"క్రీడలలో ఓటమి లేదు, గెలవడం లేదా నేర్చుకోవడం మాత్రమే"
"మీ విజయం యావత్ దేశానికి స్ఫూర్తినిస్తుంది మరియు పౌరులను గర్వపడేలా కూడా చేస్తుంది"
"ఈ రోజుల్లో, క్రీడలు కూడా ఒక వృత్తిగా అంగీకరించబడుతున్నాయి"
"దివ్యాంగుల క్రీడా విజయం క్రీడలలో మాత్రమే స్ఫూర్తిని కలిగించేది కాదు, కానీ అది జీవితంలోనే స్ఫూర్తిదాయకం"
"మునుపటి విధానం 'ప్రభుత్వం కోసం క్రీడాకారులు' ఇప్పుడు అది 'అథ్లెట్ల కోసం ప్రభుత్వం'"
“నేడు ప్రభుత్వ విధానం క్రీడాకారులను దృష్టిలో ఉంచుకుని ఉంది”
“పొటెన్షియల్ ప్లస్ ప్లాట్‌ఫాం అంటే పనితీరుకు సమానం. సంభావ్యత అవసరమైన ప్లాట్‌ఫారమ్‌ను కనుగొన్నప్పుడు పనితీరు ఊపందుకుంటుంది”
"ప్రతి టోర్నమెంట్‌లో మీ భాగస్వామ్యం మానవ కలల విజయం"

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూ ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో భారతదేశపు ఆసియా పారా గేమ్స్ బృందంతో సంభాషించారు.  మరియు ప్రసంగించారు. ఆసియన్ పారా గేమ్స్ 2022లో అత్యుత్తమ విజయాలు సాధించిన క్రీడాకారులను అభినందించేందుకు, భవిష్యత్తులో జరిగే పోటీల కోసం వారిని ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం నిర్వహించారు. 

 

పారా అథ్లెట్లను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, వారిని కలవడానికి, వారి అనుభవాలను పంచుకోవడానికి తాను ఎదురు చూస్తున్నానని అన్నారు. "మీరు ఇక్కడికి వచ్చినప్పుడల్లా కొత్త ఆశలు, నూతన ఉత్సాహాన్ని మీ వెంట తీసుకువస్తారు", అని ప్రధాన మంత్రి అన్నారు. తాను ఒక్క విషయం కోసం మాత్రమే ఇక్కడకు వచ్చానని, పారా అథ్లెట్ల విజయాలను అభినందించడమేనని ఉద్ఘాటించారు. పారా ఏషియన్ గేమ్స్‌లో ఫలితాలను తాను చాలా దగ్గరగా అనుసరించడమే కాకుండా వాటిలో మమేకమయ్యానని ప్రధాని తెలిపారు. క్రీడాకారులు వహించిన పాత్రను, వారి సహకారాన్ని ప్రశంసించారు. వారి కోచ్‌లను, వారి కుటుంబాలను కూడా అభినందించాడు. దేశంలోని 140 కోట్ల మంది పౌరుల తరపున శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

 

క్రీడలలో నెలకొనే అత్యంత పోటీతత్వ స్వభావాన్ని తెలియజేస్తూ, ప్రధాన మంత్రి అథ్లెట్లు ఒకరితో ఒకరు పోటీపడుతుండగా వారిలోని అంతర్గత పోటీపై కూడా దృష్టి పెట్టారు. అథ్లెట్ల అత్యున్నత స్థాయి సాధన, అంకితభావాన్ని ప్రధాని ప్రశంసించారు. “మీరంతా ఇక్కడ ఉన్నారు, కొందరు విజేతలుగా తిరిగి వచ్చారు, మరికొందరు తెలివైనవారు కానీ ఎవరూ ఓడిపోయి తిరిగి రాలేదు” అని ప్రధాన మంత్రి అన్నారు. “క్రీడలలో ఓడిపోవడం లేదు, గెలవడం లేదా నేర్చుకోవడం మాత్రమే”, క్రీడలలో ఉండే అభ్యాస ప్రక్రియను హైలైట్ చేస్తున్నప్పుడు ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. 140 కోట్ల మంది పౌరుల నుంచి ఎంపిక కావడం పారా అథ్లెట్లకు దక్కిన భారీ విజయంగా ఆయన పేర్కొన్నారు. మొత్తం పతకాల సంఖ్య 111 సాధించి రికార్డు బద్దలు కొట్టడం. "మీ విజయం యావత్ దేశానికి స్ఫూర్తినిస్తుంది,  పౌరులలో గర్వించదగిన అనుభూతిని కలిగిస్తుంది" అని శ్రీ మోదీ అన్నారు,

అథ్లెట్ల రికార్డు బద్దలు కొడుతూ ప్రదర్శించిన ఆట తీరు పై ప్రధాని స్పందిస్తూ.. గుజరాత్ నుండి లోక్‌సభలో రికార్డు స్థాయిలో ఎన్నికల విజయం సాధించిన సందర్బంగా శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి తనను అభినందించినప్పుడు అనుభూతిని గుర్తు చేసుకున్నారు. ఈ 111 పతకాలు కేవలం అంకెలే కాదు 140 కోట్ల కలలు అని ఆయన అన్నారు. 2014లో సాధించిన పతకాల కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ కాగా, బంగారు పతకాల సంఖ్య పది రెట్లు ఎక్కువని, పతకాల పట్టికలో భారత్ 15వ స్థానం నుంచి టాప్ 5కి చేరుకుందని ఆయన తెలియజేశారు.

గత కొన్ని నెలలుగా క్రీడా రంగంలో భారతదేశం సాధించిన విజయాలను ప్రధాన మంత్రి ప్రముఖంగా ప్రస్తావిస్తూ, “పారా ఏషియన్ గేమ్స్‌లో మీ విజయం ప్రశంసనీయం” అని అన్నారు. ఆగస్టులో బుడాపెస్ట్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం, ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్ పురుషుల జట్టుకు తొలి బంగారు పతకం, టేబుల్ టెన్నిస్‌లో మహిళల పెయిర్ తొలి పతకం, పురుషుల బ్యాడ్మింటన్ జట్టు థామస్ కప్ విజయం, 28 స్వర్ణాలతో సహా 107 పతకాలను, ఆసియా గేమ్స్‌లో పతకాలు, ఆసియా పారా గేమ్స్‌లో అత్యంత విజయవంతమైన పతకాలు. సాధించడాన్ని వరుసగా ప్రస్తావించారు. 

పారా గేమ్‌ల విశిష్టతను చెబుతూ , దివ్యాంగుల క్రీడా విజయం క్రీడల్లోనే స్ఫూర్తిని పొందే అంశం కాదని, అది జీవితంలోనే స్ఫూర్తిదాయకమని అన్నారు. ఒక క్రీడా సమాజంగా భారతదేశం పురోగతిని, దాని క్రీడా సంస్కృతిని ప్రధాన మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. "మేము 2030 యూత్ ఒలింపిక్స్, 2036 ఒలింపిక్స్ నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాము" అని ప్రధాని తెలిపారు. 

 

క్రీడల్లో షార్ట్‌కట్‌లు లేవని, క్రీడాకారులు తమ సొంత సామర్థ్యాలపై ఆధారపడతారని, అయితే ఒక చిన్న సహాయం దాని ప్రభావాన్ని గణనీయంగా చూపుతుందని ప్రధాని అన్నారు. కుటుంబాలు, సమాజం, సంస్థలు, ఇతర సహాయక పర్యావరణ వ్యవస్థల సమిష్టి మద్దతు అవసరమని ఆయన నొక్కి చెప్పారు. కుటుంబాల్లో క్రీడల పట్ల దృక్పథాన్ని మార్చుకోవాలని పేర్కొన్నారు.

"మునుపటి కాలం వలె కాకుండా సమాజం క్రీడలను ఒక వృత్తిగా గుర్తించడం ప్రారంభించింది" అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం ‘ప్రభుత్వం కోసం క్రీడాకారులు’ నుండి ‘అథ్లెట్ల కోసం ప్రభుత్వం’గా మారుతున్న విధానాన్ని ఆయన ఎత్తిచూపారు. అథ్లెట్ల విజయం పట్ల ప్రభుత్వ సున్నితత్వాన్ని ఆయన అభివర్ణించారు. "అథ్లెట్ల కలలు, పోరాటాలను ప్రభుత్వం గుర్తించినప్పుడు, దాని ప్రభావం దాని విధానాలు, ఆలోచనలలో చూడవచ్చు" అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. గత ప్రభుత్వాలు క్రీడాకారులకు ఎలాంటి విధానాలు, మౌలిక సదుపాయాలు, కోచింగ్ సౌకర్యాలు, ఆర్థిక సహాయం అందించ లేదని, ఇది విజయానికి పెద్ద అవరోధంగా మారిందని ఆయన వాపోయారు. గ‌డిచిన 9 సంవ‌త్స‌రాల‌లో, దేశం పాత ప‌ద్ధ‌తి నుండి, బ‌య‌టికి వచ్చి ఎదిగింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. నేడు వివిధ క్రీడాకారులకు 4-5 కోట్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. “ప్రభుత్వ విధానం నేడు క్రీడాకారుల కేంద్రీకృతం చేస్తోంది”, అది అడ్డంకులను తొలగిస్తోందని మరియు వారికి కొత్త అవకాశాలను సృష్టిస్తోందని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. “పొటెన్షియల్ ప్లస్ ప్లాట్‌ఫాం పనితీరుకు సమానం. సంభావ్యత అవసరమైన ప్లాట్‌ఫారమ్‌ను కనుగొన్నప్పుడు పనితీరు మరింత ఊపందుకుంటుంది”, అని అతను వ్యాఖ్యానించారు. ఖేలో ఇండియా స్కీమ్‌ను ప్రస్తావిస్తు, ఇది అథ్లెట్లను అట్టడుగు స్థాయిలలో గుర్తించడం, వారి ప్రతిభను వెలికితీయడం ద్వారా వారిని విజయానికి మార్గం వేసిందని అన్నారు. టాప్స్ చొరవ, వికలాంగుల క్రీడా శిక్షణా కేంద్రం గురించి కూడా ప్రస్తావించారు.

 

అథ్లెట్లు కష్టనష్టాలను ఎదుర్కుంటూ నిలదొక్కుకోవడమే దేశానికి వారు అందించిన గొప్ప సహకారం అని ప్రధాన మంత్రి అన్నారు. మీరు అధిగమించలేని అడ్డంకులను అధిగమించారని ఆయన అన్నారు. ఈ స్ఫూర్తి అన్ని చోట్లా గుర్తింపు పొందింది, సామాజిక మాధ్యమాల వేదికలపై పారా అథ్లెట్ల ప్రశంసలను ప్రధాని ప్రస్తావించారు. సమాజంలోని ప్రతి వర్గం పారా అథ్లెట్ల నుంచి స్ఫూర్తి పొందుతోంది. “ప్రతి టోర్నీలో మీ భాగస్వామ్యం మానవ కలల విజయం. ఇది మీ అతిపెద్ద వారసత్వం. అందుకే మీరు ఇలా కష్టపడి దేశాన్ని గర్వపడేలా చేస్తారని నాకు నమ్మకం ఉంది. మా ప్రభుత్వం మీ వెంట ఉంది, దేశం మీ వెంట ఉంది” అని ప్రధాన మంత్రి అన్నారు.

 ఒక దేశంగా మనం ఏ మైలురాయి వద్ద ఆగిపోమని, మన సన్మానాలపై విశ్రాంతి తీసుకుంటామని ఆయన అన్నారు. "మనం  టాప్ 5 ఆర్థిక వ్యవస్థలలోకి చేరుకున్నాము, ఈ దశాబ్దంలో మనం టాప్ 3 ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంటామని,  2047లో ఈ దేశం వికసిత  భారత్‌గా మారుతుందని నేను గట్టిగా చెబుతున్నాను" అని ప్రధానమంత్రి ప్రకటించారు.

 

కేంద్ర యువజన, క్రీడా వ్యవహారాల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, భారత పారాలింపిక్స్ కమిటీ అధ్యక్షరాలు శ్రీమతి దీపా మాలిక్, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా,  కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీ నిసిత్ ప్రమాణిక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం:
భారతదేశం ఆసియా పారా గేమ్స్ 2022లో 29 బంగారు పతకాలతో సహా మొత్తం 111 పతకాలను గెలుచుకుంది. ఆసియా పారా గేమ్స్ 2022లో మొత్తం పతకాల సంఖ్య మునుపటి అత్యుత్తమ ప్రదర్శన (2018లో) కంటే 54% పెరిగింది. ఈ సారి సాధించిన 29 బంగారు పతకాలు 2018లో గెలిచిన దానికంటే దాదాపు రెండు రేట్లు ఎక్కువ.

 

ఈ కార్యక్రమంలో అథ్లెట్లు, వారి కోచ్‌లు, పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధికారులు, జాతీయ క్రీడా సమాఖ్యల ప్రతినిధులు, యువజన వ్యవహారాలు,  క్రీడల మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India records highest-ever startup surge with 55,200 recognised in FY26

Media Coverage

India records highest-ever startup surge with 55,200 recognised in FY26
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 18 ఏప్రిల్ 2026
April 18, 2026

From Tap Water to 40,000 Manuscripts: Modi’s Vision Delivers Jobs, Clean Energy & Civilisational Pride