డాక్టర్ లోహియా స్మృతి లో

Published By : Admin | March 26, 2019 | 03:06 IST

మన దేశం యొక్క గొప్ప విప్లవ కారులను గౌరవించు కోవలసిన రోజు ఇది .

తల్లి భారతి యొక్క అమర పుత్రులైన వీర్ భగత్ సింగ్, సుఖ్ దేవ్ మరియు రాజ్ గురు లను వారి సర్వోచ్చ బలిదానం కొరకు వారికీ తల్లి భారతి శ్రద్ధాంజలి ఆర్పిస్తుంది.

దీనితో పాటు అసామాన్య ఆలోచన పరుడు, విప్లవ వీరుడు మరియు గొప్ప దేశ భక్తుడైన డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గారికి వారి జయంతి సందర్భమున సాదర నమస్సులు
ప్రఖరమైన బుధ్ధి కలిగిన డాక్టర్ లోహియా ప్రజలతో సంబంధాలు ఉండే రాజకీయాలంటే యిష్ట పడే వారు.

దేశములో భారత్ చోడో ఉద్యమము నడుస్తున్నప్పుడు ముఖ్యమైన నాయకు లందరు జైలు పాలైనప్పుడు యువ నాయకుడు లోహియా ఉద్యమానికి సారథ్యం వహించాడు.
అతడు అజ్ఞాతంగా వుంటూ రేడియో సేవలను కూడా ప్రారంభించాడు, దీని వాళ్ళ ఉద్యమము లో మందకొడి తనము రాలేదు.
గోవా ముక్తి ఆందోళనలో డాక్టర్ లోహియా పేరు స్వర్ణ అక్షరాలతో లిఖించ దగినది
తాడిత, పీడిత, శోషిత, వంచిత ప్రజలకు అవసరం ఉందంటే అక్కడ లోహియా హాజరు అయ్యేవాడు.
డాక్టర్ లోహియా ఆలోచనలు నేటికీ ప్రేరణ నిస్తుంటాయి. అతడు వ్యవసాయాన్ని ఆధునీకరించడము తో పాటు అన్న దాత సశక్తీకరణ కు చాలా శ్రమించారు. వారి ఆలోచనలకు అనుగుణంగానే ఎన్డీయే ప్రభుత్వము కిసాన్ సమ్మాన్ నిధి, కృషి సించాయి యోజన, ఈ-నామ్, సాయ హెల్త్ కార్డు మరియు మిగతా యోజనాల ద్వారా రైతుల క్షేమం గురించి పని చేస్తున్నది.
సమాజములో నెలకొని ఉన్న కుల వ్యవస్థ మరియు మహిళలు , పురుషుల మధ్య ఉన్న అసమానతలు డాక్టర్ లోహియా లి కలవర పరిచేవి. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అనే మా మంత్రము గత ౫సంవత్సరాలలో మేమెలా పాలనా చేసామో తెలుపుతుంది. డాక్టర్ లోహియా కళలను ఎన్డీయే పూర్తి చేసింది. నేడు ఒక వేళవారు జీవించి ఉన్నట్లైతే
ఎన్డీయే ప్రభుత్వ పాలనను చూసి తప్పకుండ గర్వ పడే వారు.
డాక్టర్ లోహియా పార్లమెంట్ లో కానీ, బయట కానీ మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీలో భయం స్పష్టముగా కనబడేది.

కాంగ్రెస్ దేశానికి ప్రమాద కారముగా మారింది. ఈ విషయము డాక్టర్ లోహియా కు లోకూడా తెలుసు. ౧౯౬౨ సంవత్సరములో మాట్లాడుతూ "కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ రంగములో కానీ, ఉద్యోగ రంగములో గాని, రక్షణ రంగములో గాని ఎలాంటి మంచి మార్పులు జరుగ లేదని అన్నారు,
ఆయన చెప్పిన మాటలు కాంగ్రెస్ తరువాత వచ్చిన ప్రభుత్వాలకు కూడా అన్వయిస్తాయి. ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలూ రైతులను ఇబ్బందులకు గురి చేసాయి. పారిశ్రామిక వేత్తలను బాధ పెట్టారు. ( కాంగ్రెస్ నాయకుల బంధువులను, వారి స్నేహితులను విడిచి పెట్టి.) దేశ రక్షణ విషయములో శీత కన్ను వేశారు.
కాంగ్రెస్ తీరుని వ్యతిరేకించే డాక్టర్ లోహియా హృదయము అల్ల కల్లోలంగా ఉండేది. వారి కృషి మూలంగానే ౧౯౬౭ ఎన్నికలలో బలమైన కాంగ్రెస్ కు ఒక కుదుపు తగిలింది. ఆ సమయములో వాజ్ పాయి మాట్లాడుతూ డాక్టర్ లోహియా ప్రయత్నాల వల్లనే హౌరా అమృతసర్ రైలు కాంగ్రెస్ పాలించని రాష్ట్రాల గుండా ప్రయాణించేది.
నేడు మన దౌర్భాగ్య మేమంటే ఈ నాటి రాజకీయ ఘటనలు ఎంతగా మారి పోయాయంటే ఉంటె లోహియా కూడా చాలా భాద పడే వాడు,
ఏ రాజకీయ పార్టీ అయితే లోహియా ను తమకు ఆదర్శంగా ప్రకటించుకుంటాయో అలంటి వారే లోహియా సిద్ధాంతాలకు తిలోదకాలు వదిలేస్తున్నారు. వీరు ఎంతగా దిగజారారంటే లోహియాను అవమాన పర్చడానికి ఎలాంటి సందర్భము వదలడం లేదు.

ఒడిశా యొక్క సమాజవాది నాయకుడు శ్రీ సురేంద్ర నాథ్ ద్వివేది మాట్లాడుతూ "ఆంగ్లేయుల కాలములో లోహియా ఎన్ని మార్లు జైలు కెళ్లాడో , అంత కన్నా ఎక్కువ మార్లు కాంగ్రెస్ ప్రభుత్వము లో జైలు కెళ్ళారు ".

నేడు అదే కాంగ్రెస్ తో లోహియా వాది పార్టీలు ఎన్నికలలో పొత్తులు పెట్టుకుంటున్నారు. ఇది చాలా విచారించ వలసిన విషయము. ఇది నిండనీయము కూడా.
డాక్టర్ లోహియా వంశ వాద రాజకీయాలను నిరసించే వాడు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని అనేవారు. కానీ నేడు వారి అనుయాయులే కుటుంబ హితమే దేశ హితము కన్నమిన్న అని భావిస్తున్నారు.
డాక్టర్ లోహియా ఉద్దేశ్యముతో వ్యక్తి "సమత, సమానత మరియూ సమత్వ భావము తో పని చేస్తారు. విచారించవలసిన విషయమేమంటే స్వయంగా లోహియవాదులమని చెప్పుకునే వారే దీనిని విస్మరించారు. ఇపుడు వారికి అధికారము, స్వార్ధము మరియు దోపిడీ లో విశ్వాసము నెలకొంది. ఈ పార్టీలు అధికారము లో ఉన్నప్పుడు దళితులను ,పేదవారిని, పీడితులను దోచుకుంటున్నారు. వీరినే కాకుండా మహిళల పట్ల కూడా వీరి ప్రవర్తన మంచిగా లేదు ఎందుకంటే వీరి పాలనలో అసాంఘిక శక్తులకు, నేరస్తులకు స్వేచ్ఛగా తిరిగే అవకాశము ఉండేది.

డాక్టర్ లోహియా జీవనంలో ప్రతి క్షేత్రములో మహిళలను పురుషులతో సమానముగా చూచే వారు. కానీ ఓటు బ్యాంకు రాజకీయాలలో మునిగిన కొన్ని రాజకీయ పార్టీలు దీనిని ఆచరణలో పెట్టలేదు. ఈ కారణంగానే ఈ పార్టీలు ఎన్డీయే ప్రభుత్వము ట్రిపుల్ తలాక్ పై తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించా లేదు.

ఈ పార్టీలకు స్పష్టం చేయాలి. మీకు లోహియా ఆదర్శాలు ముఖ్యమా లేక ఓటు బ్యాంకు రాజకీయాలు ఇష్టమా అని నిలదీయాలి.

నేడు ౧౩౦ కోట్ల భారతీయులను ఈ ప్రశ్న వేధిస్తోంది. ఎవరైతే డాక్టర్ లోహియా విశ్వాసాలనే కల రాచారో అలాంటి వారి నుండి దేశ సేవ ను ఆశించడం అత్యాశే అవుతుంది.

ఎవరైతే డాక్టర్ లోహియా సిద్ధాంతాలకు ద్రోహం చేసారో అలంటి వారు దేశవాసులకు కూడా ద్రోహం చేయగలరు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
21% YoY rise in engineering exports in June shows sector's resilience amid global challenges: EEPC India Chairman

Media Coverage

21% YoY rise in engineering exports in June shows sector's resilience amid global challenges: EEPC India Chairman
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
భారతదేశ ఐక్యత, ప్రగతికి అంకితమైన జీవితం
July 06, 2026

ఇవాళ తేదీ జూలై 6... జాతీయవాదం, నిస్వార్థ సేవ వంటి ఆదర్శాలకు ప్రాణమిచ్చే అసంఖ్యాక ప్రజానీకానికి ఇదొక ప్రత్యేక దినం. అంతులేని సాహసానికి, భరతమాతపై అత్యంత ఆరాధన భావనకు కాలాతీత నిదర్శనంగా నిలిచిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి ఈ రోజే. ఆధునిక భారతంలో మేధస్సు, ప్రజాసేవ, నైతిక విశ్వాసమనే లక్షణాల అద్భుత సమ్మేళనం ఇంతగా మూర్తీభవించిన ఆయన వంటి నాయకులు దేశంలో చాలా అరుదు.


సురక్షిత, సుఖవంతమైన జీవితానికి లోటు లేని బాల్యం ఆయనది. శ్యామా ప్రసాద్‌ తండ్రి, సర్ అశుతోష్ ముఖర్జీ సమకాలీన అగ్రశ్రేణి విద్యావేత్తలలో.. మేధావులలో ఒకరు. అలాంటి సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ సకల సౌఖ్యాలనూ వదులుకుని త్యాగం, జాతి సేవ దిశగా ఆయన అంతరాత్మ నడిపించింది. వలసవాదం, మతతత్వం, మానవతా సమస్యలు వంటివి కమ్ముకున్న నాటి కల్లోల కాలంలో ఒక మూగ ప్రేక్షకునిగా మిగిలిపోవడం తగదని ఆయన దృఢంగా విశ్వసించారు. ఈ ప్రస్థానంలో ఆయన తొలుత పసికందుగా ఉన్న బిడ్డను, ఆ తర్వాత భార్యను కోల్పోయారు. అంతటి తీవ్ర వ్యక్తిగత విషాదాలను చవిచూసినప్పటికీ దేశ సేవపై ఆయన సంకల్పం మరింత బలపడి, తిరుగులేని నిబద్ధతతో ముందుకే నడిపింది.


డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రజా జీవనాన్ని అన్నింటికన్నా ఎక్కువగా నిర్వచించిన ఆదర్శం ఏదైనా ఉందంటే- అవిభాజ్య భారత్‌ దిశగా ఆయన దీక్ష. దేశ విభజన సంక్షోభ సమయాన పశ్చిమ బెంగాల్ భారత్‌లో అంతర్భాగంగా ఉండాలని ఆయన ప్రగాఢంగా ఆకాంక్షించారు. ఆనాడు దృఢంగా నిలబడిన ఆయన విశ్వాసమే కొన్నేళ్ల తర్వాత ఆయనను జమ్మూకాశ్మీర్‌ వైపు నడిపింది. ఆ క్రమంలో జైలుపాలైనా ఆ జీవితం ఆయన ఉత్సాహాన్ని నీరుగార్చలేక పోయింది. కారాగార ఏకాంతం ఆయనను ఎంతమాత్రం కుంగదీయలేదు. ఏ ప్రజల ఆశయాన్ని తనదిగా చేసుకున్నారో వారికి అత్యంత దూరంగా, నిర్బంధంలోనే ఆయన జీవితం హఠాత్తుగా ముగిసింది. చరిత్రలో కొన్ని క్షణాలుంటాయి.. అంతిమ శ్వాసలోనూ ఒక వ్యక్తి త్యాగం రాజకీయాలకు అతీతంగా జాతీయ స్మృతిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అటువంటి క్షణాల్లో డాక్టర్ ముఖర్జీ జీవన ప్రస్థానం ఒకటిగా మిగిలింది. ఆచార్య వినోబా భావే చెప్పినట్లు- తాను విశ్వసించిన ఆదర్శం కోసం డాక్టర్ ముఖర్జీ ఆత్మార్పణకు వెనుదీయలేదు. అటుపైన ఎన్నో ఏళ్ల తర్వాత 2019లో ఆర్టికల్‌ 370, 35(ఎ)ల రద్దు ఆయన అమరత్వానికి అత్యంత సముచిత నివాళి అనడంలో సందేహం లేదు.


డాక్టర్ ముఖర్జీ సదా దేశానికే ప్రథమ స్థానమిచ్చారు... భారతీయ విలువలకే పెద్ద పీట వేశారు. తదనుగుణంగా ఆనాటి సంప్రదాయ ఆలోచనలకు సవాలు విసురుతూ సంస్థల, వ్యవస్థలకు రూపమివ్వడం ద్వారా ఆయన ఈ లక్ష్యం సాధించారు. అత్యంత పిన్న వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయానికి ఉప కులపతి అయ్యారు. తనదైన శైలిలో, దేశభక్తి, భవిష్యత్ దృక్పథంతో కూడిన అనేక సానుకూల మార్పులు తెచ్చారు. ఓ సారి విద్యావేత్తల సదస్సులో ప్రసంగించిన సందర్భంగా- “భవిష్యత్‌ గుమాస్తాలను, తక్కువ జీతాలు పొందే సిబ్బందిని ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా విద్యా సంస్థలను చిన్న చూపు చూడటం తగదు. స్థానిక సంస్థలు, పురపాలక, రాష్ట్ర, కేంద్ర చట్టసభలను నడిపించగల ఉద్దండులుగా విద్యార్థులను మనం తీర్చిదిద్దాలి. అదే తరహాలో ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక తదితర జనజీవన ప్రాధాన్య రంగాల వ్యవహారాలను నడిపించగల సమర్థులుగా తయారు చేయాలి” అని కుండబద్దలు కొట్టారు.


డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ సారథ్యంలో కలకత్తా విశ్వవిద్యాలయం అనేక విధాలుగా ముందంజ వేసింది. ఆయన హయాంలో గ్రంథాలయ మౌలిక సదుపాయాల మెరుగుదల, విజ్ఞానశాస్త్ర పరిశోధనలకు ప్రోత్సాహం, పురావస్తు అధ్యయనం, వ్యవసాయంలో కొత్త కోర్సులకు శ్రీకారం వంటి విశిష్ట కృషి కొనసాగింది. క్రీడలు, ఉపాధ్యాయ శిక్షణ, విద్యార్థుల సంక్షేమం తదితరాలపైనా ఆయన ఏకకాలంలో దృష్టి సారించారు. ప్రస్తుత-పూర్వ విద్యార్థులలో తమ విశ్వవిద్యాలయంపై సగర్వ భావనను ప్రోది చేస్తూ, ఏటా జనవరి 24న విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. అలాగే, విశ్వవిద్యాలయంపై ఒక పాట రాయాల్సిందిగా గురుదేవులు రవీంద్ర నాథ్‌ టాగోర్‌ను ఆయన అభ్యర్థించారు.


ఈ స్ఫూర్తికి మరో ఉదాహరణ ఆయన జీవిత చరమాంకంలో కనిపిస్తుంది. అప్పట్లో ‘భారతీయ జనసంఘ్‌’ను రూపుదిద్దాలని నిర్ణయించుకున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రాభవం ఉచ్ఛస్థాయిలో ఉన్న సమయాన మనవైన సాంస్కృతిక మూలాలకు కట్టుబడుతూనే దేశ ప్రగతి కోసం గళం విప్పే ప్రత్యామ్నాయ స్వరం ఒకటి అవసరమని ఆయన భావించారు. అది ఓ చిన్న దివ్వెలాంటిదైనా పరవాలేదని భావించారేమో అన్నట్లుగా దాని చిహ్నంగా ‘మట్టి దీపం’ గుర్తును డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ఎంచుకోవడం గమనార్హం. ప్రమిద ఎంత చిన్నదైనా, దాని వెలుగు స్వల్పమే అయినా తన పరిధికి మించి చీకటిని పారదోలగల శక్తి దానికి ఉంటుందని భావించారు. తదనంతర క్రియాశీల మనుగడలోనూ జనసంఘ్ ఇదేవిధంగా ముందడుగు వేసింది.


డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీకి దేశ ప్రగతిపై గల అవగాహన ఎంతటిదో భారత తొలి పరిశ్రమలు-పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన పదవీకాలం వెల్లడిస్తుంది. ఒక రాజనీతిజ్ఞుడిగా, అసాధారణ నిజాయితీ, మానవతా దృక్పథం కలగలసిన నాయకుడుగా ఆయన సామర్థ్యం స్పష్టమవుతుంది. స్వాతంత్ర్యం పొందిన తొలినాళ్లలో పారిశ్రామిక రంగాన్ని దేశానికి గౌరవం, అవకాశాలు, విశ్వాసాలను పునరుద్ధరించే సాధనంగా ఆయన పరిగణించారు. తదనుగుణంగా సంపద సృష్టిని, విలువ జోడింపును గౌరవించారు. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సింధ్రీ ఫెర్టిలైజర్ ప్లాంట్, పటిష్ట పారిశ్రామిక విధానం వంటి మార్గదర్శక కార్యక్రమాల ద్వారా ఆధునిక పారిశ్రామిక భారతానికి పునాదులు వేశారు. అదే సమయంలో భారత సంప్రదాయ బలాలు నిర్లక్ష్యానికి గురికాకుండా చూసుకున్నారు. చేనేత, కుటీర పరిశ్రమలు, కళాకారులు, వస్త్ర కార్మికులందరూ ఆయనలో అసమాన నిబద్ధతగల మద్దతుదారును కనుగొన్నారు.


ఈ సందర్భంగా నేనొక వ్యక్తిగత అనుభవాన్ని పంచుకోవాలని భావిస్తున్నాను. స్వావలంబనపై విస్పష్ట దార్శనికతతో డాక్టర్ ముఖర్జీ స్థాపించిన సింధ్రీ కర్మాగారాన్ని అనేక దశాబ్దాల పాటు దేశాన్నేలిన పాలకులు నిర్లక్ష్యం చేశారు. ఈ నేపథ్యంలో దాని పునరుద్ధరణలో తోడ్పడే అవకాశం మా ప్రభుత్వానికి లభించడం నాకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. ఆ కార్యక్రమంలో పాల్గొనడం నా జీవితంలోని అత్యంత ప్రత్యేక క్షణాలలో ఒకటిగా నిలిచిపోయిందంటే అతిశయోక్తి కాబోదు.


సంభాషణలను, చర్చలను ప్రోత్సహించడం భారత నాగరిక సంప్రదాయంలో అనాదిగా అంతర్భాగం. ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తికి డాక్టర్ ముఖర్జీ ప్రతిరూపంగా నిలిచారు. తొలిదశలో దేశ పురోగమన బాధ్యత రాజకీయ విభేదాలకు అతీతమనే సత్యాన్ని విశ్వసించి పండిట్ నెహ్రూ మంత్రిమండలిలో చేరారు. ఆ పదవిలో ఉన్నంత కాలం చిత్తశుద్ధితో, నిర్మాణాత్మక స్ఫూర్తితో సేవలందించారు. కానీ, జాతీయ ప్రాధాన్యంగల అంశాల్లో భిన్న మార్గం సముచితమని భావించిన వేళ గౌరవప్రదంగా పదవిని త్యజించారు. దేశానికి ఏది అవసరమో దానికి సంబంధించిన రాజకీయ కార్యకలాపాలకు పూర్తి నిబద్ధతతో అంకితమయ్యారు.


పండిట్ నెహ్రూ 75 ఏళ్ల కిందటే భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడితో సమానమైన తొలి రాజ్యాంగ సవరణను తెచ్చారు. దాన్ని డాక్టర్ ముఖర్జీ నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ మనోభావన ఏమిటో ఆయన పూర్తిగా అవగతం చేసుకున్నారు. అదే పూర్తిగా సరైనదని కూడా నిరూపితమైంది. అలనాడు... 75 ఏళ్ల కిందట తొలి సవరణ తెచ్చిన వారే 1975లో ఎమర్జన్సీకి కూడా కారకులయ్యారు. అటుపైన 50 ఏళ్ల కిందట ఉదార ప్రజాస్వామ్య విలువల మూలాలపై మరోసారి దెబ్బకొడుతూ 42వ సవరణ చట్టం తెచ్చారు.


మానవతా వాదాన్ని సమున్నతంగా నిలపడంలోనూ డాక్టర్ ముఖర్జీ ప్రత్యేక గుర్తింపు పొందారు. బెంగాల్లో 1943నాటి అత్యంత ఘోరమైన కరువు విజృంభించినపుడు ఆయన బాధితుల సేవలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ప్రజలకు ఆహారం సమకూర్చడం కోసం అనేక స్వచ్ఛంద వంటశాలలు, సహాయ శిబిరాలు ఏర్పాటు చేసేలా అవిరళ కృషి చేశారు. ప్రజల దుస్థితి చూసి నిలువెల్లా చలించిపోయిన ఆయన, వలస పాలకుల నిర్దాక్షిణ్య వైఖరిని తీవ్రంగా నిరసించారు. ‘పంచషేర్‌ మన్వంతర్‌’ పేరిట తాను రాసిన పుస్తకంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. అంతకుముందు 1942లో మేదినీపూర్‌ను ఒక మహా తుఫాను వణికించినపుడు పరిస్థితుల పునరుద్ధరణ దిశగా ఆయన కృషికి విస్తృత ప్రశంసలు లభించాయి.


ఆ రోజుల్లో కలకత్తాలోని ఓ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో యువతను ఉద్దేశించి మాట్లాడుతూ- “మీరు ఏ పని చేపట్టినా శ్రద్ధగా... క్షుణ్ణంగా... అర్థవంతంగా చేయండి. ఏ పనినీ అర్థాంతరంగా వదిలేయకండి... అరకొర ఫలితంతో సంతృప్తి చెందకండి.. మీ అత్యుత్తమ కృషితో సత్ఫలితం సిద్ధించే దాకా పట్టువీడకండి” అని డాక్టర్ ముఖర్జీ పిలుపునిచ్చారు. దేశం ఇవాళ వికసిత భారత్‌ స్వప్న సాకారం దిశగా పురోగమిస్తున్న తరుణాన... ఆయన ప్రగాఢంగా విశ్వసించిన శక్తియుత, సమైక్య, ఆత్మవిశ్వాసపూరిత, కరుణార్ద్ర దేశ నిర్మాణానికి నిత్యం కృషి చేయడమే ఆయనకు మనం అర్పించగల అత్యుత్తమ నివాళి. ఈ నేపథ్యంలో నేటి యువత దృక్పథం గురించి నాకు బాగా తెలుసు కాబట్టి, నేటి సందర్భానికి తగినట్లు వారంతా డాక్టర్‌ ముఖర్జీ ఆశయాలకు న్యాయం చేసేందుకు అహరహం శ్రమిస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.