ప్రైవేట్ రంగం నేతృత్వంలోని పరిశోధనాభివృద్ధి వ్యవస్థ బలోపేతం కోసం రూ. 1 లక్ష కోట్ల పథకాన్ని ప్రారంభించనున్న ప్రధానమంత్రి
ఈఎస్‌టీఐసీ-2025లో పాల్గొననున్న విద్యా, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వానికి చెందిన 3,000 మందికి పైగా ప్రతినిధులు
ఏఐ, బయో-మాన్యుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్-సెమీ కండక్టర్ తయారీ, ఎమర్జింగ్ అగ్రికల్చర్ టెక్నాలజీస్, క్వాంటం సైన్స్ సహా 11 కీలక అధ్యయనాంశాలపై చర్చలు

రేపు ఉదయం 9:30 గంటలకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఎమర్జింగ్ సైన్స్ , టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సదస్సు-2025ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.

 

దేశంలో పరిశోధనాభివృద్ధి వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఏర్పాటు చేసిన రూ. 1 లక్ష కోట్ల పరిశోధనాభివృద్ధి-ఆవిష్కరణ పథకం నిధిని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దేశంలో ప్రైవేట్ రంగ ఆధారిత పరిశోధనాభివృద్ధి వ్యవస్థను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం.

 

ఈఎస్‌టీఐసీ-2025 ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు జరుగుతుంది. ఈ సమావేశంలో నోబెల్ గ్రహీతలు, ప్రముఖ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, విధాన నిర్ణేతలతో పాటు విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వానికి చెందిన 3,000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారు. అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్-మాన్యుఫ్యాక్చరింగ్, కృత్రిమ మేధ, బయో-మాన్యుఫ్యాక్చరింగ్, బ్లూ ఎకానమీ, డిజిటల్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్-సెమీ కండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎమర్జింగ్ అగ్రికల్చర్ టెక్నాలజీస్, ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్-క్లైమేట్, హెల్త్-మెడికల్ టెక్నాలజీస్, క్వాంటం సైన్స్-టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీస్ వంటి 11 కీలక అధ్యయన అంశాలపై సదస్సులో చర్చిస్తారు.

 

ఈఎస్‌టీఐసీ-2025లో భాగంగా ప్రముఖ శాస్త్రవేత్తల చర్చలు, ప్యానెల్ చర్చలు, ప్రజెంటేషన్లు, సాంకేతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. భారత శాస్త్ర సాంకేతిక వ్యవస్థ బలోపేతం కోసం పరిశోధకులు, పరిశ్రమలు, యువ ఆవిష్కర్తల మధ్య సహకారానికి ఈ సదస్సు వేదికగా నిలుస్తుంది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Make in India' radar programme to help Tejas track targets gets Rs 2,205 crore boost

Media Coverage

'Make in India' radar programme to help Tejas track targets gets Rs 2,205 crore boost
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 01 ఆగష్టు 2026
August 01, 2026

Aatmanirbhar Bharat Delivers: Indigenous Power, Farmer Prosperity & Blue Economy