ఉలాన్బాతర్ ఓపెన్ 2025లో జరిగిన 3వ ర్యాంకింగ్ సిరీస్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినందుకు రెజ్లర్లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. "ఇప్పటివరకు చూస్తే మన నారీ శక్తి ర్యాంకింగ్ సిరీస్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చింది. ఇది ఈ ఘనతను మరింత గుర్తించుకునేదిగా చేసింది. ఈ క్రీడా ప్రదర్శన అనేక మంది భవిష్యత్ అథ్లెట్లకు స్ఫూర్తినిస్తుంది" అని ప్రధాని అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు.
"క్రీడలలో భారత్ విజయాలు కొనసాగుతున్నాయి! ఉలాన్బాతర్ ఓపెన్ 2025 3వ ర్యాంకింగ్ సిరీస్లో 6 స్వర్ణాలు సహా 21 పతకాలను గెలుచుకొని అద్భుతమైన ప్రదర్శన కనబరిన మన రెజ్లర్లకు అభినందనలు. మన నారీ శక్తి ర్యాంకింగ్ సిరీస్లో ఇప్పటివరకు చూస్తే అత్యుత్తమ ప్రదర్శనను అందించింది. ఇది ఈ ఘనతను మరింత గుర్తించుకునేదిగా చేసింది. ఈ ప్రదర్శన అనేక మంది రాబోయే అథ్లెట్లకు స్ఫూర్తినిస్తుంది."
India’s accomplishments in sports continue! Congrats to our wrestlers for their phenomenal performance at the 3rd Ranking Series in the Ulaanbaatar Open 2025, bringing home 21 medals including 6 Golds. Our Nari Shakti has given their best ever performance at the Ranking Series,… pic.twitter.com/dXqjecuQ5Z
— Narendra Modi (@narendramodi) June 2, 2025


