* భారత్‌లో పెట్టుబడులను సులభతరం, వేగవంతం చేయడానికి అభివృద్ధి చేసిన జపాన్ ప్లస్ వ్యవస్థ గురించి ప్రముఖంగా వివరించిన పీఎం
* భారత్‌లో పాలన విధాన ఆధారితమైనది. పారదర్శకమైన, ఊహించదగిన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రధాని
v
* దేశంలో నిండిన వైవిధ్యంతో కృత్రిమ మేధ రంగంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది: పీఎం
* వికసిత భారత్ 2047 లక్ష్యానికి మద్దతు అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన ప్రతినిధి బృందం

భారత్, జపాన్ మధ్య ఆర్థిక సహకారాన్ని మరింతగా బలోపేతం చేయడానికి వచ్చిన ప్రతినిధి బృందం కీజై డోయుకై (జపాన్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ సంఘం)తో ఢిల్లీలోని లోక కళ్యాణ మార్గ్, 7 లో ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. 20 మంది సభ్యులతో కూడిన ఈ బృందానికి కీజై డోయుకై అధ్యక్షుడు శ్రీ తకేసి నినామి నాయకత్వం వహిస్తున్నారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించే అంశంలో వారి ఆలోచనలను ప్రధానమంత్రి విన్నారు.

వ్యవసాయం, సముద్ర ఉత్పత్తులు, అంతరిక్షం, రక్షణ, బీమా, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, పౌర విమానయానం, హరిత ఇంధనం, ఎంఎస్ఎమ్ఈ భాగస్వామ్యం తదితర కీలక రంగాల్లో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేయడం, పెట్టుబడి అవకాశాలను విస్తరించడం, సహకారాన్ని పెంపొందించడంపై చర్చించారు.

భారత్, జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం గురించి ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే వ్యాపార అనుకూల వాతావరణాన్ని కల్పించడంలో భారత్ అంకిత భావాన్ని స్పష్టం చేశారు. భారత్‌లో జపనీయుల పెట్టుబడులను వేగవంతం, సులభతరం చేయడానికి అభివృద్ధి చేసిన జపాన్ ప్లస్ గురించి ప్రధాని వివరించారు. పెట్టుబడిదారులకు ఎలాంటి అస్పష్టత, సంకోచం ఉండకూడదని ప్రధానమంత్రి అన్నారు. విధానాల ఆధారంగా భారత్‌లో పాలన సాగుతుందని, పారదర్శకమైన, ఊహించదగిన వాతావరణాని కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు

దేశంలో విమానయాన రంగంలో ఉన్న విస్తృతమైన వృద్ధి అవకాశాల గురించి ప్రధానమంత్రి మాట్లాడారు. కొత్త విమానాశ్రయాల నిర్మాణం, రవాణా సామర్ధ్యాల విస్తరణతో సహా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే దిశగా భారత్ కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

విస్తృతమైన వైవిధ్యం కలిగి ఉన్న భారత్ ఏఐ రంగంలో కీలకమైన పాత్ర పోషిస్తుందని ప్రధాని అన్నారు. ఈ రంగంలో సహకార ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. భారత్‌తో కలసి పనిచేయాల్సిందిగా ఇప్పటికే ఏఐలో రాణిస్తున్నవారిని ప్రోత్సహించారు.

జీవఇంధనాలపై ప్రధాన దృష్టి సారించి ప్రారంభించిన పథకం ద్వారా హరిత ఇంధన రంగంలోనూ భారత్ గణనీయమైన ప్రగతి కనబరుస్తోందని ప్రధానమంత్రి అన్నారు. విలువ జోడించిన ఈ జీవ ఇంధనాల నుంచి ప్రధానంగా వ్యవసాయ రంగం ప్రయోజనం పొందుతోందని వివరించారు.

బీమా రంగంతో పాటు అంతరిక్షం, అణు శక్తి లాంటి అత్యాధునిక రంగాల్లో పెరుగుతున్న అవకాశాల గురించి ప్రధానమంత్రి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

కీజై డోయుకై ప్రతినిధి బృందంలోని వ్యాపార దిగ్గజాలు భారత్‌ కోసం సిద్ధం చేసిన తమ వ్యాపార ప్రణాళికలను పంచుకొన్నారు. మానవ వనరులు, నైపుణ్యాభివృద్ధిలో భారత్-జపాన్ మధ్య పరస్పర ప్రయోజనకరమైన అంశాలను ఉపయోగించుకోవడంలో వారు ఆసక్తి కనబరిచారు. భవిష్యత్తు భాగస్వామ్యాల పట్ల రెండు వైపులా ఆశాభావం వ్యక్తమయింది. అలాగే రానున్న సంవత్సరాల్లో వ్యాపార, పెట్టుబడి సంబంధాలను మరింతగా పెంపొందించేందుకు ఇరుపక్షాలు ఎదురు చూస్తున్నాయి.

ప్రధాని మోదీ హయాంలో భారత్, జపాన్ మధ్య వృద్ధి చెందుతున్న సంబంధాలను షంటోరి హోల్డింగ్స్ లిమిటెడ్ ప్రతినిధి, అధ్యక్షుడు, సీఈవో నినామి తకేషి ప్రశంసించారు. భారత్లో పెట్టుబడులు పెట్టడానికి జపాన్ కు అపారమైన అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత అయిన ‘మేకిన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్’ గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

భారత దేశంలో పెట్టుబడులు పెట్టే అంశంలో తన లక్ష్యాలు, అంచనాలను ప్రధాని మోదీ చాలా స్పష్టంగా వివరించారని ఎన్ఈసీ కార్పొరేషన్ కార్పొరేట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ప్రభుత్వ వ్యవహారాల  ప్రధానాధికారి తనక హిగేహీరో వ్యాఖ్యానించారు.

వికసిత భారత్ - 2047 లక్ష్యానికి అర్థవంతమైన, పరస్పరం ప్రయోజనం కలిగించే విధంగా
వ్యాపార సహకారం అందించడంలో జపాన్ నిబద్ధతను ఈ సమావేశం తెలియజేస్తుంది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s Defence Exports Explode: ₹40,000 Crore Milestone Signals a New Manufacturing Era

Media Coverage

India’s Defence Exports Explode: ₹40,000 Crore Milestone Signals a New Manufacturing Era
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of PM’s remarks during inauguration of Swaminarayan Hindu Temple in Paris
September 06, 2026

पूज्य महंत स्वामी, फ्रांस सरकार के सम्मानित प्रतिनिधिगण, उपस्थित अतिथिगण, इंडियन कम्युनिटी के मेरे साथी, देश दुनिया से जुड़े सभी हरि भक्त, देवियों और सज्जनों, जय स्वामीनारायण!

आज फ्रांस की राजधानी पेरिस में भव्य स्वामीनारायण मंदिर का लोकार्पण हो रहा है। यह लोकार्पण भारत और फ्रांस के सांस्कृतिक संबंधों का नया युग स्तंभ है। पूज्य संत जनों और सनातन परंपरा के श्रेष्ठ जनों के आशीर्वाद के साथ आज इस लोकार्पण का मंच ‘वसुधैव कुटुम्बकम’ के भाव का मंच बन गया है। भगवान स्वामीनारायण की कृपा और हमारे संतों का स्नेह, संतों का आशीर्वाद, मेरा सौभाग्य है कि मुझे ऐसे पुण्य अवसरों से जुड़ने का अवसर हमेशा मिलता रहता है। आज भी मैं भले ही पेरिस में आप सबके बीच उपस्थित नहीं हूं, लेकिन मन से और हृदय से, मैं स्वयं को आपके बीच ही अनुभव कर रहा हूं।

साथियों,

आज इस अवसर पर मैं परम पूज्य प्रमुख स्वामी जी महाराज का भी श्रद्धापूर्वक स्मरण करता हूं। प्राचीन काल में भारत का जो सांस्कृतिक आध्यात्मिक वैभव था, उन्होंने उसके पुनर्जागरण का एक अभियान शुरू किया था। आज उसका प्रकाश यूरोप समेत पूरी दुनिया में फैल रहा है। 2024 में अबू धाबी में भव्य मंदिर का लोकार्पण हुआ था। आज वहां हजारों लोग दर्शन करने जाते हैं और अब यहां पेरिस में स्वामीनारायण मंदिर का निर्माण सृजन की यह निरंतरता, यह संतों की संकल्प शक्ति का ही प्रमाण है। मैं पुनीत कार्य के लिए पूज्य महंत स्वामी का आभार प्रकट करता हूं, मैं उनके चरणों में प्रणाम करता हूं। मैं BAPS स्वामीनारायण संस्था को और करोड़ों हरि भक्तों को इस अवसर पर हृदय की गहराई से बधाई देता हूं।

साथियों,

BAPS के माध्यम से जब अलग-अलग देश में मंदिरों की प्राण प्रतिष्ठा होती है, तो वहां भारत के प्राचीन विचार और मानवीय मूल्य भी साथ-साथ ही जाते हैं और भारत का विचार कहता है ‘समानं मनः सह चित्तमेषाम्’ अर्थात हमारे मन समान हो, हमारे हृदय साथ जुड़े। इसलिए आज जब फ्रांस में इतना भव्य मंदिर बनकर तैयार हुआ है, यह फ्रांस की विविधता को तो समृद्ध करेगा ही, इससे भारत और फ्रांस के सांस्कृतिक संबंधों को भी ऊर्जा मिलेगी।

साथियों,

बीते वर्षों में भारत और फ्रांस के संबंध नई ऊंचाइयों तक पहुंचे हैं। मेरे मित्र, प्रेसिडेंट मैक्रों के साथ मिलकर दोनों देश एक Special Global Strategic Partnership बना रहे हैं। Technology, AI और Defence से लेकर Space और Climate Action तक हम एक नई गति और नई ऊर्जा के साथ मिलकर के आगे बढ़ रहे हैं। हम 2026 को India-France Year of Innovation के रूप में भी सेलिब्रेट कर रहे हैं। भारत-फ्रांस की ये Strategic Partnership इसलिए भी खास है, क्योंकि ये हमारे पुराने सांस्कृतिक-राजनैतिक सम्बन्धों की मजबूत बुनियाद पर टिकी है। इतिहास गवाह है, फ्रांस में भारतीय सैनिकों के बलिदान का इतिहास आज भी मन-मंदिर में जीवित है। भाषा से जुड़े विषयों में रुचि रखने वाले लोग यह भी जानते हैं कि फ्रेंच स्कॉलर्स ने संस्कृत को लोकप्रिय बनाने में कितनी अहम भूमिका निभाई है। रामकृष्ण परमहंस और स्वामी विवेकानंद पर रोमाँ रोलाँ की की लेखनी हमारी सोसाइटीज़ को और करीब लाई है। पेरिस से पुडुचेरी के अरबिंदो आश्रम तक 'The mother' की spiritual journey, उसने कितने ही भारतीय और फ्रेंच साधकों को inspire किया है।

साथियों,

दशकों पहले श्रील प्रभुपाद स्वामी भी फ्रांस आए थे। इस्कॉन के जरिए भारत फ्रांस के बीच आध्यात्मिक सम्बन्धों का नया अध्याय उन्होंने शुरू किया था। आज योग भी भारत-फ्रांस के people to people कनेक्ट का एक माध्यम बन चुका है। 'इंटरनेशनल योगा डे' पर एफिल टॉवर के सामने से आने वाली तस्वीरें फ्रांस में योग की लोकप्रियता का उदाहरण बनती हैं और अब BAPS के इस भव्य मंदिर के जरिए, हमारे उन सांस्कृतिक सम्बन्धों में एक नया अध्याय जुड़ रहा है।

साथियों,

इन दिनों, भारत फ्रांस Joint Ventures की संभावनाओं पर बातें होती हैं। स्वामीनारायण मंदिर ने इस संभावना में भी एक नया आयाम जोड़ा है। यह मंदिर 'मेड इन इंडिया' है और 'बिल्ट इन फ्रांस' है। इसके काफी पत्थरों को भारत में तराशा गया है। भारत की प्राचीन प्रतिभा यहाँ फ्रांस में आधुनिक इंजीनियरिंग से आकर जुड़ चुकी है। पेरिस में इस भव्य मंदिर ने आकार लिया है। इसलिए, मैं आशा करता हूँ, यह मंदिर सदियों तक भारत और फ्रांस के बीच सहयोग और संभावनाओं का भी प्रतीक बनकर उभरेगा।

साथियों,

स्वामीनारायण मंदिर हमेशा से भक्ति के साथ-साथ सेवा का माध्यम भी रहे हैं। मुझे बताया गया है, यह मंदिर भी सेवा प्रकल्पों का वैसा ही केंद्र बनेगा। मुझे विश्वास है कि यहाँ से भारतीय संस्कृति के जो स्वर निकलेंगे, उनका लाभ पूरे यूरोप में लोगों को मिलेगा। भविष्य में मुझे जब भी समय मिलेगा, मैं इस मंदिर में दर्शन करने का प्रयास अवश्य करूंगा। इन्हीं शब्दों के साथ, एक बार फिर आज के इस लोकार्पण समारोह में सम्मिलित सभी अतिथिगणों को, सभी परिवारों को, सभी हरि भक्तों को और पूरी Indian Diaspora को मेरी ओर से इस शुभारंभ पर्व की ढेरों शुभकामनाएं!

बहुत-बहुत धन्यवाद!

मर्सी बोकू!

जय स्वामीनारायण!