ప్రసిద్ధ రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ వినోద్ కుమార్ శుక్లా కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. హిందీ సాహిత్య లోకానికి ఆయన అమూల్య సేవలు చిరస్మరణీయమని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ వినోద్ కుమార్ శుక్లా మృతి నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హిందీ సాహితీ లోకానికి ఆయన అమూల్య సేవలందించారు. ఆయన కృషి చిరస్మరణీయం కాబట్టి, ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సానుభూతి తెలుపుతున్నాను. ఓం శాంతి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ज्ञानपीठ पुरस्कार से सम्मानित प्रख्यात लेखक विनोद कुमार शुक्ल जी के निधन से अत्यंत दुख हुआ है। हिन्दी साहित्य जगत में अपने अमूल्य योगदान के लिए वे हमेशा स्मरणीय रहेंगे। शोक की इस घड़ी में मेरी संवेदनाएं उनके परिजनों और प्रशंसकों के साथ हैं। ओम शांति।
— Narendra Modi (@narendramodi) December 23, 2025


