ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ శ్రీలంక రాజధాని కొలంబో సమీపంలోని శ్రీ జయవర్ధనేపుర కొట్టేలోగల ‘భారత శాంతి పరిరక్షక దళం’ (ఐపికెఎఫ్) స్మారకం వద్ద సైనిక సిబ్బందిని స్మరిస్తూ నివాళి అర్పించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“శ్రీలంక ఐక్యత, ప్రాదేశిక సమగ్రత పరిరక్షణ కర్తవ్య దీక్షలో అసమాన త్యాగం చేసిన ఐపీకేఎఫ్ సైనికుల ధైర్యసాహసాలను ఈ స్మారక చిహ్నం సదా స్మరించుకుంటుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు


