ఘనా దేశం ఆక్రా నగరంలోని ఎన్క్రుమా సంస్కరణ వాటికను సందర్శించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ... దివంగత నేత, ఆఫ్రికా స్వాతంత్ర్య వీరుడు, దేశాన్ని ఉనికిలోకి తెచ్చిన తొలి దేశాధ్యక్షుడు డాక్టర్ క్వామే ఎన్క్రుమాకు ఘన నివాళులు అర్పించారు. ఘనా ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ నానా జేన్ ఓపుకు-ఆగ్యేమాంగ్ ప్రధాని వెంట ఉన్నారు. స్వాతంత్ర్యం, ఐక్యత, సామాజిక న్యాయం వంటి ఆశయాల సాధనకు డాక్టర్ ఎన్క్రుమా చేసిన కృషిని, ఆయా రంగాలపై చెక్కుచెదరని ఆయన ప్రభావానికి గౌరవ సూచకంగా శ్రీ మోదీ పుష్ప గుచ్ఛాన్ని ఉంచి మౌనం పాటించారు.

ఘనా దేశ ఘన చారిత్రిక వారసత్వం పట్ల భారత్ కు గల గౌరవాన్ని ప్రధాని నివాళి ప్రతిబింబించింది. ఇరు దేశాల మధ్య గల దృఢమైన స్నేహ బంధాలు, సహకార స్ఫూర్తిని పునరుద్ఘాటించింది.


In Accra, paid homage to Dr. Kwame Nkrumah. He was a visionary statesman whose thoughts and ideals guide several people. He devoted himself towards the well-being of people of Ghana. pic.twitter.com/WY9pqEGezI
— Narendra Modi (@narendramodi) July 3, 2025


