నూతన ఓసీఐ పోర్టల్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రశంసించారు. ‘‘విస్తరించిన ఫీచర్లు, మెరుగైన పనితీరుతో కూడిన కొత్త ఓసీఐ పోర్టల్.. ప్రజాహితమైన డిజిటల్ పాలనను బలోపేతం చేసే దిశగా వేసిన ముఖ్యమైన అడుగుగా నిలుస్తుంది’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఎక్స్లో కేంద్ర హోం వ్యవహారాల మంత్రి శ్రీ అమిత్ షా పోస్టుకు స్పందిస్తూ ప్రధాని ఇలా అన్నారు:
‘‘విస్తరించిన ఫీచర్లు, మెరుగైన పనితీరుతో రూపుదిద్దుకున్న కొత్త ఓసీఐ పోర్టల్ ప్రజాహితమైన డిజిటల్ పాలనను బలోపేతం చేసే దిశగా వేసిన ముఖ్యమైన అడుగుగా నిలుస్తుంది’’
With enhanced features and improved functionality, the new OCI Portal marks a major step forward in boosting citizen friendly digital governance. https://t.co/aGjMPkDKuW
— Narendra Modi (@narendramodi) May 19, 2025


