సరిహద్దు దాటి తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేసే శక్తి, తీవ్రవాదులను కాపాడిన పాకిస్థాన్ ను గంటల వ్యవధిలో మోకాళ్లపై కూర్చోబెట్టిన సామర్థ్యం, ‘ఆపరేషన్ సిందూర్’ విజయంతో పాటు, భారత్ కొత్త రూపాన్ని ప్రపంచం మొత్తం చూసింది: ప్రధాని
భారత్ నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ: ప్రధాని
గత 11 సంవత్సరాల్లో మన ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుంచి తొలి 5 స్థానాల్లోకి వచ్చింది.. ఇప్పుడు మూడు అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారే దిశగా వేగంగా పయనిస్తున్నాం: ప్రధాని
వికసిత భారత్ ప్రయాణం, డిజిటల్ ఇండియాతో చేయి చేయి కలిపి ముందుకు సాగుతుంది: ప్రధాని
మన తదుపరి ప్రధాన లక్ష్యం సాంకేతిక రంగంలో స్వావలంబన సాధించడమే: ప్రధాని

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కర్ణాటకలోని బెంగళూరులో సుమారు రూ.7,160 కోట్లతో చేపట్టిన బెంగళూరు మెట్రో యెల్లో లైన్‌ను ప్రారంభించారు. మరోపక్క రూ.15,610 కోట్లకు పైగా విలువైన బెంగళూరు మెట్రో 3వ దశ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్‌ నుంచి మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. కర్ణాటక నేలపై కాలుపెట్టగానే ఒక అనిర్వచనీయ అనుభూతి కలిగిందని పేర్కొన్నారు. కర్ణాటక సంస్కృతి వైభవం, ప్రజల స్నేహపూర్వకత, హృదయాన్ని హత్తుకునే కన్నడ భాష మాధుర్యాన్ని ప్రస్తావిస్తూ... శ్రీ మోదీ ముందుగా బెంగళూరుకు అధిష్ఠాన దేవత అన్నమ్మ తాయికి నమస్కరించారు. శతాబ్దాల క్రితం నాదప్రభు కెంపెగౌడ బెంగళూరు నగరానికి పునాది రాయి వేశారని గుర్తుచేసిన ప్రధానమంత్రి, సంప్రదాయాలతో మమేకమై అభివృద్ధి శిఖరాలను అధిరోహించే నగరాన్ని కెంపెగౌడ ఆనాడే ఊహించారని అన్నారు. “బెంగళూరు ఎల్లప్పుడూ ఆ భావాన్ని కొనసాగిస్తూ దాన్ని కాపాడుతూ వచ్చింది. ఈ రోజు ఆ కలను సాకారం చేసుకుంటోంది” అని ప్రధాని అన్నారు. 

 

“ఈ రోజు, బెంగళూరు నవ భారత పురోగమనానికి ప్రతీకగా నిలిచిన నగరంగా వెలుగొందుతోంది” అని శ్రీ మోదీ తెలిపారు. తాత్విక జ్ఞానాన్ని చెక్కుచెదర నీయక సాంకేతిక నైపుణ్యాన్ని కార్యాచరణలో ప్రతిబింబించే నగరంగా ఆయన బెంగళూరును వర్ణించారు. భారతదేశాన్ని సగర్వంగా ప్రపంచ ఐటీ పటంలో నిలిపిన నగరంగా బెంగళూరును అభివర్ణిస్తూ, ఈ విజయగాథకు ఇక్కడి  ప్రజల కష్టపడి పనిచేసే స్వభావం, ప్రతిభే కారణమని ఆయన పేర్కొన్నారు. 

 

“21వ శతాబ్దంలో నగరాల అభివృద్ధి ప్రణాళికలు, పట్టణ మౌలిక వసతులు అత్యంత కీలకమైన అవసరాలు” అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. బెంగళూరు వంటి నగరాలు భవిష్యత్తు పయనానికి సిద్ధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో భారత ప్రభుత్వం బెంగళూరుకు వేల కోట్ల రూపాయల విలువైన అనేక ప్రాజెక్టులను అందించిందని, ఈ రోజు మరో ముందడుగు పడిందని అన్నారు. శ్రీ మోదీ బెంగళూరు మెట్రో యెల్లో లైన్‌ను ప్రారంభించడంతోపాటు  మెట్రో మూడో  దశకు పునాది రాయివేశారు. దేశంలోని విభిన్న ప్రాంతాలను అనుసంధానించే మూడు కొత్త వందే భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. బెంగళూరు–బెలగావి వందే భారత్ సర్వీస్ ప్రారంభం కావడంతో  బెలగావిలో వాణిజ్య, పర్యాటక రంగాలు గణనీయంగా అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు. అలాగే నాగ్‌పూర్–పూణే మధ్య, శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా –అమృతసర్ మధ్య కూడా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభమయ్యాయి. ఈ సర్వీసులు లక్షలాది భక్తులకు ప్రయోజనం చేకూర్చి పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాయని ప్రధానమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులు, కొత్త వందే భారత్ రైళ్ల ప్రారంభం నేపథ్యంలో ఆయన బెంగళూరు, కర్ణాటకతో పాటు యావత్ దేశ ప్రజానీకానికి శుభాకాంక్షలు అందజేశారు.

 

ఆపరేషన్ సిందూర్ తర్వాత తాను బెంగళూరుకు రావడం ఇదే మొదటిసారని పేర్కొంటూ.. భారత దళాలు ఆపరేషన్ సిందూర్లో సాధించిన విజయాన్ని శ్రీ మోదీ ప్రస్తావించారు. సరిహద్దు దాటి తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేసే సామర్థ్యాన్ని వారు ప్రదర్శించారని ఆయన తెలిపారు. తీవ్రవాదుల కొమ్ముకాసిన పాకిస్థాన్ ను గంటల వ్యవధిలో మోకాళ్లపై కూర్చోబెట్టిన భారత శక్తిని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. “నవ భారతావని కొత్త రూపాన్ని ప్రపంచం మొత్తం చూసింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ విజయానికి రక్షణ రంగంలో సాంకేతిక శక్తి, మేక్ ఇన్ ఇండియా బలం ప్రధాన కారణమని ఆయన వివరించారు. ఈ విజయానికి బెంగళూరు, కర్ణాటక యువత అందించిన విశిష్ట సహకారాన్ని గుర్తిస్తూ అందరికీ ఆయన అభినందనలు తెలిపారు.

 

ఇప్పుడు ప్రపంచంలోని ప్రధాన నగరాల సరసన బెంగళూరు గుర్తింపు పొందిందని పేర్కొంటూ, భారత్ ప్రపంచస్థాయిలో పోటీపడడమే కాకుండా ముందుండాలని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. మన నగరాలు స్మార్ట్‌గా, వేగంగా, సమర్థవంతంగా మారినప్పుడే పురోగతి సాధ్యమవుతుందని, ఆధునిక మౌలిక ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆయన తెలిపారు. ఆర్వీ రోడ్ నుంచి బొమ్మసంద్ర వరకు బెంగళూరు మెట్రో యెల్లో లైన్ ను ప్రారంభిస్తున్నట్లు శ్రీ మోదీ ప్రకటించారు. ఇది బెంగళూరులోని అనేక ముఖ్య ప్రాంతాలను అనుసంధానిస్తుందని చెప్పారు. బసవనగుడి, ఎలక్ట్రానిక్ సిటీ మధ్య ప్రయాణ సమయం ఇప్పుడు గణనీయంగా తగ్గుతుందని, ఇది లక్షలాది మందికి జీవన సౌలభ్యం, పని సౌకర్యాన్ని పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. 

 

యెల్లో లైన్ ప్రారంభంతో పాటు బెంగళూరు మెట్రో మూడో దశ -అంటే ఆరెంజ్ లైన్- కు కూడా పునాది రాయివేసినట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. ఆరెంజ్ లైన్ కూడా అందుబాటులోకి వస్తే రెండింటితో కలిపి రోజుకు 25 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలకు వీలవుతుందని ఆయన తెలిపారు. ఇది బెంగళూరు రవాణా వ్యవస్థను మరింత శక్తిమంతం చేసి కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని అన్నారు. బెంగళూరు మెట్రో దేశంలో ప్రజా మౌలిక వసతుల అభివృద్ధికి ఒక కొత్త మోడల్‌ను పరిచయం చేసిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్, బయోకాన్, డెల్టా ఎలక్ట్రానిక్స్ వంటి సంస్థలు పలు కీలక మెట్రో స్టేషన్లకు కొంతమేర నిధులు సమకూర్చాయని ఆయన ప్రస్తావించారు. ఈ వినూత్న సీఎస్‌ఆర్‌ ప్రయత్నం ఒక ప్రేరణగా నిలుస్తుందని  ప్రశంసిస్తూ, సహకారమందించిన  కార్పొరేట్ రంగానికి ఆయన అభినందనలు తెలిపారు. 

 

“భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ. గత పదకొండు సంవత్సరాల్లో, భారత ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుంచి ప్రపంచంలో ఐదు అగ్రస్థాయి దేశాల్లో ఒకటిగా ఎదిగి ఇప్పుడు తొలి మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారే దిశగా వేగంగా పయనిస్తోంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు. కచ్చితమైన సంకల్పం, నిజాయితీ తో కూడిన కృషి ప్రధానాంశాలుగా  “రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్” భావన ఈ పురోగతికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. మౌలిక వసతుల అభివృద్ధిని ప్రస్తావిస్తూ, 2014లో మెట్రో సేవలు కేవలం ఐదు నగరాలకే పరిమితమై ఉన్నాయని ప్రధాని గుర్తుచేశారు. ఈ రోజు, 24 నగరాల్లో 1,000 కి.మీ.కుపైగా విస్తరించిన మెట్రో నెట్‌వర్క్‌తో, భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌ కలిగిన దేశంగా నిలిచిందని ఆయన తెలిపారు. 2014కు ముందు రైల్వే మార్గాల్లో కేవలం 20,000 కి.మీ. రైల్వే మార్గాలను మాత్రమే విద్యుదీకరించగా, గత పదకొండు సంవత్సరాల్లోనే 40,000 కి.మీ.కుపైగా రైల్వే మార్గాలు విద్యుదీకరించామని, ఇది సుస్థిర రవాణా అభివృద్ధిలో ఒక విశేషమైన ముందడుగని ఆయన పేర్కొన్నారు.

 

భారత్ విజయాలు పుడమికే పరిమితం కాలేదని, నింగిని సైతం తాకాయని పేర్కొంటూ.. 2014లో దేశంలో కేవలం 74 విమానాశ్రయాలే ఉండగా, ఈ రోజు ఆ సంఖ్య 160 దాటిందని  ప్రధానమంత్రి వెల్లడించారు. అలాగే, జలమార్గాల అభివృద్ధిలో సాధించిన విశేష పురోగతిని ప్రస్తావిస్తూ, 2014లో కేవలం మూడు జాతీయ జలమార్గాలే కార్యకలాపాలు నిర్వహిస్తూండగా ఇప్పుడా సంఖ్య ముప్పైకి పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

 

ఆరోగ్య, విద్యా రంగాల్లో భారత్ సాధించిన విశేష ప్రగతిని ప్రస్తావిస్తూ 2014 వరకు దేశంలో కేవలం 7 ఎయిమ్స్, 387 వైద్య కళాశాలలే ఉండగా ఈ రోజు 22 ఎయిమ్స్, 704 వైద్య కళాశాలలు ప్రజలకు సేవలందిస్తున్నాయని శ్రీ మోదీ తెలిపారు. గత 11 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా లక్షకు పైగా కొత్త వైద్య సీట్లు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ఫలితంగా  మధ్యతరగతి పిల్లలు విస్తృత అవకాశాలను పొందారని ఆయన హైలైట్ చేశారు. గత 11 సంవత్సరాల్లో ఐఐటీల సంఖ్య 16 నుంచి 23కు, ఐఐఐటీల సంఖ్య 9 నుంచి 25కు, ఐఐఎంల సంఖ్య 13 నుంచి 21కు పెరిగిందని శ్రీ మోదీ తెలిపారు. ఈ రోజు విద్యార్థులకు ఉన్నత విద్యలో మరిన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

 

ఈ రోజు దేశం వేగంగా పురోగమిస్తున్నవేళ  పేదలు, అణగారిన వర్గాల జీవితాలు కూడా అదే స్థాయిలో మారుతున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్లకు పైగా పక్కా ఇళ్లు అందించామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పుడు మరో 3 కోట్లు ఇళ్లు నిర్మించడానికి సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. కేవలం 11 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించామని శ్రీ మోదీ తెలిపారు. ఈ కార్యక్రమం కోట్లాది తల్లులు, అక్కాచెల్లెమ్మలకు గౌరవం, శుభ్రత, భద్రతను అందించిందని ఆయన పేర్కొన్నారు. 

 

“దేశంలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధి కార్యక్రమాలన్నీ భారత ఆర్థిక వృద్ధి కి అనుగుణంగా ముందుకు సాగుతున్నవే" అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. 2014కు ముందు భారత మొత్తం ఎగుమతులు 468 బిలియన్ డాలర్లు ఉండగా, ఈ రోజు ఆ సంఖ్య 824 బిలియన్ డాలర్లకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. గతంలో భారత్ మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకునేదని, కానీ ఇప్పుడు మొబైల్ హ్యాండ్‌సెట్లను ఎగుమతి చేసే అయిదు అగ్రగామి దేశాల్లో ఒకటిగా మారిందని ప్రధాని తెలిపారు. ఈ మార్పులో బెంగళూరు కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. అలాగే 2014కు ముందు భారత ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు సుమారు 6 బిలియన్ డాలర్లు ఉండగా, ఇప్పుడవి దాదాపు 38 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు ఆయన వెల్లడించారు.

 

పదకొండు సంవత్సరాల క్రితం భారత ఆటోమొబైల్ ఎగుమతులు సుమారు 16 బిలియన్ డాలర్లు ఉండగా, ఈ రోజు ఆ సంఖ్య రెండింతలకు పైగా పెరిగి, భారత్‌ను ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆటోమొబైల్ ఎగుమతిదారుగా నిలిపిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ విజయాలు ఆత్మనిర్భర్ భారత్ సంకల్పాన్ని మరింత బలపరుస్తాయని, దేశం కలిసి ముందుకు సాగి వికసిత భారతాన్ని నిర్మిస్తుందని ఆయన పేర్కొన్నారు. 

 

“వికసిత భారత్‌ ప్రయాణం డిజిటల్ ఇండియాతో చేయి చేయి కలుపుకొని ముందుకు సాగుతుంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఇండియా ఏఐ మిషన్ వంటి కార్యక్రమాల ద్వారా భారత్‌ ప్రపంచ స్థాయి ఏఐ నాయకత్వం వైపు దూసుకెళ్తోందని తెలిపారు. సెమీకండక్టర్ మిషన్ కూడా ఊపందుకుంటోందని, త్వరలోనే భారత్‌ తన సొంత  మేడ్‌-ఇన్‌-ఇండియా చిప్‌ను కలిగి ఉంటుందని ఆయన అన్నారు. తక్కువ వ్యయంతో హైటెక్‌ అంతరిక్ష మిషన్లలో భారత్‌ ప్రపంచానికి ఒక ఆదర్శంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. భవిష్యత్‌ సాంకేతిక రంగాలన్నింటిలోనూ భారత్‌ పురోగమిస్తోందని, ఈ అభివృద్ధిలో అత్యంత విశేషమైన అంశం పేదల సాధికారత అని ఆయన పేర్కొన్నారు. డిజిటలైజేషన్ ఇప్పుడు దేశంలోని ప్రతి గ్రామానికి చేరుకుందని, యూపీఐ ద్వారా ప్రపంచంలోని రియల్ టైమ్ లావాదేవీలలో 50% కంటే ఎక్కువ భారత్‌ ఖాతాలోనే ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం, ప్రజల మధ్య దూరాన్ని సాంకేతికత తగ్గిస్తోందని, ప్రస్తుతం 2,200కుపైగా ప్రభుత్వ సేవలు మొబైల్ ప్లాట్‌ఫామ్‌లపై అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఉమాంగ్‌ యాప్ ద్వారా ప్రజలు ఇళ్ల నుంచే ప్రభుత్వ పనులు పూర్తిచేసుకోవచ్చని, డిజిలాకర్ ద్వారా ప్రభుత్వ సర్టిఫికేట్ల నిర్వహణలోని ఇబ్బందులు తొలగిపోయాయని ఆయన అన్నారు. భారత్ ఇప్పుడు ఏఐ ఆధారిత ముప్పు గుర్తింపు వంటి సాంకేతికతల్లో పెట్టుబడులు పెడుతోందని, డిజిటల్ విప్లవ ప్రయోజనాలు సమాజంలోని చివరి వ్యక్తి వరకు చేరేలా చేయడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ యత్నంలో బెంగళూరు చురుగ్గా  సహకరిస్తోందని ప్రధాని గుర్తించారు. 

 

“మన తదుపరి ప్రధాన లక్ష్యం సాంకేతిక రంగంలో స్వావలంబన సాధించడమే” అని ప్రధానమంత్రి ప్రకటించారు. భారతీయ టెక్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతూ, మొత్తం ప్రపంచానికి సాఫ్ట్‌వేర్, ఉత్పత్తులను అభివృద్ధి చేశాయని ఆయన వెల్లడించారు. ఇప్పుడు భారత్ సొంత అవసరాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, యాప్‌లను ప్రతి రంగంలోనూ ఉపయోగిస్తున్న ఈ కాలంలో కొత్త ఉత్పత్తుల అభివృద్ధిని వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ రంగంలో భారత్ కొత్త శిఖరాలను చేరుకోవడం అవసరమని ప్రధాని పేర్కొన్నారు. వికసిస్తున్న రంగాల్లో ముందంజలో ఉండేందుకు కేంద్రీకృత కృషి చేయాలని పిలుపునిస్తూ, మేక్ ఇన్ ఇండియా, తయారీ రంగాల్లో బెంగళూరు, కర్ణాటక ప్రాధాన్యతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. భారత ఉత్పత్తులు “జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్” ప్రమాణాలను అనుసరించాలి... అంటే అవి నాణ్యతా లోపంలేకుండా, పర్యావరణ హితంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ దృష్టిని కర్ణాటక ప్రతిభ ముందుండి నడిపిస్తుందన్న నమ్మకాన్ని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

 

కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వాలైనా ప్రజాసేవకే కట్టుబడి ఉన్నాయని, పౌరుల జీవితాలను మెరుగుపర్చడానికి సమష్టి కృషి అవసరమని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ దిశలో కొత్త సంస్కరణలను అమలు చేయడం ఒక కీలక బాధ్యత అని ఆయన అన్నారు. గత దశాబ్దంలో కేంద్ర ప్రభుత్వం నిరంతరం సంస్కరణల పథంలో పయనించిందని ప్రధాని తెలిపారు. ఉదాహరణకు, చట్టాలను డీక్రిమినలైజ్ చేయడానికి జన విశ్వాస్ బిల్లును ఆమోదించామని, జన విశ్వాస్ 2.0 కూడా ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు. అవసరం లేని క్రిమినల్ నిబంధనలతో ఉన్న చట్టాలను గుర్తించి, వాటిని తొలగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్య ఆధారిత శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా మిషన్ కర్మయోగి కార్యక్రమాన్ని ప్రస్తావించిన ఆయన, రాష్ట్రాలు కూడా తమ అధికారుల కోసం ఈ లెర్నింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను చేపట్టవచ్చని సూచించారు. ఆశావహ జిల్లాల కార్యక్రమం, ఆశావహ బ్లాక్ కార్యక్రమంపై దృష్టి సారిస్తూ, ప్రత్యేక శ్రద్ధ అవసరమైన ప్రాంతాలను రాష్ట్రాలు కూడా గుర్తించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో నిరంతర సంస్కరణలను కొనసాగించాలనీ, ఈ సంయుక్త ప్రయత్నాలు కర్ణాటకను అభివృద్ధిలో కొత్త స్థాయిలకు తీసుకెళ్తాయని, ఫలితంగా వికసిత భారత్ దృష్టి సాకారమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

 

కర్ణాటక గవర్నర్ శ్రీ థావర్ చంద్ గెహ్లోత్, కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్దరామయ్య, కేంద్ర మంత్రులు శ్రీ మనోహర్ లాల్, శ్రీ హెచ్.డి. కుమారస్వామి, శ్రీ అశ్విని వైష్ణవ్, శ్రీ వి. సోమన్న, సుష్రీ శోభా కరంద్లాజే తదితర విశిష్ట అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

నేపథ్యం 

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, రూ. 7,160 కోట్ల వ్యయంతో 19 కి.మీ.కు పైగా పొడవు, 16 స్టేషన్లు కలిగిన బెంగళూరు మెట్రో ఫేజ్-2 ప్రాజెక్ట్‌లోని ఆర్వీ రోడ్ (రగిగుట్ట) నుంచి  బొమ్మసంద్ర వరకు ఉన్న యెల్లో లైన్‌ను ప్రారంభించారు. దీంతో బెంగళూరులో మెట్రో నెట్‌వర్క్ 96 కి.మీ.కు పైగా పెరిగి, ఈ ప్రాంతంలోని అధిక జనాభాకు సేవలు అందిస్తుంది.

 

రూ.15,610 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్న బెంగళూరు మెట్రో ఫేజ్-3 ప్రాజెక్ట్‌కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం మార్గ పొడవు 44 కి.మీ.పైగా ఉండి, 31 ఎలివేటెడ్ స్టేషన్లు కలిగి ఉంటుంది. ఈ మౌలిక వసతుల ప్రాజెక్ట్ నగరంలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడమే కాకుండా, నివాస, పారిశ్రామిక, వాణిజ్య, విద్యా ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది.

 

బెంగళూరు నుంచి మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా ప్రధాన మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. వీటిలో బెంగళూరు–బెలగావి, అమృతసర్–శ్రీమాత వైష్ణో దేవి కత్రా,  నాగ్‌పూర్ (అజ్ని)–పూణే రైళ్లు ఉన్నాయి. ఈ హైస్పీడ్ రైళ్లు ప్రాంతీయ అనుసంధానాన్ని గణనీయంగా పెంచి, ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు ప్రయాణికులకు ప్రపంచస్థాయి ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి.

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
UP's exports to BRICS nations, partners cross $5.36 billion in FY26: Govt

Media Coverage

UP's exports to BRICS nations, partners cross $5.36 billion in FY26: Govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Odisha is emerging as a gateway to growth and prosperity in eastern India: PM Modi in Rairangpur
June 20, 2026
I extend my heartfelt birthday greetings to President Smt. Droupadi Murmu Ji, I wish her long life and excellent health: PM
Pahadpur village will now be rapidly developed as a solar village, that is, solar power will be ensured in every home here: PM
The vision of the Central Government is the development of India through the development of Eastern India: PM
To uplift tribal society, we are connecting tribal youth with opportunities for education and employment: PM
These children should get better facilities for studies; for this, around 500 Eklavya Model Schools have been opened across the country: PM

जॉय जगन्नाथ! जॉय मां किचकेश्वरी! मोर सबू भाई,भौणी,मां,मौसी मानंकु मोर नमोस्कार।

माननीय राष्ट्रपति द्रौपदी मुर्मू जी, राज्यपाल श्री हरि बाबु जी, यहां के लोकप्रिय मुख्यमंत्री मोहन चरण माझी जी, उप मुख्यमंत्री कनक वर्धन सिंह देव जी, प्रवती परीदा जी, ओडिशा के मंत्री गणेश सिंह खूंटिया जी, कृष्ण चंद्र महापात्र जी, सांसद नबा चरण माझी जी, मनमोहन सामल जी, बैजयंत पांडा जी, अन्य महानुभाव, भाइयों और बहनों।

हमारा ओडिशा इन दिनों उत्सवों के आनंद में डूबा हुआ है। यहाँ का गणपर्व रज, पिछले हफ्ते ही धूमधाम से मनाया गया है। महाप्रभु जगन्नाथ जी की रथ यात्रा की तैयारियां भी पुरजोश चल रही है। मयूरभंज के बारीपदा रथ यात्रा को लेकर भी उत्साह का माहौल है। और, इस सबके बीच ही लोकतन्त्र का विकास का उत्सव भी चल रहा है। ओडिशा की बीजेपी सरकार ने अपने 2 साल भी पूर्ण किए हैं। इस मौके पर, आप सबके बीच आना, मयूरभंज आने का ये सौभाग्य, और इतनी बड़ी संख्या में आप सबकी उपस्थिति, ये अवसर मेरे लिए बहुत खास है। आपका अपनापन मुझे बार-बार यहां खींच लाता है। मैं आप सभी का हृदय से बहुत-बहुत अभिनंदन करता हूँ। और ओडिशा की जनता को डबल इंजन सरकार में विकास यात्रा की भी बधाई देता हूँ, शुभकामनाएं देता हूं। साथ ही, इस अवसर पर मैं पंडित रघुनाथ मुर्मू जी, डॉ. दमयंती बेश्रा जी, और श्री चरण हेम्ब्रम जी जैसी विभूतियों को भी नमन करता हूँ। रघुनाथ मुर्मू जी ने संथाली भाषा के लिए ओल चिकी लिपि का निर्माण किया था। हमारी सरकार ने संथाली भाषा में भारत के संविधान को प्रस्तुत किया है। ओडिशा की संतानों को पद्म सम्मान देकर सम्मानित किया है। पिछले 2 वर्षों में ओडिशा सरकार भी इन सभी विभूतियों के सपनों को पूरा करने में दिन रात पुरुषार्थ कर रही है।

साथियों,

आज का ये अवसर इसलिए भी विशेष है, क्योंकि मयूरभंज की धरती पर पली-बढ़ीं, ओडिशा की बेटी, माननीय राष्ट्रपति जी हमारे बीच उपस्थित हैं। आज उनका जन्मदिन भी है। मैं राष्ट्रपति द्रौपदी मुर्मू जी को जन्मदिन की हार्दिक बधाई और शुभकमानाएं देता हूं, मैं उनके दीर्घायु होने और उत्तम स्वास्थ्य की कामना करता हूं। जनगन्नाथ जी भगवान के श्री चरणों में प्रार्थना करता हूं। ओडिशा की बेटी आज देश के इतने बड़े पद पर पहुंची हैं, हमारा मार्गदर्शन कर रही हैं, ये हम सभी के लिए बहुत गौरव की बात है। राष्ट्रपति जी का व्यक्तित्व, उनका उदार और सहृदय स्वभाव, राष्ट्र और समाज की सेवा के लिए उनका अटल समर्पण, उन्होंने मयूरभंज ही नहीं, पूरे ओडिशा की पहचान सशस्त की है। मैं इस अवसर पर, उनका विशेष रूप से अभिनंदन करता हूँ।

साथियों,

ये कार्यक्रम जब बना, तो इसमें मूल कारण तो लॉजिस्टिक था, लंबे अर्से से यहां आने के लिए चर्चा चल रही थी, लेकिन कोई तालमेल नहीं बैठता था। 21 जून को अंतर्राष्ट्रीय योगा दिवस कोलकाता में तय हुआ, तो फिर मैंने कहा अच्छा है, आज बंग दिवस भी है, तो क्यों न मैं सुबह मयूरभंज होकर के शाम को फिर कोलकाता के कार्यक्रम में जाऊं। और इसके कारण ये 20 जून तय हुई। लेकिन कुछ चीजें ऐसी होती हैं, जिसकी मंगल कामनाएं ईश्वरआधीन होती हैं, और इसलिए आज एक शुभ मंगल हो गया, कि राष्ट्रपति का जन्मदिन भी, मुझे आज उनके गांव में जाकर के, उनको शुभकामनाएं देने का अवसर मिला।

साथियों,

आज मैं राष्ट्रपति जी के साथ पहाड़पुर भी गया था। मैं इस क्षेत्र के बच्चों के लिए उनके द्वारा बनवाए गए स्कूल भी गया। बच्चों के साथ कुछ यादगार समय बिताने का अवसर मुझे मिला। मैं देख रहा था, बच्चों के चेहरों की चमक, राष्ट्रपति जी की उपस्थिति और आत्मीयता, वहां मुझे ऐसा कुछ भी नहीं लगा, किसी बच्चे को ये लगा हो कि राष्ट्रपति जी आई हैं, हर बच्चे को लगता था उनकी मां आई है। वे बच्चे भी बहुत भाग्यवान हैं, कैसे इस क्षेत्र के गरीब, वंचित और आदिवसी समाज के बच्चों को प्रेरणा मिल रही है, उन्हें देश के लिए कुछ बड़ा करने का आत्मविश्वास मिल रहा है। मैं राष्ट्रपति जी का आभारी हूं कि उन्होंने इन अनुभवों से गुजरने का आज मुझे अवसर दिया। ये मेरा दिन, एक प्रकार से मेरी शिक्षा का दिवस था, कुछ सीखने का अवसर था मेरे लिए।

साथियों,

मैं आपको सरकार का ये निर्णय भी बताना चाहता हूं कि पहाड़पुर गांव को, अब तेजी से सुर्यग्राम, सोलर विलेज के रूप में विकसित किया जाएगा। यानी यहां हर घर में सोलर बिजली बने, इसे सुनिश्चित किया जाएगा। और हम तो बड़ा गर्व के साथ कह सकते हैं कि यही ओडिशा है, जहां कोणार्क में सुर्य मंदिर की एक पहचान है, वैसे ही पहाड़पुर सुर्यग्राम की पहचान बन जाएगा। सुर्यग्राम, से पूरा गांव सोलर विलेज के रूप में पहचाना जाए, इस दिशा में काम तुरंत शुरू हो ऐसा मेरा प्रयास रहेगा। इस अभियान से, पहाड़पुर के लोगों को मुफ्त सोलर बिजली भी मिलेगी और जो ज्यादा बिजली होगी, वो उनकी आय भी बढ़ाएगी।

साथियों,

ओडिशा में डबल इंजन सरकार के 2 साल कई मायनों में ऐतिहासिक रहे हैं। मुख्यमंत्री मोहन चरण माझी जी के नेतृत्व में, आज ओडिशा तेज गति से विकास के रास्ते पर आगे बढ़ रहा है। आज यहां गरीब कल्याण की योजनाओं से सामान्य मानवी का जीवन बदल रहा है। ओडिशा में आर्थिक गतिविधियाँ निवेश और उद्योगों को आकर्षित करने का सामर्थ्य आज नज़र आ रहा है। यहाँ रोजगार के नए अवसरों के लिए तेजी से काम हो रहा है।

साथियों,

केंद्र सरकार का विज़न है- पूर्वी भारत के विकास से भारत का विकास। इसीलिए, हम पूर्वोदय की नीति पर काम कर रहे हैं। जिस पूर्वी भारत को काँग्रेस के दौर में पिछड़ेपन का पर्याय बना दिया गया था, आज वो प्रगति का प्रवेश द्वार बन रहा है। आज ओडिशा खुद इस बदलाव का साक्षी बन रहा है।

साथियों,

ओडिशा के पास समुद्र है, खनिज संपदा है, कृषि की शक्ति है और सबसे सामर्थ्यवान यहां युवा प्रतिभा है। इस सामर्थ्य का पूरा उपयोग करने के लिए हम मिलकर काम कर रहे हैं। इसीलिए, आज ओडिशा में रेलवे इनफ्रास्ट्रक्चर में रिकॉर्ड निवेश हो रहा है। नई सड़कें और आर्थिक कॉरिडोर बन रहे हैं। पोर्ट्स का विस्तार हो रहा है। ऊर्जा, सेमीकंडक्टर, ग्रीन एनर्जी और आधुनिक उद्योगों में निवेश आ रहा है। आज भी यहां ओडिशा के विकास से जुड़ी अनेक महत्वपूर्ण परियोजनाओं का लोकार्पण और शिलान्यास हुआ है। इन परियोजनाओं पर लगभग 47 हजार करोड़ रुपये खर्च किए जाएंगे। बिजली, सड़क, रेलवे, स्वास्थ्य और शिक्षा से जुड़ी इन परियोजनाओं से, आप सभी लोगों को बहुत सुविधा होने वाली है। मैं इन परियोजनाओं के लिए ओडिशा के लोगों को बहुत बहुत बधाई देता हूं।

साथियों,

हमारी सरकार ओडिशा के संसाधनों को, ओडिशा की संभावनाओं में बदल रही है। ओडिशा में बड़ा निवेश आए, यहाँ नए उद्योग लगें, इसके लिए उत्कर्ष ओडिशा जैसे अभियान चलाए जा रहे हैं। इसके तहत, अब तक करीब 20 लाख करोड़ रुपए के निवेश प्रस्ताव मिल चुके हैं। साढ़े 3 लाख करोड़ रुपए से ज्यादा की अनेक मेगा परियोजनाओं पर भी काम चल रहा है। उद्योगों के लिए अनुकूल वातावरण बने, इसके लिए ओडिशा के समग्र विकास पर ध्यान दिया जा रहा है। पावर सेक्टर में 6 हजार करोड़ रुपए से ज्यादा का निवेश हो रहा है। समृद्ध शहर योजना के तहत शहरी विकास को गति दी जा रही है। आने वाले वर्षों में इन प्रयासों का परिणाम हमें देखने को मिलने वाला है।

साथियों,

डबल इंजन सरकार की बड़ी विशेषता ये है कि वो खुद जनता तक पहुँचती है। हमारा प्रयास है कि सामान्य नागरिक को किसी समस्या के समाधान के लिए अनावश्यक चक्कर न लगाने पड़े। इन्हीं प्रयासों का परिणाम है कि युवाओं, महिलाओं, किसानों और आम लोगों की अपेक्षाएँ आज पूरी हो रही हैं। आप देखिए, धान खरीद में किसानों को 3,100 रुपये प्रति क्विंटल देने का निर्णय लिया गया। सुभद्रा योजना के माध्यम से एक करोड़ से अधिक माताओं और बहनों तक आर्थिक सहायता पहुंचाई गई। आयुष्मान भारत को लागू करके ओडिशा के परिवारों के लिए देशभर के अस्पतालों में इलाज का रास्ता खोला गया। आदिवासी विद्यार्थियों की पढ़ाई बीच में न छूटे, इसके लिए माधो सिंह हाथ-खर्चा योजना शुरू की गई। महाप्रभु श्री जगन्नाथ जी के भक्तों की भावनाओं का सम्मान करते हुए श्रीमंदिर के श्रद्धालुओं के लिए सारे द्वार खोल दिए गए, चारों-चार द्वार खोल दिए गए। डबल इंजन की ताकत मिलने से आज यहां चारों दिशाओं में विकास सुनिश्चित हो रहा है।

साथियों,

यहां बीते दिनों स्वच्छता को लेकर जो विशेष अभियान चला है, उसकी भी मुझे जानकारी मिली है। और मैं देख रहा था सोशल मीडिया में तो सफाई अभियान छाया हुआ है, यानी स्वच्छता से स्वागत, मैं ओडिशा की इस पहल के लिए, यहां के नगारिको का, सरकार का, मुख्यमंत्री जी का, इस प्रशंसनीय पहल के लिए बहुत ही प्रशंसा करता हूं, संतोष व्यक्त करता हूं।

साथियों,

स्वच्छता हमारे जीवन शैली का हिस्सा होनी चाहिए, हर रोज की आदत होनी चाहिए। मैं यहां स्वच्छता अभियान से जुड़े सभी लोगों का हृदय से बहुत-बहुत अभिनंदन करता हूं।

साथियों,

मैंने अपने जीवन का कुछ महत्वपूर्ण कालखंड जनजातीय क्षेत्रों में एक वालंटियर के रूप में काम करते हुए बिताया है। माननीय राष्ट्रपति जी तो बरसों तक ऐसे क्षेत्रों में चुनौतियां का सामना करती रही हैं। आप और हम जानते हैं कि जनजातीय क्षेत्रों में जीवन की सुविधाएं आसानी से नहीं पहुंचती थीं। इसलिए, हमारी सरकार ने जनजातीय विकास को बहुत प्राथमिकता दी है। हमने ऐसे इलाकों को सुविधाओं से जोड़ने के लिए धरती आबा जनजातीय ग्राम उत्कर्ष अभियान शुरू किया। इसके तहत स्वास्थ्य, शिक्षा, सड़क, आवास से जुड़े विभाग मिलकर के सर्वागीण विकास के लिए काम कर रहे हैं। ताकि वहां रहने वाले लोगों की कठिनाइयां दूर हो सकें। इसी तरह, पीएम जनमन अभियान तो राष्ट्रपति जी के साथ हुई चर्चाओं का, उनके मार्गदर्शन का ही परिणाम है। ये विशेष रूप से देश के ऐसे जनजातीय समूहों के लिए है, जो जनजातीय समुदाय में भी सबसे पीछे रह गए हैं। ऐसे जनजातीय समुदायों तक अब सरकार स्वयं चलकर उनके गांव, उनके दरवाजे तक पहुंच रही है।

साथियों,

आदिवासी समाज के उत्थान के लिए हम आदिवासी युवाओं को शिक्षा और रोजगार के अवसरों से जोड़ रहे हैं। इन बच्चों को पढ़ाई की बेहतर सुविधा मिले, इसके लिए देश में करीब 500 एकलव्य मॉडल स्कूल खोले गए हैं। करीब साढ़े सात सौ एकलव्य स्कूल स्वीकृत किए गए हैं। प्री-मैट्रिक और पोस्ट मैट्रिक लेवल पर, डेढ़ करोड़ से अधिक आदिवासी बच्चों को सैकड़ों करोड़ रुपए की स्कॉलर्शिप दी गई है। मुझे ये बताते हुए भी खुशी है कि यहां मयूरभंज में एक और नवोदय विद्यालय बनाने के लिए भी स्वीकृति दे दी गई है।

साथियों,

दूर-दराज इलाकों में रहने के कारण, जनजातीय समाज स्वास्थ्य से जुड़ी कठिनाइयों का भी शिकार रहा है। सिकल सेल एनीमिया जैसी बीमारियाँ एक बहुत बड़ी चुनौती रही हैं। हमने इनके खिलाफ देश भर में अभियान चलाया, चार करोड़ से ज्यादा हेल्थ कार्ड बांटे, मुफ्त इलाज के लिए करोड़ों आदिवासी लाभार्थियों को आयुष्मान कार्ड दिये। जल जीवन मिशन के तहत घर-घर साफ पानी पहुंचाया जा रहा है। इन प्रयासों का परिणाम आज हमें दिख रहा है। आदिवासी समाज दशकों पुरानी कठिनाइयों से बाहर आ रहा है, और, विकास की मुख्यधारा का हिस्सा बन रहा है।

साथियों,

आने वाले समय में हमारे सामने दो महत्वपूर्ण पड़ाव हैं। 2036 में ओडिशा के गठन के 100 वर्ष पूरे होंगे। और, 2047 में भारत की स्वतंत्रता के 100 वर्ष पूरे होने वाले हैं। यानी, ओडिशा और देश का लक्ष्य एक ही दिशा में है। ओडिशा की अर्थव्यवस्था मजबूत होगी, तो भारत मजबूत होगा। मुझे ओडिशा के सामर्थ्य पर भरोसा है। हमें मिलकर ओडिशा को विकास की बुलंदियों पर पहुंचाना है।

साथियों,

कल 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस भी मनाया जाना है। ज्ञान और योग की धरती ओडिशा, योग यहाँ के संस्कारों का हिस्सा रहा है। मैं ओडिशा की धरती से पूरे देश से, पूरी दुनिया के लोगों से आह्वान करता हूँ, आप सब ज्यादा से ज्यादा संख्या में योग दिवस में हिस्सा लें। मैं एक बार फिर आप सभी को आज के अवसर, और विकास परियोजनाओं की बहुत-बहुत बधाई देता हूं। मैं माननीय राष्ट्रपति जी का विशेष रूप से आभार प्रकट करता हूं, कि मुझे उनके साथ उनकी कर्मभूमि को देखने का मौका मिला। एक बार फिर उन्हें जन्मदिन की बहुत-बहुत बधाई। बहुत-बहुत धन्यवाद।

जय जगन्नथ।

जय जगन्नथ।

जय जगन्नथ।