ఏడాది పాటు నిర్వహించే ఉత్సవాలను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
భారత్, భరతమాత, భారతదేశమనే శాశ్వత భావనే వందేమాతర సారాంశం: పీఎం
వలస పాలన కాలంలో.. భారత్‌ స్వాతంత్ర్యం సాధిస్తుందని, బానిస సంకెళ్లను భరతమాత తెంచేస్తుందని, భారతీయులు తమ విధిని తామే లిఖించుకుంటారనే సంకల్పాన్ని వందేమాతరం ప్రకటించింది: పీఎం
భారత స్వాతంత్ర్య ఉద్యమానికి వందేమాతరం ఊపిరిగా మారింది. ప్రతి ఉద్యమకారుడి గొంతులో ఈ నినాదం ప్రతిధ్వనించింది... ప్రతి భారతీయుని భావోద్వేగాన్ని వినిపించింది: పీఎం
స్వాతంత్ర్య సమరయోధులు పాడిన వందేమాతరం.. నిత్య స్ఫూర్తిగా నిలుస్తోంది....

దేశం కోసం వందేమాతరం ఆలపిస్తూ.. ప్రాణత్యాగం చేసిన అందరికీ తెలిసిన, తెలియని, మరుగునపడిన, చరిత్ర పుటలకెక్కని వీరులందరికీ 140 కోట్ల మంది భారతీయులు ఈ రోజు నివాళులు అర్పిస్తున్నారని ప్రధానమంత్రి ప్రకటించారు.

 

 

 

వేద శ్లోకాన్ని చెబుతూ.. ఇది మన మాతృభూమి అని, ఈ దేశం మన తల్లి అని, మనం ఆమె పిల్లలమని, వేద కాలం నుంచి భారతీయులు దేశాన్ని మాతృమూర్తిగా కొలిచారని శ్రీ మోదీ అన్నారు. వందేమాతరం ద్వారా ఈ వేద భావన స్వాతంత్ర్య సమరంలో కొత్త చైతన్యాన్ని నింపిందని వెల్లడించారు.

 

 

 

దేశాన్ని ఒక భౌగోళిక-రాజకీయ ప్రదేశంగా మాత్రమే చూసేవారికి... అలా కాకుండా తల్లిగా పరిగణించాలనే ఆలోచన ఆశ్చర్యం అనిపించవచ్చునని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కానీ, భారత్‌ ఇందుకు భిన్నం... ఇక్కడ తల్లి అంటే- జన్మనిచ్చేది.. పెంచిపోషించేది మాత్రమే కాదు బిడ్డలకు ప్రమాదం కలిగించే దుష్టశక్తులను అంతం చేసే భద్రకాళి. కాబట్టే- భరతమాత శక్తి అపారమని, కష్టాల నుంచి మనల్ని గట్టెక్కించడమేగాక శత్రు నాశనం చేసిందని చెబుతూ- వందేమాతరంలోని పంక్తులను ఆయన ఉటంకించారు. దేశం ఒక తల్లి కాగా, ఆ తల్లి శక్తిసామర్థ్యాలు ఒక దైవ స్వరూపమనే భావనే స్వాతంత్ర ఉద్యమంలో స్త్రీ-పురుషులు సమాన భాగస్వాములు కావడానికి దారితీసిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నారీశక్తి భారత్‌ను మరోసారి పురోగమన పథంలో నిలపగలదనే స్వప్నాలకు ఊతమిచ్చింది ఈ దార్శనికతేనని చెప్పారు.

 

వందేమాతరం ఆనాడు స్వాతంత్ర్య పోరాట గీతమైనప్పటికీ, నేడు మనకు లభించిన స్వేచ్ఛను పరిరక్షించుకోవడంలోనూ ఇది స్ఫూర్తినిస్తున్నదని శ్రీ మోదీ పేర్కొన్నారు. బంకింబాబు అసలు కూర్పు నుంచి కొన్ని పంక్తులను ఈ సందర్భంగా ఉటంకించారు. దీని ప్రకారం... భరతమాత జ్ఞానప్రదాత అయిన సరస్వతీ స్వరూపం మాత్రమే కాదు... సౌభాగ్య ప్రదాత లక్ష్మీదేవి, సాయుధ శక్తిస్వరూపిణి దుర్గామాత కూడా! ఇది జ్ఞానం, శాస్త్ర, సాంకేతికతలలో ముందంజలో నిలిచే దేశాన్ని.. అభ్యసనం-ఆవిష్కరణల శక్తితో సుసంపన్న దేశాన్ని... జాతీయ భద్రతలో స్వావలంబన గల దేశాన్ని నిర్మించడమే ఈ దార్శనికత లక్ష్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

 

దేశం కోసం వందేమాతరం ఆలపిస్తూ.. ప్రాణత్యాగం చేసిన అందరికీ తెలిసిన, తెలియని, మరుగునపడిన, చరిత్ర పుటలకెక్కని వీరులందరికీ 140 కోట్ల మంది భారతీయులు ఈ రోజు నివాళులు అర్పిస్తున్నారని ప్రధానమంత్రి ప్రకటించారు.

 

వేద శ్లోకాన్ని చెబుతూ.. ఇది మన మాతృభూమి అని, ఈ దేశం మన తల్లి అని, మనం ఆమె పిల్లలమని, వేద కాలం నుంచి భారతీయులు దేశాన్ని మాతృమూర్తిగా కొలిచారని శ్రీ మోదీ అన్నారు. వందేమాతరం ద్వారా ఈ వేద భావన స్వాతంత్ర్య సమరంలో కొత్త చైతన్యాన్ని నింపిందని వెల్లడించారు.

 

దేశాన్ని ఒక భౌగోళిక-రాజకీయ ప్రదేశంగా మాత్రమే చూసేవారికి... అలా కాకుండా తల్లిగా పరిగణించాలనే ఆలోచన ఆశ్చర్యం అనిపించవచ్చునని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కానీ, భారత్‌ ఇందుకు భిన్నం... ఇక్కడ తల్లి అంటే- జన్మనిచ్చేది.. పెంచిపోషించేది మాత్రమే కాదు బిడ్డలకు ప్రమాదం కలిగించే దుష్టశక్తులను అంతం చేసే భద్రకాళి. కాబట్టే- భరతమాత శక్తి అపారమని, కష్టాల నుంచి మనల్ని గట్టెక్కించడమేగాక శత్రు నాశనం చేసిందని చెబుతూ- వందేమాతరంలోని పంక్తులను ఆయన ఉటంకించారు. దేశం ఒక తల్లి కాగా, ఆ తల్లి శక్తిసామర్థ్యాలు ఒక దైవ స్వరూపమనే భావనే స్వాతంత్ర ఉద్యమంలో స్త్రీ-పురుషులు సమాన భాగస్వాములు కావడానికి దారితీసిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నారీశక్తి భారత్‌ను మరోసారి పురోగమన పథంలో నిలపగలదనే స్వప్నాలకు ఊతమిచ్చింది ఈ దార్శనికతేనని చెప్పారు.

 

వందేమాతరం ఆనాడు స్వాతంత్ర్య పోరాట గీతమైనప్పటికీ, నేడు మనకు లభించిన స్వేచ్ఛను పరిరక్షించుకోవడంలోనూ ఇది స్ఫూర్తినిస్తున్నదని శ్రీ మోదీ పేర్కొన్నారు. బంకింబాబు అసలు కూర్పు నుంచి కొన్ని పంక్తులను ఈ సందర్భంగా ఉటంకించారు. దీని ప్రకారం... భరతమాత జ్ఞానప్రదాత అయిన సరస్వతీ స్వరూపం మాత్రమే కాదు... సౌభాగ్య ప్రదాత లక్ష్మీదేవి, సాయుధ శక్తిస్వరూపిణి దుర్గామాత కూడా! ఇది జ్ఞానం, శాస్త్ర, సాంకేతికతలలో ముందంజలో నిలిచే దేశాన్ని.. అభ్యసనం-ఆవిష్కరణల శక్తితో సుసంపన్న దేశాన్ని... జాతీయ భద్రతలో స్వావలంబన గల దేశాన్ని నిర్మించడమే ఈ దార్శనికత లక్ష్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

 

షెకావత్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా, ముఖ్యమంత్రి శ్రీమతి రేఖ గుప్తా తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

 

నేపథ్యం

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి ఒక స్మారక తపాలా బిళ్లను, నాణాన్ని కూడా ఆవిష్కరించారు. దీంతో దేశవ్యాప్తంగా మరో ఏడాది పాటు... 2026 నవంబరు 7 వరకూ నిర్వహించే వేడుకలు నేటినుంచి ప్రారంభమయ్యాయి. భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినివ్వడమేగాక జాతీయ ప్రతిష్ఠ, ఐక్యతలను ప్రోదిచేసే ఈ గేయం 150 ఏళ్ల సంబరాలను కొనసాగిస్తుంది.

 

ఈ వేడుకలలో ప్రధాన కార్యక్రమంతోపాటు సమాజంలోని అన్ని వర్గాల పౌరుల భాగస్వామ్యంతో ‘వందేమాతరం’ పూర్తి గీతాన్ని బహిరంగ ప్రదేశాలలో సామూహికంగా ఆలపించారు.

ఈ ఏడాదితో వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ జాతీయ గీతాన్ని 1875 నవంబర్ 7న అక్షయ నవమి శుభ సందర్భంగా బంకించంద్ర ఛటర్జీ రాశారు. ఇది ఆయన నవల ‘ఆనందమఠ్‌’లో భాగంగా తొలిసారి సాహిత్య పత్రిక ‘బంగదర్శన్‌’లో ప్రచురితమైంది. శక్తిసామర్థ్యాలు, సౌభాగ్యం, దైవ స్వరూపంగా మాతృభూమిని ప్రార్థించే ఈ గీతం దేశ ఐక్యత, ఆత్మగౌరవాలను మేల్కొలిపే స్ఫూర్తికి కవితాత్మక వ్యక్తీకరణను సమకూర్చింది. అటుపైన అనతి కాలంలోనే దేశభక్తికి శాశ్వత ప్రతీకగా మారింది.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s strong fundamentals, steady reforms sustaining investor confidence: Baker Tilly

Media Coverage

India’s strong fundamentals, steady reforms sustaining investor confidence: Baker Tilly
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the demise of Shri Govindbhai Parmar
March 07, 2026

The Prime Minister, Shri Narendra Modi has expressed grief over the passing of Shri Govindbhai Parmar, a member of the Gujarat Legislative Assembly.

In a post on X, the Prime Minister said;