అమ్మ

Published By : Admin | June 18, 2022 | 07:30 IST

అమ్మ – నిఘంటువులో ఇతర పదాల తరహాలో కనిపించే ఓ పదం కాదు… ప్రేమ, సహనం, నమ్మకం వంటి ఎన్నో భావోద్వేగాలు ఈ పదంలో ఇట్టే ఇమిడిపోతాయి. దేశం లేదా ప్రాంతంతో నిమిత్తం లేకుండా ప్రపంచవ్యాప్తంగా పిల్లలు తమ తల్లులపై ప్రత్యేక అనురాగం కలిగి ఉంటారు. తల్లి కేవలం తన పిల్లలకు జన్మనివ్వడమే మాత్రమేగాక వారి మనోభావాలకు, వ్యక్తిత్వానికి, ఆత్మవిశ్వాసానికి కూడా రూపమిస్తుంది. ఆ క్రమంలో తల్లులు స్వార్థమనే మాటకు తావులేకుండా తమ వ్యక్తిగత అవసరాలు, ఆకాంక్షలను త్యాగం చేస్తారు.
మా అమ్మ శ్రీమతి హీరాబా శత సంవత్సరంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో నాకెంతో సంతోషంగా ఉంది. అంతేగాక ఈ సందర్భాన్ని మీతో పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఆమె జన్మశతాబ్ది సంవత్సరం… మా తండ్రి నేడు జీవించి ఉంటే గతవారం ఆయన కూడా 100వ పుట్టినరోజు వేడుక చేసుకుని ఉండేవారు. మా అమ్మ జన్మ శతాబ్ది ప్రారంభమవుతున్న ఈ 2022 నాకొక ప్రత్యేక సంవత్సరం.. ఇదే సందర్భంలో మా తండ్రి వందేళ్లు పూర్తిచేసుకుని ఉండేవారు.

గత వారంలోనే మా మేనల్లుడు గాంధీనగర్ నుంచి అమ్మకు సంబంధించిన కొన్ని వీడియోలను నాతో పంచుకున్నాడు. కొందరు యువ సామాజిక సంఘ సభ్యులు మా ఇంటికి వచ్చి, మా తండ్రి ఫొటోను కుర్చీలో ఉంచారు.. అటుపైన అమ్మ మంజీర వాయిస్తూ ఓ కీర్తనను ఆలపించడంలో నిమగ్నమైంది. వయసు ప్రభావంతో శారీరకంగా బలహీనపడి ఉండవచ్చుగానీ, ఆమె ఇప్పటికీ అదే ఉత్సాహంతో ఉంది. అదే సమయంలో మానసికంగా కూడా ఎప్పటిలాగానే చురుగ్గా ఉంది.

మా కుటుంబంలో ఇంతకుముందు పుట్టినరోజు వేడుకలు చేసుకునే సంప్రదాయం లేదు. కానీ, మా తర్వాతి తరంలోని పిల్లలు మా తండ్రిగారి జయంతి నాడు ఆయన సంస్మరణార్థం 100 మొక్కలు నాటారు.

నా జీవితంలోని ప్రతి మంచి మలుపు.. నా వ్యక్తిత్వంలోని ప్రతి మంచి లక్షణాలకు నా తల్లిదండ్రులే కారణమని చెప్పడానికి నేనెంతమాత్రం సందేహించను. నేనివాళ ఢిల్లీలో కూర్చున్నప్పటికీ నా మదిలో గతకాలపు జ్ఞాపకాలే నిండి ఉన్నాయి.

నా తల్లి ఎంత అసాధారణమైనదో అమ్మలందరి తరహాలో అంతే సాధారణమైనది కూడా! నేను నా తల్లి గురించి రాస్తున్న ఈ సందర్భంలో మీలో చాలామంది ఆమె గురించి నా వివరణతో మమేకం అవుతారని నేను కచ్చితంగా భావిస్తున్నాను. అదేవిధంగా నా మాటలు చదువుతున్నప్పుడూ మీ మనో ఫలకం మీద సాక్షాత్తూ మీ అమ్మ రూపం మెదలడం ఖాయం.

ఓ తల్లి త్యాగం ఒక మంచి మనిషిని సృష్టిస్తుంది. ఆమె ఆప్యాయత పిల్లల్లో మానవీయ విలువలను, కరుణను నింపుతుంది. తల్లి ఒక వ్యక్తి లేదా వ్యక్తిత్వం కాదు.. మాతృత్వమన్నది ఓ సుగుణం కాదు… దీన్ని మరింత లోతుగా చెప్పాలంటే- దేవతలు వారి భక్తుల స్వభావాన్ని బట్టి రూపొందుతారని తరచూ వింటుంటాం. అదే తరహాలో మన సొంత స్వభావం, మనస్తత్వానికి అనుగుణంగా మనం మన తల్లులను, వారి మాతృత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాం.

మా అమ్మ గుజరాత్లోని మెహసానాలో గల విస్నగర్లో జన్మించింది. ఇది మా స్వస్థలం వాద్నగర్కు సమీపంలోనే ఉంటుంది. ఆమె బాల్యంలో తన తల్లి ప్రేమను పొందలేకపోయింది. పసితనంలోనే ‘స్పానిష్ ఫ్లూ’ మహమ్మారి వల్ల మా అమ్మమ్మ ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఆమెకు మా అమ్మమ్మ రూపం లేదా ఆమె ఒడిలోని వాత్సల్యం ఎలా ఉంటాయో కూడా గుర్తులేదు. తల్లి లాలన లేకుండానే మా అమ్మ బాల్యం గడిచిపోయింది. మనలాగా తల్లి ఒడిలో ముద్దుముద్దుగా అల్లరిచేసే అవకాశం ఆమెకు దక్కలేదు. మనందరిలాగా తన తల్లి ఒడిలో ఆమె సేదదీరలేకపోయింది. అలాగే ఆమె పాఠశాలకు వెళ్లి చదవడం-రాయడం కూడా నేర్చుకోలేకపోయింది. ఆమె బాల్యమంతా పేదరికం, ప్రేమరాహిత్యంతోనే గడచింది.

నేటి పరిస్థితులలో పోలిస్తే మా అమ్మ బాల్యం చాలా కష్టంతో కూడుకున్నది. బహుశా ఆ సర్వాంతర్యామి ఆమె నుదుటి రాతను ఇలా రాశాడేమో! అందుకు తగినట్లుగా ఇది దేవుని చిత్తమని అమ్మ కూడా నమ్ముతుంది. కానీ చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడం, కనీసం తన తల్లి రూపం కూడా తెలియకపోవడం నేటికీ ఆమెను బాధిస్తూనే ఉంది.

ఇలాంటి కష్టాలవల్ల మా అమ్మకు బాల్యం అంత సాఫీగా సాగలేదు సరికదా- ఆమె తన వయస్సుకు మించిన పరిణతి కనబరచాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె తన కుటుంబంలో పెద్ద కూతురు కాగా, పెళ్లి తర్వాత పెద్ద కోడలుగానూ మారింది. చిన్నతనంలో కుటుంబ భారమంతా ఆమె తన భుజాలకు ఎత్తుకుని, అన్ని పనులూ తానే చూసుకునేది. అదేవిధంగా పెళ్లయ్యాక కూడా ఆ బాధ్యతలన్నిటినీ ఆమె తన భుజాన వేసుకుంది. ఎంతో బరువైన బాధ్యతలు, రోజువారీ సంఘర్షణలు ఎన్ని ఉన్నప్పటికీ మా అమ్మ కుటుంబం మీద ఆ ప్రభావం పడనివ్వకుండా ప్రశాంతంగా, దృఢంగా ఉండేలా చూసింది.

వాద్నగర్లో మా కుటుంబం కనీసం కిటికీ కూడా లేని ఓ చిన్న ఇంట్లో నివసించేది. ఇక స్నానాలగది లేదా మరుగుదొడ్డి ఉండటమంటే విలాసమే! మట్టిగోడలు, మట్టి పెంకుల పైకప్పుగల ఈ ఒక్క గదినే మేం ‘ఇల్లు’ అని పిలిచేవాళ్లం. మేమందరం- నేనుసహా నా తల్లిదండ్రులు, తోబుట్టువులు అందరం నివసించేది అందులోనే!

మా అమ్మ వంటపనిని సులభం చేయడం కోసం మా నాన్న వెదురు కర్రలు, చెక్క పలకలతో ‘మంచె’ కట్టారు. ఇదే మా వంటగది... అమ్మ దానిపైకెక్కి వంట చేస్తే.. కుటుంబమంతా దానిపైనే కూర్చుని భోజనం చేసేది.సాధారణంగా ఏదైనా కొరతగా ఉందంటే ఒత్తిడి మొదలవుతుంది. కానీ, రోజువారీ సంఘర్షణలతో తలెత్తే ఆందోళన మా కుటుంబ వాతావరణాన్ని ఎన్నడూ చెడగొట్టకుండా నా తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధ వహించేవారు. ఆ మేరకు వారిద్దరూ తమతమ బాధ్యతలను జాగ్రత్తగా విభజించుకుని, కచ్చితంగా నిర్వర్తించేవారు.

కాలంతో సమానంగా మా నాన్న తెల్లవారుజామున నాలుగు గంటలకల్లా పనికి బయల్దేరేవారు. అప్పుడు ఇరుగుపొరుగు… ‘అబ్బో అప్పుడే 4 గంటలైంది… దామోదర్ బాబాయ్ పనికి బయల్దేరారు’ అని చెప్పుకొనేవారు. అలాగే తన చిన్న టీ దుకాణం తెరవడానికి ముందు స్థానిక ఆలయంలో ప్రార్థనచేసే ఆనవాయితీని ఆయన ఎన్నడూ వీడలేదు.

అమ్మ కూడా అంతే కచ్చితంగా తన పనిలో తాను మునిగిపోతుంది. ఆ ప్రకారం నాన్నతోపాటు నిద్రలేచి, ఉదయం పూట చేయాల్సిన ఇంటిపనులన్నిటినీ చక్కబెట్టేది. పిండి రుబ్బడం దగ్గర్నుంచి బియ్యం, పప్పు జల్లెడ పట్టడందాకా ఎలాంటి సాయం లేకుండా అమ్మ చేసుకుపోయేది. పని చేస్తున్నప్పుడు ఆమె తనకిష్టమైన భక్తిగీతాలు, కీర్తనలను సన్నగా ఆలపిస్తూండేది. నర్సీ మెహతాజీ రచించిన ప్రసిద్ధ భక్తిగీతం ‘జల్కమల్ ఛడీ జానే బాలా.. స్వామి అమరో జగ్సే” అలాగే ‘శివాజీ ను హలార్దు’ అనే లాలిపాట కూడా ఆమెకు చాలా చాలా ఇష్టం.
పిల్లలు తన పనిలో సాయపడాలని మా అమ్మ ఎప్పుడూ ఎదురుచూసేది కాదు. చదువు మానేసి తనకు సాయం చేయాలని ఆమె ఎన్నడూ అడగలేదు. కానీ, అమ్మ కష్టం చూసి ఇంటిపనేల్లో ఆమెకు సహాయం చేయడం మా బాధ్యతగా మేం భావించేవాళ్లం. మా ఊరి చెరువులో ఈత కొట్టడమంటే నాకెంతో సరదా. అందుకోసం ఇంట్లో మాసిన దుస్తులన్నీ మూటగట్టి చెరువుకు తీసుకెళ్లి, ఉతికి తెచ్చేవాడిని. ఆ పనిలోపనిగా నా ఈత సరదా కూడా తీరేది. 

ఇంటి ఖర్చుల కోసం మా అమ్మ కొన్ని ఇళ్లలో పాచిపని చేసేది. అంతేకాకుండా మా కొద్దిపాటి కుటుంబ ఆదాయానికి తోడుగా ఆమె చరఖా తిప్పి నూలు వడికేది. అలాగే దూది తీయడం దగ్గర్నుంచి నూలు వడకడందాకా పనులన్నీ చేసేది. వెన్నువిరిగేలా ఇంత పని చేస్తున్నా కూడా తనచుట్టూ తిరిగే మాకు పత్తి ములుకులు గుచ్చుకోకుండా చూడటానికి ఎంతో ప్రయాసపడేది.

ఇక తన పనిలో సాయం కోసం అమ్మ ఇతరులపై ఆధారపడటం లేదా అభ్యర్థించడం చేసేది కాదు. వర్షాకాలం వస్తే మా మట్టి ఇంటికి కష్టాలు మొదలైనట్టే. అయినప్పటికీ మేం ఎలాంటి అసౌకర్యానికీ లోనుకాకుండా మా అమ్మ జాగ్రత్త పడుతుంది. ఇక మండుటెండలు కాసే జూన్ నెలలో ఆమె మా మట్టి ఇంటి పైకప్పు మీదికెక్కి పెంకులు బాగుచేస్తుంది. అయితే, ఆమె ఎంత చాకచక్యంగా ఈ పనులన్నీ చక్కబెట్టినా మా పాత ఇల్లు వర్షాల తాకిడిని తట్టుకోలేకపోయేది.

వర్షాలకు మా ఇంటి పైకప్పు కారుతూ లోపలంతా నీటితో నిండిపోయేది. నీరుకారే ప్రతి చోట బకెట్లు, పాత్రలు పెట్టడానికి మా అమ్మ చాలా అవస్థ పడేది. ఇంత విపత్కర పరిస్థితుల్లోనూ మానసిక స్థైర్యానికి ఆమె మారుపేరు అన్నట్లు ఉండేది. ఇక ఇలా ఒడిసి పట్టిన వాననీటిని ఆ తర్వాత కొద్ది రోజులు వాడుకునే తీరు తెలిస్తే మీరంతా ఆశ్చర్యపోతారు. జల సంరక్షణకు ఇంతకన్నా మంచి ఉదాహరణ మరేముంటుంది!

మేముండే చిన్న ఇంటిని చక్కగా ఉంచడంలో మా అమ్మ ఎంతో శ్రద్ధ చూపేది. ఇల్లు శుభ్రం చేయడానికి, అందంగా తీర్చిదిద్దడానికి ఆమె చాలా సమయం కేటాయించేది. ఆమె ఆవు పేడతో నేలను అలికేది. ఆవు పేడతో చేసిన పిడకలతో వంటచేసేటపుడు పొగ విపరీతంగా కమ్ముకుంటుంది. అయినప్పటికీ, కిటికీ కూడా లేని ఆ ఇంటిలో ఆ పొగలోనే మా అమ్మ వంట చేసేది! గోడలు మసితో నల్లబారుతాయి కాబట్టి, అప్పుడప్పుడూ వెల్లవేయడం అవసరం. ఈ పనిని కూడా నిర్ణీత వ్యవధి మేరకు ఆమె స్వయంగా చేసేది. ఆ విధంగా మా శిథిల గృహానికి ఇది కొత్తదనాన్నిస్తుంది. అంతేకాకుండా ఇంటిని అందంగా అలంకరించడం కోసం చిన్నచిన్న మట్టి పాత్రలు కూడా తయారుచేస్తుంది. ఇక పాత గృహోపకరణాలను కొత్తగా తీర్చిదిద్దే భారతదేశపు అలవాటును పాటించడంలో ఆమెను మించినవారు లేరు.
మా అమ్మకు మరో ప్రత్యేకమైన అలవాటుండేది. ఆమె పాత కాగితాన్ని నీటిలో ముంచి, చింతగింజలతో కలిపి ఓ జిగురుముద్దను తయారుచేసేంది. ఈ జిగురు సాయంతో గోడలపై అద్దాల ముక్కలను అతికించడం ద్వారా అందమైన చిత్తరువులు రూపొందించేది. బజారు నుంచి చిన్నచిన్న అలంకరణ వస్తువులు తెచ్చి తలుపును అందంగా అలంకరించేది.

మంచం, దానిమీద పరుపు శుభ్రంగా-చక్కగా ఉంచడానికి మా అమ్మ చాలా ప్రాధాన్యం ఇచ్చేది. పడక మంచంమీద కాసింత దుమ్మును కూడా సహించేది కాదు. దుప్పటిమీద ఏ కాస్త మరక కనిపించినా తక్షణం దుమ్ము దులిపి మళ్లీ పరిచేది. ఈ విషయంలో మేమంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండేవాళ్లం. నేటికీ, ఈ వయస్సులోనూ తన మంచం మీద దుప్పటి నలిగిపోకుండా చూసుకోవాలని మా అమ్మ తపన పడుతుంది!
అంతా సవ్యంగా ఉండాలన్న తాపత్రయం ఆమెలో నేటికీ పదిలమే. ఇప్పుడామె గాంధీనగర్లో నా సోదరుడు, మేనల్లుడి కుటుంబాలతో ఉంటున్నప్పటికీ, ఈ వయసులోనూ తన పనులన్నీ తానే స్వయంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. పరిశుభ్రతపై ఆమె శ్రద్ధ నేటికీ స్పష్టంగా కనిపిస్తుంది. నేను ఆమెను పరామర్శించడానికి గాంధీనగర్కు వెళ్లినప్పుడల్లా తాను స్వయంగా చేసిన మిఠాయిలతో నా నోరు తీపిచేస్తుంది. అంతేకాదు.. పాలు తాగిన పసిబిడ్డకు మూతి తుడిచినట్లు నేను మిఠాయి తినడం పూర్తికాగానే రుమాలుతో నోరు తుడుస్తుంది. తన నడుము వద్ద చీర మడతలో సదా ఒక రుమాలు వంటిది ఉంచుకోవడం ఆమెకు అలవాటు.

ఈ విధంగా పరిశుభ్రతపై మా అమ్మ శ్రద్ధను గుర్తుచేసే కథనాలను పేజీలకు పేజీలు రాయగలను. ఆమెలో మరో సుగుణం కూడా ఉంది… పరిశుభ్రత, పారిశుధ్య పనుల్లో పాలుపంచుకునే వారిపట్ల ఎంతో గౌరవం చూపుతుంది. నాకిప్పటికీ గుర్తుంది… వాద్నగర్లో మా ఇంటి పక్కనే ఉన్న మురుగు కాలువను శుభ్రం చేయడానికి వచ్చే కార్మికులు తన చేతి టీ తాగనిదే మా అమ్మ వెళ్లనివ్వదు. పని పూర్తయ్యాక మా ఇంటి తేనీరు రుచి చూడటం పారిశుధ్య కార్మికులందరికీ పరిపాటి!

అమ్మకు మరో అలవాటు- ఇతర ప్రాణుల పట్ల ఆమెకున్న ప్రత్యేక అభిమానం. ఈ విషయం నాకు బాగా గుర్తుంది. ప్రతి వేసవిలో, ఆమె పక్షుల కోసం నీటి పాత్రలను ఉంచుతుంది. మా ఇంటి చుట్టూ తిరిగే శునకాలు ఎప్పుడూ ఆకలితో ఉండకుండా చూస్తుంది. మా నాన్న తన టీ షాప్ నుండి తెచ్చే పాల మీగడతో అమ్మ రుచికరమైన నెయ్యి తయారు చేసేది. ఈ నెయ్యి మా వినియోగానికి మాత్రమే కాదు. మా పొరుగున ఉన్న ఆవులకు కూడా తమ వాటా ఉండేది. అమ్మ ప్రతిరోజూ ఆవులకు రోటీలు తినిపించేది. కేవలం పొడి రోటీలు కాకుండా ఇంట్లో తయారుచేసిన నెయ్యిని వాటిపై రాసి ప్రేమతో వాటిని ఆవులకు పెట్టేది.

ఆహారం ఒక్క గింజ కూడా వృధా చేయకూడదని అమ్మ గట్టిగా చెప్పేది. మా ఇరుగుపొరుగున పెండ్లి విందు జరిగినప్పుడల్లా, ఆహారాన్ని వృధా చేయకూడదని ఆమె గుర్తుచేసేది. ఇంట్లో ఒక స్పష్టమైన నియమం ఉంది - మీరు తినగలిగినంత మాత్రమే తీసుకోండి అనేది ఆ నియమం. నేటికీ, అమ్మ తను తినగలిగినంత ఆహారం మాత్రమే తీసుకుంటుంది మరియు ఒక ముక్క కూడా వృధా చేయదు. అలవాటు ఉన్న జీవి, ఆమె సమయానికి తింటుంది, సరిగ్గా జీర్ణం కావడానికి ఆహారాన్ని బాగా నమిలి తింటుంది.

అమ్మ ఇతరుల సంతోషాలలో ఆనందాన్ని పొందుతుంది. మా ఇల్లు చిన్నది కావచ్చు, కానీ ఆమె చాలా పెద్ద మనసుతో ఉండేది. మా నాన్నగారి ఆప్తమిత్రుడు దగ్గర్లోని ఊరిలో ఉండేవాడు. అతని అకాల మరణం తర్వాత, మా నాన్న తన స్నేహితుడి కొడుకు అబ్బాస్ని మా ఇంటికి తీసుకొచ్చాడు. మా దగ్గరే ఉంటూ చదువు పూర్తి చేశాడు. అమ్మ మా తోబుట్టువులందరిలాగే అబ్బాస్ పట్ల ప్రేమగా, శ్రద్ధగా ఉండేది. ప్రతి సంవత్సరం ఈద్ నాడు ఆమె అతనికి ఇష్టమైన వంటకాలను సిద్ధం చేసేది. పండుగలప్పుడు, ఇరుగుపొరుగు పిల్లలు మా ఇంటికి వచ్చి అమ్మ ప్రత్యేకంగా తయారుచేసేవి ఆస్వాదించడం సర్వసాధారణం.

సాధువు మా ఇరుగుపొరుగు నుంచి వెళ్తున్నప్పుడల్లా అమ్మ వారిని వినయపూర్వకంగా మా ఇంటికి భోజనానికి పిలిచేది. ఆమె నిస్వార్థ స్వభావానికి నిదర్శనం ఏమిటంటే, ఆమె తన కోసం ఏదైనా అడగడం కంటే పిల్లలైన మమ్మల్ని ఆశీర్వదించమని సాధువులను కోరుకునేది. ఆమె వారిని ప్రోత్సహిస్తుంది, “నా పిల్లలను ఆశీర్వదించండి, తద్వారా వారు ఇతరుల సంతోషాలలో సంతోషంగా ఉంటారు. వారి బాధలలో సానుభూతితో ఉంటారు. వారికి భక్తి (దైవ భక్తి), సేవాభావం (ఇతరులకు సేవ) ఉండనివ్వండి" అని సాధువులతో అనేది.

అమ్మ సంస్కరాలను నేర్పింది. ఆమెకు నాపై అపారమైన నమ్మకం ఉంది. నేను సంస్థలో పనిచేసినప్పుడు దశాబ్దాల నాటి సంఘటనను గుర్తుచేసుకున్నాను. నేను సంస్థాగత కార్యకలాపాలతో చాలా బిజీగా ఉన్నాను మరియు నా కుటుంబంతో సన్నిహితంగా ఉండలేకపోయాను. ఆ కాలంలో మా అన్నయ్య అమ్మను బద్రీనాథ్ జీ, కేదార్నాథ్ జీ దగ్గరకు తీసుకెళ్లాడు. బద్రీనాథ్ లో దర్శనం పూర్తి చేసిన తర్వాత మా అమ్మ కేదార్నాథ్ జీ దర్శనానికి వస్తుందని స్థానికులు తెలుసుకున్నారు.

అయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొంత మంది దుప్పట్లతో కిందకు దిగారు. వారు నరేంద్ర మోడీ తల్లి కాదా అని రోడ్లపై వృద్ధ మహిళలను అడుగుతూనే ఉన్నారు. చివరగా, వారు అమ్మ ని కలుసుకున్నారు. ఆమెకు దుప్పట్లు మరియు టీ ఇచ్చారు. కేదార్నాథ్ లో ఆమె బస చేసేందుకు వారు సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేశారు. ఈ సంఘటన అమ్మని బాగా ప్రభావితం చేసింది. తర్వాత ఆమె నన్ను కలిసినప్పుడు, “ప్రజలు నిన్ను గుర్తించే విధంగా నువ్వు మంచి పని చేస్తున్నట్లు అనిపిస్తోంది” అని చెప్పింది.
ఈరోజు, చాలా సంవత్సరాల తర్వాత, తన కొడుకు దేశానికి ప్రధాని అయ్యాడని గర్వపడుతున్నావా అని ప్రజలు ఆమెను అడిగినప్పుడల్లా, అమ్మ చాలా లోతైన సమాధానం ఇస్తుంది. ఆమె చెప్పింది... “నేను మీలాగే గర్వపడుతున్నాను. ఏదీ నాది కాదు. నేను దేవుని ప్రణాళికలలో ఒక సాధనం మాత్రమే."

ఏదైనా ప్రభుత్వ లేదా ప్రజా కార్యక్రమాలకు అమ్మ ఎప్పుడూ నాతో రాకపోవడాన్ని మీరు గమనించి ఉండవచ్చు. ఆమె గతంలో రెండు సందర్భాల్లో మాత్రమే నాతో పాటు వచ్చింది. ఒకసారి, అహ్మదాబాద్లోని ఒక పబ్లిక్ ఫంక్షన్లో, నేను ఏక్తా యాత్రను ముగించుకుని లాల్ చౌక్లో జాతీయ జెండాను ఎగురవేసిన శ్రీనగర్ నుండి నేను తిరిగి వచ్చిన తర్వాత ఆమె నా నుదుటిపై తిలకం పెట్టింది.
ఏక్తా యాత్ర సమయంలో ఫగ్వారాలో జరిగిన ఉగ్రదాడిలో కొంతమంది మరణించినందున అది అమ్మ కి చాలా భావోద్వేగ క్షణం. ఆ సమయంలో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. ఇద్దరు వ్యక్తులు నన్ను తనిఖీ చేయడానికి పిలిచారు. ఒకరు అక్షరధామ్ ఆలయానికి చెందిన శ్రద్ధే ప్రముఖ్ స్వామి, రెండవది అమ్మ. ఆమె ఉపశమనం స్పష్టంగా కనిపించింది. రెండవది 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నేను మొదటిసారి ప్రమాణ స్వీకారం చేయడం. రెండు దశాబ్దాల క్రితం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవం అమ్మ నాతో కలిసి హాజరైన చివరి బహిరంగ కార్యక్రమం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పబ్లిక్ ఈవెంట్కు కూడా ఆమె నాతో కలిసి రాలేదు.

నాకు ఇంకో సంఘటన గుర్తుంది. నేను గుజరాత్లో ముఖ్యమంత్రి అయ్యాక, నా ఉపాధ్యాయులందరినీ బహిరంగంగా సన్మానించాలనుకున్నాను. జీవితంలో అమ్మ నాకు పెద్ద గురువు అని, నేను ఆమెను కూడా గౌరవించాలని అనుకున్నాను. మన గ్రంధాలు కూడా తల్లిని మించిన పెద్ద గురువు లేరని పేర్కొన్నాయి - ‘నాస్తి మాతృ సమో గురుః’. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని నేను అమ్మ ని అభ్యర్థించాను, కానీ ఆమె నిరాకరించింది. ఆమె చెప్పింది, “చూడండి, నేను సాధారణ వ్యక్తిని. నేను మీకు జన్మనిచ్చి ఉండవచ్చు, కానీ మీకు సర్వశక్తిమంతుడే నేర్పించాడు" అని ఆమె అన్నారు.. ఆ రోజు నా టీచర్లందరినీ సత్కరించారు.

అదనంగా, ఈవెంట్కు ముందు, మా స్థానిక ఉపాధ్యాయుడు జేతాభాయ్ జోషి జీ కుటుంబం నుండి ఎవరైనా ఈ కార్యక్రమానికి హాజరవుతారా అని ఆమె అడిగింది. అతను నా ప్రారంభ అభ్యాసాన్ని పర్యవేక్షించారు, నాకు వర్ణమాల కూడా నేర్పించారు. ఆమె అతన్ని గుర్తుపట్టింది. అతను చనిపోయారని తెలిసింది. ఆమె కార్యక్రమానికి రానప్పటికీ, నేను జేతాభాయ్ జోషి జీ కుటుంబం నుండి ఎవరికైనా ఫోన్ చేశానా అని ఆమె నిర్ధారించుకుంది.ఆమె ఆలోచనా విధానం, దూరదృష్టితో కూడిన ఆలోచన నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరిచాయి.
పౌరురాలిగా తన బాధ్యతల పట్ల ఆమెకు ఎప్పుడూ అవగాహన ఉంది. ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుండి, ఆమె పంచాయతీ నుండి పార్లమెంటు వరకు ప్రతి ఎన్నికలలో ఓటు వేసింది. కొద్ది రోజుల క్రితం ఆమె గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఓటు వేయడానికి వెళ్లారు.

ప్రజల నుండి, సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుడు నుండి నాకు ఆశీస్సులు ఉన్నందున నాకు ఏమీ జరగదని ఆమె తరచుగా నాకు చెబుతోంది. నేను ప్రజలకు సేవ చేయడం కొనసాగించాలనుకుంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని నడిపించడం, వ్యక్తిగత నిబంధనల చిత్రాన్ని నిర్ధారించడం అవసరమని ఆమె నాకు గుర్తుచేస్తుంది.

ఇంతకు ముందు, అమ్మ చాతుర్మాస దీక్షను ఖచ్చితంగా పాటిస్తుంది. నవరాత్రి సమయంలో నా వ్యక్తిగత అలవాట్లు కూడా ఆమెకు తెలుసు. ఇప్పుడు, నేను చాలా కాలంగా ఈ కఠినమైన వ్యక్తిగత నియమాలను అనుసరిస్తున్నందున నేను వాటిని సడలించాలని ఆమె నాకు చెప్పడం ప్రారంభించింది.

జీవితంలో అమ్మ ఏ విషయంలోనూ ఫిర్యాదు చేయడం వినలేదు. ఆమె ఎవరిపైనా ఫిర్యాదు చేయదు లేదా ఎవరి నుండి ఎటువంటి అంచనాలను ఉంచదు.నేటికీ అమ్మ పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవు. ఆమె బంగారు ఆభరణాలు ధరించడం నేను ఎప్పుడూ చూడలేదు. ఆమెకు ఆసక్తి కూడా లేదు. మునుపటిలాగే, ఆమె తన చిన్న గదిలో చాలా సరళమైన జీవనశైలిని కొనసాగిస్తుంది.

అమ్మకి దైవం పట్ల అపారమైన విశ్వాసం ఉంది, కానీ అదే సమయంలో, ఆమె మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ, అదే లక్షణాలను మాలో కూడా పెంపొందించింది. ఆమె సాంప్రదాయకంగా కబీర్ పంక్తి, ఆమె రోజువారీ ప్రార్థనలలో ఆ ఆచారాలను అనుసరిస్తూనే ఉంది. ఆమె తన పూసల మాలతో జపము చేస్తూ కాలం గడుపుతుంది. రోజువారీ పూజలు, జపాలలో నిమగ్నమై, ఆమె తరచుగా నిద్రను కూడా వదులుకుంటుంది. కొన్నిసార్లు, ఆమె నిద్రపోయేలా నా కుటుంబ సభ్యులు ప్రార్థన పూసలను దాచిపెడతారు.

వయసు పెరిగినా అమ్మకు జ్ఞాపకశక్తి బాగానే ఉంది. దశాబ్దాల నాటి సంఘటనలను ఆమె స్పష్టంగా గుర్తు చేసుకున్నారు. కొంతమంది బంధువులు ఆమెను సందర్శించినప్పుడల్లా, ఆమె వెంటనే వారి తాతామామల పేర్లను గుర్తుకు తెచ్చుకుంటుంది, తదనుగుణంగా వారిని గుర్తిస్తుంది. ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను ఆమె ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటుంది. ఇటీవల, నేను ఆమెను ప్రతిరోజూ ఎంతసేపు టీవీ చూస్తావని అడిగాను. టీవీలో చాలా మంది వ్యక్తులు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడంలో బిజీగా ఉన్నారని, ప్రశాంతంగా వార్తలను చదివి ప్రతి విషయాన్ని వివరించే వారిని మాత్రమే తాను చూస్తానని బదులిచ్చింది. అమ్మ చాలా విషయాలను ట్రాక్ చేస్తుందని నేను ఆశ్చర్యపోయాను.

ఆమె అద్భుత జ్ఞాపకశక్తికి సంబంధించి నేను మరో సంఘటనను చెబుతాను. 2017లో, ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి కాశీలో ప్రచారం అనంతరం నేను అహ్మదాబాద్ వెళ్లాను. ఆమె కోసం నేను ప్రసాదం తీసుకువెళ్ళాను. నేను మా తల్లిగారిని కలుసుకోగానే, కాశీ విశ్వనాధ మహదేవ్ దర్శనం చేసుకున్నావా లేదా అని అడిగారు. కాశీ విశ్వనాధ్ మహదేవ్ పూర్తిపేరుతోనే ఆమె స్వామిని స్మరిస్తారు. కాశీ విశ్వనాథ్ ఆలయానికి వెళ్లే దారులు ఇప్పటికీ అలాగే ఉన్నాయా, ఎవరి ఇంటి ప్రాంగణంలోనో ఉన్నట్టే ఉందా అని అడిగారు. నాకు ఆశ్చర్యం వేసి ,తను ఈ ఆలయాన్ని ఎప్పుడు దర్శించిందీ అని అడిగాను. ఎన్నో ఏళ్ల క్రితం కాశీ వెళ్లానని చెప్పింది.

కానీ ఆమెకు అక్కడివి ప్రతి ఒక్కటీ ఇప్పటికీ గుర్తే. అమ్మ గారు చాలా సున్నిత మనస్కురాలే కాక ఎంతో ఆప్యాయత కలిగిన, మంచి ప్రతిభ కలిగిన వ్యక్తి. ఆమె పిల్లలకు చికిత్స చేయడానికి సంబంధించిన గృహవైద్య చిట్కాలు ఎన్నో తెలుసు. మా వాద్నగర్ ఇంట్లో ప్రతిరోజూ ఉదయం, తమ పిల్లలను తీసుకువచ్చిన తల్లిదండ్రుల క్యూ ఉండేది. వారు అమ్మ చేత పరీక్ష చేయించుకుని ,చికిత్స చేయించుకునే వారు. ఆమె చికిత్సకు మెత్తటి పొడి అవసరమయ్యేది. దానిని సమకూర్చిపెట్టడం పిల్లలుగా మా సమిష్టి బాధ్యతగా ఉండేది. స్టవ్ నుంచి బూడిద, ఒక గిన్నె, మెత్తటి పొడి కోసం గుడ్డ ఇచ్చేది. మేం గిన్నెకు ఆ గుడ్డను కట్టి దానిపై బూడిదను వేసేవాళ్లం.దానిని అలా చేతితో రుద్దుతూ ఉంటే మెత్తటిపొడి గిన్నెలో పడేది. "మెత్తటి పొడి రావాలి, జాగ్రత్తగా చేయండి. లేకుంటే పిల్లలు ఇబ్బంది పడతారు" అనేవారు.

అమ్మ ప్రేమ, ఏకాగ్రత కు సంబంధించిన మరో సంఘటన గురించి చెబుతాను. ఒకసారి మా నాన్నగారు కోరుకున్నట్టు మా కుటుంబం, పూజ కోసం నర్మదా ఘాట్కు వెళ్లింది. మూడు గంటలపాటు అక్కడికి ప్రయాణం. అయితే ఎండ వేడిమిని తప్పించుకునేందుకు ఉదయమే బయలుదేరి వెళ్లాం. అక్కడ దిగిన తర్వాత ఇంకా కొద్ది దూరం నడచివెళ్లాలి. ఎండ ఎక్కువగా ఉండడంతో నది ఒడ్డున నీళ్లలో నడుస్తూ వెళ్లాం. నీళ్లలో నడవడం అంత సులభం కాదు.దానితో మేం ఆలిసిపోయాం. ఆకలి కూడా అయింది. మేం ఇబ్బంది పడుతున్న పరిస్థితిని గమనించిన అమ్మ , మా నాన్నను కాసేపు ఆగి విశ్రాంతి తీసుకుని బయలుదేరుదామన్నారు. అక్కడికి దగ్గరలోనే వెళ్లి బెల్లం తీసుకురమ్మని చెప్పింది. ఆయన వెంటనే వెళ్లి బెల్లం తీసుకువచ్చారు. బెల్లం, నీళ్ళు ఇవే మాకు అప్పటికప్పుడు శక్తినిచ్చాయి. అలా మళ్లీ నడుచుకుంటూ ముందుకు వెళ్లాం.అంత ఎండలో పూజకు వెళ్లడం, అమ్మ సమయస్ఫూర్తి, నాన్న వెంటనే బెల్లం తీసుకురావడం, ఈ క్షణాలన్నీ ప్రతి ఒక్కటీ నాకు ఎంతో జ్ఞాపకం.

నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. అమ్మ, ఇతరుల ఇష్టాలను గౌరవించడమే కాక, ఎప్పుడూ తన అభిప్రాయాన్ని ఇతరులపై రుద్దేవారు కారు. ప్రత్యేకించి నా విషయంలో, ఆమె నా నిర్ణయాలను గౌరవించే వారు. ఏనాడూ ఎలాంటి అడ్డంకులు కల్పించలేదు. నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ వచ్చారు. చిన్నప్పటి నుండి, నాలో భిన్నమైన మనస్తత్వం పెరిగినట్లు ఆమె భావించేది. మా అన్నదమ్ములతో, అక్కచెల్లెళ్లతో పోలిస్తే నేను కాస్త భిన్నంగా ఉండేవాడిని.


అప్పుడప్పుడూ నా ప్రత్యేక అలవాట్లు , అసాధారణ ప్రయోగాలు, ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఆమె తరచుగా ప్రత్యేక ప్రయత్నాలు చేయాల్సి వచ్చేది. అయితే ఎప్పుడూ ఆమె దీనిని భారంగా పరిగణించి, తన అసహనం వ్యక్తం చేయలేదు. ఉదాహరణకు, నేను కొన్ని నెలలపాటు ఉప్పు వేసుకోవడం కానీ, కొన్ని నెలలు ఏదైనా ధాన్యాన్ని వాడడం కానీ మానేసి కేవలం పాలు మాత్రమే తీసుకునే వాడిని. ఆరు నెలల పాటు స్వీట్లు మానేసేవాడిని. శీతాకాలంలో ఆరుబయట పడుకోవడం, మట్టి కుండలోని చల్లటి నీళ్లతో స్నానం చేయడం చేసేవాడిని. నన్ను నేను పరీక్షించుకుంటున్నానని అమ్మకు తెలుసు. వీటికి దేనికీ ఆమె అభ్యంతరపెట్టలేదు. "సరే కానీ, నీకు ఎలా ఇష్టమైతే అలా చేయి "అనేవారు.నేను భిన్నమైన మార్గంలో వెళుతున్నానని ఆమె పసిగట్టారు. ఒకసారి , ఒక మహాత్ముడు మా ఇంటికి దగ్గరగా ఉన్న గిరి మహదేవ్ ఆలయానికి వచ్చారు. నేను భక్తితో ఆయనకు సేవలు చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో, తను కొద్ది రోజులలో జరగబోయే తన చెల్లి పెళ్లి కోసం ఆతృత తో ఎదురుచూస్తోంది. ఆ రకంగా సోదరుడి ఇంటికి వెళ్లచ్చని.

అయితే , కుటుంబ సభ్యులందరూ పెళ్లికి వెళ్లడానికి సిద్ధమౌతుంటే, నాకు వెళ్ళాలనుకోవడం లేదని చెప్పాను. దానికి ఆమె కారణం అడిగారు. నేను ఆ మహాత్ముడికి సేవ చేస్తున్న విషయం ఆమెకు వివరించాను.
సహజంగానే, ఆమె,నేను తన చెల్లెలి వివాహానికి హాజరు కావడం లేదని ఎంతో నిరాశ చెందారు. అయితే ఆమె నా నిర్ణయాన్ని గౌరవించారు. కానీ, నీ ఇష్టం వచ్చినట్టే చేయి అని అన్నారు. అయితే నేను ఒంటరిగా ఇంట్లో ఎలా సర్దుకు రాగలనో అని ఆలోచించి, నేను ఆకలితో ఉండకూడదని,కొన్ని రోజులకు సరిపడే ఆహారం, టిఫిన్లు తయారుచేసిపెట్టి వెళ్లింది.

నేను ఇంటినుంచి వచ్చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, అమ్మ, నేను ఈ విషయం అమ్మకు చెప్పడానికంటే ముందే పసిగట్టింది. నేను బయటకు వెళ్లి ప్రపంచాన్ని అర్ధం చేసుకోవాలని తరచూ అమ్మా నాన్నలతో అంటూ ఉండేవాడిని. స్వామి వివేకానంద గురించి వారికి చెబుతుండేవాడిని. రామకృష్ణ మిషన్ చూడాలనుకుంటున్నానని చెప్పేవాడిని. ఇలా చాలా రోజులు సాగింది. చివరికి, నేను ఇంటినుంచి వచ్చేయాలని నిర్ణయించుకుని అమ్మ దీవెనలు కోరాను. నాన్న చాలా బాధపడ్డారు. ఆయనకు కోపం వచ్చింది. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్ అన్నారు. అయితే వారి ఆశీస్సులు లేకుండా ఇల్లు వదిలివెళ్లనని చెప్పాను. ఎలాగోలా అమ్మ నా కోరికను మన్నించి , నన్ను ఆశీర్వదించింది. "నీ మనసు చెప్పినట్టు చెయ్"అని చెప్పింది. నాన్నను బుజ్జగించడానికి, నా జాతకాన్ని జ్యోతిష్కుడికి చూపించమని చెప్పింది. జ్యోతిష్యం తెలిసిన మా బంధువు ఒకరికి నాన్న, నా జాతకం చూపించారు. ఆయన ," అతని మార్గం వేరు. భగవంతుడు ఆయన కోసం ఎంపిక చేసిన మార్గంలోనే పయనిస్తాడు" అని చెప్పాడు.

ఆ తర్వాత కొద్ది గంటలకు నేను ఇల్లు వదిలాను. అప్పటికి నాన్న, నా నిర్ణయాన్ని జీర్ణించుకున్నారు. వారు తన ఆశీస్సులు అందజేశారు. నేను ఇంటినుంచి వచ్చే ముందు అమ్మ నాకు నూతన ప్రారంభానికి గుర్తుగా పెరుగు, బెల్లం తినిపించింది. ఇకముందు నా జీవితం పూర్తి భిన్నంగా ఉండబోతుందని ఆమెకు తెలుసు. తల్లులు భావోద్వేగాలను నియంత్రించడంలో చాలా నేర్పరులు కావచ్చుకానీ, తన బిడ్డ ఇంటినుంచి వెళ్లేప్పుడు ఎంతో బాధపడతారు.. అమ్మ కళ్లల్లో నీళ్లుతిరిగాయి, కానీ అందులో నా భవిష్యత్తుకు అపారమైన ఆశీర్వచనాలు ఉన్నాయి. నేను ఇల్లు వదలి వచ్చిన తర్వాత , ఆమె ఆశీస్సులే నాకు ఎల్లవేళలా గుర్తుకు వచ్చేవి. నేను ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా అవే నాకు జ్ఞాపకం. అమ్మ ఎప్పుడూ నాతో గుజరాతీలో మాట్లాడేది. గుజరాతీలో చిన్నవాళ్లను, సమవయస్కులను 'నువ్వు' అనడానికి 'తు' అని అంటారు. మనకంటే పెద్దవారిని,సీనియర్లను 'మీరు' అనాలంటే , 'తమే' అంటాం. నా చిన్నప్పుడు అమ్మ ఎప్పుడూ 'తు' అనే వాడేది. నేను ఇల్లువదిలి వినూత్న పథం ఎంచుకున్న తర్వాత ఆమె తు అని సంబోధించడం మానేసింది. అప్పటి నుంచి ఆమె, నన్ను ఎప్పుడూ తమే లేదా ఆప్ అనే అనేవారు. 

పేదల అభ్యున్నతిపై దృష్టిపెట్టాలన్న బలమైన సంకల్పానికి అమ్మ ఎప్పుడూ ప్రేరణనిస్తూ ఉంటుంది. నాకు బాగా గుర్తు, నేను గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యేందుకు నిర్ణయం జరిగినపుడు, నేను రాష్ట్రంలో లేను. నేను అక్కడ దిగగానే నేను నేరుగా అమ్మదగ్గరకు వెళ్లాను. ఆమె ఎంతో ఉత్సాహంతో,నేను తిరిగి వాళ్లతో కలిసి ఉండబోతున్నానా అని అడిగింది. కానీ అందుకు నా సమాధానం ఏమిటో ఆమెకు తెలుసు. అప్పుడు ఆమె, ప్రభుత్వంలో మీ పని ఏమిటో నాకు తెలియదు. కానీ ఎప్పుడు లంచం తీసుకోకు అని చెప్పారు.
నేను ఢిల్లీకి వచ్చిన తర్వాత ఆమెను కలుసుకునే సందర్భాలు అంతకు ముందుతో పోలిస్తే తగ్గాయి. కొన్నిసార్లు నేను గాంధీనగర్ వెళ్లినపుడు, కొద్దిసేపు అమ్మను కలిసి వచ్చేవాడిని. ఇంతకు ముందు లాగా అమ్మను తరచూ కలవడానికి వీలుపడడం లేదు. అయితే ఇందుకు అమ్మ ఏమీ అనుకోలేదు.ఆమె ప్రేమ, అనురాగం అలాగే ఉన్నాయి. ఆమె దీవెనలూ అలాగే ఉన్నాయి. అమ్మ అప్పుడప్పుడూ అడుగుతుంటుంది, “ఢిల్లీలొ సంతోషంగా ఉన్నావా? నీకు ఇష్టమేనా?” అని తన గురించి ఆందోళన చెందవద్దని, బాధ్యతల నుంచి దృష్టి మరల్చవద్దని ఆమె నాకు చెబుతుంటారు. నేను ఫోన్లో అమ్మతో మాట్లాడినప్పుడల్లా, ఆమె ఒకటే చెబుతుంటారు, " తప్పు ఏదీ చేయకు. ఎవరికీ చెడు చేయకు, పేదలకోసం పనిచేయి "అని చెబుతూ ఉంటారు.
నా తల్లిదండ్రుల జీవితం గురించి ఒకసారి వెనక్కు తిరిగి చూసినపుడు, వారి నిజాయితీ, ఆత్మగౌరవమే వారి గొప్ప ఆస్తి. పేదరికంలో ఉన్నప్పటికీ, దానితో ముడిపడిన సవాళ్లు ఎన్ని ఉన్నప్పటికీ, మా అమ్మ నాన్న ఏనాడూ నిజాయితీగా వెళ్లే మార్గాన్ని వీడలేదు. లేదా తమ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టలేదు. ఎలాంటి సవాలునైనా అధిగమించడానికి వారి మంత్రం ఒక్కటే, కష్టించి పనిచేయడం, నిరంతర శ్రమ! మా నాన్న గారు తన జీవితంలో ఎనాడూ ఎవరికీ భారంకాలేదు. అమ్మ కూడా అలాగే ఉండడానికి ప్రయత్నిస్తుంది. వీలైనంత వరకు ఆమె తన పనులు తానే చేసుకుంటుంది.

ఇప్పటికీ, ఎవరైనా అమ్మను కలిసినపుడు, ఆమె ఎప్పుడూ ఒకమాట అంటుంటుంది "ఇతరుల చేత సేవచేయించుకోవడం నాకు ఇష్టం లేదు. నా అవయవాలన్నీ పనిచేస్తున్నప్పుడే పోవాలని ఉంది" అని .అమ్మ జీవిత కథలో, భారతదేశ మాతృశక్తి చేయూత, తపస్సు, త్యాగాన్ని నేను చూస్తున్నాను. అమ్మను, ఆమె వంటి కోట్లాది మంది మహిళలను చూసినప్పుడల్లా, భారతీయ మహిళలు సాధించలేనిది ఏదీ లేదని నేను కనుగొన్నాను.

ప్రతి లేమి కథను మించినది, తల్లి గురించిన అద్భుతమైన కథ,

తల్లి బలమైన సంకల్పం, ప్రతి పోరాటం కంటే ఎంతో ఉన్నతమైనది.

అమ్మా, మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

పుట్టిన రోజుకు సంబంధించి శత వసంతాల సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నందుకు శుభాకాంక్షలు.

ఇప్పటివరకు మీ జీవితం గురించి బహిరంగంగా,ఇంత సుదీర్ఘంగా రాసే సాహసం ఎప్పుడూ చేయలేదు.

మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. మా అందరికీ మీ ఆశీస్సులు ఉండాలి.

మీ పాదాలకు నమస్కరిస్తూ.......

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka

Media Coverage

Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
India and natural farming…the way ahead!
December 03, 2025

In August this year, a group of farmers from Tamil Nadu met me and talked about how they were practising new agricultural techniques to boost sustainability and productivity. They invited me to a Summit on natural farming to be held in Coimbatore. I accepted their invite and promised them that I would be among them during the programme. Thus, a few weeks ago, on 19th November, I was in the lovely city of Coimbatore, attending the South India Natural Farming Summit 2025. A city known as an MSME backbone was hosting a big event on natural farming.

Natural farming, as we all know, draws from India’s traditional knowledge systems and modern ecological principles to cultivate crops without synthetic chemicals. It promotes diversified fields where plants, trees and livestock coexist to support natural biodiversity. The approach relies on recycling farm residues and enhancing soil health through mulching and aeration, rather than external inputs.

This Summit in Coimbatore will forever remain a part of my memory! It indicated a shift in mindset, imagination and confidence with which India’s farmers and agri-entrepreneurs are shaping the future of agriculture.

The programme included an interaction with farmers from Tamil Nadu, in which they showcased their efforts in natural farming and I was amazed!

I was struck by the fact that people from diverse backgrounds, including scientists, FPO leaders, first-generation graduates, traditional cultivators and notably people who had left high-paying corporate careers, decided to return to their roots and pursue natural farming.

I met people whose life journeys and commitment to doing something new were noteworthy.

There was a farmer who managed nearly 10 acres of multi-layered agriculture with bananas, coconuts, papaya, pepper and turmeric. He maintains 60 desi cows, 400 goats and local poultry.

Another farmer has dedicated himself to preserving native rice varieties like Mapillai Samba and Karuppu Kavuni. He focuses on value-added products, creating health mixes, puffed rice, chocolates and protein bars.

There was a first-generation graduate who runs a 15-acre natural farm and has trained over 3,000 farmers, supplying nearly 30 tonnes of vegetables every month.

Some people who were running their own FPOs supported tapioca farmers and promoted tapioca-based products as a sustainable raw material for bioethanol and Compressed Biogas.

One of the agri-innovators was a biotechnology professional who built a seaweed-based biofertilizer enterprise employing 600 fishermen across coastal districts; another developed nutrient-enriched bioactive biochar that boosts soil health. They both showed how science and sustainability can blend seamlessly.

The people I met there belonged to different backgrounds, but there was one thing in common: a complete commitment to soil health, sustainability, community upliftment and a deep sense of enterprise.

At a larger level, India has made commendable progress in the field. Last year, the Government of India launched the National Mission on Natural Farming, which has already connected lakhs of farmers with sustainable practices. Across the nation, thousands of hectares are under natural farming. Efforts by the Government such as encouraging exports, institutional credit being expanded significantly through the Kisan Credit Card (including for livestock and fisheries) and PM-Kisan, have also helped farmers pursuing natural farming.

Natural farming is also closely linked to our efforts to promote Shri Anna or millets. What is also gladdening is the fact that women farmers are taking to natural farming in a big way.

Over the past few decades, the rising dependence on chemical fertilisers and pesticides has affected soil fertility, moisture and long-term sustainability. At the same time, farming costs have steadily increased. Natural farming directly addresses these challenges. The use of Panchagavya, Jeevamrit, Beejamrit, and mulching protects soil health, reduces chemical exposure, and lowers input costs while building strength against climate change and erratic weather patterns.

I encouraged farmers to begin with ‘one acre, one season.’ The outcomes from even a small plot can build confidence and inspire larger adoption. When traditional wisdom, scientific validation and institutional support come together, natural farming can become feasible and transformative.

I call upon all of you to think of pursuing natural farming. You can do this by being associated with FPOs, which are becoming strong platforms for collective empowerment. You can explore a StartUp relating to this area.

Seeing the convergence between farmers, science, entrepreneurship and collective action in Coimbatore was truly inspiring. And, I am sure we will together continue making our agriculture and allied sectors productive and sustainable. If you know of teams working on natural farming, do let me know too!