దాద్రా నగర్ హవేలీ, దామన్ దివే మనకు గర్వకారణం, మన వారసత్వం: ప్రధానమంత్రి
దాద్రా నగర్ హవేలీ, దామన్ దివే అనేక పథకాల అమలులో సంతృప్త స్థాయికి చేరుకున్నాయి: ప్రధాని
జన ఔషధి అంటే తక్కువ ఖర్చుతో వైద్యానికి భరోసా!
జన ఔషధి మంత్రం... తక్కువ ధరలు, ప్రభావవంతమైన మందులు: ప్రధాని

కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ, దామన్ దివేలోని సిల్వస్సాలో రూ.2580 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. అంతకుముందు సిల్వస్సాలో నమో ఆస్పత్రిని కూడా ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, దాద్రా నగర్ హవేలీ, దామన్ దివే కేంద్రపాలిత ప్రాంతంతో అనుసంధానం కావడానికి, సన్నిహితంగా పనిచేయడానికి అవకాశం ఇచ్చినందుకు అక్కడి అంకితభావం కలిగిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. అక్కడి ప్రజలతో తనకు ఉన్న సాన్నిహిత్యం, దీర్ఘకాలిక సంబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఈ ప్రాంతంతో తన అనుబంధం దశాబ్దాల నాటిదని తెలిపారు. 2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ ప్రాంతం సాధించిన పురోగతిని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దాద్రా నగర్ హవేలీ, దామన్ దివే సామర్థ్యాన్ని ఆధునికత, పురోగతి దిశగా మార్చిన విధానాన్ని ఆయన వివరించారు.

"సిల్వస్సా సహజ అందాలు, అలాగే దాద్రా నగర్ హవేలీ, దామన్ దివే ప్రజల ప్రేమ - మీతో నా సంబంధం ఎంతకాలంగా ఉందో మీ అందరికీ తెలుసు. దశాబ్దాల నాటి ఈ బంధం, నేను ఇక్కడికి వచ్చినప్పుడు కలిగే ఆనందాన్ని మీరు, నేను మాత్రమే అర్థం చేసుకుంటాం” అని శ్రీ మోదీ పేర్కొన్నారు. మొదటిసారి తాను ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు చాలా భిన్నంగా ఉండేదని, ఒక చిన్న తీర ప్రాంతం ఏమి సాధించగలదనే ప్రశ్న ప్రజల్లో ఉండేదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అయితే, ఈ ప్రాంత ప్రజలపై, వారి సామర్థ్యాలపై తనకు ఎప్పుడూ పూర్తి విశ్వాసం ఉందని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వ నాయకత్వంలో, ఈ విశ్వాసం పురోగతిగా రూపాంతరం చెందిందని, సిల్వస్సాను కాస్మోపాలిటన్ నగరంగా మార్చిందని, తన నివాసితులందరికీ కొత్త అవకాశాలు కల్పిస్తూ అభివృద్ధి చెందుతోందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

తొలినాళ్లలో చిన్న మత్స్యకార గ్రామంగా ఉన్న సింగపూర్ కు సంబంధించిన ఒక ఉదాహరణను కూడా శ్రీ మోదీ పంచుకున్నారు. సింగపూర్ ప్రజల దృఢ సంకల్పబలం వల్లే ఇప్పటి మార్పు సాధ్యమైందని ఆయన ఉద్ఘాటించారు. ఈ కేంద్రపాలిత ప్రాంత ప్రజలు కూడా అభివృద్ధి కోసం ఇదే విధమైన సంకల్పాన్ని తీసుకోవాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. వారికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు, అయితే ముందుకు సాగడానికి వారు కూడా చొరవ తీసుకోవాలన్నారు.

“దాద్రా నగర్ హవేలీ, దామన్ దివే కేవలం కేంద్ర పాలిత ప్రాంతం మాత్రమే కాదు. అది గర్వకారణమే గాక, వారసత్వ సంపద కూడా. అందుకే ఈ ప్రాంతాన్ని సమగ్రాభివృద్ధికి పేరొందిన ఆదర్శ రాష్ట్రంగా మారుస్తున్నాం'' అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, అధునాతన ఆరోగ్య సంరక్షణ సేవలు, ప్రపంచశ్రేణి విద్యాసంస్థలు, , పర్యాటకం, నీలి ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక ప్రగతి యువతకు కొత్త అవకాశాలు, అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యానికి ఈ ప్రాంతం గుర్తింపు పొందాలని తాను ఆశిస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు.

శ్రీ ప్రఫుల్ పటేల్ నాయకత్వంలో, కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ఈ ప్రాంతం ఈ లక్ష్యాల దిశగా వేగంగా పురోగమిస్తోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. గత పదేళ్లలో అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించామని అన్నారు. ఈ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి పరంగా ప్రత్యేక గుర్తింపు సాధిస్తూ జాతీయ పటం పై ఉద్భవిస్తోంది. వన్ నేషన్ - వన్ రేషన్ కార్డ్, జల్ జీవన్ మిషన్, భారత్‌నెట్, ప్రధానమంత్రి జనధన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్షా బీమా వంటి వివిధ ప్రభుత్వ పథకాలు ప్రజలకు, ముఖ్యంగా బడుగు, బలహీన, గిరిజన సముదాయాలకు గణనీయమైన ప్రయోజనాలను అందించాయని ప్రధానమంత్రి తెలిపారు.

స్మార్ట్ సిటీస్ మిషన్, సమగ్ర శిక్ష, పీఎం ముద్ర యోజన వంటి కార్యక్రమాల్లో 100 శాతం లక్ష్యాన్ని సాధించడమే తదుపరి లక్ష్యమని ప్రధానమంత్రి ప్రకటించారు. తొలిసారిగా ఈ సంక్షేమ పథకాలతో ప్రభుత్వం నేరుగా ప్రజలకు చేరువవుతోందని, ప్రభుత్వ పథకాల ద్వారా ప్రతి పౌరుడు లబ్ధి పొందేలా చూస్తున్నామని తెలిపారు.

 

మౌలిక సదుపాయాలు, విద్య, ఉపాధి, పారిశ్రామికాభివృద్ధిలో దాద్రా నగర్ హవేలీ, దామన్ దివేల మార్పును ప్రధాన మంత్రి ప్రస్తావించారు. గతంలో ఈ ప్రాంతానికి చెందిన యువత ఉన్నత విద్య కోసం బయటకు వెళ్లాల్సి వచ్చేదని, కానీ నేడు ఈ ప్రాంతంలో ఆరు జాతీయ స్థాయి సంస్థలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. వీటిలో నమో మెడికల్ కాలేజ్, గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ, ఐఐఐటీ డయ్యూ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, డామన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి. ఈ సంస్థలు సిల్వస్సాను, ఈ ప్రాంతాన్ని కొత్త విద్యాకేంద్రంగా మార్చాయి. “యువతకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు ఈ సంస్థల్లో వారికి సీట్లు కేటాయించారు. ఇది హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, మరాఠీ అనే నాలుగు మాధ్యమాల్లో విద్యను అందించే ప్రాంతం అని ఇంతకు ముందు నేను సంతోషించాను. ఇప్పుడు, ఇక్కడ ప్రాథమిక, జూనియర్ పాఠశాలల్లోని పిల్లలు స్మార్ట్ తరగతి గదుల్లో చదువుతున్నారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను" అని శ్రీ మోదీ అన్నారు.

ఇటీవలి సంవత్సరాల్లో, ఆధునిక ఆరోగ్య సంరక్షణ సేవలు ఈ ప్రాంతంలో గణనీయంగా విస్తరించాయని శ్రీ మోదీ అన్నారు. '2023లో నమో మెడికల్ కాలేజీని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. వీటితో పాటు 450 పడకల సామర్థ్యంతో కొత్త ఆసుపత్రిని కూడా నేను నేడు ప్రారంభించాను. సిల్వస్సాలోని ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు ఈ ప్రాంతంలోని గిరిజన సమాజానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి" అని శ్రీ మోదీ చెప్పారు.

జన ఔషధి దివస్ ను పురస్కరించుకుని నేడు ప్రారంభించిన ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను ప్రధానమంత్రి వివరించారు. జన్ ఔషధి తక్కువ ఖర్చుతో చౌకైన చికిత్సను అందిస్తుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వం నాణ్యమైన ఆస్పత్రులు, ఆయుష్మాన్ భారత్ కింద ఉచిత చికిత్స, జన ఔషధి కేంద్రాల ద్వారా చౌకగా మందులు అందిస్తోంది. దేశవ్యాప్తంగా 15,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 80% వరకు తక్కువ ధరలకు మందులను అందిస్తున్నాయి. దాదాపు 40 జన ఔషధి కేంద్రాలు దాద్రా నగర్ హవేలీ, దామన్ దివే ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా 25,000 జన ఔషధి కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుండి, దాదాపు రూ.6,500 కోట్ల విలువైన తక్కువ ధర మందులను అవసరమైన వారికి అందించామని, పేద, మధ్యతరగతికి రూ.30,000 కోట్లకు పైగా ఆదా చేశామని చెప్పారు. “ఈ చొరవ అనేక క్లిష్టమైన వ్యాధుల చికిత్సను మరింత చౌకగా చేసింది, ఇది సాధారణ పౌరుల అవసరాల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రదర్శిస్తుంది" అని శ్రీ మోదీ చెప్పారు.

 

ఆరోగ్యానికి పెనుముప్పుగా పరిణమించిన జీవనశైలి వ్యాధులు, ముఖ్యంగా ఊబకాయంపై పెరుగుతున్న ఆందోళనను ప్రధానమంత్రి ప్రస్తావించారు. 2050 నాటికి 44 కోట్ల మంది భారతీయులు ఊబకాయంతో బాధపడతారని ఒక తాజా నివేదిక అంచనా వేసిన విషయాన్ని ఆయన ఉటంకించారు. “ఈ ఆందోళన కలిగించే గణాంకాలు చూస్తే, ప్రతి ముగ్గురు వ్యక్తుల్లో ఒకరికి ఊబకాయం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది ప్రాణాంతక పరిస్థితిగా మారే అవకాశం కూడా ఉంది,” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

దీన్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ స్థూలకాయాన్ని తగ్గించే ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రధాని కోరారు. వంట నూనె వినియోగాన్ని ప్రతి నెలా 10% తగ్గించాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు తమ రోజువారీ వంటలలో 10% తక్కువ నూనెను ఉపయోగించడానికి కట్టుబడి ఉండాలని కోరారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి, ఊబకాయాన్ని నివారించడానికి ప్రతిరోజూ కొన్ని కిలోమీటర్లు నడవడం వంటి క్రమం తప్పని శారీరక వ్యాయామాలను చేర్చాలని ఆయన ఉద్బోధించారు. “అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యసాధనకు దేశం కట్టుబడి ఉంది. ఆరోగ్యవంతమైన దేశం మాత్రమే అటువంటి లక్ష్యాన్ని చేరుకోగలదు" అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.

గత దశాబ్ద కాలంలో దాద్రా నగర్ హవేలీ, దామన్ దివేలో చోటు చేసుకున్న వేగవంతమైన పారిశ్రామిక వృద్ధిని శ్రీ మోదీ ప్రస్తావించారు. ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించిన మిషన్ మానుఫ్యాక్చరింగ్ పథకం ద్వారా ఈ ప్రాంతానికి భారీగా లాభాలు చేకూరనున్నాయని తెలిపారు. “ఇప్పటికే వందలాది కొత్త పరిశ్రమలు ప్రారంభమయ్యాయి, ఇంకా అనేక ప్రస్తుత పరిశ్రమలు విస్తరించాయి. తద్వారా వేలాది కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి” అని ఆయన వివరించారు. ఈ పరిశ్రమలు ముఖ్యంగా గిరిజన సమాజానికి, మహిళలకు, అట్టడుగు వర్గాలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను అందిస్తున్నాయి. “ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళల సాధికారత కోసం గిర్ ఆదర్శ్ జీవిక యోజనను అమలు చేశామని, చిన్న డెయిరీ ఫామ్ ల ఏర్పాటుతో కొత్త స్వయం ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయని” శ్రీ మోదీ తెలిపారు.

పర్యాటక రంగం కూడా ప్రధాన ఉపాధి వనరుగా అవతరించిందని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ప్రాంతంలోని బీచ్ లు, గొప్ప వారసత్వ ప్రదేశాలు దేశవిదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. రామసేతు, నమో పథ్, డామన్ లోని టెంట్ సిటీ, పాపులర్ నైట్ మార్కెట్ వంటి కొత్త మార్పులు ఈ ప్రాంతం ఆకర్షణను పెంచుతున్నాయి. ఒక పెద్ద పక్షుల అభయారణ్యం ఏర్పాటు చేశామని, దుధానిలో ఎకో రిసార్ట్ కోసం ప్రణాళికలు జరుగుతున్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. డయ్యూలో తీరప్రాంత విహారయాత్ర, బీచ్ అభివృద్ధి పనులు చేపడుతున్నారని చెప్పారు. "2024 లో జరిగిన డయ్యూ బీచ్ గేమ్స్ బీచ్ క్రీడలపై ఆసక్తిని పెంచాయి. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ తో డయ్యూలోని ఘోగ్లా బీచ్ ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మారింది. డయ్యూలో ఒక కేబుల్ కార్ ప్రాజెక్ట్ ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇది అరేబియా సముద్ర అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది, ఇది ఈ ప్రాంతాన్ని భారతదేశ అగ్ర పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా చేస్తుంది" అని శ్రీ మోదీ అన్నారు.

 

దాద్రా నగర్ హవేలీ, దామన్ దివేలో కనెక్టివిటీ గణనీయంగా మెరుగుపడిన అంశాన్ని ప్రస్తావిస్తూ, దాద్రా సమీపంలో బుల్లెట్ రైలు స్టేషన్ ను నిర్మిస్తున్నారని, ముంబయి-ఢిల్లీ ఎక్స్ ప్రెస్ వే సిల్వస్సా మీదుగానే వెళుతుందని ప్రధానమంత్రి తెలిపారు. గత కొన్నేళ్లుగా అనేక కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మించారని, ప్రస్తుతం వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో 500 కిలోమీటర్లకు పైగా రోడ్డు పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఉడాన్ పథకం ద్వారా ఈ ప్రాంతం కూడా లబ్ది ప్రయోజనం పొందుతోంది. కనెక్టివిటీని పెంచడానికి స్థానిక విమానాశ్రయాన్ని అప్ గ్రేడ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.


 

దాద్రా నగర్ హవేలీ, దామన్ దివే అభివృద్ధికి, సుపరిపాలనకు, జీవన సౌలభ్యానికి నమూనాలుగా నిలుస్తున్నాయని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పదేపదే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేవారని, కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్లలో ఒక్క క్లిక్ తో చాలా వరకు ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తి చేయగలుగుతున్నారన్నారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన గిరిజన ప్రాంతాలకు ఈ కొత్త విధానం ఎంతో మేలు చేసింది. గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు విని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. ఇందుకుగాను శ్రీ ప్రఫుల్ పటేల్ ను, ఆయన బృందాన్ని ప్రధానమంత్రి అభినందించారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందని ప్రజలకు హామీ ఇచ్చారు. “ఈరోజు ప్రారంభించిన విజయవంతమైన అభివృద్ధి ప్రాజెక్టులకు గాను దాద్రా నగర్ హవేలీ, దామన్ దివే ప్రజలకు నా అభినందనలు. కేంద్ర పాలిత ప్రాంత ప్రజలు చూపిన ఆత్మీయ స్వాగతం, ఆప్యాయత, గౌరవానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని ప్రధానమంత్రి ముగించారు.

 

నేపథ్యం

దేశంలోని అన్ని మూలల్లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను పెంపొందించడంపై ప్రధానమంత్రి ప్రధానంగా దృష్టి సారించారు. దీనికి అనుగుణంగా సిల్వస్సాలో నమో హాస్పిటల్ (ఫేజ్ 1)ను ఆయన ప్రారంభించారు. రూ.460 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ 450 పడకల ఆసుపత్రి కేంద్ర పాలిత ప్రాంతంలో ఆరోగ్య సేవలను గణనీయంగా బలోపేతం చేస్తుంది. ఇది ఈ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా గిరిజన వర్గాలకు అత్యాధునిక వైద్య సేవలను అందిస్తుంది.

 

సిల్వస్సాలో రూ.2580 కోట్లకు పైగా విలువైన కేంద్రపాలిత ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటిలో వివిధ గ్రామ రహదారులు, ఇతర రహదారుల మౌలిక సదుపాయాలు, పాఠశాలలు, ఆరోగ్య, వెల్నెస్ సెంటర్లు, పంచాయతీ, పరిపాలనా భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, నీటి సరఫరా, మురుగునీటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఉన్నాయి. కనెక్టివిటీని మెరుగుపరచడం, పారిశ్రామిక వృద్ధిని పర్యాటకాన్ని ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, ఈ ప్రాంతంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పెంచడం ఈ ప్రాజెక్టుల లక్ష్యం.

షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ), మైనారిటీలు, దివ్యాంగులకు చెందిన మహిళలకు చిన్న పాల కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా వారి జీవితాల్లో సామాజిక, ఆర్థిక మార్పులతో ఆర్థిక సాధికారతను పెంపొందించడం గిర్ ఆదర్శ్ ఆజీవిక యోజన లక్ష్యంగా పెట్టుకుంది. మహిళా వీధి వ్యాపారులను ప్రోత్సహించే సిల్వన్ దిదీ పథకం కింద వారి వ్యాపారాలకు సౌకర్యవంతమైన బండ్లు అందిస్తారు.. ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా ఈ పథకానికి నిధులు అందిస్తారు.

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
'Operation Sindoor on, if they fire, we fire': India's big message to Pakistan

Media Coverage

'Operation Sindoor on, if they fire, we fire': India's big message to Pakistan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi's address to the nation
May 12, 2025
Today, every terrorist knows the consequences of wiping Sindoor from the foreheads of our sisters and daughters: PM
Operation Sindoor is an unwavering pledge for justice: PM
Terrorists dared to wipe the Sindoor from the foreheads of our sisters; that's why India destroyed the very headquarters of terror: PM
Pakistan had prepared to strike at our borders,but India hit them right at their core: PM
Operation Sindoor has redefined the fight against terror, setting a new benchmark, a new normal: PM
This is not an era of war, but it is not an era of terrorism either: PM
Zero tolerance against terrorism is the guarantee of a better world: PM
Any talks with Pakistan will focus on terrorism and PoK: PM

ప్రియమైన దేశ ప్రజలారా.. నమస్కారం

గత కొన్ని రోజులుగా మనమందరం దేశ సామర్థ్యం, సహనాన్ని రెండింటిని చూశాం

మొదటగా..భారత దేశ పరాక్రమ సేనకు, సరిహద్దు బలగాలకు, నిఘా సంస్థలకు, శాస్త్రవేత్తలకు, ప్రతి ఒక్క భారతీయుడి తరఫున సెల్యూట్ చేస్తున్నాను.

మన వీర సైనికులు ఆపరేషన్ సిందూర్‌లో కచ్చితత్వంతో అసమాన శౌర్యాన్ని చూపిస్తూ లక్ష్యాలను ఛేదించారు

వారి వీరత్వం, పరాక్రమానికి, వారి సాహసానికి సెల్యూట్ చేస్తున్నాను

 

మన దేశ ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి కూతురుకు ఈ పరాక్రమాన్ని అంకితం చేస్తాం

 

మిత్రులారా...ఏప్రిల్ 22న పెహల్గామ్ లో ఉగ్రవాదులు క్రూరత్వాన్ని చూపించారు

ఈ ఘటన దేశాన్ని, ప్రపంచాన్ని వణికించింది.

సెలవులు గడపడానికి వెళ్లిన అమాయాక పౌరులను వారి మతం అడిగి...వారి కుటుంబం ముందే, వారి పిల్లల ముందే దయలేకుండా హతమార్చారు. ఇది ఉగ్రవాదానికి బీభత్సానికి, క్రూరత్వానికి ప్రతీక.

 

దేశంలోని సౌభ్రాత్రుత్వాన్ని విడగొట్టడానికి ఘోరమైన ప్రయత్నం. వ్యక్తిగతంగా నాకు ఇది ఎంతో బాధను కలిగించింది. ఈ ఉగ్రవాద దాడి తర్వాత దేశమంతా, ప్రతి పౌరుడు, ప్రతి సమాజం, ప్రతి వర్గం, ప్రతి రాజకీయ పార్టీ ముక్తకంఠంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఏకమయ్యారు. ఉగ్రవాదాన్ని తుదముట్టేంచేందుకు భారతీయ సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం.

 

మన చెల్లెల్లు, కూతుళ్ల నుదిటి సింధూరాన్ని చేరిపేస్తే..దాని సమాధానం ఎలా ఉంటుందో ప్రతి ఉగ్రవాది, ఉగ్రవాద సంస్థ తెలుసుకుంది.

మిత్రులారా..ఆపరేషన్ సిందూర్ ఇదొక పేరు కాదు.

ఇది దేశంలోని కోటానుకోట్ల ప్రజల మనోభావాలతో ముడిపడి ఉంది

ఆపరేషన్ సిందూర్ న్యాయం కోసం ఒక అఖండ ప్రతిజ్ఞ.

మే 6 రాత్రి, మే7 తెల్లవారుజామున ఈ ప్రతిజ్ఞ ఫలితాలను ప్రపంచం మొత్తం చూసింది.

భారత సైన్యం పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై...వారి శిక్షణ కేంద్రాలపై కచ్చితమైన దాడి చేసింది. ఉగ్రవాదులు కలలో కూడా అనుకొని ఉండకపోవచ్చు...భారత్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందని..కానీ ఎప్పుడైతే దేశం ఏకమవుతుందో..నేషన్ ఫస్ట్ అనే భావన ఉంటుందో.. దేశ హితమే ముఖ్యమని అనుకుంటున్నామో అప్పుడే ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం. ఆ ఫలితాలను సాధించి చూపిస్తాం

 

పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మిసైల్ దాడులు చేసినప్పుడు, డ్రోన్ల దాడులు చేసినప్పుడు, ఉగ్రవాద సంస్థల భవనాలే కాకుండా వారి ధైర్యం కూడా ధ్వంసం అయ్యాయి. బవహల్ పూర్, మురిద్కేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలు...ఒక రకంగా ప్రపంచ ఉగ్రవాదానికి విశ్వవిద్యాలయాలుగా ఉన్నాయి.

ప్రపంచంలో ఎక్కడైనా ఉగ్రవాద దాడి జరిగినా, 9/11, లండన్ బాంబ్ బ్లాస్టింగ్ లేదా, భారత్ లో జరిగిన పెద్ద ఉగ్రవాద దాడులు, వాటి మూలాలు ఈ ఉగ్రవాద విశ్వవిద్యాలయాలతో ముడిపడి ఉన్నాయి.

ఉగ్రవాదులు మన అక్కాచెల్లెల్ల సిందూరాన్ని తుడిచేశారు. అందుకే భారత్ ఉగ్రవాద ముఖ్య కేంద్రాలను సర్వనాశనం చేసింది. భారత్ దాడిలో వంద మందికిపైగా అతి భయంకరమైన ఉగ్రవాదులు హతం అయ్యారు.

గత రెండున్నర దశాబ్దాలుగా పాకిస్తాన్ లో ఉగ్రవాదానికి సూత్రధారులు బహిరంగంగా తిరుగుతున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు. భారత్ ఒక్కదాడితో వారందరినీ అంతమొందించింది. మిత్రులారా.. భారత దేశ ఈ చర్యతో పాకిస్తాన్ ఎంతో నిరాశ, నిస్పృహకు, గాభరపాటుకు లోనయ్యింది. ఈ గాభరపాటులోనే పాకిస్తాన్ మరొక దుస్సాహసానికి పాల్పడింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరులో భారత్ కు మద్దతుగా నిలవాల్సింది పోయి పాకిస్తాన్ భారత్ పై దాడిని ప్రారంభించింది. పాకిస్థాన్ మన పాఠశాలలు, కళాశాలలు, గురుద్వారాలు, సామాన్య పౌరుల నివాసాలే లక్ష్యంగా దాడులు చేసింది. పాక్ మన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. కానీ..దీంతో పాకిస్తాన్ నిజస్వరూపం బయటపడింది. అలాగే పాకిస్తాన్ కుట్రలు కూడా బయటపడ్డాయి..

ప్రపంచం మొత్తం పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లను భారత్ ఎలా ముక్కలుముక్కలు చేసిందో చూశాయి. భారత దేశ సమర్ధమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఆ డ్రోన్లు, మిస్సైళ్లను ఆకాశంలోనే నాశనం చేశాయి. పాకిస్తాన్ సరిహద్దు వద్ద యుద్దానికి సిద్దమైంది..ఐతే భారత వాయుసేన పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి కీలక స్థావరాలపై దాడి చేసింది.

భారత డ్రోన్లు, మిస్సైళ్లు కచ్చితమైన లక్ష్యాలపై దాడి చేశాయి.

పాకిస్థాన్ వాయు సేన ఎయిర్ బేస్‌ను నష్టం కలిగించాం. ఈ ఎయిర్ బేస్ పై పాకిస్థాన్‌కు గర్వం ఉండేది. భారత్ మొదటి మూడు రోజుల్లోనే పాకిస్థాన్‌లో చేసిన నష్టం, వాళ్ల ఊహకు కూడా అందలేదు. అందుకే భారత ప్రతి దాడి తర్వాత పాకిస్థాన్ తనను తాను రక్షించుకునేందుకు అనేక మార్గాలను వెతకడం ప్రారంభించింది.

ఉద్రిక్తతలను తగ్గించాలని ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ వినతులు చేసింది. ఇంత ఘోరంగా దెబ్బతినడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మే 10 మధ్యాహ్నానికి పాక్ సైన్యం మన డీజీఎంవోను సంప్రదించారు. అప్పటికే..ఉగ్రవాద సంస్థల మౌలిక సదుపాయాలను పెద్దఎత్తున నాశనం చేశాం. అనేక ఉగ్రవాదులను హతం చేశాం. పాకిస్థాన్‌లో ఎన్నో దశాబ్దాలుగా ఉన్న ఉగ్ర స్థావరాలను శ్మశానంలా మార్చేశాం. అందుకే పాకిస్థాన్ నుంచి ఇలాంటి వినతులను వచ్చాయి. పాకిస్థాన్ తరఫు నుంచి ఇలా అన్నారు...తమ నుంచి భవిష్యత్‌లో ఉగ్రవాద చర్యలు, సైనిక దుస్సాహసం జరగదని హామీ ఇచ్చారు. దానిపై ఆలోచిస్తుందని...దీన్ని మరోసారి నేను చెప్తున్నాను. మనం పాకిస్తాన్ ఉగ్రవాద సైనిక స్థావరాలపై ప్రతిదాడి చేశాం, ప్రతిదాడిని ప్రస్తుతానికి ఆపేశాం. రాబోయే రోజుల్లో పాకిస్థాన్ తీసుకునే ప్రతి అడుగును ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తాం. వారి వైఖరి ఎలా ఉంటుందో చూస్తాం. మిత్రులారా భారత్, త్రివిధ దళాలు మన ఎయిర్ ఫోర్స్, మన సైన్యం, మన నౌకా దళం, బీఎస్ఎఫ్, భారత అర్థ సైనిక బలాలు ప్రతిక్షణం అలర్ట్‌గా ఉన్నాయి. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్ తర్వాత ఆపరేషన్ సిందూర్ వంటివి ఉగ్రవాదుల వ్యతిరేకంగా భారత విధానంగా చూడాలి. ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. దాడుల స్థాయిని పెంచి న్యూ నార్మల్‌ని నిర్దేశించాం. అందులో మొదటగా భారత్ మీద ఉగ్రదాడులు జరిగితే దానికి ధీటైన జవాబు ఇస్తాం.

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రపంచం పాకిస్తాన్ అసహ్యకరమైన సత్యాన్ని మరోసారి చూసింది. చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియల సమయంలో పాక్ సైన్యంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఇంకేం కావాలి. భారత్, తన పౌరుల రక్షణ కోసం నిరంతరంగా నిర్ణయాక చర్యలు తీసుకుంటుంది.

మిత్రులారా...యుద్ధ క్షేత్రంలో మనం ప్రతిసారి పాకిస్థాన్ ను ఓడించాం. ఈ సారి కూడా ఆపరేషన్ సిందూర్ కొత్త శిఖరాలకు చేర్చింది.

మన సైన్యం ఎడారి, కొండల్లో తన సామర్ధ్యాన్ని నిరూపించుకుంది. అలాగే..కొత్త తరం యుద్ధ తంత్రంలో కూడా మనం శ్రేష్ఠత సామర్ధ్యాన్ని నిరూపించుకుంది. ఈ ఆపరేషన్ లో మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల సామర్ధ్యం కూడా నిరూపితమైంది. ఈ రోజు ప్రపంచమంతా చూస్తోంది. 21వ శతాబ్ద యుద్ధంలో భారత్ లో తయారైన రక్షణ ఉత్పత్తుల వినియోగానికి సమయం వచ్చింది.

మిత్రులారా..ఏరకమైన ఉగ్రవాదానికైనా వ్యతిరేకంగా మనం అందరం ఏకంగా ఉండటం అదే మన బలం.

కచ్చితంగా ఇప్పుడు ఇది యుద్ధ యుగం కాదు. కానీ ఉగ్రవాద యుగం కూడా కాదు. టెర్రరిజానికి వ్యతిరేకంగా జీరో టోలరెన్స్ విధానం....ఒక సురక్షిత ప్రపంచానికి గ్యారంటీ..

మిత్రులారా పాకిస్థాన్ ప్రభుత్వం ఎలాగైతే ఉగ్రవాదానికి మద్దతుగా ఉందో..అదే ఉగ్రవాదం భవిష్యత్తులో పాకిస్తాన్‌నే అంతం చేస్తుంది. పాకిస్థాన్ తనను తాను కాపాడుకోవాలంటే..తన భూభాగంలో ఉన్న టెర్రర్ ఇన్ఫ్రా స్ట్రక్చర్‌ను అంతం చేయాల్సిందే..

దీనికి మించి శాంతికి మరేదారి లేదు. భారత దేశ అభిప్రాయం చాలా స్పష్టంగా ఉంది. టెర్రర్ అండ్ టాక్...ఉగ్రవాదం ఒకే పడవ మీద ప్రయాణం చేయలేవు. ఉగ్రవాదం వ్యాపారం ఒకే దగ్గర ఇమిడి ఉండవు. నీరు రక్తం కూడా ఒకే దగ్గర ఉండవు. నేను ఈ రోజు ప్రపంచానికి చెప్తున్నానను..ఇది మా ప్రకటిత విధానం. పాకిస్థాన్‌తో చర్చలు జరిగితే అది కేవలం ఉగ్రవాదంపైనే...పాకిస్థాన్ తో చర్చలు జరిపితే పాక్ ఆక్రమిత కశ్మీర్ పైనే జరుగుతుంది. ప్రియమన దేశ ప్రజలారా ..ఈ రోజు బుద్ద పూర్ణిమ...భగవాన్ బుద్దుడు మనకు శాంతి మార్గాన్ని చూపించారు. శాంతి మార్గమే శక్తిగా ఉంటుంది. మానవాళి శాంతి, సమృద్ధి వైపు ముందుకు వెళుతోంది ప్రతి భారతీయుడు శాంతితో జీవించాలి. వికసిత్ భారత్ కలను పూర్తి చేయాలి. దీని కోసం భారత్, శాంతియుంతంగా ఉండాలి అవసరమైతే శక్తిని కూడా వాడాలి. గత కొన్ని రోజులుగా భారత్ ఇదే చేస్తోంది. నేను మరోసారి భారత సైన్యానికి, భద్రతా దళాలకు సెల్యూట్ చేస్తున్నాను. భారతీయులందరి ధైర్యం, ఐక్యతకు నేను నమస్కరిస్తున్నాను.

ధన్యవాదాలు....

భారత్ మాతా కీ జై

​​​​​​​భారత్ మాతా కీ జై

​​​​​​​భారత్ మాతా కీ జై​​​​​​​....