ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ టెక్సాస్‌ లోని హ్యూస్ట‌న్ లో సిక్కు స‌మాదాయం స‌భ్యుల తో ఈ రోజు న సంభాషించారు. సిక్కు స‌ముదాయానికి చెందిన స‌భ్యులు ప్ర‌ధాన మంత్రి కి ఉత్సాహం గా స్వాగ‌తం ప‌లికారు.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ టెక్సాస్‌ లోని హ్యూస్ట‌న్ లో సిక్కు స‌మాదాయం స‌భ్యుల తో ఈ రోజు న సంభాషించారు. సిక్కు స‌ముదాయానికి చెందిన స‌భ్యులు ప్ర‌ధాన మంత్రి కి ఉత్సాహం గా స్వాగ‌తం ప‌లికారు.

సంభాష‌ణ క్ర‌మం లో, స‌ముదాయానికి చెందిన స‌భ్యులు దేశం యొక్క మ‌రియు మరియు సిక్కు స‌ముదాయం యొక్క స‌మగ్ర అభివృద్ధి కై భార‌త ప్ర‌భుత్వం తీసుకొన్న మార్గ నిర్దేశక నిర్ణ‌యాల‌ కు గాను ప్ర‌ధాన మంత్రి కి ధ‌న్య‌వాదాలు తెలియజేశారు.

త‌ద‌నంత‌రం ప్ర‌ధాన మంత్రి, “హ్యూస్ట‌న్ లోని సిక్కు స‌ముదాయం తో నేను చక్కటి సంభాషణ ను జరిపాను. భార‌త‌దేశం అభివృద్ధి పట్ల వారిలో ఉప్పొంగిన ఉత్సాహాన్ని చూసి నేను సంతోషించాను” అని ట్విటర్ లో వెల్లడించారు.

 

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ టెక్సాస్ లోని హ్యూస్ట‌న్ లో దావూదీ బోహ్రా స‌ముదాయాని కి చెందిన స‌భ్యుల తో నేడు భేటీ అయ్యి, వారి తో సంభాషించారు.

ఆ స‌ముదాయాని కి చెందిన స‌భ్యులు ప్ర‌ధాన మంత్రి ని స‌త్క‌రించారు. సంభాష‌ణ క్ర‌మం లో, దావూదీ బోహ్రా స‌భ్యులు స‌య్య‌ద్‌నా సాహబ్ తో ప్ర‌ధాన మంత్రి కి ఉన్న‌టువంటి సాహచర్యాన్ని గురించి ప్ర‌స్తావించారు. వారు కింద‌టి సంవ‌త్స‌రం లో ఇందౌర్ లో జ‌రిగిన వారి యొక్క సాముదాయక కార్యక్ర‌మాని కి శ్రీ న‌రేంద్ర మోదీ హాజ‌రు కావ‌డాన్ని కూడా గుర్తు కు తెచ్చారు.

ఈ సంభాషణ అనంత‌రం ప్ర‌ధాన మంత్రి ట్విటర్ లో తన ప్రతిస్పందన ను వ్యక్తం చేస్తూ, “దావూదీ బోహ్రా స‌ముదాయం ప్ర‌పంచ వ్యాప్తంగా త‌నదైనటువంటి ఒక ప్రత్యేక గుర్తింపు ను తెచ్చుకొంది. వారి తో హ్యూస్ట‌న్ లో కొంత స‌మ‌యాన్ని వెచ్చించే అవ‌కాశం తో పాటు అనేక అంశాల పై సంభాషించే అవకాశం కూడా నాకు లభించింది” అని పేర్కొన్నారు.

 

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ టెక్సాస్ లోని హ్యూస్టన్ లో క‌శ్మీరీ పండితుల ప్ర‌తినిధివర్గం తో నేడు స‌మావేశ‌మ‌య్యారు.

సంభాష‌ణ క్ర‌మం లో, స‌ముదాయాని కి చెందిన స‌భ్యులు భార‌తదేశం పురోగ‌మించడం కోసం మరియు భార‌త‌దేశం లో ప్ర‌తి ఒక్క‌రి కి సాధికారిత కల్పన కోసం ప్ర‌ధాన మంత్రి తీసుకొన్నటువంటి నిర్ణయాల కు గట్టి మ‌ద్ధ‌తు ను వ్య‌క్తం చేశారు.

స‌మావేశం అనంత‌రం ప్ర‌ధాన మంత్రి , “హ్యూస్ట‌న్ లో క‌శ్మీరీ పండితుల తో నేను భేటీ అయ్యి, వారి తో ప్రత్యేకం గా సంభాషించాను’’ అని ట్విటర్ ద్వారా వెల్లడించారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s data centre boom: Mumbai cracks global top 15, Hyderabad pipeline set to surge 15x

Media Coverage

India’s data centre boom: Mumbai cracks global top 15, Hyderabad pipeline set to surge 15x
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి 27న ప్రధానమంత్రి ప్రసంగం
August 26, 2026
దేశంలో క్రీడలు.. యువ నాయకత్వం.. పౌర బాధ్యత.. స్వచ్ఛంద సేవ.. దారుఢ్యం.. దేశ ప్రగతి వంటి అంశాలను ఈ చర్చలు ఒకే వేదికపైకి తెస్తాయి
ఈ చర్చలు ప్రధానంగా క్రీడలు.. ఒలింపిక్స్‌ ఆకాంక్షలు.. యువ నేతృత్వం.. వికిసిత భారత్.. మాదకద్రవ్య రహిత యువతరంపై దృష్టి సారిస్తాయి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 27న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమం ద్వారా ‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. దేశ క్రీడారంగ పురోగమనంలో యువత భాగస్వామ్యం సహా వారి ఆకాంక్షల వెల్లడి, యువతరం నాయకత్వాన బలమైన వికసిత భారత్ కోసం మేధా మధనం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

జాతీయ క్రీడా దినోత్సవం-2026లో భాగంగా ‘మేరా యువ భారత్’ ఆధ్వర్యాన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలోగల రెండు కళాశాలల్లో యువతరం భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. జాతీయ ప్రగతి కార్యకలాపాల్లో యువత ఆకాంక్షలకు కీలక స్థానమిస్తూ ఆరోగ్యకర, క్రమశిక్షణాయుత. క్రీడాస్ఫూర్తి గల దేశానికి రూపుదిద్దాలన్న ప్రధానమంత్రి దృక్కోణానికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

దేశంలో క్రీడలు, యువ నాయకత్వం, పౌర కర్తవ్యం, స్వచ్ఛంద సేవ, దారుఢ్యం, దేశ పురోగమనం తదితర అంశాలన్నిటిపైనా చర్చను ఈ కార్యక్రమం ఒకే వేదికపైకి తెస్తుంది. దేశ క్రీడారంగ పురోగమన ఆకాంక్షలతో యువత మమేకమయ్యే ప్రత్యక్ష మార్గాన్ని నిర్దేశిస్తుంది. దేశ యువతరం, క్రీడా వ్యవస్థపై చర్చల సందర్భంగా వారి ఆలోచనలు, దృక్కోణాలను పంచుకునే వేదికగా ఇది ఉపయోగపడుతుంది.

ఈ జాతీయ స్థాయి కార్యక్రమం అనంతరం యువ భాగస్వాములు, మై భారత్ వలంటీర్లు, స్థానిక క్రీడాకారులు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో స్థానిక స్థాయిలో చర్చలు సాగుతాయి. క్రీడాసక్తి గల యువత, ప్రముఖ క్రీడాకారులు, పతక విజేతల మధ్య ప్రత్యక్ష ఇష్టాగోష్ఠి ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఇందులో ‘యువతరం చర్చలు’ ప్రధానాంశంగా ఉంటాయి. యువ భాగస్వాములు తమ ఆలోచనలు, దృక్కోణాలు, ఆకాంక్షలను ఈ వేదిక ద్వారా పంచుకుంటారు. ఈ చర్చలు ప్రధానంగా దిగువ పేర్కొన్న 5 అంశాలపై కేంద్రీకృతమవుతాయి:

· మెరుగైన సౌకర్యాలు, శిక్షణ, క్రీడా విజ్ఞానం, సార్వజనీన భాగస్వామ్యంతో జాతీయ క్రీడా వ్యవస్థ మెరుగుదల.

· శాస్త్రీయ ప్రతిభకు గుర్తింపు, పారదర్శక ఎంపిక, దీర్ఘకాలిక క్రీడా వికాసం ద్వారా 2036లో ఒలింపిక్స్ దిశగా ప్రతిభకు పదును పెట్టడం.

· పరిపాలన వేదికలు, మై భారత్ నేతృత్వంలోని స్వచ్ఛంద సేవ ద్వారా యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దడం.

· పౌర చైతన్యం, భవిష్యత్‌ సంసిద్ధ నైపుణ్యం, వ్యవస్థీకృత స్వచ్ఛంద సేవకు ప్రోత్సాహం, ద్వారా వికసిత భారత్ ప్రస్థానం వైపు యువతరానికి సాధికారత కల్పన.

· ఈ నెల 2న ప్రారంభమైన ‘ప్రధానమంత్రి 100 వారాల ప్రచారం’లో భాగంగా వారానికోసారి జన భాగస్వామ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మాదకద్రవ్య వినియోగంపై పోరులో క్రీడలు సహా, సహ రంగాల్లోని వివిధ బృందాల సేవల ద్వారా ‘మాదకద్రవ్య రహిత యువత’ ఉద్యమాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన ధ్యేయం.