థాయ్లాండ్ రాజు మహా వజిరలాంగ్కార్న్ ఫ్రా వజిరక్లావోయుహువా, రాణి సుతిదా బజ్రసుధాబి మలలక్షణతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బ్యాంకాక్లోని దుసిట్ రాజసౌధంలో సగౌవర సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భారత్-థాయిలాండ్ ఉమ్మడి సాంస్కృతిక వారసత్వంపై తమ మనోభావాలను పంచుకున్నారు. అలాగే భారత్ నుంచి థాయిలాండ్కు బుద్ధ భగవానుని అవశేషాలు చేరడంతోపాటు రెండు దేశాల మధ్య ప్రజల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావడంలో ఈ కార్యక్రమం సానుకూల ప్రభావాన్ని చూపిందని వారు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య బహుముఖ దౌత్య సంబంధాలను మరింత పటిష్ఠం చేసే మార్గాలపైనా వారు చర్చించారు.
Called on Maha Vajiralongkorn, the King of Thailand. We talked about the robust friendship between India and Thailand and how to make it even stronger. pic.twitter.com/FJE958U1mn
— Narendra Modi (@narendramodi) April 4, 2025


