మహనీయుడు సంత్ శ్రీ గురు రవిదాస్ మహారాజ్ గారి జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. శ్రీ గురు రవిదాస్ మహారాజ్ గారు న్యాయాన్నీ, కరుణనీ ఇతర అన్ని భావనల కన్నా మిన్నగా తలచారనీ, ప్రజల సంక్షేమానికి మేం అమలు చేస్తున్న పథకాలకు కూడా ఈ భావనలే ఆధారంగా ఉన్నాయనీ శ్రీ మోదీ వివరించారు. ‘‘ఆయన వెలిగించిన సామాజిక సామరస్యం, సద్భావనల జ్యోతి దేశ ప్రజలు నడిచే దారిని ఎప్పటికీ ప్రకాశవంతం చేస్తూనే ఉంటాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -

‘‘మానవత్వాన్ని ఎంతగానో ఉపాసించిన మహా సంత్ శ్రీ గురు రవిదాస్ మహారాజ్ గారికి ఆయన జయంతి సందర్భంగా కోటి కోటి నమస్సులు. న్యాయం, కరుణ అనే భావాలను మిగతా అన్నింటి కన్నా మిన్నగా ఆయన భావించారు. మేం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అమలు చేస్తున్న పథకాలకు కూడా ఈ భావనలే కీలకంగా ఉన్నాయి. శ్రీ గురు రవిదాస్ మహారాజ్ గారు వెలిగించిన సామాజిక సామరస్యం, సద్భావనలనే దీపాలు దేశ ప్రజలు నడుస్తున్న మార్గాన్ని ఎప్పటికీ ప్రకాశవంతం చేస్తుంటాయి’’ అని పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s AI moment: Sarvam turns unicorn at $1.5 billion valuation

Media Coverage

India’s AI moment: Sarvam turns unicorn at $1.5 billion valuation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 16 జూన్ 2026
June 16, 2026

Viksit Bharat in Action: 12 Years of Roads, AI Unicorns, Export Booms & Unmatched Global Camaraderie"