ఆర్థిక సంవత్సరం 2022-23 లో రైలు రవాణా సంబంధి కార్యకలాపాలు 5 లక్షల కు పైచిలుకు గా నమోదు కావడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఏటికేడాది సరకు రవాణా రైళ్ళ సంబంధి కార్యకలాపాల సంఖ్య లో వృద్ధి నమోదు అయిన సందర్భం లో రేల్ వేస్ మంత్రిత్వ శాఖ చేసిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ,
‘‘ఇది ప్రోత్సాహకరమైనటువంటి సంఖ్య, ఆర్థిక కార్యకలాపాల లో మరియు లాజిస్టిక్స్ లో మనం సాధిస్తున్న ప్రగతి కి సూచిక గా ఉంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Encouraging numbers, indicating our strides in logistics and economic momentum. https://t.co/3QvDYqPGJZ
— Narendra Modi (@narendramodi) May 8, 2023


