జయలలిత జయంతి సందర్భంగా ఆమెను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సంస్మరించుకున్నారు. తమిళనాడు అభివృద్ధి కోసం జీవితాన్ని వెచ్చించిన విశిష్ట పరిపాలనాదక్షురాలు, ప్రజల పట్ల ఆదరం చూపిన నేత జయలలిత అని శ్రీ మోదీ కొనియాడారు.

ఎక్స్ వేదికపై రాసిన వివిధ పోస్టుల్లో ప్రధాని నివాళి అర్పిస్తూ:  

“జయలలిత జీ జయంతి సందర్భంగా ఆమెను సంస్మరించుకుంటున్నాను. తమిళనాడు అభివృద్ధి కోసం తన జీవితాన్ని వెచ్చించిన మేటి పరిపాలనాదక్షురాలు, ప్రజల పట్ల సదా ఆదరం చూపిన నేతగా ఆమె ఎందరి  అభిమానాన్నో పొందారు. అనేక సందర్భాల్లో ఆమెతో సంభాషించే అవకాశం కలగడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ప్రజలకు మేలు చేసే ఏ పథకానికైనా ఆమె తమ సంపూర్ణమైన మద్దతుని అందించేవారు”  అని పేర్కొన్నారు.

 “జయలలిత జీ జయంతి నాడు ఆమెను సంస్మరించుకుంటున్నాను. తమిళనాడు రాష్ట్రాభివృద్ధి కోసం సదా తపించిన  మేటి పరిపాలనాదక్షురాలు, ప్రజల పట్ల ఆదరాభిమానాలు చూపిన నేతగా ఆమె అందరి ప్రేమనూ చూరగొన్నారు.  పలు సందర్భాల్లో ఆమెతో సంభాషించే అవకాశం కలగడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ప్రజా సంక్షేమం కోసం చేపట్టే ఏ పథకానికైనా ఆమె తమ మద్దతుని అందించేవారు”  అని పేర్కొన్నారు.

“ஜெயலலிதா அவர்களின் பிறந்தநாளில் அவரை நினைவுகூர்கிறேன். தமிழ்நாட்டின் வளர்ச்சிக்காக தமது வாழ்க்கையை அர்ப்பணித்துக் கொண்ட அவர், கருணைமிக்க தலைவராகவும், திறமைமிக்க நிர்வாகியாகவும் நன்கு அறியப்பட்டவர். பல சந்தர்ப்பங்களில் அவருடன் உரையாடும் வாய்ப்பை நான் பெற்றிருந்தது எனது கௌரவமாகும். அவர் எப்போதும் அன்பாகவும் மக்கள் நலன் சார்ந்த முன்முயற்சிகளுக்கு ஆதரவாகவும் இருந்தவர்.”

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Vikas Bhi, Virasat Bhi: How JATAN, AI and Digital Archives are revolutionising India’s cultural heritage preservation

Media Coverage

Vikas Bhi, Virasat Bhi: How JATAN, AI and Digital Archives are revolutionising India’s cultural heritage preservation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న యోధులకు ప్రధాని నివాళి
August 09, 2026

చరిత్రాత్మక క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న యోధులందరినీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో వారు చూపిన ధైర్యసాహసాలకూ, దృఢ సంకల్పానికీ నివాళి అర్పించారు. మహాత్మాగాంధీ నాయకత్వం అందించిన స్ఫూర్తితో క్విట్ ఇండియా ఉద్యమం ఇచ్చిన పిలుపు స్వాతంత్ర్య పోరాటంలో నూతనోత్తేజాన్ని నింపిందనీ, వలస పాలన నుంచి విముక్తి పొందాలన్న భారత ప్రజల అచంచలమైన సంకల్పాన్ని ప్రతిబింబించిందని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

చరిత్రాత్మక క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారిని స్మరించుకుంటున్నా. వారి ధైర్యం ప్రతి భారతీయునికీ ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం. మహాత్మాగాంధీ నాయకత్వం అందించిన స్ఫూర్తితో క్విట్ ఇండియా పిలుపు స్వాతంత్ర్య ఉద్యమంలో నూతన శక్తిని నింపింది. వలస పాలన నుంచి విముక్తి పొందాలన్న మన ప్రజల అచంచల సంకల్పాన్ని ప్రతిబింబించింది.