PM Modi to visit Karnataka, address three public meetings
PM Modi in Karnataka: To distribute RuPay cards to beneficiaries at the Shri Kshetra Dharmasthala Rural Development Project at Ujire
PM Modi to address the gathering at the Dashamah Soundarya Lahari Parayanotsava Mahasarmapane in Bengaluru
Karnataka: PM Modi to inaugurate the Bidar - Kalaburagi New Railway Line

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపు, అంటే అక్టోబర్ 29, 2017 నాడు, కర్ణాటక లో పర్యటించనున్నారు. ఆయన ఆ రోజు మూడు జన సభలలో ప్రసంగిస్తారు.

కర్ణాటక రాష్ట్రంలో ఆయన తన పర్యటనను ధర్మస్థలలో శ్రీ మంజునాథ స్వామి దేవాలయంలో పూజలు చేసి, ప్రారంభిస్తారు. ఒక జన సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఉజీర్ లో శ్రీ క్షేత్ర ధర్మస్థల రూరల్ డివెలప్ మెంట్ ప్రాజెక్టు లో ప్రధాన మంత్రి పాల్గొని, లబ్ధిదారులకు రూపే కార్డులను ప్రదానం చేస్తారు. ఇది స్వయంసహాయ బృందాలు నగదురహిత డిజిటల్ లావాదేవీలను మొదలుపెట్టడానికి దోహదపడనుంది.

ఆ తరువాత ప్రధాన మంత్రి బెంగళూరుకు వెళ్తారు. అక్కడ దశమ: సౌందర్య లహరీ పారాయణోత్సవ మహాసమర్పణె కార్యక్రమానికి హాజరై, సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

ఆది శంకరాచార్యుల వారు రచించిన శ్లోకాల గుచ్ఛమే సౌందర్య లహరి. ఆ శ్లోకాలను జన సందోహం సామూహికంగా పారాయణం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

తదనంతరం, ప్రధాన మంత్రి బీదర్ చేరుకొంటారు. బీదర్- కల్ బుర్గీ న్యూ రైల్వే లైన్ ను ప్రారంభిస్తారు. ఆయన ఈ సందర్భంగా ఓ జన సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు కూడా.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
From school to PG, girls now outnumber boys

Media Coverage

From school to PG, girls now outnumber boys
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 1 మే 2026
May 01, 2026

From Stolen Treasures to Smart Trains: PM Modi’s Blueprint for a Proud, Connected, Self-Reliant India