Every Indian is proud of our armed forces and brave soldiers, says PM Modi #MannKiBaat
Blue helmet-wearing Indian soldiers have been contributing to world peace since decades: PM Modi #MannKiBaat
Every Indian, irrespective of what his region, caste, religion or language; is always ready to support our soldiers and express joy towards their success: PM #MannKiBaat
India can say with pride that the army derives its strength not only from men but also from women. Today, the Women are empowered, and also armed: PM Modi #MannKiBaat
The Indian Air Force is at the forefront of relief and rescue work during times of disasters, says PM Modi #MannKiBaat
India to celebrate Mahatma Gandhi's 150th birth anniversary for two years: PM Modi #MannKiBaat
Bapu gave an inspirational mantra to all of us which is known as Gandhi Ji’s Talisman. This Mantra is extremely relevant today: PM during #MannKiBaat
The strong personality of Pt. Lal Bahadur Shastri is identified with his slogan of 'Jai Jawan, Jai Kisan': PM Modi #MannKiBaat
Shastri ji’s gentle persona will always continue to fill us with immense pride, says PM Modi #MannKiBaat
#MannKiBaat PM Modi congratulates the people of India on the success of the 'Swachhata Hi Seva' movement
Come and let's 'Run for Unity' on 31st October, so that citizens from every class of society could join together and strengthen our efforts for a united India, says PM Modi #MannKiBaat
#MannKiBaat Sardar Patel always worked for the unity of the country throughout his lifetime, says PM Modi
NHRC, which is set to celebrate its 25th anniversary, has promoted Indian Vedic Values of Sarve Bhavantu Sukhinah: PM Modi #MannKiBaat

నా ప్రియమైన దేశప్రజలారా నమస్కారం! మన సైనిక బలగాలను, మన సాయుధ దళాలను చూసి గర్వపడని భారతీయుడు ఎవరూ ఉండరు. ఏ జాతి, ఏ ప్రాంతం, ఏ మతం, లేదా ఏ భాషకు చెందిన వారైనా కూడా ప్రతి భారతీయుడూ మన సైనికుల పట్ల, తమ సంతోషాన్నీ, మద్దతునీ తెలపడానికి ఎల్లప్పుడూ తయారుగా ఉంటాడు. నిన్న 125కోట్ల భారతీయులందరూ పరాక్రమ పర్వాన్ని జరుపుకున్నారు. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్ ను గుర్తుచేసుకున్నారు. టెర్రరిజం ముసుగులో మన దేశంపై పరోక్ష యుధ్ధం జరిగినప్పుడు, వారి నిర్లజ్జకర ప్రవర్తనకు దీటైన జవాబుని మన సైనికులు సర్జికల్ స్ట్రైక్ రూపంలో అందించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో మన సాయుధదళాలు ప్రదర్శనలను ఏర్పాటుచేసాయి. ఈ ప్రదర్శనల ముఖ్య ఉద్దేశ్యం – మన దేశ ప్రజలకు, ఎక్కువగా మన యువతరానికి, మన దేశానికి ఉన్న శక్తిని పరిచయం చేయడమే. మనలో ఎంత సామర్ధ్యం దాగి ఉందో, మన సైనికులు ఏ విధంగా తమ ప్రాణాలకు తెగించి దేశాన్నీ,మనల్ని రక్షిస్తూ ఉంటారో తెలపడానికి. పరాక్రమ్ పర్వ్ లాంటి ముఖ్యమైన రోజులు మన దేశ యువతలో మన సైనికుల పట్ల గౌరవపూర్వకంగా ఎలా ఉండాలో తెలిపేలాంటి వారసత్వ సంప్రదాయాల్ని గుర్తు చేస్తాయి. తద్వారా మన దేశ సమైక్యత ను, నైతికతను సదా నిలిపి ఉంచడానికి ఇలాంటి దినోత్సవాలు మనల్ని ప్రోత్సహిస్తాయి. వీరుల భూమి అయిన రాజస్థాన్ లోని జోధ్పూర్ లో ఒక కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. మన దేశ శాంతి, సామరస్యాలను నష్టపరచాలనే ప్రయత్నం ఎవరు చేసినా సరే, వారికి చెంపపెట్టు లాంటి సమాధానాన్ని మన సైనికులు ఇవ్వగలరన్న సంగతి ఇప్పుడు నిశ్చయంగా అందరికీ అర్ధమైంది. మనం శాంతికాముకులం. దేశంలో శాంతిని పెంచాలనే నిబధ్ధతతో ఉంటాం. కానీ అది దేశ గౌరవంతో రాజీ పడో, లేదా దేశ సార్వభౌమాధికారాన్ని పణంగా పెట్టో మాత్రం జరగదు. భారతదేశం నిరంతరం శాంతి పట్ల అంకితభావంతో, కట్టుబడి ఉంది. ఇరవయ్యవ శతాబ్దంలో జరిగిన రెండు ప్రపంచయుధ్ధాలలోనూ మన దేశ సైనికులు ఒక లక్ష కంటే ఎక్కువమంది శాంతి కోసం స్వచ్ఛంద బలిదానాలను ఇచ్చారు. ఆ యుధ్ధాలతో మనకు ఏ మాత్రం సంబంధం లేనప్పటికీ కూడా. మన దృష్టి ఎన్నడూ మనది కాని భూమిపై పడలేదు. ఇది శాంతి పట్ల మనకున్న నిబధ్ధత. కొన్ని రోజుల క్రితం సెప్టెంబరు ఇరవై మూడవ తేదీన ఇజ్రాయిల్ లో హైఫా యుధ్ధం జరిగి వందేళ్ళు పూర్తయిన సందర్భంలో, మైసూర్, హైదరాబాద్, జోధ్పూర్ లకు చెందిన ఈటెగాళ్ళైన మన వీర సైనికులను జ్ఞాపకం చేసుకున్నాం. వారిపై దండెత్తి వచ్చినవారితో మన వీర సైనికులు పోరాడి హైఫా కు ముక్తిని ప్రసాదించారు. శాంతిబాటలో పయనించాలనే ఉద్దేశంతో మన దేశ సైనికులు చేసిన ఒక సాహసం అది. ఐక్య రాజ్య సమితికి చెందిన రకరకాల శాంతి భద్రతా దళాలకు అత్యధిక సంఖ్యలో సైనికులను పంపే దేశాలలో భారతదేశం కూడా ఒకటి. దశాబ్దాలుగా మన వీర సైనికులు నీలి హెల్మెట్ ధరించి ప్రపంచంలో శాంతిని స్థాపించడంలో కీలక పాత్రను వహిస్తున్నారు.

నా ప్రియమైన దేశప్రజలారా, ఆకాశం కబుర్లు విచిత్రమైనవి. ఆకాశానికి కూడా తమ శక్తిని పరిచయం చేసిన మన వైమానిక దళం దేశప్రజలందరి దృష్టినీ తన వైపుకి ఆకర్షించుకుంది. మనకు రక్షణను అందిస్తుందనే నమ్మకాన్ని కుదిర్చింది. గణతంత్ర దినోత్సవ ఉత్సవ సమయంలో జరిగే పెరేడ్ లో  ఏ భాగం కోసం ప్రజలు ఆత్రంగా ఎదురు చూస్తారో, వాటిల్లో ఒకటి ఫ్లై పాస్ట్(fly past) . అందులో మన వైమానిక దళం ఆశ్చర్యకరమైన పనులతో తన శక్తిని ప్రదర్శిస్తుంది. అక్టోబర్ 8వ తేదీన మనం వైమానిక దళ దినోత్సవం జరుపుకుంటాం. 1932లో ఆరుగురు పైలట్లు , 19 మంది సైనికులతో మొదలైన అతి చిన్న వైమానిక దళం పెరిగి పెద్దయ్యింది. ఇవాళ మన దళం ఇరవై ఒకటవ శతాబ్దంలోకెల్లా సాహసవంతమైన, శక్తివంతమైన వైమానిక దళాల్లో ఒకటిగా నిలిచింది. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం.  దేశం కోసం తమ సేవను అందించే ఈ వాయు యోధులకు, వారి కుటుంబాలకు నా హృదయపూర్వక అభినందనలు. 
1947 లో పాకిస్తాన్ వారు ఆకస్మిక దాడి మొదలుపెట్టినప్పుడు, శ్రీనగర్ ను ఆక్రమణదారుల నుండి భారత                                                                                                                                                                                                                                                                            వైమానిక దళాలవారే రక్షించారు. భారతీయ సైనికులు, వారి సాధనాలు, యుధ్ధ సమయంలో సరిగ్గా సమయానికల్లా చేరేలా ఖచ్చితమైన ప్రణాళిక చేసింది మన వైమానిక దళాలవారే. 1965లో శత్రువుల మొహం పగిలేలా జవాబునిచ్చింది  కూడా మన వైమానిక దళమే. 1971లో జరిగిన బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటం గురించి ఎవరికి తెలీదు? 1999 లో కార్గిల్ ను చొరబాటుదారుల వశం నుండి విడిపించడంలో కూడా వైమానిక దళం ముఖ్య పాత్రను వహించింది. టైగర్ హిల్స్ లో శత్రువుల స్థావరాలపై రాత్రింబవళ్ళూ బాంబుదాడి చేసి వారిని మట్టి కరిపించింది కూడా మన వైమానిక దళమే. సహాయ పునరావాసాలు అయినా, విపత్తు నిర్వహణ అయినా సరే మన వాయుసేనా యోధులు చేసే మెచ్చుకోలు పనుల వల్ల దేశానికి వారి పట్ల ఎంతో కృతజ్ఞతాభావంతో ఉంది. తుఫాను, గాలివాన, వరదలు నుండి అడవిలో కార్చిచ్చుల వరకూ ప్రకృతి వైపరీత్యాలన్నింటినీ ఎదుర్కొని, దేశప్రజలకు సహాయం చెయ్యడంలో వారు చూపే తెగువ అద్భుతమైనది. దేశంలో gender equality అంటే స్త్రీ, పురుష సమానత్వాన్ని నిరూపించడంలో వైమానికదళం వారు ఒక ఉదాహరణగా నిలిచారు. ఒక ప్రత్యేక మహిళా విభాగాన్ని మన దేశ ఆడపడుచుల కోసం ఏర్పాటు చేసారు. ఇప్పుడైతే మన వైమానిక దళం స్త్రీల కోసం short service commission తో పాటూ permanent commissionను కూడా ప్రత్యామ్నాయంగా ఇస్తోంది. ఆగస్టు15 న ఎర్రకోట వేదిక నుండి నేను ఈ ప్రకటనను చేసాను. భారత సైన్యంలో సాయుధ బలగాలలో పురుష శక్తి తో పాటూ స్త్రీ శక్తి సహకారం కూడా సమానంగా ఉందని  ఇప్పుడు భారతదేశం గర్వంగా చెప్పగలదు. శక్తిస్వరూపమైన స్త్రీ ఇప్పుడు సాయుధురాలు కూడా అవుతోంది.

నా ప్రియమైన దేశప్రజలారా, కొద్ది రోజుల క్రితం మన నౌకా దళానికి చెందిన అభిలాష్ టోమీ అనే అధికారి తన జీవితం కోసం మృత్యువుతో పోరాటం చేశారు. యావత్ దేశం ఆయనను ఎలా రక్షించుకోవాలా అని ఆందోళన పడింది. మీకు తెలుసు కదా అభిలాష్ టోమీ చాలా సాహసవంతుడైన అధికారి. ఏ రకమైన ఆధునిక సాంకేతికతనూ ఉపయోగించుకోకుండా, కేవలం ఒక చిన్న నావ సహాయంతో ప్రపంచాన్ని చుట్టివచ్చిన మొట్టమొదటి భారతీయుడు ఆయన. దక్షిణ హిందూ మహా సముద్రంలో Golden Globe Raceలో పాల్గోవడానికి ఆయన గత ఎనభై రోజులుగా సముద్రంలో తన వేగాన్ని అదుపుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కానీ భయంకరమైన సముద్రపు తుఫాను ఆయనకు ఇబ్బందులను తెచ్చింది. కానీ భారత నౌకా దళానికి చెందిన ఈ వీరుడు సముద్రంలో అనేక రోజుల పాటు పోరాడుతూ గడిపాడు. ఆ సముద్రపు నీటిలో తిండితిప్పలు లేకుండా నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు కానీ ఓటమిని ఒప్పుకోలేదు. సాహసం, సంకల్పబలం, పరాక్రమాలకు అతి పెద్ద ఉదాహరణ అతను. కొద్ది రోజుల క్రితం అతడిని సముద్రంలోంచి రక్షించి బయతకు తీసుకువచ్చిన తరువాత నేను ఆయనతో ఫోన్ లో మాట్లాడాను. ఇంతకు మునుపు కూడా నేనతన్ని కలిసాను. ఇంతటి ఆపద నుండి బయటకు వచ్చిన తరువాత కూడా అతడిలోని ధైర్యం, పోరాట పటిమ, మరోసారి ఇటువంటి సాహసం చెయ్యాలనే కోరిక ఉన్నాయి. ఇవన్నీ కూడా మన దేశ యువతకు ప్రేరణాత్మకమైనవి. అభిలాష్ టోమీ ఆరోగ్యం మెరుగవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆయన సాహసం, ఆయన పరాక్రమం, ఆయన సంకల్పబలం, పోరాట పటిమ, గెలవాలనే సంకల్పం మన దేశ యువతకు తప్పకుండా ప్రేరణను అందిస్తాయి.

నా ప్రియమైన దెశప్రజలారా, అక్టోబర్ రెండవ తేదీ మన దేశానికి ఎంత ముఖ్యమైనదో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఈ సంవత్సరం అక్టోబర్ రెండుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పటి నుండీ మొదలుకొని ఒక రెండేళ్ళ వరకూ మనందరము మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాల ద్వారా జరుపుకోబోతున్నాం. మహాత్మా గాంధీ ఆలోచనలు యావత్ ప్రపంచానికీ ప్రేరణను అందించాయి. Dr. Martin Luther King Junior , Nelson Mandela లాంటి గొప్ప నాయకులు కూడా తమ ప్రజలకు సమానత్వం, గౌరవం తాలూకూ హక్కులను అందించడానికి జరిపిన పోరాటాలకు మహాత్మా గాంధీ ఆలోచనల నుండి శక్తిని పొందినవారే. ఇవాళ్టి మన్ కీ బాత్ కార్యక్రమంలో నేను పూజ్య బాపూ జరిపిన మరొక ముఖ్యమైన పనిని గురించి మీతో చర్చించాలనుకుంటున్నాను. దీని గురించి వీలయినంత ఎక్కువమంది దేశప్రజలందరూ తెలుసుకోవలసిన అవసరం ఉంది. 1941లో గాంధీ గారు constructive programme అంటేరచనాత్మక కార్యక్రమ రూపంలో కొన్ని ఆలోచనలను రాయడం మొదలుపెట్టారు. తర్వాత 1945లో స్వతంత్ర పోరాటం ఊపందుకొన్నప్పుడు ఆయన తన ఆలోచనల సవరణా ప్రతి ని తయారుచేసారు. పూజ్య బాపూ రైతులు, పల్లెలు, శ్రామికుల అధికారాలను రక్షించడం కోసం, పరిశుభ్రత, విద్య లాంటి అనేక విషయాలపై తన ఆలోచనలను దేశప్రజల ముందర పెట్టారు. దానిని గాంధీ చార్టర్(Gandhi Charter) అని కూడా అంటారు. పూజ్య బాపు ప్రజా సంగ్రాహకుడు.  ప్రజలతో కలిసిపోవడం, వారిని తనతో కలుపుకోవడం అనేది బాపూ ప్రత్యేకత. అది ఆయన స్వభావం. ఇది ఆయన వ్యక్తిత్వంలోని ప్రత్యేకతగా అందరూ గుర్తించారు. ఇది దేశానికి ఎంతో అవసరమైన, ముఖ్యమైన ఆవస్యకత అని బాపూ అందరికీ అర్థమయ్యేలా చేశారు. స్వతంత్ర పోరాటం జరిగిన సమయంలో ఆయన వహించిన ముఖ్య పాత్ర ఏమిటంటే ఆ పోరాటాన్ని ఒక ప్రజా-ఉద్యమంగా మార్చడం. మహాత్మా గాంధీ గారి ఆహ్వానంపై సమాజంలోని ప్రతి వర్గానికీ, ప్రతి ప్రాంతానికీ సంబంధించిన ప్రజలందరూ కూడా స్వతంత్ర పోరాట ఉద్యమానికి తమను తాము అంకితం చేసుకున్నారు. బాపు మనందరికీ ఒక ప్రేరణాత్మక మంత్రాన్ని ఇచ్చారు. అది గాంధీగారి తాయత్తు అనే పేరుతో పసిధ్ధి చెందింది.అందులో గాంధీ గారు ఏం చెప్పారంటే, "నేను మీ అందరికీ ఒక తాయొత్తు ని ఇస్తాను. మీకు ఎప్పుడైనా ఏదైనా సందేహం కలిగినా, లేదా మీ అహం మీపై అధికారాన్ని చూపెట్టినా సరే ఒక పరీక్షను పెట్టుకోండి. మీరు చూసిన వ్యక్తుల్లో అతి పేద, బలహీన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అతడి మొహాన్ని గుర్తుకు తెచ్చుకోండి. మీరు వేయబోయే అడుగు ఆ వ్యక్తికి ఎలాంటి సహాయాన్ని అందించగలదు? అని ఆలోచించండి . ఆ పేద వ్యక్తికి నా నిర్ణయం సహాయపడగలదా? దానివల్ల అతడికి ఏదైనా లాభం చేకూరగలదా? దీనివల్ల అతడు తన జీవితమ్లో ఏవైనా మార్పులు చేసుకోగలడా? నా నిర్ణయం వల్ల ఆకలితో అలమటిస్తున్న కోట్ల కొద్దీ ప్రజల ఆకలి తీరగలదా? వారి ఆత్మ సంతృప్తి చెందగలదా? అని ప్రశ్నించుకోండి. అప్పుడు నీ సందేహ నివృత్తి జరుగుతున్నట్లు, నీ అహం కరిగిపోతున్నట్లు నీకు అనిపిస్తుంది" అని చెప్పారు బాపూ.

నా ప్రియమైన దేశప్రజలారా, గాంధీ గారు చెప్పిన ఈ మంత్రం ఇప్పటికీ ముఖ్యమైనదే. నేడు దేశంలో  మధ్యవర్గం పెరుగుతోంది, వారి ఆర్థిక శక్తి పెరుగుతోంది, కొనుగోలు శక్తి పెరుగుతోంది. మనం ఏదన్న కొనేందుకు వెళ్ళినప్పుడు ఒక్క క్షణం పూజ్య బాపూ ని గుర్తు చేసుకుని, ఆయన చెప్పిన ఈ మంత్రాన్ని ఒక్కసారి గుర్తుచేసుకుందాం. ఈ వస్తువు కొనుగోలు చెయ్యడం వల్ల నేను దేశంలో ఏ పౌరుడికి లాభం ఇస్తున్నాను?ఎవరి మొహంలో సంతోషాన్ని వెలిగిస్తున్నాను? నా కొనుగోలు వల్ల ఎవరికి నేరుగా కానీ పరోక్షంగా గానీ లాభం కలగబోతోంది? దీని వల్ల నిరుపేద వ్యక్తికి లాభం కలిగితే నా కొనుగోలు వల్ల నేను చాలా సంతోషాన్ని పొందుతాను. భవిష్యత్తులో మీ ప్రతి కొనుగోలు ముందరా,  గాంధీ గారు చెప్పిన ఈ మంత్రాన్ని గనుక మీరు గుర్తు ఉంచుకోవాలి. గాంధీ గారి 150వ జయంతి సందర్భంగా ఇది గనుక గుర్తు పెట్టుకుంటే మన కొనుగొలు వల్ల ఎవరో ఒక నిరుపేదకు ఉపయోగం కలుగుతుంది, అతడు చిందించిన చమటకు, పడిన కష్టానికీ, అతడి పెట్టుబడి పెట్టిన ప్రతిభకూ అన్నింటికీ ఏదో ఒక లాభం చేకూరుతుంది అని ఆలోచించాలి. ఇదే గాంధీ గారి తాయత్తు. ఇదే ఆయన సందేశం. అందరి కంటే పేదవాడు, బలహీనుడు అయిన వ్యక్తి జీవితంలో మీరు వేసే అడుగు వల్ల గొప్ప మార్పు రాగలదు అని నాకు నమ్మకం ఉంది.

నా ప్రియమైన దేశప్రజలారా, పరిశుభ్రత పాటిస్తే స్వాతంత్ర్యం లభిస్తుంది అని గాంధీగారు చెప్పారు. ఎలాగో ఆయనకూ తెలిసి ఉండదు కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అలానే ఇవాళ మీరు చేసే ఈ చిన్న పని వల్ల కూడా నా దేశ ఆర్థిక అభివృధ్ధి, ఆర్థిక సాధికారత, పేదవాడికి పేదరికంతో పోరాడే శక్తిని ఇవ్వడానికి నా సహకారం ఉంటుందా అని మీకు అనిపించవచ్చు. కానీ నేటి యుగంలో ఇదే నిజమైన దేశభక్తి, ఇదే గాంధీ గారికి మనం ఇచ్చే కార్యాంజలి. ఉదాహరణకి, ప్రత్యేక సందర్భాల్లో ఖాదీ, చేనేత ఉత్పాదక కొనుగోళ్ళ వల్ల అనేకమంది చేనేత కర్మికులకి సహాయాన్ని అందించినవాళ్ళమౌతాము. లాల్ బహదూర్ శాస్త్రి గారు పాతబడిన, చిరిగిన చేనేత వస్త్రాలను కూడా దాచిపెట్టి వాడుకునేవారట. అందులో ఎవరి కష్టం ఉందో కదా అనే ఆలోచనతో అలా చేసేవారుట. ఈ ఖాదీ వస్త్రాలన్నీ కూడా ఎంతో కష్టపడితే గాని తయారవ్వవు, వీటి ఒక్కొక్క దారం ఉపయోగపడాలి అనేవారుట. దేశం పట్ల అభిమానం, దేశప్రజల పట్ల ప్రేమ కనబడే ఇటువంటి గొప్ప భావనలు అతి చిన్న అడుగులు వేసే ఆ మహామనీషి నరనరాల్లోనూ నిండి ఉన్నాయి. రెండు రోజుల్లో పూజ్య బాపు తో పాటూ మనం శాస్త్రి గారి జయంతిని కూడా జరుపుకోబోతున్నాం. శాస్త్రి గారి పేరు వినగానే మన భారతీయుల మనసుల్లో ఒక అనంతమైన భక్తిశ్రధ్ధలు ఎగసిపడతాయి. వారి సౌమ్య వ్యక్తిత్వం ప్రతి పౌరుడినీ ఎప్పటికీ గర్వంతో  నింపేస్తుంది.

బయట నుంచి అతి వినమ్రంగా కనబడి, లోపలి నుండి మాత్రం పర్వతం లాంటి ధృఢ నిశ్చయం కలిగి ఉండేవారు  లాల్ బహదూర్ శాస్త్రి గారు. "జయ్ జవాన్ జయ్ కిసాన్" అన్న నినాదం శాస్త్రి గారి గొప్ప వ్యక్తిత్వానికి ఒక చక్కని నిదర్శనం. ఏదాదిన్నర కాలం పాటు సాగిన ఆయన సంక్షిప్త పదవీ కాలంలో, ఆయన దేశ సైనికులకు, రైతులకు విజయశిఖరాలను అందుకునే మంత్రం ఇచ్చారు. ఇది దేశం పట్ల ఆయనకు ఉన్న నిస్వార్థ ప్రేమకు నిదర్శనం.

నా ప్రియమైన దేశప్రజలారా, ఇవాళ మనం పూజ్యులైన బాపుని గుర్తు చేసుకుంటున్నప్పుడు పరిశుభ్రత గురించి మాట్లాడుకోవడం అనేది సాధారణమే. సెప్టెంబర్ పదిహేను నుండీ "పరిశుభ్రతే సేవ" అనే ఒక ఉద్యమం మొదలైంది. కోట్ల కొద్దీ ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. నాకు కూడా ఢిల్లీలోని అంబేద్కర్ పాఠశాల లో పిల్లలతో పరిశుభ్రత శ్రమదానం చేసే అవకాశం లభించింది. బాబా సాహెబ్ అంబేద్కర్ స్వయంగా ఆ పాఠశాలకు పునాది వేశారుట. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలూ ఈ సెప్టెంబర్ పదిహేను వ తేదీన జరిగిన శ్రమదానంలో పాల్గొన్నారు. అనేక సంస్థలు ఈ కార్యక్రమంలో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నాయి. స్కూలు పిల్లలు, కాలేజీ పిల్లలు, ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్, యువజన సంఘాలు, మీడియా గ్రూపులు, కార్పరేట్ ప్రపంచంలోనివారందరూ కూడా పెద్ద ఎత్తున పరిశుభ్రతకై శ్రమదానం చేశారు. ఇందుమూలంగా ఈ పరిశుభ్రతా ప్రేమికులందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలుయచేస్తున్నాను. రండి ఒక ఫోన్ కాల్ విందాం –
"నమస్కారం! నా పేరు షైతాన్ సింగ్. పూగల్ తాలూకా, బికనేర్ జిల్లా, రాజస్థాన్ నుండి మాట్లాడుతున్నాను. నేనొక అంధుడిని. నా రెండు కళ్ళు కనబడవు. నేను పూర్తి గుడ్డివాడిని. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ’మన్ కీ బాత్ కార్యక్రమం’ ద్వారా మోదీ గారు చేపట్టిన పరిశుభ్ర భారతదేశాన్ని తయారుచేసే పని చాలా గొప్పది. నాలాంటి అంధులు మరుగుదొడ్ల కోసం బయటకు వెళ్లాల్సి వచ్చేది. చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఇంట్లోనే  మరుగుదొడ్ల నిర్మాణం జరిగడం వల్ల మాకు చాలా ఉపయోగం జరిగింది. ఇది చాలా గొప్ప అడుగు. ఈ పని ఇలానే ముందుకు సాగాలి"

అనేకానేక ధన్యవాదాలు.  మీరు చాలా మంచి మాట చెప్పారు. ప్రతివారి జీవితంలోనూ పరిశుభ్రతకు ప్రత్యేకమైన స్థానం ఉంది. స్వచ్ఛ భారత ఉద్యమం ద్వారా మీ ఇంట్లో మరుగుదొడ్డి నిర్మణం జరిగడం వల్ల అది మీకు బాగా ఉపయోగపడుతోంది. ఇంతకు మించిన ఆనందం మా అందరికీ ఇంకేముంటుంది? మీకు కనబడదు కాబట్టి చూడలేకపోతున్నారు కానీ ఈ ఉద్యమం ద్వారా కలిగిన ప్రయోజనం ఇందులో పాల్గొన్న వారికి కూడా అంచనా ఉండి ఉండదు . మరుగుదొడ్డి నిర్మాణం జరగక ముందు మీరెన్ని  ఇబ్బందులతో జీవితాన్ని గడిపేవారో, మరుగుదొడ్డి నిర్మాణం జరిగిన తర్వాత అది మీ పాలిట ఎలా వరంగా మారిందో అన్న విషయం మీరు ఫోన్ చేయకపోయి ఉంటే మాకు తెలిసేది కాదు. పరిశుభ్రతా ఉద్యమంలో పాలుపంచుకున్నవారందరి దృష్టికీ ఈ సున్నితమైన అంశం వచ్చేది కాదు. మీ ఫోన్ కాల్ కి గానూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా, "స్వఛ్ఛ భారత్ మిషన్" కేవలం మన దేశం లోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఒక విజయవంతమైన కథ అయ్యింది. దీని గురించి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. చరిత్రలో నిలిచిపోయేలాంటి ప్రపంచంలోకెల్లా అతి పెద్ద పరిశుభ్రతా సదస్సు ని ఈసారి భారతదేశం నిర్వహించబోతోంది.  ‘Mahatma Gandhi International Sanitation Convention’ అంటే "మహాత్మా గాంధీ అంతర్జాతీయ పరిశుభ్రతా సదస్సు" ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశుభ్రతా మంత్రులు, ఈ రంగంలోని నిపుణులు ఒకటిగా వచ్చి ఈ పరిశుభ్రతా సదస్సులో తమతమ ప్రయోగాలు, అనుభవాలు పంచుకుంటారు.  2018 అక్టోబర్ రెండవ తేదీన బాపూ 150వ జయంతి ఉత్సవాల ప్రారంభం తో పాటూ ఈ ‘Mahatma Gandhi International Sanitation Convention’ పూర్తవుతుంది. 

నా ప్రియమైన దేశప్రజలారా, సంస్కృతంలో ఒక మాట ఉంది – "న్యాయమూలం స్వరాజ్యం స్యాత్". అంటే స్వరాజ్య మూలంలోనే న్యాయం ఉంటుంది. న్యాయాన్ని గురించిన చర్చ జరిగినప్పుడు మానవ అధికారాల భావంలోనే పూర్తిగా అది అంతర్గతమై ఉంటుంది. శోషిత,పీడిత, వంచిత ప్రజలకు స్వతంత్రం, శాంతి, న్యాయం అందించాలంటే, అది ప్రత్యేకంగా అనివార్యమైన సంగతి. బాబా సాహెబ్ అంబేద్కర్ ద్వారా నిర్మితమైన రాజ్యాంగంలో పేదల ప్రాధమిక హక్కుల కోసం అనేక చట్టాలు చేయబడ్డాయి. వాటి దృష్టితో ప్రేరణ పొంది, 1993 అక్టోబర్ 12, న "జాతీయ మానవ హక్కుల కమిషన్ అంటే "‘National Human Rights Commission’ (NHRC)  స్థాపించబడింది. కొద్ది రోజుల్లో NHRC పాతికేళ్ళు పూర్తిచేసుకోబోతోంది. NHRC  కేవలం మానవ హక్కులను మాత్రమే రక్షించలేదు. మనవత గౌరవాన్ని కూడా పెంచే పని చేసింది ఈ కమీషన్. మన మాజీ ప్రధానీ, మన ప్రాణ ప్రియ నేత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయ్ గారు స్పష్టంగా చెప్పారు – మానవ హక్కులనేవి మనకి పరాయివేమీ కాదు. మన జాతీయ మానవ హక్కుల కమిషన్ చిహ్నాంలో వైదిక కాలం నాటి ఆదర్శ సూత్రం "సర్వే భవంతు సుఖిన:" అంకితమై ఉంది. మానవ హక్కుల కోసం NHRC   విస్తృతమైన అవగాహనని కల్పించింది. దానితో పాటూ ఇందులో ఆ హక్కుల దురుపయోగాన్ని అడ్డుకునేందుకు కూడా మెచ్చుకోదగ్గ పాత్రను వహించింది. పాతికేళ్ల ఈ ప్రయాణంలో దేశప్రజల్లో NHRC   ఒక ఆశనీ, ఒక నమ్మకపు వాతావరణాన్నీ ఏర్పరిచింది. ఒక ఆరోగ్యకరమైన సమాజం కోసం , ఉత్తమ ప్రజాస్వామ్య విలువల కోసం ఇదొక పెద్ద ఆశాపూర్వకమైన ఘటన అని నా నమ్మకం. ఇవాళ జాతీయ స్థాయిలో మానవ హక్కుల పనితో పాటూ ఇరవై ఆరు దేశాల మానవ హక్కుల కమిషన్ కూడా స్థాపించబడింది. ఒక సమాజ రూపంలో మానవ హక్కులను అర్థం చేసుకుని, ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం చెయ్యాల్సి ఉంది. ఇదే "సబ్ కా సాథ్, సబ్ కా వికాస్" – ’అందరి సహకారంతో -అందరికీ అభివృధ్ధి ’ అనే ఆలోచనకి ఆధారం.

నా ప్రియమైన దేశప్రజలారా, అక్టోబర్ నెలలో జయ ప్రకాశ్ నారాయణ్ గారి జయంతి ఉంది. ఇదే నెలలో రాజమాత విజయరాజే సింధియా గారి శతాబ్ది జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ మహా పురుషులందరూ మనకి ప్రేరణాత్మకమైనవారు.  వారికి నా నమస్సులు. అక్టోబర్ 31 వ తేదీన సర్దార్ సాహెబ్ జయంతి ఉంది. వీరి గురించి రాబోయే మన్ కీ బాత్ లో నేను వివరంగా చెప్తాను కానీ ఇవాళ మాత్రం నేను తప్పకుండా ఈ ప్రస్తావన చెయ్యలనుకున్నాను. గత కొన్నేళ్ళ నుండీ సర్దార్ సాహెబ్ జయంతి అయిన అక్టోబర్ 31 నాడు "రన్ ఫర్ యూనిటీ" అని భారతదేశంలో ప్రతి చిన్న- పెద్ద పట్టణాల్లో, ప్రాంతాల్లో, పల్లెల్లో "రన్ ఫర్ యూనిటీ" ఏర్పాటుచేయడం జరుగుతోంది. ఈసారి కూడా మనం ప్రయత్నపూర్వకంగా ప్రతి చిన్న- పెద్ద పట్టణాల్లో, ప్రాంతాల్లో, పల్లెల్లో ఈ "రన్ ఫర్ యూనిటీ"ని ఏర్పాటుచేద్దాం. "రన్ ఫర్ యూనిటీ" అనే కార్యక్రమం సర్దార్ సాహెబ్ ను గుర్తుచేసుకుందుకు ఉత్తమ మార్గం. ఎందుకంటే ఈయన జీవితమంతా భారతదేశ సమైక్యత కోసం పాటుపడ్డారు. అక్టోబర్ 31 న "రన్ ఫర్ యూనిటీ" ద్వారా సమాజంలో ప్రతి వర్గాన్నీ, దేశంలోని ప్రతి ప్రాంతాన్నీ సమైక్యతాభావంతో ముడిపెట్టేందుకు మనం చేసే ప్రయత్నాలన్నింటికీ మనం బలాన్నిద్దాం. ఇదే ఆయనకు మనం ఇచ్చే చక్కని శ్రధ్ధాంజలి.

నా ప్రియమైన దేశప్రజలారా, నవరాత్రి , దుర్గా పూజ లేదా విజయదశమి ఏ పేరైనా ఈ పవిత్ర పండుగల సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకంగా అనేకానేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Great To See How He Supports Art': 'Fauda' Star Lior Raz On Meeting PM Modi In Israel

Media Coverage

Great To See How He Supports Art': 'Fauda' Star Lior Raz On Meeting PM Modi In Israel
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
The HPV vaccination campaign, launched from Ajmer, marks a significant step towards empowering the nation’s Nari Shakti: PM Modi in Rajasthan
February 28, 2026
Our government is committed to all-round development: PM
Today, I had the privilege of launching the nationwide HPV vaccination campaign from Ajmer, inaugurating and laying foundation stones for multiple projects and distributing appointment letters to the youth: PM
The HPV vaccination campaign has commenced from Ajmer, this campaign is a significant step towards empowering the Nari Shakti of the country: PM
The double-engine government is moving forward by taking both Rajasthan’s heritage and development together: PM
The campaign to link rivers started by our government will significantly benefit Rajasthan: PM
There is no shortage of sunlight in Rajasthan, this very sunshine is becoming a source of savings and income for the common man: PM
A very significant role is being played by the PM Surya Ghar Free Electricity Scheme, this scheme has the power to change Rajasthan's destiny: PM

भारत माता की जय।

भारत माता की जय।

भारत माता की जय।

तीर्थराज पुष्कर और माता सावित्री की इस पावन भूमि पर, आज मुझे आप सबके बीच आने का, आपके आशीर्वाद प्राप्त करने का अवसर मिला है। इस मंच से मैं सुरसुरा के तेजाजी धाम को, पृथ्वीराज की भूमि अजमेर को प्रणाम करता हूं।

मेरे साथ बोलिए –

तीर्थराज पुष्कर की जय।

तीर्थराज पुष्कर की जय।

वीर तेजाजी महाराज की जय।

वीर तेजाजी महाराज की जय।

भगवान देव नारायण की जय।

भगवान देव नारायण की जय।

वरूण अवतार भगवान झूलेलाल जी की जय।

भगवान झूलेलाल जी की जय।

मंच पर विराजमान राजस्थान के राज्यपाल हरिभाउ बागडे जी, राज्य के लोकप्रिय मुख्यमंत्री श्री भजनलाल शर्मा जी, पूर्व मुख्यमंत्री बहन वसुंधरा जी, केंद्रीय मंत्रिमंडल में मेरे साथी भगीरथ चौधरी जी, उपमुख्यमंत्री प्रेमचंद भैरवा जी, दिया कुमारी जी, संसद में मेरे साथी, भाजपा के प्रदेश अध्यक्ष मदन राठौर जी, उपस्थित अन्य मंत्रिगण, अन्य महानुभाव और राजस्थान के मेरे प्यारे भाई और बहनों। मैं पूज्य संतों का बहुत आभारी हूं, कि हमें आशीर्वाद देने के लिए इतनी बड़ी संख्या में पूज्य संतगण यहां मौजूद हैं।

साथियों,

अजमेर आस्था और शौर्य की धरती है। यहां तीर्थ भी है और क्रांतिवीरों के पदचिन्ह भी हैं। अभी कल ही मैं इजराइल की यात्रा को पूरा करके भारत लौटा हूं। राजस्थान के सपूत मेजर दलपत सिंह के शौर्य को इजराइल के लोग आज भी गौरव से याद करते हैं। मुझे भी इजराइल की संसद में, मेजर दलपत सिंह जी के शौर्य को नमन करने का सौभाग्य मिला। राजस्थान के वीर बाकुरों की, इजराइल के हाइफा शहर को आजाद कराने में जो भूमिका थी, मुझे उसका गौरवगान करने का अवसर मिला है।

साथियों,

कुछ समय पहले ही, राजस्थान में भाजपा की डबल इंजर सरकार को दो साल पूरे हुए हैं, मुझे संतोष है कि आज राजस्थान विकास के नए पथ पर अग्रसर है। विकास के जिन वायदों के साथ भाजपा सरकार आपकी सेवा में आई थी, उन्हें तेजी के साथ पूरा कर रही है। और आज का दिन, विकास के इसी अभियान को तेज करने का दिवस है। थोड़ी देर पहले यहां राजस्थान के विकास से जुड़ी करबी 17 हजार करोड़ रूपयों की परियोजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है। सड़क, बिजली, पानी, स्वास्थ्य, शिक्षा, हर क्षेत्र में नई शक्ति जुड़ रही है। ये सारे प्रोजेक्टस राजस्थान की जनता की सुविधा बढ़ाएंगे और राजस्थान के युवाओं के लिए, रोजगार के भी अवसर पैदा करेंगे।

साथियों,

भाजपा की डबल इंजर सरकार लगातार युवा शक्ति को सशक्त कर रही है। दो साल पहले तक राजस्थान से भर्तियों में भ्रष्टाचार और पेपर लीक की ही खबरें चमकती रहती थीं, आती रहती थीं। अब राजस्थान में पेपर लीक पर लगाम लगी है, दोषियों पर सख्त कार्रवाई हो रही है। आज यहां इसी मंच से राजस्थान के 21 हजार से अधिक युवाओं को नियुक्ति पत्र भी सौंपे गए हैं। ये बहुत बड़ा बदलाव आया है। मैं इस बदलाव के लिए, नई नौकरियों के लिए, विकास के सभी कामों के लिए, राजस्थान के आप सभी लोगों को बहुत-बहुत बधाई देता हूं।

साथियों,

आज वीरांगनाओं की इस धरती से, मुझे देशभर की बेटियों के लिए एक अहम अभियान शुरू करने का अवसर मिला है। यहां अजमेर से HPV वैक्सीनेशन अभियान शुरू हुआ है। ये अभियान, देश की नारीशक्ति को सशक्त करने की दिशा में अहम कदम है।

साथियों,

हम सब जानते हैं कि परिवार में जब मां बीमार होती है, तो घर बिखर सा जाता है। अगर मां स्वस्थ है, तो परिवार हर संकट का सामना करने में सक्षम रहता है। इसी भाव से, भाजपा सरकार ने महिलाओं को संबल देने वाली अनेक योजनाएं चलाई हैं।

साथियों,

हमने 2014 से पहले का वो दौर देखा है, जिसमें शौचालय के अभाव में बहनों-बेटियों को कितनी पीड़ा, कितना अपमान झेलना पड़ता था। बच्चियां स्कूल छोड़ देती थीं, क्योंकि वहां अलग टॉयलेट की सुविधा नहीं होती थी। गरीब बेटियां सेनिटरी पैड्स नहीं ले पाती थीं। पहले जो सत्ता में रहे, उनके लिए ये छोटी बातें थीं। इसलिए इन समस्याओं की चर्चा तक नहीं होती थी। लेकिन हमारे लिए ये बहनों-बेटियों को बीमार करने वाला, उनके अपमान से जुड़ा संवेदनशील मसला था। इसलिए, हमने इनका मिशन मोड पर समाधान किया।

साथियों,

गर्भावस्था के दौरान कुपोषण माताओं के जीवन के लिए बहुत बड़ा खतरा होता था। हमने सुरक्षित मातृत्व के लिए योजना चलाई, मां को पोषक आहार मिले, इसके लिए पांच हज़ार रुपए बहनों के खाते में जमा करने की योजना शुरु की। मां धुएं में खांसती रहती थी, लेकिन उफ्फ तक नहीं करती थी। हमने कहा ये नहीं चलेगा। और इसलिए उज्जवला गैस योजना बनाई गई। ये सब इसलिए संभव हुआ, क्योंकि भाजपा सरकार, सत्ता भाव से नहीं, संवेदनशीलता के साथ काम करती है।

साथियों,

21वीं सदी का एक चौथाई हिस्सा बीत चुका है। आज का समय राजस्थान के विकास के लिए बड़ा महत्वपूर्ण है। भाजपा की डबल इंजन सरकार, राजस्थान की विरासत और विकास, दोनों को साथ लेकर चल रही है। हम सब जानते हैं, अच्छी सड़क, अच्छी रेल और हवाई सुविधा सिर्फ सफर आसान नहीं करती, वो पूरे इलाके की किस्मत बदल देती है। जब गांव-गांव तक अच्छी सड़क पहुँचती है, तो किसान अपनी फसल सही दाम पर बेच पाता है। व्यापारी आसानी से अपना सामान बाहर भेज पाते हैं। और हमारा अजमेर-पुष्कर तो, उसकी पर्यटन की ताकत कौन नहीं जानता। अच्छी कनेक्टिविटी का पर्यटन पर सबसे अच्छा असर पड़ता है। जब सफर आसान होता है, तो ज्यादा लोग घूमने आते हैं।

और साथियों,

जब पर्यटक आते हैं तो स्वाभाविक है होटल चलते हैं, ढाबे चलते हैं, कचौड़ी और दाल बाटी ज्यादा बिकती है, यहां राजस्थान के कारीगरों का बनाया सामान बिकता है, टैक्सी चलती है, गाइड को काम मिलता है। यानी एक पर्यटक कई परिवारों की रोज़ी-रोटी बन जाता है। इसी सोच के साथ हमारी सरकार, राजस्थान में आधुनिक कनेक्टिविटी पर बहुत बल दे रही है।

साथियों,

जैसे-जैसे राजस्थान में कनेक्टिविटी का विस्तार हो रहा है, वैसे-वैसे यहां निवेश के लिए भी अवसर लगातार बढ़ते जा रहे हैं। दिल्ली-मुंबई इंडस्ट्रियल कॉरिडोर के इर्द-गिर्द उद्योगों के लिए एक बहुत ही शानदार इंफ्रास्ट्रक्चर बनाया जा रहा है। यानी राजस्थान को अवसरों की भूमि बनाने के लिए, डबल इंजन सरकार हर संभव, अनेक विध काम कर रही है।

साथियों,

राजस्थान की माताएं अपने बच्चों को पालने में ही, राष्ट्र भक्ति का संस्कार देती हैं। राजस्थान की ये धरा जानती है कि देश का सम्मान क्या होता है, और इसीलिए आज राजस्थान की इस धरा पर, मैं आप लोगों से एक और बात कहने आया हूं।

साथियों,

हाल में ही, दिल्ली में, दुनिया का सबसे बड़ा AI सम्मेलन हुआ, Artificial Intelligence इसमें दुनिया के अनेक देशों के प्रधानमंत्री, अनेक देशों के राष्ट्रपति, अनेक देशों के मंत्रि, उस कार्यक्रम में आए थे। दुनिया की बड़ी-बड़ी कंपनियां, उन कंपनियों के कर्ता-धर्ता वो भी एक छत के नीचे इकट्ठे हुए थे। सबने भारत की खुले मन से प्रशंसा की। मैं जरा राजस्थान के मेरे भाई-बहनों से पूछना चाहता हूं। जब दुनिया के इतने सारे लोग, भारत की प्रशंसा करते हैं, ये सुनकर के आपको गर्व होता है की नहीं होता है? आपको गर्व होता है कि नहीं होता है? आपको अभिमान होता है कि नहीं होता है? आपका माथा ऊंचा हुआ या नहीं हुआ? आपका सीना चौड़ा हुआ कि नहीं हुआ?

साथियों,

आपको गर्व हुआ, लेकिन हताशा निराशा में डूबी, लगातार पराजय के कारण थक चुकी कांग्रेस ने क्या किया, ये आपने देखा है। दुनियाभर के मेहमानों के सामने, कांग्रेस ने देश को बदनाम करने की कोशिश की। इन्होंने विदेशी मेहमानों के सामने देश को बेइज्जत करने के लिए पूरा ड्रामा किया।

साथियों,

कांग्रेस, पूरे देश में ल्रगातार हार रही है, और गुस्से में वो इसका बदला, वो भारत को बदनाम करके ले रही है। कभी कांग्रेस, INC यानी इंडियन नेशनल कांग्रेस थी, लेकिन अब INC नहीं बची है, इंडियन नेशनल कांग्रेस नहीं बची है, आज वो INC के बजाय MMC, MMC बन गई है। MMC यानी मुस्लिम लीगी माओवादी कांग्रेस हो चुकी है।

राजस्थान के मेरे वीरों,

इतिहास गवाह है, मुस्लिम लीग भारत से नफरत करती थी, और इसलिए मुस्लिम लीग ने देश बांट दिया। आज कांग्रेस भी वही कर रही है। माओवादी भी, भारत की समृद्धि, हमारे संविधान और हमारे सफल लोकतंत्र से नफरत करते हैं, ये घात लगाकर हमला करते हैं, कांग्रेस भी घात लगाकर, देश को बदनाम करने के लिए कहीं भी घुस जाती है। कांग्रेस के ऐसे कुकर्मों को देश कभी माफ नहीं करेगा।

साथियों,

देश को बदनाम करना, देश की सेनाओं को कमजोर करना, ये कांग्रेस की पुरानी आदत रही है। आप याद कीजिए, यही कांग्रेस है, जिसने हमारी सेना के जवानों को हथियारों और वर्दी तक के लिए तरसा कर रखा था। ये वही कांग्रेस है, जिसने सालों तक हमारे सैनिक परिवारों को वन रैंक वन पेंशन से वंचित रखा था। ये वही कांग्रेस है, जिसके जमाने में विदेशों से होने वाले रक्षा सौदों में बड़े-बड़े घोटाले होते थे।

साथियों,

बीते 11 वर्षों में भारत की सेना ने हर मोर्चे पर आतंकियों पर, देश के दुश्मनों पर करारा प्रहार किया। हमारी सेना, हर मिशन, हर मोर्चे में विजयी रही। सर्जिकल स्ट्राइक से लेकर ऑपरेशन सिंदूर तक, वीरता का लोहा मनवाया, लेकिन कांग्रेस के नेताओं ने इसमें भी दुश्मनों के झूठ को ही आगे बढ़ाया। देश के लिए जो भी शुभ है, जो भी अच्छा है, जो भी देशवासियों का भला करने वाला है, कांग्रेस उस सबका विरोध करती है। इसलिए, देश आज कांग्रेस को सबक सिखा रहा है।

साथियों,

राजस्थान में तो आपने कांग्रेस के कुशासन को करीब से अनुभव किया है। यहां जितने दिन कांग्रेस की सरकार रही, वो भ्रष्टाचार करने और आपसी लड़ाई-झगड़े में ही उलझी रही। कांग्रेस ने हमारे किसानों को भी हमेशा धोखा दिया है। आप याद कीजिए, कांग्रेस ने दशकों तक सिंचाई की परियोजनाओं को कैसे लटकाए रखा। इसका राजस्थान के किसानों को बहुत अधिक नुकसान हुआ है। ERCP परियोजना को कांग्रेस की सरकारों ने केवल फाइलों और घोषणाओं में उलझाकर रखा। हमारी सरकार ने आते ही इस स्कीम को फाइलों से निकालकर धरातल पर उतारने का प्रयास किया है।

साथियों,

हमारी सरकार ने नदियों को जोड़ने का जो अभियान शुरु किया है, उसका बहुत अधिक फायदा राजस्थान को मिलना तय है। संशोधित पार्वती-कालीसिंध-चंबल लिंक परियोजना हो, यमुना-राजस्थान लिंक प्रोजेक्ट हो, डबल इंजन सरकार ऐसी अनेक सिंचाई परियोजनाओं का लाभ किसानों तक पहुंचाने के लिए प्रतिबद्ध है। आज भी झालावाड़, बारां, कोटा और बूंदी जिले के लिए पानी की अनेक परियोजनाओं पर काम शुरु हुआ है। हमारा प्रयास है, कि राजस्थान में भूजल का स्तर भी ऊपर उठे।

साथियों,

भाजपा सरकार, राजस्थान के सामर्थ्य को समझते हुए, योजनाएं बना रही है, उन्हें लागू कर रही है। मुझे खुशी है कि राजस्थान अब, सूरज की ताकत से समृद्धि कमाने वाली धरती बन गया है। हम सब जानते हैं, हमारे राजस्थान में धूप की कोई कमी नहीं। अब यही धूप, सामान्य मानवी के घर की बचत और कमाई का साधन बन रही है। और इसमें बहुत बड़ी भूमिका है, प्रधानमंत्री सूर्यघर मुफ्त बिजली योजना की। इस योजना में राजस्थान का भाग्य बदलने की ताकत है। इस योजना में भाजपा सरकार लोगों को अपनी छत पर सोलर पैनल लगाने के लिए 78 हजार रुपए की सहायता देती है। सरकार सीधे आपके बैंक खाते में पैसे भेजती है। आजादी के बाज सब बजट, सब योजनाएं देख लीजिए, जिसमें मध्यम वर्ग को सबसे ज्यादा लाभ होने वाला है, ऐेसी योजना कभी नजर नहीं आएगी, आज इन परिवारों को सोलर पैनल लगाने के लिए 78 हजार रुपए सीधा सरकार देती है। सबसे अधिक लाभ मध्यम वर्ग के लोग ले रहे हैं। और जिससे घर पर एक छोटा सा बिजली घर तैयार हो जाता है। दिन में सूरज की रोशनी से बिजली बनती है, घर में वही बिजली काम आती है और जो ज्यादा बिजली बनती है, वो बिजली ग्रिड में जाती है। और जिस घर में बिजली बनी होती है, उसे भी इसका लाभ मिलता है।

साथियों,

आज राजस्थान में सवा लाख से अधिक परिवार इस योजना से जुड़ चुके हैं। और इस योजना की वजह से, कई घरों का बिजली बिल लगभग जीरो आ रहा है। यानी खर्च कम हुआ है, बचत ज़्यादा हुई है।

साथियों,

विकसित राजस्थान से विकसित भारत के मंत्र पर हम लगातार काम कर रहे हैं। आज जिन योजनाओं पर काम शुरू हुआ है, वो विकसित राजस्थान की नींव को और अधिक मजबूत करेंगे। जब राजस्थान विकसित होगा, तो यहां के हर परिवार का जीवन समृद्ध होगा। आप सभी को एक बार फिर, विकास परियोजनाओं के लिए बहुत-बहुत शुभकामनाएं। मेरे साथ बोलिये-

भारत माता की जय!

भारत माता की जय!

वंदे मातरम के 150 साल देश मना रहा है। मेरे साथ बोलिये-

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

बहुत-बहुत धन्यवाद।