దేశం కోసం వందేమాతరం ఆలపిస్తూ.. ప్రాణత్యాగం చేసిన అందరికీ తెలిసిన, తెలియని, మరుగునపడిన, చరిత్ర పుటలకెక్కని వీరులందరికీ 140 కోట్ల మంది భారతీయులు ఈ రోజు నివాళులు అర్పిస్తున్నారని ప్రధానమంత్రి ప్రకటించారు.
వేద శ్లోకాన్ని చెబుతూ.. ఇది మన మాతృభూమి అని, ఈ దేశం మన తల్లి అని, మనం ఆమె పిల్లలమని, వేద కాలం నుంచి భారతీయులు దేశాన్ని మాతృమూర్తిగా కొలిచారని శ్రీ మోదీ అన్నారు. వందేమాతరం ద్వారా ఈ వేద భావన స్వాతంత్ర్య సమరంలో కొత్త చైతన్యాన్ని నింపిందని వెల్లడించారు.
దేశాన్ని ఒక భౌగోళిక-రాజకీయ ప్రదేశంగా మాత్రమే చూసేవారికి... అలా కాకుండా తల్లిగా పరిగణించాలనే ఆలోచన ఆశ్చర్యం అనిపించవచ్చునని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కానీ, భారత్ ఇందుకు భిన్నం... ఇక్కడ తల్లి అంటే- జన్మనిచ్చేది.. పెంచిపోషించేది మాత్రమే కాదు బిడ్డలకు ప్రమాదం కలిగించే దుష్టశక్తులను అంతం చేసే భద్రకాళి. కాబట్టే- భరతమాత శక్తి అపారమని, కష్టాల నుంచి మనల్ని గట్టెక్కించడమేగాక శత్రు నాశనం చేసిందని చెబుతూ- వందేమాతరంలోని పంక్తులను ఆయన ఉటంకించారు. దేశం ఒక తల్లి కాగా, ఆ తల్లి శక్తిసామర్థ్యాలు ఒక దైవ స్వరూపమనే భావనే స్వాతంత్ర ఉద్యమంలో స్త్రీ-పురుషులు సమాన భాగస్వాములు కావడానికి దారితీసిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నారీశక్తి భారత్ను మరోసారి పురోగమన పథంలో నిలపగలదనే స్వప్నాలకు ఊతమిచ్చింది ఈ దార్శనికతేనని చెప్పారు.

వందేమాతరం ఆనాడు స్వాతంత్ర్య పోరాట గీతమైనప్పటికీ, నేడు మనకు లభించిన స్వేచ్ఛను పరిరక్షించుకోవడంలోనూ ఇది స్ఫూర్తినిస్తున్నదని శ్రీ మోదీ పేర్కొన్నారు. బంకింబాబు అసలు కూర్పు నుంచి కొన్ని పంక్తులను ఈ సందర్భంగా ఉటంకించారు. దీని ప్రకారం... భరతమాత జ్ఞానప్రదాత అయిన సరస్వతీ స్వరూపం మాత్రమే కాదు... సౌభాగ్య ప్రదాత లక్ష్మీదేవి, సాయుధ శక్తిస్వరూపిణి దుర్గామాత కూడా! ఇది జ్ఞానం, శాస్త్ర, సాంకేతికతలలో ముందంజలో నిలిచే దేశాన్ని.. అభ్యసనం-ఆవిష్కరణల శక్తితో సుసంపన్న దేశాన్ని... జాతీయ భద్రతలో స్వావలంబన గల దేశాన్ని నిర్మించడమే ఈ దార్శనికత లక్ష్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

దేశం కోసం వందేమాతరం ఆలపిస్తూ.. ప్రాణత్యాగం చేసిన అందరికీ తెలిసిన, తెలియని, మరుగునపడిన, చరిత్ర పుటలకెక్కని వీరులందరికీ 140 కోట్ల మంది భారతీయులు ఈ రోజు నివాళులు అర్పిస్తున్నారని ప్రధానమంత్రి ప్రకటించారు.

వేద శ్లోకాన్ని చెబుతూ.. ఇది మన మాతృభూమి అని, ఈ దేశం మన తల్లి అని, మనం ఆమె పిల్లలమని, వేద కాలం నుంచి భారతీయులు దేశాన్ని మాతృమూర్తిగా కొలిచారని శ్రీ మోదీ అన్నారు. వందేమాతరం ద్వారా ఈ వేద భావన స్వాతంత్ర్య సమరంలో కొత్త చైతన్యాన్ని నింపిందని వెల్లడించారు.

దేశాన్ని ఒక భౌగోళిక-రాజకీయ ప్రదేశంగా మాత్రమే చూసేవారికి... అలా కాకుండా తల్లిగా పరిగణించాలనే ఆలోచన ఆశ్చర్యం అనిపించవచ్చునని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కానీ, భారత్ ఇందుకు భిన్నం... ఇక్కడ తల్లి అంటే- జన్మనిచ్చేది.. పెంచిపోషించేది మాత్రమే కాదు బిడ్డలకు ప్రమాదం కలిగించే దుష్టశక్తులను అంతం చేసే భద్రకాళి. కాబట్టే- భరతమాత శక్తి అపారమని, కష్టాల నుంచి మనల్ని గట్టెక్కించడమేగాక శత్రు నాశనం చేసిందని చెబుతూ- వందేమాతరంలోని పంక్తులను ఆయన ఉటంకించారు. దేశం ఒక తల్లి కాగా, ఆ తల్లి శక్తిసామర్థ్యాలు ఒక దైవ స్వరూపమనే భావనే స్వాతంత్ర ఉద్యమంలో స్త్రీ-పురుషులు సమాన భాగస్వాములు కావడానికి దారితీసిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నారీశక్తి భారత్ను మరోసారి పురోగమన పథంలో నిలపగలదనే స్వప్నాలకు ఊతమిచ్చింది ఈ దార్శనికతేనని చెప్పారు.

వందేమాతరం ఆనాడు స్వాతంత్ర్య పోరాట గీతమైనప్పటికీ, నేడు మనకు లభించిన స్వేచ్ఛను పరిరక్షించుకోవడంలోనూ ఇది స్ఫూర్తినిస్తున్నదని శ్రీ మోదీ పేర్కొన్నారు. బంకింబాబు అసలు కూర్పు నుంచి కొన్ని పంక్తులను ఈ సందర్భంగా ఉటంకించారు. దీని ప్రకారం... భరతమాత జ్ఞానప్రదాత అయిన సరస్వతీ స్వరూపం మాత్రమే కాదు... సౌభాగ్య ప్రదాత లక్ష్మీదేవి, సాయుధ శక్తిస్వరూపిణి దుర్గామాత కూడా! ఇది జ్ఞానం, శాస్త్ర, సాంకేతికతలలో ముందంజలో నిలిచే దేశాన్ని.. అభ్యసనం-ఆవిష్కరణల శక్తితో సుసంపన్న దేశాన్ని... జాతీయ భద్రతలో స్వావలంబన గల దేశాన్ని నిర్మించడమే ఈ దార్శనికత లక్ష్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

షెకావత్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా, ముఖ్యమంత్రి శ్రీమతి రేఖ గుప్తా తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

నేపథ్యం
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి ఒక స్మారక తపాలా బిళ్లను, నాణాన్ని కూడా ఆవిష్కరించారు. దీంతో దేశవ్యాప్తంగా మరో ఏడాది పాటు... 2026 నవంబరు 7 వరకూ నిర్వహించే వేడుకలు నేటినుంచి ప్రారంభమయ్యాయి. భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినివ్వడమేగాక జాతీయ ప్రతిష్ఠ, ఐక్యతలను ప్రోదిచేసే ఈ గేయం 150 ఏళ్ల సంబరాలను కొనసాగిస్తుంది.

ఈ వేడుకలలో ప్రధాన కార్యక్రమంతోపాటు సమాజంలోని అన్ని వర్గాల పౌరుల భాగస్వామ్యంతో ‘వందేమాతరం’ పూర్తి గీతాన్ని బహిరంగ ప్రదేశాలలో సామూహికంగా ఆలపించారు.
ఈ ఏడాదితో వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ జాతీయ గీతాన్ని 1875 నవంబర్ 7న అక్షయ నవమి శుభ సందర్భంగా బంకించంద్ర ఛటర్జీ రాశారు. ఇది ఆయన నవల ‘ఆనందమఠ్’లో భాగంగా తొలిసారి సాహిత్య పత్రిక ‘బంగదర్శన్’లో ప్రచురితమైంది. శక్తిసామర్థ్యాలు, సౌభాగ్యం, దైవ స్వరూపంగా మాతృభూమిని ప్రార్థించే ఈ గీతం దేశ ఐక్యత, ఆత్మగౌరవాలను మేల్కొలిపే స్ఫూర్తికి కవితాత్మక వ్యక్తీకరణను సమకూర్చింది. అటుపైన అనతి కాలంలోనే దేశభక్తికి శాశ్వత ప్రతీకగా మారింది.
పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
वंदे मातरम् का मूल भाव है...
— PMO India (@PMOIndia) November 7, 2025
भारत! मां भारती।
भारत की शाश्वत संकल्पना! pic.twitter.com/wdktTSByJo
गुलामी के उस कालखंड में... वन्दे मातरम् इस संकल्प का उद्घोष बन गया था कि...
— PMO India (@PMOIndia) November 7, 2025
भारत की आज़ादी का... माँ भारती के हाथों से गुलामी की बेड़ियाँ टूटेंगी!
उसकी संतानें स्वयं अपने भाग्य की विधाता बनेंगी! pic.twitter.com/VDbCRAELAU
वंदे मातरम् भारत के स्वतंत्रता संग्राम का स्वर बन गया।
— PMO India (@PMOIndia) November 7, 2025
एक ऐसा स्वर, जो हर क्रांतिकारी की जबान पर था!
एक ऐसा स्वर, जो हर भारतीय की भावनाओं को व्यक्त कर रहा था! pic.twitter.com/XbN8o8F5D5
वंदे मातरम् आज़ादी के परवानों का तराना होने के साथ ही इस बात की भी प्रेरणा देता है कि हमें इस आज़ादी की रक्षा कैसे करनी है। pic.twitter.com/B9XfALtnuu
— PMO India (@PMOIndia) November 7, 2025


