ఛఠ్ మహాపర్వం ముగింపు సందర్భంగా భక్తులందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

నాలుగు రోజుల పాటు జరిగిన ఈ గొప్ప పండుగ ఈ ఉదయం భగవాన్ సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించటంతో ముగిసిందని ప్రధానమంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా, ఛఠ్ పూజ సంప్రదాయంతో భారతదేశంలో దివ్య వైభవం కనిపించిందని ఆయన అన్నారు.

భక్తులు, ఈ పండుగలో పాల్గొన్న వారందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఛఠీ మాత ఆశీస్సులతో అందరి జీవితాల్లో కాంతులు వెల్లివిరియాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని ప్రార్థించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"ఈరోజు ఉదయం సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించటంతో ఛఠ్ మహాపర్వం శుభప్రదంగా ముగిసింది. ఈ నాలుగు రోజుల ఛఠ్ పూజ సందర్భంగా దివ్య వైభవాన్ని మనం చూశాము. ఈ పవిత్ర పండుగలో పాల్గొన్న భక్తులందరికీ, వ్రతం ఆచరించిన వారికి, మా కుటుంబసభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు! ఛఠీ మాతా అనంతమైన ఆశీర్వాదాలతో మీ జీవితాలు ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను"

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
A big deal: The India-EU partnership will open up new opportunities

Media Coverage

A big deal: The India-EU partnership will open up new opportunities
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 28 జనవరి 2026
January 28, 2026

India-EU 'Mother of All Deals' Ushers in a New Era of Prosperity and Global Influence Under PM Modi