శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు సభ్యుడు, రాజ్సదన్ అయోధ్య ముఖ్యుడు విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా మరణంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు.
విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా తన జీవనాన్ని ధార్మిక, సామాజిక కార్యక్రమాలకు అంకితం చేశారని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు:
‘‘శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు సభ్యుడు, రాజ్సదన్ అయోధ్య ముఖ్యుడు విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా మరణం ఎంతో బాధ కలిగించింది. ఆయన తన జీవితాన్ని ధార్మిక, సామాజిక కార్యక్రమాలకు అంకితం చేశారు. శ్రీ రామ ప్రభువు తన శ్రీచరణాలలో ఆయనకు స్థానాన్ని ఇవ్వాలని, శోకసంద్రంలో మునిగిన ఆయన ఆత్మీయులకు, అభిమానులకు ఈ కష్టాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి’’.
श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के सदस्य और राजसदन अयोध्या के मुखिया विमलेंद्र मोहन प्रताप मिश्र जी के देहावसान से अत्यंत दुख हुआ है। उनका जीवन धार्मिक और सामाजिक कार्यों को समर्पित रहा। प्रभु श्री राम से प्रार्थना है कि उन्हें अपने श्रीचरणों में स्थान दें और उनके शोकाकुल… pic.twitter.com/DIBWorxuwX
— Narendra Modi (@narendramodi) August 24, 2025


