మా కామాఖ్య దివ్య లోక్ పరియోజనకు శంకుస్థాపన్
రూ. 3400 కోట్లతో బహుళ రోడ్ల అప్‌గ్రేడేషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని
క్రీడలు మరియు వైద్య మౌలిక సదుపాయాలను పెంపొందించే ప్రాజెక్టుల పనులకూ ప్రారంభోత్సవం
"మా కామాఖ్య దర్శనం కోసం భక్తుల రద్దీ పెరగడంతో ఈశాన్య ప్రాంతంలో అస్సాం పర్యాటకానికి గేట్‌వే అవుతుంది"
"మన తీర్థయాత్రలు, దేవాలయాలు మరియు విశ్వాస స్థలాలు మన నాగరికత వేల సంవత్సరాల ప్రయాణానికి చెరగని గుర్తులు"
"జీవన సౌలభ్యమే ప్రస్తుత ప్రభుత్వ ప్రాధాన్యత"
"చారిత్రక ప్రాసంగిక స్థలాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలను ప్రారంభించనుంది"
"మోదీ హామీ అంటే నెరవేర్చే హామీ"
ఈ ఏడాది మౌలిక సదుపాయాల కోసం 11 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
‘‘పగలు, రాత్రి కష్టపడి తాను ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే సంకల్పం మోదీకి ఉంది’’
"భారతదేశం, భారతీయులకు సంతోషకరమైన మరియు సంపన్నమైన జీవితాన్ని సృష్టించడం, భారతదేశాన్ని ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చడం, 2047 నాటికి భారతదేశాన్ని వికసిత భారత్‌గా మార్చడం లక్ష్యం"

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు అస్సాంలోని గౌహ‌తిలో రూ. 11,000 కోట్ల విలువైన ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న చేశారు. గౌహతిలో స్పోర్ట్స్ & మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీని పెంపొందించే ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, 11,000 కోట్ల రూపాయ‌ల విలువైన ప‌థ‌కాల‌కు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేసేందుకు మా కామాఖ్య ఆశీర్వాదంతో ఈరోజు అస్సాంలో ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. నేటి అభివృద్ధి ప్రాజెక్టులు ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఆగ్నేయాసియాలోని పొరుగు దేశాలకు అస్సాం కనెక్టివిటీని పెంచుతాయని, అలాగే పర్యాటక రంగంలో ఉపాధిని పెంచుతుందని,  రాష్ట్రంలోని క్రీడా ప్రతిభకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ఆయన అన్నారు. నేటి అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా రాష్ట్రంలో వైద్య విద్య మరియు ఆరోగ్య సంరక్షణ రంగానికి విస్తరణ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. నేటి అభివృద్ధి ప్రాజెక్టు కోసం అస్సాం మరియు ఈశాన్య ప్రాంత ప్రజలను ప్రధాని మోదీ అభినందించారు తనకు ఘన స్వాగతం పలికిన గౌహతి పౌరులకు ధన్యవాదాలు తెలిపారు.

తాను ఇటీవల అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, ఈరోజు మా కామాఖ్యకు చేరుకున్నందుకు, మా కామాఖ్య దివ్య లోక్ పరియోజనకు శంకుస్థాపన చేసినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ప్రాజెక్ట్ కాన్సెప్ట్, పరిధిని వెలుగులోకి తెస్తూ, ఇది పూర్తి అయిన తర్వాత, ఇది భక్తులకు మరింత సౌలభ్యం, సౌకర్యాన్ని పెంచుతుందని, అలాగే పాదచారులకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని తెలియజేసారు. "మా కామాఖ్య దర్శనం కోసం భక్తుల రద్దీ పెరగడంతో ఈశాన్య ప్రాంతంలో అస్సాం పర్యాటకానికి గేట్‌వే అవుతుంది", అని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ కృషిని ప్రశంసిస్తూ ప్రధాన మంత్రి అన్నారు.

 

భారతీయ పుణ్యక్షేత్రాలు, దేవాలయాల ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, ఈ ప్రదేశాలు వేల సంవత్సరాలుగా మన నాగరికత చెరగని గుర్తుగా నిలుస్తాయని, భారతదేశం ఎదుర్కొన్న ప్రతి సంక్షోభాన్ని ఎలా నిలబెట్టుకుందో చూపుతుందని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. పూర్వం సుభిక్షంగా ఉన్న నాగరికతలు ఇప్పుడు శిథిలావస్థలో ఎలా ఉన్నాయో మనం చూశాం. స్వాతంత్య్రానంతర ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరి స్వంత సంస్కృతి, గుర్తింపు గురించి సిగ్గుపడే ధోరణిని ప్రారంభించాయని మరియు భారతదేశంలోని పవిత్ర స్థలాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాయని ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. 'వికాస్' (అభివృద్ధి) మరియు 'విరాసత్' (హెరిటేజ్) రెండింటిపై దృష్టి సారించే విధానాల సహాయంతో గత 10 సంవత్సరాలలో దీనిని సరిదిద్దామని ఆయన అన్నారు. అస్సాం ప్రజలకు ఈ విధానాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, రాష్ట్రంలోని చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రదేశాలను ఆధునిక సౌకర్యాలతో అనుసంధానం చేయడం, ఈ ప్రదేశాలను సంరక్షించడం మరియు అభివృద్ధిని వేగవంతం చేయడం వంటి వాటి ప్రాముఖ్యతను ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. ఐఐటీ, ఐఐఎం వంటి ప్రముఖ విద్యాసంస్థల విస్తరణను గమనించిన ఆయన, అంతకుముందు పెద్ద నగరాల్లో మాత్రమే వీటిని ఏర్పాటు చేసేవారని అన్నారు. అయితే, ఇప్పుడు ఐఐటీలు, ఐఐఎంలు, ఏఐఐఎంల నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించింది, అస్సాంలో మొత్తం వైద్య కళాశాలల సంఖ్య అంతకుముందు 6గా ఉంది, ఇది 12కి పెరిగింది. రాష్ట్రం క్రమంగా క్యాన్సర్ చికిత్సకు  ఈశాన్యంలో కేంద్రంగా మారుతుందని ఆయన నొక్కి చెప్పారు.

పేదల కోసం 4 కోట్ల పక్కా గృహాలు నిర్మించడం, ఉజ్వల యోజన కింద కుళాయి కనెక్షన్లు, విద్యుత్, వంటగ్యాస్ కనెక్షన్లు, స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్ల నిర్మాణం వంటి అంశాలను ప్రస్తావిస్తూ “సౌలభ్యం జీవనం ప్రస్తుత ప్రభుత్వ ప్రధానాంశం” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

 

వారసత్వంతో పాటు అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించడం వల్ల భారతదేశంలోని యువతకు భారీ ప్రయోజనం చేకూరిందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. దేశంలో పర్యాటకం మరియు తీర్థయాత్రల పట్ల పెరుగుతున్న ఉత్సాహాన్ని గమనించిన ప్రధాన మంత్రి, కాశీ కారిడార్ పూర్తయిన తర్వాత వారణాసిలో రికార్డు స్థాయిలో భక్తుల రద్దీ గురించి తెలియజేశారు. "గత సంవత్సరంలో, 8.50 కోట్ల మంది ప్రజలు కాశీని సందర్శించారు, 5 కోట్ల మందికి పైగా ఉజ్జయిని మహాకల్ లోక్‌ను సందర్శించారు, మరియు 19 లక్షల మందికి పైగా భక్తులు కేదార్ధామ్‌ను సందర్శించారు" అని ఆయన తెలియజేశారు. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ తర్వాత గడిచిన 12 రోజుల్లో అయోధ్యలో 24 లక్షల మందికి పైగా ప్రజలు వీక్షించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మా కామ్ఖ్య దివ్య లోక్ పరియోజన పూర్తయిన తర్వాత ఇక్కడ కూడా అలాంటి దృశ్యం ఆవిష్కృతమవుతుందని ఆయన పునరుద్ఘాటించారు.

రిక్షా నడిపే వారయినా, టాక్సీ డ్రైవర్ అయినా, హోటల్ యజమాని అయినా లేదా వీధి వ్యాపారులైనా సరే, యాత్రికులు మరియు భక్తుల రాకతో పేదలకు కూడా జీవనోపాధి పెరుగుతుందని, ఈ ఏడాది బడ్జెట్‌లో పర్యాటకంపై ప్రభుత్వం దృష్టి సారించిన విషయాన్ని ప్రధాని తెలియజేశారు. "చారిత్రక సంబంధమైన ప్రదేశాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలను ప్రారంభించబోతోంది", ఈ విషయంలో ఈశాన్య రాష్ట్రాల ముందు ఉన్న అనేక అవకాశాలను హైలైట్ చేస్తూ ప్రధాని మోదీ అన్నారు. అందువల్ల ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని చెప్పారు.

 

గ‌త 10 సంవ‌త్స‌రాల‌లో ఈశాన్యంలో ప‌ర్యాట‌కుల సంఖ్య రికార్డు స్థాయిలో ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావిస్తూ, ఇంత‌కు ముందు ఈ ప్రాంత అందం ఉన్న‌ప్ప‌టికీ, హింసాకాండ మరియు వనరుల కొరత కారణంగా పర్యాటకుల సంఖ్య చాలా తక్కువగా ఉందని అన్నారు. గత ప్రభుత్వాలు చూపిన నిర్లక్ష్యానికి ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు ప్రయాణించడానికి గంటల సమయం పట్టే ప్రాంతంలో వాయు, రైలు మరియు రోడ్డు కనెక్టివిటీ పేలవంగా ఉండేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం, రాష్ట్ర స్థాయిలో డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వమే కారణమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

పేదలు, మహిళలు, యువత మరియు రైతులకు ప్రాథమిక సౌకర్యాల హామీని ప్రస్తావిస్తూ “మోదీ హామీ అంటే నెరవేరే హామీ” అని ప్రధాని అన్నారు. వివికసిత భారత్ సంకల్ప్ యాత్ర,  ప్రభుత్వ పథకాలు అందుకోలేని వారికి లబ్ధి చేకూర్చేందుకు ఉద్దేశించిన ‘మోదీ హామీ వాహనం’ గురించి ఆయన ప్రస్తావించారు. “దేశవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది ప్రజలు వికాస్ భారత్ సంకల్ప్ యాత్రలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో అస్సాం ప్రజలు కూడా దాని ప్రయోజనాలను పొందారు, ” అని అన్నారాయన. కేంద్రం  విజన్‌ను పంచుకుంటూ, ప్రతి పౌరుడి జీవితాలను సరళీకృతం చేయాలని ప్రధాన మంత్రి ధృవీకరించారు, ఈ నిబద్ధత ఈ సంవత్సరం బడ్జెట్ ప్రకటనలలో కూడా ప్రతిబింబిస్తుంది. ఈ ఏడాది ప్రభుత్వం మౌలిక సదుపాయాల కోసం రూ. 11 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని ప్రతిజ్ఞ చేసింది, మౌలిక సదుపాయాలపై ఈ రకమైన వ్యయం మరింత ఉపాధిని సృష్టించి అభివృద్ధికి ఊపందుకుంటుంది. 2014కి ముందు గత 10 ఏళ్లలో అస్సాంలో మొత్తం మౌలిక సదుపాయాల బడ్జెట్ రూ.12 లక్షల కోట్లుగా ఉందని కూడా ఆయన స్పష్టం చేసారు. 

ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరాపై గత 10 సంవత్సరాలలో ప్రభుత్వం ఉద్ఘాటించిన విషయాన్ని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. కోటి కుటుంబాలకు సోలార్ రూఫ్‌టాప్‌లను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం సహాయం చేసే రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్ ప్రారంభంతో విద్యుత్ బిల్లులను సున్నాకి తగ్గించాలని ఈ ఏడాది బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయం గురించి ఆయన తెలియజేశారు. "దీనితో, వారి విద్యుత్ బిల్లు కూడా సున్నా అవుతుంది మరియు సాధారణ కుటుంబాలు తమ ఇంటి వద్ద విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా సంపాదించగలుగుతారు" అని ఆయన తెలిపారు.

 

దేశంలో 2 కోట్ల లఖ్‌పతి దీదీలను సృష్టించే హామీని దృష్టిలో ఉంచుకుని, గత ఏడాది ఈ సంఖ్య 1 కోటికి చేరుకుందని, ఈ ఏడాది బడ్జెట్‌లో ఇప్పుడు 3 కోట్ల లఖపతి దీదీలను లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రధాని మోదీ తెలియజేశారు. దీంతో అసోంకు చెందిన లక్షలాది మంది మహిళలు కూడా లబ్ధి పొందుతారని తెలిపారు. స్వయం సహాయక సంఘాలతో సంబంధం ఉన్న మహిళలందరికీ కొత్త అవకాశాలను మరియు ఆయుష్మాన్ పథకంలో అంగన్‌వాడీ మరియు ఆశా వర్కర్లను చేర్చడాన్ని కూడా ఆయన స్పృశించారు.

"మోదీకి రాత్రింబగళ్లు పనిచేసి, ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే సంకల్పం ఉంది", మోడీ హామీపై ఈశాన్య రాష్ట్రాలు విశ్వాసం కలిగి ఉన్నాయని ప్రధాని ఉద్ఘాటించారు. అసోంలోని ఒకప్పుడు అల్లకల్లోలంగా ఉన్న మరియు హింసాత్మకంగా ఉన్న ప్రాంతాల్లో శాశ్వత శాంతి నెలకొల్పడం మరియు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాల పరిష్కారం గురించి ఆయన ప్రస్తావించారు. "ఇక్కడ 10 కంటే ఎక్కువ ప్రధాన శాంతి ఒప్పందాలు సంతకం చేయబడ్డాయి", గత కొన్ని సంవత్సరాలుగా ఈశాన్య ప్రాంతంలోని వేలాది మంది యువత హింసా మార్గాన్ని విస్మరించి అభివృద్ధిని ఎంచుకున్నారని ఆయన తెలియజేశారు. వీరిలో అస్సాంకు చెందిన 7,000 మందికి పైగా యువత కూడా ఆయుధాలను వదులుకున్నారని, దేశాభివృద్ధిలో భుజం భుజం కలిపి నిలబడతామని ప్రతిజ్ఞ చేశారన్నారు. అనేక జిల్లాల్లో ఏఎఫ్‌ఎస్‌పీఏ ఎత్తివేతను ఎత్తిచూపిన ఆయన.. హింసాకాండకు గురైన ప్రాంతాలు నేడు ప్రభుత్వ సహకారంతో ప్రజల ఆకాంక్ష మేరకు అభివృద్ధి చెందుతున్నాయన్నారు.

 

లక్ష్యాలను ఏర్పరచుకోవడం ప్రాముఖ్యతను ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు మరియు గత ప్రభుత్వాలకు లక్ష్యాలు లేవని, కష్టపడి పనిచేయడంలో విఫలమయ్యాయని నొక్కి చెప్పారు. తూర్పు ఆసియా మాదిరిగానే ఈశాన్య ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉత్తర,  తూర్పు ఆసియాలో విస్తరించిన కనెక్టివిటీని సులభతరం చేయాలని అతను అన్నారు. దక్షిణాసియా ఉపప్రాంతీయ ఆర్థిక సహకారం కింద రాష్ట్రంలోని అనేక రహదారులు ఈశాన్య ప్రాంతాలను వాణిజ్య కేంద్రంగా మారుస్తూ అప్‌గ్రేడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈశాన్య ప్రాంతంలోని యువత తూర్పు ఆసియా తరహాలో తమ ప్రాంత అభివృద్ధికి సాక్ష్యమివ్వాలనే ఆకాంక్షను ప్రధాన మంత్రి గుర్తించి, ఈ కలను సాకారం చేయాలనే తన సంకల్పాన్ని వ్యక్తం చేశారు. భారతదేశం మరియు దాని యొక్క సంతోషకరమైన మరియు సంపన్నమైన జీవితమే లక్ష్యమని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. నేడు జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటికీ ప్రధాన కారణం పౌరులే. ‘‘ప్రపంచంలో భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం. లక్ష్యం విక్షిత్ భారత్ 2047”, అస్సాం మరియు ఈశాన్య రాష్ట్రాలు పోషించాల్సిన భారీ పాత్రను పునరుద్ఘాటిస్తూ ప్రధాన మంత్రి ముగించారు. ఈ కార్యక్రమంలో అస్సాం గవర్నర్ శ్రీ గులాబ్ చంద్ కటరాయ్, అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ మరియు కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాలు, ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ తదితరులు పాల్గొన్నారు.

 

నేపథ్యం 

తీర్థయాత్రలను సందర్శించే ప్రజలకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడం ప్రధాన మంత్రి  కీలకమైన అంశం. ఈ ప్రయత్నంలో మరో దశలో, ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన కీలక ప్రాజెక్టులలో మా కామాఖ్య దివ్య పరియోజన (మా కామాఖ్య యాక్సెస్ కారిడార్) కూడా ఉంది, ఇది ఈశాన్య ప్రాంతానికి ప్రధానమంత్రి అభివృద్ధి చొరవ కింద మంజూరు చేయబడింది. ఇది కామాఖ్య ఆలయాన్ని సందర్శించే యాత్రికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తుంది.

3400 కోట్లకు పైగా విలువైన బహుళ రోడ్ల అప్‌గ్రేడేషన్ ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. దీని కింద 38 వంతెనలతో సహా 43 రోడ్లు దక్షిణాసియా సబ్‌రీజినల్ ఎకనామిక్ కోఆపరేషన్ కారిడార్ కనెక్టివిటీలో భాగంగా అప్‌గ్రేడ్ చేయబడతాయి. డోలాబరీ నుండి జముగురి మరియు బిస్వనాథ్ చారియాలీ నుండి గోహ్‌పూర్ వరకు నాలుగు వరుసల ప్రాజెక్టులను ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు ఇటానగర్‌కు కనెక్టివిటీని మెరుగుపరచడానికి మరియు ప్రాంతం మొత్తం ఆర్థికాభివృద్ధిని పెంచడానికి సహాయపడతాయి.

ఈ ప్రాంతం అద్భుతమైన క్రీడా సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి, రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలను పెంచడానికి ప్రధాన మంత్రి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టులలో చంద్రాపూర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా స్టేడియం, నెహ్రూ స్టేడియంను ఫిఫా  స్టాండర్డ్ ఫుట్‌బాల్ స్టేడియంగా అప్‌గ్రేడ్ చేయడం వంటివి ఉన్నాయి. 

గౌహ‌తి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిట‌ల్ మౌలిక స‌దుపాయాల అభివృద్ధికి ప్ర‌ధాన మంత్రి శంకుస్థాప‌న చేశారు. ఇంకా, కరీంగంజ్ లోమెడికల్ కాలేజీ అభివృద్ధికి శంకుస్థాపన కూడా చేశారు.

 

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Marvell to invest $250 million, double India workforce in 3 years

Media Coverage

Marvell to invest $250 million, double India workforce in 3 years
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates Dilip Mahadu Gavit on winning Gold in Men’s 100m T47 at Commonwealth Games 2026
July 30, 2026

The Prime Minister, Shri Narendra Modi, has congratulated Dilip Mahadu Gavit on winning the Gold medal in the Men’s 100m T47 event at the Commonwealth Games 2026.

The Prime Minister noted that Dilip Mahadu Gavit set a new Commonwealth Games record and achieved his season best with a remarkable timing.

Shri Modi said that his speed, determination and dedication have made the nation proud and wished him the very best for his future endeavours.

In a post, Shri Modi said;

“A phenomenal performance by Dilip Mahadu Gavit!

Congratulations to him on winning the Gold Medal in the Men’s 100m T47 event with a remarkable timing, setting a new Games Record and achieving his Season Best. His speed, determination and dedication have made our nation proud. Best wishes for his future endeavours!

#CWG2026”