“Today is a day of pride in parliamentary democracy, it is a day of glory. For the first time since independence, this oath is being taken in our new Parliament”
“Tomorrow is 25 June. 50 years ago on this day, a black spot was put on the Constitution. We will try to ensure that such a stain never comes to the country”
“For the second time since independence, a government has got the opportunity to serve the country for the third time in a row. This opportunity has come after 60 years”
“We believe that majority is required to run the government but consensus is very important to run the country”
“I assure the countrymen that in our third term, we will work three times harder and achieve three times the results”
“Country does not need slogans, it needs substance. Country needs a good opposition, a responsible opposition”

మిత్రులారా,

 

ఈ రోజు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి గర్వకారణమైన రోజు, గొప్ప రోజు. స్వాతంత్య్రానంతరం తొలిసారిగా మన కొత్త పార్లమెంటులో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటి వరకు పాత సభలోనే ఈ ప్రక్రియ జరిగేది. ఈ ముఖ్యమైన రోజున, నేను కొత్తగా ఎన్నికైన ఎంపీలందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను, ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను, అందరికీ నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.

 

భారతదేశంలోని సాధారణ పౌరుల ఆకాంక్షలను నెరవేర్చడమే ఈ పార్లమెంటు ఏర్పాటు లక్ష్యం. రెట్టించిన ఉత్సాహంతో కొత్త ఊపుతో, కొత్త శిఖరాలను అధిరోహించడానికి ఇది చాలా ముఖ్యమైన అవకాశం. 2047 నాటికి శ్రేష్ఠ (గొప్ప), 'వికసిత్' (అభివృద్ధి చెందిన) భారత్ ను నిర్మించాలన్న లక్ష్యం, కలలు, తీర్మానాలతో 18వ లోక్సభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికలు అద్భుతంగా, ఘనంగా జరగడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. ఇది 140 కోట్ల దేశ ప్రజలకు గర్వకారణం. 65 కోట్లకు పైగా ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఈ ఎన్నికలు కూడా చాలా ముఖ్యమైనవి ఎందుకంటే, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రెండవసారి, దేశ ప్రజలు ఒక ప్రభుత్వానికి వరుసగా మూడవసారి సేవలందించే అవకాశాన్ని ఇచ్చారు. 60 ఏళ్ల తర్వాత ఈ అవకాశం రావడం ఎంతో గర్వకారణం.

 

మిత్రులారా,

 

దేశ ప్రజలు మూడవసారి ఓ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు, అది దాని ఉద్దేశాలను మరియు విధానాలను వారు అంగీకరించడాన్ని సూచిస్తుంది. ప్రజల పట్ల దాని అంకితభావంపై వారి నమ్మకాన్ని వారు ధృవీకరించారు, ఇందుకు నా దేశ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వాన్ని నడపడానికి మెజారిటీ అవసరం అయితే, ఒక దేశాన్ని పాలించడానికి ఏకాభిప్రాయం చాలా ముఖ్యమని మేము నమ్ముతున్నందున, మేము గత 10 సంవత్సరాలుగా ఒక సంప్రదాయాన్ని స్థాపించడానికి నిరంతరం కృషి చేస్తున్నాము. కాబట్టి, అందరి సమ్మతితో భారత మాతకు సేవ చేయడం, అందరినీ కలుపుకొని పోవడం, 140 కోట్ల మంది దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడం మా నిరంతర ప్రయత్నం.

 

 

అందరినీ కలుపుకుని రాజ్యాంగ పరిధిలో తీసుకొనే నిర్ణయాలను వేగవంతం చేయడమే మా లక్ష్యం. 18వ లోక్ సభలో యువ ఎంపీలు గణనీయంగా ఉండటం సంతోషంగా ఉంది. భారతీయ సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వం తెలిసిన వారికి 18 సంఖ్యకు ఉన్న  ప్రాముఖ్యత గురించి బాగా తెలుసు. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి, ఇది కర్మ, కర్తవ్యం మరియు కరుణ యొక్క సందేశాలను అందిస్తుంది. మన సంప్రదాయంలో 18 పురాణాలు, ఉప పురాణాలు కూడా ఉన్నాయి. 18 యొక్క మూల సంఖ్య 9, ఇది పరిపూర్ణతను సూచించే సంఖ్య. 18 ఏళ్లకే ఓటు హక్కును పొందుతాం. 18వ లోక్ సభ భారత్ 'అమృత్ కాల్' లో ఏర్పడడం కూడా శుభసూచకమే.

 

మిత్రులారా,

 

ఈ రోజు జూన్ 24న మనం కలుస్తున్నాం. రేపు జూన్ 25. మన రాజ్యాంగ గౌరవాన్ని నిలబెట్టడానికి అంకితమైన వారికి, భారతదేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను విశ్వసించే వారికి జూన్ 25 మరువలేని రోజు. భారత ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యాయం లిఖించి రేపటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. రాజ్యాంగాన్ని పూర్తిగా విస్మరించి, ఛిన్నాభిన్నం చేసి, దేశాన్ని జైలుగా మార్చి, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అణచివేసిన తీరును కొత్త తరం భారతం ఎన్నటికీ మరచిపోకూడదు. ఎమర్జెన్సీ తర్వాత ఈ 50 ఏళ్లు మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని సగర్వంగా కాపాడాలని గుర్తు చేస్తున్నాయి. ఇలాంటి అపహాస్యం ఇంకెప్పుడూ జరగకూడదని దేశప్రజలు సంకల్పించాలి. భారత రాజ్యాంగం నిర్దేశించిన విధంగా శక్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని నిర్ధారించడానికి మరియు సామాన్యుడి కలలను నెరవేర్చడానికి మేము కట్టుబడి ఉన్నాము.

 

మిత్రులారా,

 

దేశ ప్రజలు మాకు మూడో అవకాశం ఇచ్చారు , ఇది చాలా పెద్ద విజయం, చాలా అద్భుతమైన విజయం. ఆపై మన బాధ్యత కూడా మూడు రెట్లు పెరుగుతుంది. రెండుసార్లు ప్రభుత్వాన్ని నడిపిన అనుభవంతో మూడోసారి మూడు రెట్లు కష్టపడి పనిచేస్తామని నేను ఈ రోజు దేశప్రజలకు హామీ ఇస్తున్నాను. మూడు రెట్లు ఎక్కువ ఫలితాలు సాధించే సంకల్పంతో ఈ కొత్త పనిలో ముందుకెళ్తాం.

 

గౌరవనీయులైన సభ్యులారా, దేశం మనందరి నుండి గొప్ప ఆశలను కలిగి ఉంది. ఎంపీలందరూ ప్రజా సంక్షేమం, సేవ కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజాప్రయోజనాల దృష్ట్యా సాధ్యమైన ప్రతి అడుగు వేయాలని కోరుతున్నాను. ప్రజలు కూడా ప్రతిపక్షాల నుంచి నిర్మాణాత్మక సహకారం ఆశిస్తారు. ఇంతవరకు నిరాశే ఎదురైనప్పటికీ 18వ లోక్ సభలో ప్రతిపక్షాలు తమ పాత్రను సమర్థవంతంగా నిర్వహించి ప్రజాస్వామ్య గౌరవాన్ని నిలబెట్టగలవని ఆశిస్తున్నాను. ప్రతిపక్షాలు ఈ అంచనాలకు అనుగుణంగా నడుచుకుంటామని నమ్ముతున్నాను.


 

మిత్రులారా,

 

సభలో సామాన్యుడు చర్చను, శ్రద్ధను ఆశిస్తాడు. అల్లరి, డ్రామా, అలజడిని ప్రజలు ఆశించరు. వారు నినాదాలను కాకుండా ఫలితాలను కోరుకుంటారు. దేశానికి మంచి, బాధ్యతాయుతమైన ప్రతిపక్షం అవసరమని, 18వ లోక్ సభకు ఎన్నికైన ఎంపీలు సామాన్యుల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తారని నేను విశ్వసిస్తున్నాను.

 

మిత్రులారా,

 

'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారత్) కోసం మన సంకల్పాన్ని సాధించడం మన సమిష్టి బాధ్యత. ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తూ ఈ బాధ్యతను అందరం కలిసి నిర్వర్తిస్తాం. పేదరికం నుంచి 25 కోట్ల మంది పౌరులు బయటపడటం వల్ల అతి త్వరలోనే భారత్ లో పేదరికాన్ని నిర్మూలించగలమనే కొత్త నమ్మకాన్ని కలిగిస్తుంది, ఇది మానవాళికి గొప్ప సేవ అవుతుంది. మన దేశ ప్రజలు, 140 కోట్ల మంది పౌరులు కష్టపడి పనిచేయడానికి ఉన్న ఏ ప్రయత్నమూ వదిలి పెట్టరు. వీలైనన్ని ఎక్కువ అవకాశాలను వారికి అందించాలి. ఇది మా ఏకైక దార్శనికత, మరియు మన 18వ లోక్‌సభ తీర్మానాలతో నిండి ఉండాలని, తద్వారా సామాన్యుల కలలు సాకారం కావాలని కోరుకుంటున్నాను.

 

మిత్రులారా,

 

కొత్తగా ఎన్నికైన ఎంపీలకు మరోసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎన్నో ఆశలతో, ఈ దేశ ప్రజలు మనకు అప్పగించిన కొత్త బాధ్యతను అంకితభావంతో, శ్రేష్ఠతతో నెరవేర్చడానికి అందరం కలిసి పనిచేద్దాం. మిత్రులారా,మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Out-of-pocket expenditure on health shows declining trend, states latest National Health Accounts

Media Coverage

Out-of-pocket expenditure on health shows declining trend, states latest National Health Accounts
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays tributes to NTR Garu on his birth anniversary
May 28, 2026

The Prime Minister, Shri Narendra Modi, paid tributes to NTR Garu on his birth anniversary.

The Prime Minister said that NTR Garu is fondly remembered for his commitment towards public welfare and governance which ensured dignity for the poor and marginalised.

The Prime Minister also noted that NTR Garu’s contributions to cinema continue to captivate generations and said that his life and ideals remain a source of immense inspiration.

The Prime Minister wrote on X;

“Tributes to the great NTR Garu on his birth anniversary. He is fondly remembered for his commitment towards public welfare and governance which ensured dignity for the poor and marginalised. His contributions to cinema continue to captivate generations. His life and ideals remain a source of immense inspiration. The NDA Government in Andhra Pradesh, under the leadership of my friend Chandrababu Naidu Garu, is committed to advancing the aspirations he cherished for the people.

@ncbn”