ఉర్సులా వాన్ డెర్ లేయన్‌లతో సంయుక్త టెలిఫోన్ సంభాషణలో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
వాణిజ్యం, సాంకేతికత, పెట్టుబడి, ఆవిష్కరణ, సుస్థిరత, రక్షణ, భద్రత, సమర్థ సరఫరా వ్యవస్థ వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని స్వాగతించిన నేతలు
భారత్-ఈయూ ఎఫ్‌టీఏ చర్చల త్వరిత ముగింపు పట్ల నిబద్ధతను పునరుద్ఘాటించిన నేతలు
ఉక్రెయిన్‌ సంఘర్షణ ముగింపు ప్రయత్నాలపై అభిప్రాయాలు పంచుకున్న నేతలు

యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు గౌరవనీయ ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు గౌరవనీయ ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌లతో ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా ఉభయులతోనూ మాట్లాడారు.

ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య శక్తులుగా భారత్-ఈయూలు నమ్మకం, ఉమ్మడి విలువలు, భవిష్యత్తు పట్ల ఉమ్మడి దృక్పథం ఆధారంగా ఏర్పడిన బలమైన, సన్నిహిత సంబంధాన్ని పంచుకుంటున్నాయి. ప్రపంచ సమస్యలను సంయుక్తంగా పరిష్కరించడంలో, సుస్థిరతను పెంపొందించడంలో, పరస్పర శ్రేయస్సు కోసం నియమాల ఆధారిత క్రమాన్ని ప్రోత్సహించడంలో భారత్-ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్య పాత్రను నేతలు ప్రధానంగా ప్రస్తావించారు.

వాణిజ్యం, సాంకేతికత, పెట్టుబడి, ఆవిష్కరణ, సుస్థిరత, రక్షణ, భద్రత, సమర్థ సరఫరా వ్యవస్థ వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని నేతలు స్వాగతించారు. భారత్-ఈయూ ఎఫ్‌టీఏ చర్చలను త్వరగా ముగించడం, ఐఎమ్ఈఈసీ కారిడార్ అమలు పట్ల ఉమ్మడి నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు.

ఫిబ్రవరిలో ఈయూ కాలేజ్ ఆఫ్ కమిషనర్స్ చారిత్రాత్మక భారత పర్యటన ఆధారంగా.. పరస్పర సౌలభ్యం కోసం వీలైనంత త్వరగా భారత్‌లో తదుపరి భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడం గురించి నేతలు చర్చించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇరువురు నేతలను ఈ సమావేశంలో పాల్గొనడం కోసం భారత్‌కు ఆహ్వానించారు.

ఉక్రెయిన్‌ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నాలు సహా పరస్పర ప్రయోజనకరమైన ప్రాంతీయ, ప్రపంచస్థాయి అంశాలపై నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించడం, శాంతి-సుస్థిరతలను త్వరగా పునరుద్ధరించడం కోసం భారత్ స్థిరమైన మద్దతును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.

సంప్రదింపులు కొనసాగించడానికి నేతలు అంగీకరించారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Bosch Home to start AC exports from India in two years: CEO & President Jan Brockmann

Media Coverage

Bosch Home to start AC exports from India in two years: CEO & President Jan Brockmann
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam paying tribute to Shaheed Udham Singh
July 31, 2026

The Prime Minister, Shri Narendra Modi, paid heartfelt tributes to the great revolutionary martyr Udham Singh on his Balidan Diwas. He said that the saga of courage and valour embodied in Udham Singh’s life will continue to inspire every generation of the country to uphold the honour and self-respect of the motherland.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“न जातु शौर्यं पुरुषस्य भानुरस्तं गतो भवति कदापि शश्वत्।

यथा पुनस्तपति दिवाकरोऽयं तथा पुनर्विक्रमते स वीरः॥”

The Subhashitam conveys that The sun of valor never sets permanently. Just as the sun rises and shines brightly again, so too does a brave man triumph over every adversity with his valor.

The Prime Minister wrote on X;

“महान क्रांतिकारी शहीद उधम सिंह को उनके बलिदान दिवस पर सादर नमन। हिम्मत और हौसले से भरी उनकी जीवनगाथा देश की हर पीढ़ी को मातृभूमि के स्वाभिमान की रक्षा के लिए प्रेरित करती रहेगी।

न जातु शौर्यं पुरुषस्य भानुरस्तं गतो भवति कदापि शश्वत्।

यथा पुनस्तपति दिवाकरोऽयं तथा पुनर्विक्रमते स वीरः॥”