35 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 35 పిఎస్ఎ ఆక్సీజన్ ప్లాంటుల ను ప్రధానమంత్రి అంకితం చేస్తారు
దేశం లోని అన్ని జిల్లాల లో ప్రస్తుతం పిఎస్ఎఆక్సీజన్ ప్లాంటులు పని చేస్తున్నాయి

పిఎమ్ కేర్స్ లో భాగం గా 35 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల లో ఏర్పాటైన 35 ప్రెశర్ స్వింగ్ అడ్ సార్ప్ శన్ (పిఎస్ఎ) ఆక్సీజన్ ప్లాంటుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 అక్టోబర్ 7న ఉదయం 11 గంటల కు ఉత్తరాఖండ్ లోని ఎఐఐఎమ్ఎస్ రుషీకేశ్ లో జరుగనున్న ఒక కార్యక్రమం లో దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. దీనితో, దేశం లోని అన్ని జిల్లాలు ఇక పిఎస్ఎ ఆక్సీజన్ ప్లాంటులను కలిగివున్నట్లు అవుతుంది. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి సభికుల ను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఇంతవరకు, పిఎం కేర్స్ ద్వారా దేశవ్యాప్తం గా మొత్తం 1224 పిఎస్ఎ ఆక్సీజన్ ప్లాంటుల కు ఆర్థిక సహాయాన్ని అందించడమైంది. వీటిలో 1100లకు పైగా ప్లాంటులు ఇప్పటికే పని చేస్తున్నాయి. వీటి ద్వారా ప్రతి రోజు 1750 ఎమ్ టి కి పైగా ఆక్సీజన్ ఉత్పత్తి అవుతోంది. ఇది కోవిడ్-19 విశ్వమారి తలెత్తినప్పటి నుంచి భారతదేశం లో చికిత్స కు వినియోగించే ఆక్సీజన్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడం కోసం ప్రభుత్వం ముందుచూపు తో చేపట్టిన చర్యల కు ఒక నిదర్శనం గా ఉంది.

దేశం లో ప్రతి ఒక్క జిల్లా లో ఒక పిఎస్ఎ ఆక్సీజన్ ప్లాంటు ను ఏర్పాటు చేయడం కోసం తలపెట్టిన ఒక ప్రాజెక్టు ను కార్యాచరణ లోకి తీసుకు రావడం లో భాగం గా పర్వత ప్రాంతాలు, ద్వీపాలు, దుర్గమమైన ప్రదేశాలు కలిగిన భూ భాగాల వంటి క్లిష్ట సవాళ్ళ ను కూడా అధిగమించడం జరిగింది.

7,000 కు పైగా సిబ్బంది కి శిక్షణ ను ఇవ్వడం ద్వారా ఈ ప్లాంటుల కార్యకలాపాలకు, నిర్వహణ కు పూచీ పడడం జరిగింది. సిబ్బంది పనితీరు ను వాస్తవ కాల ప్రాతిపదిక న పర్యవేక్షించడం కోసం ఒక ఎంబెడెడ్ ఇంట‌ర్‌ నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి) ఉపకరణాన్ని, అలాగే ఒక ఏకీకృత వెబ్ పోర్టల్ ను ఉపయోగించడం జరుగుతున్నది.


ఈ కార్యక్రమం లో కేంద్ర ఆరోగ్య మంత్రి తో పాటు, ఉత్తరాఖండ్ గవర్నర్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి లు కూడా పాల్గొంటారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
‘Modi Govt’s 12 years are transformational for industry’

Media Coverage

‘Modi Govt’s 12 years are transformational for industry’
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 జూన్ 2026
June 12, 2026

Breaking Barriers, Building Bharat: PM Modi’s Historic Push for Gender Equality and Inclusive Growth