ప్రారంభోత్సం:1. భారత ప్రభుత్వం, భూటాన్ దేశప్రభుత్వాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం నిర్మించిన 1020 మెగావాట్ల పునత్సాంగ్చు-II జలవిద్యుత్ ప్రాజెక్టు ప్రారంభం.ప్రకటనలు:2. 1200 మెగావాట్ల పునత్సాంగ్చు-I జలవిద్యుత్ ప్రాజెక్టు ప్రధాన ఆనకట్ట నిర్మాణ పనుల పునఃప్రారంభంపై అంగీకారం.3. భూటాన్ ఆలయం/మఠం, అతిథి గృహ నిర్మాణానికి వారణాసిలో భూమి మంజూరు.4. గెలెఫు ప్రాంతంలోని హతీసార్లో వలస చెక్పోస్టు ఏర్పాటుకు నిర్ణయం.5. భూటాన్కు రూ. 4,000 కోట్ల విలువైన రుణం మంజూరుఅవగాహన ఒప్పందాలు..
|
వరుస సంఖ్య |
ఒప్పందం పేరు |
వివరణ |
భూటాన్ తరపున సంతకం చేసిన వ్యక్తి |
భారత్ తరపున సంతకం చేసిన వ్యక్తి |
|
6. |
పునరుత్పాదక ఇంధన రంగంలో సహకారంపై ఒప్పందం |
పునరుత్పాదక ఇంధన రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని వ్యవస్థీకృతం చేయడమే ఈ అవగాహన ఒప్పంద లక్ష్యం. ఇది సౌరశక్తి, పవన శక్తి, బయోమాస్, శక్తి నిల్వ, గ్రీన్ హైడ్రోజన్ మరియు సామర్థ్య నిర్మాణం వంటి రంగాలలో కలిసి పనిచేయడం లక్ష్యంగా పెట్టుకుంది. |
ఇంధనం, సహజ వనరుల మంత్రి లియోన్పో జెమ్ షెరింగ్ |
నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ వెంకటేష్ జోషి |
|
7. |
ఆరోగ్యం, వైద్య రంగంలో సహకారంపై ఒప్పందం |
ఈ ఒప్పందం వైద్య రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని వ్యవస్థీకృతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఔషధాలు, నిర్ధారణ పరికరాలు, వైద్య పరికరాలు, తల్లీ, గర్ణిణీల ఆరోగ్య సంరక్షణ, సంచార/అసంచార వ్యాధుల నివారణ చికిత్స, సంప్రదాయ వైద్యం, టెలీమెడిసిన్ వంటి డిజిటల్ ఆరోగ్య పరిష్కారాలు, సాంకేతిక సహకారం, సంయుక్త పరిశోధన, వైద్య నిపుణుల సామర్థ్యాభివృద్ధి వంటి అంశాల్లో సహకారం పెంపొందించడమే ప్రధాన ఉద్ధేశం |
వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పెంబా వాంగ్చుక్ |
భూటాన్లో భారత రాయబారి శ్రీ సందీప్ ఆర్య, |
|
8. |
భూటాన్లోని పెమా సెక్రటేరియట్, భారత్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ మధ్య సంస్థాగత అనుబంధాన్ని ఏర్పరచుకునే ఒప్పందం |
మానసిక ఆరోగ్య నిపుణుల సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం, సేవల మెరుగుదల, పరిశోధనకు తోడ్పడే విధంగా దేశంలో మానసిక ఆరోగ్య కోర్సులను అభివృద్ధి చేయడంలో రెండు దేశాల మధ్య సహకారాన్ని ఈ ఒప్పందం బలోపేతం చేస్తుంది. |


