ఒడిశాలో రెండు ప్యాకేజీల కింద మొత్తం 160.18 కి.మీల పొడవుతో రూ. 8300.79 కోట్ల మూలధన వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో (హెచ్ఏఎం) రామేశ్వర్ నుంచి పరదీప్ వరకు కొత్త తీరప్రాంత రహదారి నిర్మాణానికి ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది.
రామేశ్వర్ నుంచి పరదీప్ వరకు ప్రతిపాదించిన ఈ కొత్త తీరప్రాంత రహదారి ప్రాజెక్ట్ ఒడిశాలోని ఖుర్దా, పూరి, కేంద్రపడ, జగత్సింగ్పూర్ జిల్లాల గుండా వెళ్తుంది. స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టులో భాగమైన ప్రస్తుత ఎన్హెచ్-16 రహదారి ఇప్పటికే ఖుర్ధా, భువనేశ్వర్, కటక్ వంటి ప్రధాన నగరాల గుండా వెళ్తోంది. ఇది ఆరు వరుసల రహదారిగా ఉంది. ఇక ప్రస్తుత ఎన్హెచ్-316 రహదారి భువనేశ్వర్-పూరిలను కలుపుతూ సాతపడ, కోణార్క్ వరకు ఉంది. అయితే పూరి-సాతపడ, పూరి-కోణార్క్ మార్గాలలో రోడ్డు సరిగ్గా లేదు. ఈ కారిడార్లో దాదాపు 40 శాతం రహదారి పక్కనే నివాసాలు, దుకాణాలు ఉన్నాయి. దీనివల్ల స్థానిక ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇది సుదూర ప్రాంతాలకు వెళ్లే వాహనాల సాఫీ, వేగవంతమైన ప్రయాణానికి ఆటంకంగా మారింది.
ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం ఈ ప్రాజెక్టులో భాగంగా రామేశ్వర్ నుంచి కోణార్క్ వరకు (ప్యాకేజీ-1) 4 వరుసల రహదారిని, కోణార్క్ నుంచి పరదీప్ వరకు (ప్యాకేజీ-2) పేవ్డ్ షోల్డర్తో కూడిన 2 వరుసల రహదారిని నిర్మించనున్నారు. గంటకు 100 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో వాహనాలు నడిచే ఈ రహదారి.. ఒడిశాలోని ఖుర్దా, పూరి, కేంద్రపడ, జగత్సింగ్పూర్ జిల్లాల వ్యాప్తంగా ప్రయాణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ప్రాంతీయ రవాణాను వేగవంతం చేయడంతో పాటు సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది.
ఈ ప్రాజెక్టులను 'పీఎం గతిశక్తి' సూత్రాలకు అనుగుణంగా రూపొందించారు. ఇవి 9 ఆర్థిక కేంద్రాలు, 5 లాజిస్టిక్ కేంద్రాలను అనుసంధానిస్తాయి. ఇది దేశ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్పై (ఎల్పీఐ) సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత రామేశ్వర్, పరదీప్ మధ్య ప్రయాణ సమయం సుమారు 2 గంటల 30 నిమిషాలు తగ్గుతుందన్న అంచనా ఉంది. ఇది ప్రయాణికులు, సరుకు రవాణాకు సురక్షితమైన, వేగవంతమైన, ఎలాంటి అంతరాయం లేని అనుసంధానతను అందిస్తుంది. దీనితో పాటు ఇంధన వినియోగం, కార్బన్ ఉద్గారాలు, వాహన నిర్వహణ ఖర్చులు (వీఓసీ) గణనీయంగా తగ్గడానికి ఈ ప్రాజెక్ట్ ఎంతగానో దోహదపడుతుంది.
Map of Corridor



Appendix - I: Project Details
అనుబంధం - I: ప్రాజెక్ట్ వివరాలు
వివరణ
రామేశ్వర్- కోణార్క్ 4 వరుసల యాక్సెస్-నియంత్రిత రహదారి
కోణార్క్-పారాదీప్ పేవ్డ్ షోల్డర్తో 2 వరుసల రహదారి
పొడవు (కి.మీ)
79.4
80.78
బ్రౌన్ఫీల్డ్ పొడవు (కి.మీ.)
2.56
-
గ్రీన్ఫీల్డ్ పొడవు (కి.మీ.)
76.84
80.78
మొత్తం సివిల్ పనుల వ్యయం (రూ. కోట్లు)
3129.06
1566.02
నిర్మాణానికి ముందు జరిగే భూమి, ఇతర వ్యయం (రూ. కోట్లు)
751.62
668.13
మొత్తం మూలధన వ్యయం (రూ. కోట్లు)
5304.8
2995.99
విధానం
హైబ్రిడ్ యాన్యుటీ మాడల్ (హెచ్ఎం)
హైబ్రిడ్ యాన్యుటీ మాడల్ (హెచ్ఎం)
మొత్తం రాయితీ కాలం
17.5 సంవత్సరాలు (2.5 సంవత్సరాల నిర్మాణం + 15 సంవత్సరాల నిర్వహణ, మరమ్మత్తు)
17.5 సంవత్సరాలు (2.5 సంవత్సరాల నిర్మాణం + 15 సంవత్సరాల నిర్వహణ, మరమ్మత్తు)
ఆర్థిక
2 సెజ్ లు- భువనేశ్వర్, ఖుర్ధా (ఖండగిరి)
మెగా ఫుడ్ పార్కులు- భువనేశ్వర్ఫిషింగ్ క్లస్టర్-పరదీప్, కోణార్క్, జగత్సింగ్పూర్, పూరి, కేంద్రపాడ
ఫార్మా క్లస్టర్- కటక్
లాజిస్టిక్ నోడ్లు
పూరి రైల్వే స్టేషన్, పూరి విమానాశ్రయం, అస్తరాంగ్ పోర్ట్, పరదీప్ పోర్ట్- ఎంఎంఎల్పీ-జగత్సింగ్పూర్.
ఉపాధి కల్పన సామర్థ్యం
53.61 లక్షల పనిదినాలు (ప్రత్యక్ష) , 67.01 లక్షల పనిదినాలు (పరోక్ష)
2027-28 ఆర్థిక సంవత్సరంలో రోజువారీ వార్షిక సగటు ట్రాఫిక్ (ఏఏడీటీ) అంచనా
ప్యాకేజీ I : 10,437 పీసీయూ (9,236 పీసీయూ- టోల్ వసూలు చేయదగినవి)
ప్యాకేజీ II : 7,249 పీసీయూ (6,369 పీసీయూ- టోల్ వసూలు చేయదగినవి)
The approval for the construction of a new coastal highway from Rameshwar to Paradeep in Odisha will improve connectivity across Khordha, Puri, Kendrapada and Jagatsinghpur districts while significantly reducing travel time. This modern project will strengthen logistics, support…
— Narendra Modi (@narendramodi) June 3, 2026
ଓଡ଼ିଶାର ରାମେଶ୍ୱରରୁ ପାରାଦୀପ ପର୍ଯ୍ୟନ୍ତ ଏକ ନୂତନ ଉପକୂଳ ରାଜପଥ ନିର୍ମାଣ ପାଇଁ ଅନୁମୋଦନ ଦ୍ୱାରା ଖୋର୍ଦ୍ଧା, ପୁରୀ, କେନ୍ଦ୍ରାପଡା ଏବଂ ଜଗତସିଂପୁର ଜିଲ୍ଲାର ଯୋଗାଯୋଗରେ ଉନ୍ନତି ଆସିବ ଏବଂ ଯାତ୍ରା ସମୟ ଯଥେଷ୍ଟ ହ୍ରାସ ପାଇବ । ଏହି ଆଧୁନିକ ପ୍ରକଳ୍ପ ଲଜିଷ୍ଟିକ୍ସକୁ ସୁଦୃଢ଼ କରିବ, ପର୍ଯ୍ୟଟନ ଓ ଆର୍ଥିକ କାର୍ଯ୍ୟକଳାପକୁ ସମର୍ଥନ…
— Narendra Modi (@narendramodi) June 3, 2026


