India-Indonesia ties are special: PM Modi
We are all proud of the manner in which the Indian diaspora has distinguished itself in Indonesia: PM Modi
In the last four years, India has witnessed unparalleled transformation, says PM Modi in Indonesia
Both India and Indonesia are proud of their democratic ethos and their diversity: PM Modi
In 2014 the people of India voted for a Government headed by a person belonging to a poor background. Similarly, the people of Indonesia elected President Widodo whose background is also humble: PM
Indian diaspora in Indonesia further strengthens the vibrant people-to-people ties between both our countries: PM Modi
Ensuring a corruption-free, citizen-centric and development-friendly ecosystem is our priority: PM Modi
GST has enhanced the tax compliance system in India; it has ensured a better revenue system: PM Modi
To enhance ‘Ease of Living’, we are focussing on modern infrastructure; we are creating a system which is transparent as well as sensitive: PM Modi

జ‌కార్తా లోని భార‌తీయ స‌ముదాయాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ప్ర‌సంగించారు.

భార‌త‌దేశానికి మ‌రియు ఇండోనేశియా కు మ‌ధ్య గ‌ల ప్ర‌త్యేక సంబంధాల‌ను గురించి ఆయ‌న వివ‌రించారు. ఈ సంవ‌త్స‌రం మొద‌ట్లో న్యూ ఢిల్లీ లో జ‌రిగిన గ‌ణ‌తంత్ర దినోత్స‌వాలలో ఇండోనేశియా తో సహా 10 ఏశియాన్ దేశాల‌కు చెందిన నేత‌లు పాలుపంచుకొన్న విష‌యాన్ని ఆయ‌న గుర్తుకు తెచ్చుకొన్నారు. 1950 లో న్యూ ఢిల్లీ లో జ‌రిగిన గ‌ణ‌తంత్ర దిన క‌వాతు లో ఇండోనేశియా అధ్య‌క్షులు ముఖ్య అతిథిగా పాల్గొన‌డం యాదృచ్చికం ఏమీ కాద‌ని ఆయ‌న గుర్తు చేశారు.

ఇండోనేశియా లోని భార‌తీయ ప్ర‌వాస కుటుంబ స‌భ్యులు ఇండోనేశియా యొక్క గ‌ర్వ‌కార‌క‌మైన పౌరుల‌ని ఆయ‌న పేర్కొంటూ, అయితే వారు త‌మ యొక్క భార‌తీయ మూలాల‌తో ముడిపడివుండాలనే కోరుకొంటున్నార‌ని పేర్కొన్నారు.

గ‌త నాలుగు సంవ‌త్స‌రాల‌లో భార‌త‌దేశం సాటి లేన‌టువంటి ప‌రివ‌ర్త‌న‌ కు సాక్షీభూతంగా నిలచింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎఫ్‌డిఐ, భార‌త‌దేశ ఆర్థిక‌ వ్య‌వ‌స్థ లోని బాహాట‌త్వం, వ్యాపార నిర్వ‌హ‌ణ‌లో స‌ర‌ళ‌త్వం మ‌రియు భార‌త‌దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ లోని స్ప‌ర్ధాత్మ‌క‌త‌ ల‌ను గురించి వివ‌రించారు.

ఉభ‌య దేశాలు వాటి ప్ర‌జాస్వామిక సంప్ర‌దాయాల పట్ల, వాటి భిన్న‌త్వం ప‌ట్ల గ‌ర్విస్తున్నట్లు ఆయ‌న తెలిపారు. ఇరు దేశాల మ‌ధ్య నెల‌కొన్న సాంస్కృతిక బంధాల‌ను గురించి ఆయ‌న ప్ర‌ముఖంగా ప్ర‌స్తావిస్తూ, భాషలలోను, వంట చేసే ప‌ద్ధ‌తుల‌లోను పోలిక‌లు, ఇంకా బాలి-జ‌త్రా వంటి ఉదాహ‌ర‌ణ‌లను ఏకరువు పెట్టారు. అంత‌క్రితం రామాయ‌ణం మ‌రియు మ‌హాభార‌తం నుండి స్వీక‌రించిన ఇతివృత్తాలతో కూడిన గాలిప‌టాల ప్ర‌ద‌ర్శ‌న‌ను అధ్య‌క్షులు శ్రీ విడోడో, తాను క‌ల‌సి ప్రారంభించామని ఆయన తెలిపారు.

భార‌త‌దేశం లోని ప‌రిణామాల‌ను గురించి ఆయ‌న చెప్తూ, కేంద్ర ప్ర‌భుత్వం అభివృద్ధికి స్నేహ‌శీలంగా ఉన్న మ‌రియు అవినీతికి తావు ఉండన‌టువంటి వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్మిస్తోంద‌ని తెలిపారు. “వ్యాపార నిర్వ‌హ‌ణ‌ లో స‌ర‌ళ‌త్వాన్ని” అధిగ‌మించి, ఇప్పుడు ఇక “జీవించ‌డంలో స‌ర‌ళ‌త్వం” పైన శ్ర‌ద్ధ తీసుకోవ‌డం జ‌రుగుతోంద‌న్నారు. మ‌న‌ ప్ర‌క్రియ‌లు పార‌ద‌ర్శ‌క‌మైన‌వీ, సూక్ష్మ‌గ్రాహ్య‌త‌ తో కూడుకొన్న‌వీనూ అని ఆయ‌న వివ‌రించారు. అవ‌స్థాప‌న అభివృద్ధి సంబంధిత రంగాల‌లో చోటు చేసుకొన్న నాట‌కీయ ప‌రిణామాల‌ను ఆయ‌న వివరించారు. భార‌త‌దేశం లో చైత‌న్య‌శీలంగా ఉన్న‌టువంటి స్టార్ట్-అప్ ఇకో సిస్ట‌మ్ ను గురించి మ‌రియు ఇంట‌ర్‌నేశ‌న‌ల్ సోలర్ అల‌య‌న్స్ ను గురించి కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు.

ఆప‌న్నుల‌కు స‌హాయాన్ని అందించే విష‌యానికి వ‌స్తే ఇటు ఇండోనేశియా అటు భార‌త‌దేశం సత్వరమే ప్ర‌తిస్పందించే దృష్టికోణాన్ని క‌లిగివున్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. భార‌త‌దేశం ఎవ‌రి పాస్‌పోర్టు యొక్క రంగు ఏమిట‌న్నది చూడ‌కుండా, స‌హాయం అవ‌స‌ర‌మైన సాటి మాన‌వులు అంద‌రికీ చేయూత ను అందిస్తుంద‌ని ఆయ‌న అన్నారు. భార‌త‌దేశం మ‌రియు ఇండోనేశియా వాటి పేర్ల‌లో ప్రాస‌ ను మాత్ర‌మే కాక వాటి యొక్క సంస్కృతి, సంప్ర‌దాయాలు మ‌రియు ప్ర‌జాస్వామిక విలువ‌ల తాలూకు ఒక ఉమ్మ‌డి ల‌య‌ను కూడా పంచుకొన్నట్లు ఆయ‌న చెప్పారు.

భార‌త‌దేశం లో ఆవిష్కార‌మ‌వుతున్నటువంటి మార్పుల‌ను స్వ‌యంగా గ‌మ‌నించ‌డానికై ఇక్కడికి త‌ర‌లి రండి అంటూ ప్ర‌వాసులను ప్ర‌ధాన మంత్రి ఆహ్వానించారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Parliament on verge of history, says PM Modi, as it readies to take up women's bills

Media Coverage

Parliament on verge of history, says PM Modi, as it readies to take up women's bills
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays homage to Dr. Babasaheb Ambedkar in the Parliament complex
April 14, 2026

The Prime Minister, Shri Narendra Modi has paid homage to Dr. Babasaheb Ambedkar in the Parliament complex earlier today.

The Prime Minister wrote on X;

“Paid homage to Dr. Babasaheb Ambedkar in the Parliament complex earlier today.”