75వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి... రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్మూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిగా ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ‘‘140 కోట్ల మంది దేశ ప్రజలు చూపిస్తున్న ప్రేమ, వారు అందిస్తున్న అండదండలతో భారత్ను సుదృఢమైన, సమర్థమైన, స్వావలంబన కలిగిన దేశంగా తీర్చిదిద్దేందుకు మనం నిత్యం అంకితభావంతో కృషి చేద్దాం. ఈ బాటలో ముందుకు నడిచేందుకు మీ దార్శనికతతో పాటు మీ మార్గదర్శకత్వం మాకెంతో స్ఫూర్తినిస్తున్నాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో ప్రధానమంత్రి ఈరోజు ఒక సందేశాన్ని నమోదు చేస్తూ...
‘‘గౌరవ రాష్ట్రపతి (@rashtrapatibhvn) గారూ, మీరు నాకు శుభాకాంక్షలను అందించినందుకు నేను అనేకానేక ధన్యవాదాలతో పాటు కృతజ్ఞతలను వ్యక్తం చేస్తున్నా. 140 కోట్ల మంది దేశవాసులు చూపిస్తున్న ప్రేమతో, వారు అందిస్తున్న మద్దతుతో భారత్ను సుదృఢమైన, సమర్థమైన, స్వావలంబన దిశగా దేశాన్ని తీర్చిదిద్దేందుకు మనం నిత్యం అంకితభావంతో కృషి చేద్దాం. ఈ దిశగా ముందుకు నడిచేందుకు మీ దార్శనికత, మీ మార్గదర్శకత్వం మాకెంతో స్ఫూర్తినిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.
आपकी शुभकामनाओं के लिए बहुत-बहुत धन्यवाद और आभार माननीय @rashtrapatibhvn जी। 140 करोड़ देशवासियों के स्नेह और सहयोग से हम सशक्त, समर्थ और स्वावलंबी भारतवर्ष के निर्माण के लिए सदैव समर्पित रहेंगे। इस दिशा में आपके विजन और विचार हमारे लिए बहुत प्रेरणादायी हैं। https://t.co/xggt5teUg0
— Narendra Modi (@narendramodi) September 17, 2025


