PM Modi campaigns in Bijnor, Uttar Pradesh, urges people to vote for BJP
Shri Modi questions Samajwadi party for attacking & getting BJP workers arrested without reason
Farmer welfare is most vital for us. Our Government has brought the Pradhan Mantri Fasal Bima Yojana: PM
Chaudhary Charan Singh Kisan Kalyan Kosh would be created for farmers’ welfare, says Shri Modi
People in UP must question the SP government that what development works have been done in the state in last five years: Shri Modi

ప్రధాని నరేంద్ర మోదీ నేడు బిజ్నోర్, ఉత్తరప్రదేశ్ లో ప్రచారం చేసారు. ప్రధాని ఉత్తరప్రదేశ్ ప్రజల ఉత్సాహం చూశాక, ప్రజలు మార్పు కోరుకుంటున్నారానడానికి ఇదే సంకేతం అన్నారు. బిజేపి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేలా ఓట్లు వేయాలని కోరారు.  

సమాజ్వాది పార్టీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ దాడి చేస్తూ, “ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్ లోనూఏ తప్పు చేయకుండా బిజేపి కార్యకర్తలు అరెస్ట్ అయుతున్నారు. ప్రభుత్వాలు ఇలానే పనిచేస్తాయా? రాజకీయ వ్యతిరేకులపై చట్టాన్ని దుర్వినియోగం చేయాలా?” అని అన్నారు.

రాష్ట్రంలోని ఎస్పి ప్రభుత్వం పేద మరియు నిజాయితీ పౌరుల ప్రయోజనాలను కాపాడలేకపోయిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పెరుతున్న నేరాలు గురించి ప్రస్తావిస్తూ, “ రాష్ట్రంలో అత్యాచారం వంటి దురదృష్టకర సంఘటనలు జరిగిన తర్వాత సమాజ్వాది పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు? ఇటువంటి అమర్యాదకరమైన వ్యాఖ్యలు ఆమోదనీయంకాదు. "

శ్రీ మోదీ కాంగ్రెస్ పై దాడి చేస్తూ, వారి మనుగడ కోసం ఏదైనా చేయగలరు. “కాంగ్రెస్, వారి మనుగడ కోసం ఏదైనా చేయగలదు, ఏళ్లగా ఎవరిమీద అయితే పోరాడుతుందో ఆ ఎస్పి తో పొత్తుపెట్టుకోవడం కూడా.”

చెరుకు రైతుల సంక్షేమమే బిజెపి ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైనదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. "ఉత్తరప్రదేశ్ లో చెరుకు రైతులు తమ బకాయిలు ఎందుకు పొందడం లేదు? రైతులకు ఎందుకు న్యాయం జరగడంలేదు? వారి బకాయిలు వారికి అందేలా మేము చూస్తాము. “ అని ఆయన అన్నారు.

కేంద్రం యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి ప్రధాని సుదీర్ఘంగా మాట్లాడారు. “రైతే సంక్షేమమే మాకు చాలా కీలకం.   మా ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తెచ్చింది. అది మన రైతులకు తక్కువ ప్రీమియం మరియు గరిష్ట బీమా అందిస్తుంది.” అని అన్నారు.

రైతుల సంక్షేమం కోసం చౌదరి చరణ్ సింగ్ కిసాన్ కళ్యాణ్ కోష్ ప్రారంభిస్తామని కూడా ఆయన చెప్పారు.

వారి శ్రేయస్సు కోసం పని చేయని ఒక అసమర్థమైన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఉండకూడదని శ్రీ మోదీ పేర్కొన్నారు. “కేంద్రం నుంచి తమకు వనరులు కేటాయించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సంక్షేమం కోసం వాటిని ఉపయోగించలేదు.”

అనేక మంది పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు హాజరయ్యారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Railways' financial health improves in last 10 yrs, surplus revenue after meeting cost: Ashwini Vaishnaw

Media Coverage

Railways' financial health improves in last 10 yrs, surplus revenue after meeting cost: Ashwini Vaishnaw
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 7 ఫెబ్రవరి 2026
February 07, 2026

Empowering the Nation: Trade Deals, Tech Innovations, and Rural Revival Under PM Modi