మహారాజా బిర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జీ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. త్రిపురను అభివృద్ధి చేయటంలో మహారాజా బిర్ బిక్రమ్ కిషోర్  మాణిక్య బహదూర్ జీ చేసిన కృషి ఆదర్శనీయమైనదని శ్రీ మోదీ అన్నారు. ప్రజాసేవ పట్ల ఆయకున్న మక్కువ, పేదల సాధికారత, సామాజిక అభ్యున్నతి పట్ల నిబద్ధత మనకు స్ఫూర్తినిస్తాయని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి ఎక్స్ లో ఇలా పోస్టు చేశారు;

"మహారాజా బిర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జయంతి సందర్భంగా ఆయనను  స్మరించుకుందాం.త్రిపురను అభివృద్ధి చేయటంలో ఆయన కృషి ఆదర్శనీయమైనది. ప్రజాసేవ పట్ల ఆయకున్న మక్కువ, పేదల సాధికారత, సామాజిక అభ్యున్నతి పట్ల ఆయకున్న నిబద్ధత మనకు స్ఫూర్తినిస్తాయి. ఆయన దార్శనికతను నిజం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, త్రిపుర ప్రభుత్వం అహర్నిశలూ కృషి చేస్తున్నాయి."

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian Railways takes up 764 km of new lines to boost connectivity in Bihar’s Seemanchal region

Media Coverage

Indian Railways takes up 764 km of new lines to boost connectivity in Bihar’s Seemanchal region
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
నిస్వార్థ సేవ భావనను బోధించే సంస్కృత సుభాషితాన్ని తెలియజేసిన ప్రధానమంత్రి
August 07, 2026

నిస్వార్థ సేవ గుణాన్ని, ఇతరుల వద్ద నుంచి మరేదీ ఆశించకుండా వారి మేలు కోసం పని చేయాలనే గొప్ప ఆదర్శాన్ని బోధిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.

‘‘కిం చంద్రమాః ప్రత్యుపకారలిప్సయా కరోతి గోభిః కుముదావబోధనమ్

స్వభావ ఏవోన్నతచేతసాం సతాం పరోపకారవ్యసనం హి జీవితమ్’’

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘కిం చంద్రమాః ప్రత్యుపకారలిప్సయా కరోతి గోభిః కుముదావబోధనమ్

స్వభావ ఏవోన్నతచేతసాం సతాం పరోపకారవ్యసనం హి జీవితమ్’ అని పేర్కొన్నారు.