PM Modi campaigns in Bijnor, Uttar Pradesh, urges people to vote for BJP
Shri Modi questions Samajwadi party for attacking & getting BJP workers arrested without reason
Farmer welfare is most vital for us. Our Government has brought the Pradhan Mantri Fasal Bima Yojana: PM
Chaudhary Charan Singh Kisan Kalyan Kosh would be created for farmers’ welfare, says Shri Modi
People in UP must question the SP government that what development works have been done in the state in last five years: Shri Modi

ప్రధాని నరేంద్ర మోదీ నేడు బిజ్నోర్, ఉత్తరప్రదేశ్ లో ప్రచారం చేసారు. ప్రధాని ఉత్తరప్రదేశ్ ప్రజల ఉత్సాహం చూశాక, ప్రజలు మార్పు కోరుకుంటున్నారానడానికి ఇదే సంకేతం అన్నారు. బిజేపి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేలా ఓట్లు వేయాలని కోరారు.  

సమాజ్వాది పార్టీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ దాడి చేస్తూ, “ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్ లోనూఏ తప్పు చేయకుండా బిజేపి కార్యకర్తలు అరెస్ట్ అయుతున్నారు. ప్రభుత్వాలు ఇలానే పనిచేస్తాయా? రాజకీయ వ్యతిరేకులపై చట్టాన్ని దుర్వినియోగం చేయాలా?” అని అన్నారు.

రాష్ట్రంలోని ఎస్పి ప్రభుత్వం పేద మరియు నిజాయితీ పౌరుల ప్రయోజనాలను కాపాడలేకపోయిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పెరుతున్న నేరాలు గురించి ప్రస్తావిస్తూ, “ రాష్ట్రంలో అత్యాచారం వంటి దురదృష్టకర సంఘటనలు జరిగిన తర్వాత సమాజ్వాది పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు? ఇటువంటి అమర్యాదకరమైన వ్యాఖ్యలు ఆమోదనీయంకాదు. "

శ్రీ మోదీ కాంగ్రెస్ పై దాడి చేస్తూ, వారి మనుగడ కోసం ఏదైనా చేయగలరు. “కాంగ్రెస్, వారి మనుగడ కోసం ఏదైనా చేయగలదు, ఏళ్లగా ఎవరిమీద అయితే పోరాడుతుందో ఆ ఎస్పి తో పొత్తుపెట్టుకోవడం కూడా.”

చెరుకు రైతుల సంక్షేమమే బిజెపి ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైనదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. "ఉత్తరప్రదేశ్ లో చెరుకు రైతులు తమ బకాయిలు ఎందుకు పొందడం లేదు? రైతులకు ఎందుకు న్యాయం జరగడంలేదు? వారి బకాయిలు వారికి అందేలా మేము చూస్తాము. “ అని ఆయన అన్నారు.

కేంద్రం యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి ప్రధాని సుదీర్ఘంగా మాట్లాడారు. “రైతే సంక్షేమమే మాకు చాలా కీలకం.   మా ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తెచ్చింది. అది మన రైతులకు తక్కువ ప్రీమియం మరియు గరిష్ట బీమా అందిస్తుంది.” అని అన్నారు.

రైతుల సంక్షేమం కోసం చౌదరి చరణ్ సింగ్ కిసాన్ కళ్యాణ్ కోష్ ప్రారంభిస్తామని కూడా ఆయన చెప్పారు.

వారి శ్రేయస్సు కోసం పని చేయని ఒక అసమర్థమైన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఉండకూడదని శ్రీ మోదీ పేర్కొన్నారు. “కేంద్రం నుంచి తమకు వనరులు కేటాయించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సంక్షేమం కోసం వాటిని ఉపయోగించలేదు.”

అనేక మంది పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు హాజరయ్యారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
First multilingual Indian speech recognition model trained on 65 languages and dialects released

Media Coverage

First multilingual Indian speech recognition model trained on 65 languages and dialects released
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే సందర్భంగా విభజన కారణంగా నష్టపోయిన బాధితుల ధైర్యాన్ని కొనియాడిన ప్రధానమంత్రి
August 14, 2026
పట్టుదలతో కూడిన శ్రమ, మానవ ప్రయత్నాల శక్తిని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న పీఎం

పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే సందర్భంగా దేశ విభజన వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరి ధైర్యసాహసాలను స్మరించుకుంటున్నట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ విభజన చరిత్రలో ఎన్నో జీవితాలను చిన్నభిన్నం చేసిందని, కుటుంబాలు చెల్లాచెదురయ్యాయని, ఎంతోమంది ప్రియమైన వారిని కోల్పోయారని, చెప్పలేనంత బాధను అనుభవించాల్సి వచ్చిందన్నారు.

కష్టాలను అధిగమించి ప్రజలు, వారి జీవితాలను పునర్మించుకున్నారని, ప్రతికూల పరిస్థితులను విజయంగా మలచుకుంటూ దేశ పురోగతికి తోడ్పాటునందించారని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సంకల్ప బలం ఎంత గొప్పదో వారి జీవిత ప్రయాణాలు మనకు తెలియజేస్తాయన్నారు. దేశంలో ఐక్యతను, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించుకోవాలన్న సంకల్పాన్ని ఈ రోజు మరింత బలపరుస్తుందని… వికసిత్ భారత్ నిర్మాణానికి సమష్టి కృషి చేసేలా స్ఫూర్తినిస్తుందని శ్రీ నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడి దేశ పురోగతికి కృషి చేసిన వారందరికీ ప్రధానమంత్రి హృదయపూర్వక నివాళులు అర్పించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదలతో లక్ష్యాలను సాధించవచ్చని వారి ధైర్యసాహసాలు, సామర్థ్యాలు నిరూపించాయని పేర్కొన్నారు. దేశ సద్భావన, ఐక్యతా స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

ఒక సుభాషితాన్ని ప్రస్తావిస్తూ.. శ్రమ, పట్టుదల, అంకితభావంతో కూడిన ప్రయత్నాల వల్లే వివిధ కళలు, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక నైపుణ్యాలు, హస్తకళలు, నూతన ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని, ఇవి విజయానికి బాటలు వేస్తాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. కేవలం అదృష్టాన్ని నమ్ముకుని ఉండిపోకుండా… ధైర్యం, శ్రమ శక్తి, నిరంతర ప్రయత్నాలతో స్థిరంగా గమ్యం దిశగా సాగాలని తెలిపారు. మానవ ప్రయత్నాలే భవితవ్యాన్ని నిర్ణయిస్తాయన్నారు.

సామాజిక మాధ్యమం "ఎక్స్" వరుస పోస్టుల్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

"ఇవాళ మనం పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే నిర్వహిస్తున్నాం. దేశ విభజన వల్ల ప్రభావితమైన వారి ధైర్యసాహసాలను ఈ సందర్భంగా స్మరించుకుందాం. విభజన వల్ల ఎన్నో జీవితాలు చిన్నాభిన్నమై.. మరెన్నో కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ప్రియమైన వారిని కోల్పోయారు. ఎంతో వేదనను అనుభవించారు.

అదే సమయంలో ఈ క్లిష్ట పరిస్థితులను అధిగమించి ప్రజలు తమ జీవితాలను పునర్నిర్మించుకున్నారు. కష్టాలను విజయాలుగా మలచుకున్నారు. దేశ పురోగతికి ఎంతో కృషి చేశారు. వారి జీవిత ప్రయాణాలు సంకల్పబలాన్ని గుర్తుచేస్తాయి.

దేశంలో ఐక్యతను, సౌభ్రాతృత్వానని పరిరక్షించుకోవాలన్న సంకల్పాన్ని ఈ రోజు మరింత బలపరుస్తుందని… వికసిత్ భారత్ నిర్మాణానికి సమష్టి కృషి చేసేలా స్ఫూర్తినిస్తుందని విశ్వసిస్తున్నా"

"పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే సందర్భంగా ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడి దేశ ప్రగతికి అమూల్యమైన సేవలందించిన దేశవాసులందరికీ హృదయపూర్వక నివాళులు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యసాహసాలతో సంకల్ప బలం గొప్పతనాన్ని నిరూపించారు.

"विभाजन विभीषिका स्मृति दिवस पर उन सभी देशवासियों का हृदय से नमन, जिन्होंने उस वीभत्स दौर से निकलकर देश की प्रगति में अमूल्य योगदान दिया। उन्होंने अपने साहस और सामर्थ्य से दिखाया कि कैसे विपरीत परिस्थितियों में भी संकल्पों को सिद्ध किया जाता है। आइए, सद्भावना और एकजुटता की राष्ट्रीय भावना को और सशक्त करें।

उद्यमस्य प्रसादेन दृश्यन्ते विविधाः कलाः।
कातरा एव जल्पन्ति यद् भाव्यं तद् भविष्यति॥”

It is through hard work, enterprise and dedicated effort that diverse arts, science, technological skills, craftsmanship and innovations flourish, paving the way for success. Therefore, one should not remain dependent on fate; rather, one should move steadily towards one's goals with courage, diligence and persistent effort, for it is human endeavor that shapes destiny.