Several projects in Delhi which were incomplete for many years were taken up by our government and finished before the scheduled time: PM
All MPs have taken care of both the products and the process in the productivity of Parliament and have attained a new height in this direction: PM
Parliament proceedings continued even during the pandemic: PM Modi

పార్ల‌మెంట్ స‌భ్యుల‌ కోసం నిర్మించినటువంటి బ‌హుళ అంత‌స్తులు క‌లిగిన నివాస భ‌వ‌నాలను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రారంభించారు.  ఈ ఫ్లాట్ లను న్యూ ఢిల్లీ లోని డాక్ట‌ర్ బి డి మార్గ్ లో కట్టారు.  80 సంవ‌త్స‌రాలకు పైబడిన ఎనిమిది పాత బంగళాల కు చెందిన భూమి ని పునరభివృద్ధిపర్చి ఈ 76 ఫ్లాట్‌ లను నిర్మించారు.  

ఈ సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, పార్ల‌మెంట్ స‌భ్యుల కు ఉద్దేశించిన ఈ బ‌హుళ అంత‌స్తుల నివాస భ‌వ‌నాల‌ ను గ్రీన్ బిల్డింగ్ నియ‌మాల‌ను పాటిస్తూ నిర్మించ‌డం జ‌రిగింద‌న్నారు.  ఈ నూత‌న గృహాలు ఎంపీ ల‌తో పాటు వీటి నివాసులు అంద‌రిని భ‌ద్రంగా, సురక్షితంగా ఉంచగలవన్న ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.  ఎంపీ ల గృహ వ‌స‌తి చాలా కాలంగా ప‌రిష్కారం కాకుండా మిగిలిపోయిన స‌మ‌స్య‌ గా ఉండగా, దానిని ఇప్పుడు ప‌రిష్క‌రించ‌డం జ‌రిగింద‌ని ఆయ‌న చెప్పారు.  ద‌శాబ్దాల నాటి పాత స‌మ‌స్య‌లను వాటిని త‌ప్పించుకు తిరిగితే స‌మ‌సిపోవు, వాటికి ప‌రిష్కార మార్గాల‌ను అన్వేషిస్తేనే అవి కొలిక్కి వ‌స్తాయి అని ఆయ‌న అన్నారు.  చాలా సంవ‌త్స‌రాలుగా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు దిల్లీ లో అనేకం ఉన్నాయి, వాటిని ఈ ప్ర‌భుత్వం చేప‌ట్టి అనుకున్న కాలాని కంటే ముందుగానే పూర్తి చేసింది అని చెప్తూ, వాటిని ఒక‌ దాని త‌రువాత మ‌రొక‌టి గా ఆయ‌న ప్ర‌స్తావించారు.  కీర్తిశేషుడు అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ గారు ప్ర‌ధాని ప‌ద‌వి లో ఉన్న‌ప్పుడు ఆంబేడ్ కర్ నేశన‌ల్ మెమోరియ‌ల్ తాలూకు చ‌ర్చ మొద‌లైంద‌ని, ఆ స్మార‌కాన్ని 23 సంవ‌త్స‌రాల దీర్ఘ కాలిక నిరీక్ష‌ణ అనంతరం ఈ ప్ర‌భుత్వం నిర్మించింద‌ని శ్రీ మోదీ గుర్తు చేశారు.  చాలా కాలం పాటు ప‌రిష్కారం కాకుండా ఉన్న కేంద్రీయ స‌మాచార సంఘం (సిఐసి) కొత్త భ‌వ‌నాన్ని, ఇండియా గేట్ స‌మీపం లో యుద్ధ స్మార‌కాన్ని, జాతీయ ర‌క్ష‌కభ‌ట స్మార‌కాన్ని ఈ ప్ర‌భుత్వం నిర్మించిందని ఆయ‌న అన్నారు.

చట్టసభ లో ఫ‌ల‌ప్ర‌ద‌ చ‌ర్చ‌లతో పాటు ఫ‌లితాలు కూడా వెలువ‌డేందుకు ఎంపీలంతా శ్ర‌ద్ధ తీసుకొన్నార‌ని, ఈ దిశ‌ లో వారు ఒక నూత‌న శిఖ‌రాన్ని చేరుకొన్నార‌ంటూ ప్ర‌ధాన మంత్రి అభివ‌ర్ణించారు.  స‌భ వ్య‌వ‌హారాలను నిర్వ‌హించడంలో చ‌క్క‌గా ప‌నిచేసి, మంచి ఫ‌లితాల‌ను సాధించ‌డంలో లోక్ స‌భ స్పీక‌ర్ సార‌థ్యాన్ని శ్రీ మోదీ ప్ర‌శంసించారు.  మ‌హమ్మారి కాలం లో సైతం  కొత్త నిబంధనలతో, అనేక ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌ల‌తో పార్లమెంట్ ఉభ‌య స‌భ‌ల కార్య‌క‌లాపాలు కొన‌సాగినందుకు ఆయ‌న ప్ర‌స‌న్న‌త‌ ను వ్య‌క్తం చేశారు.  వ‌ర్ష‌కాల స‌మావేశాల‌లో స‌భా కార్య‌క‌లాపాలు సాఫీ గా న‌డిచేందుకు ఉభ‌య స‌భ‌లు వారాంత‌పు దినాల‌లో కూడా ప‌ని చేశాయి అని ఆయ‌న అన్నారు.

యువ‌తీ యువ‌కుల‌కు 16 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ మ‌ధ్య వ‌య‌స్సు చాలా ముఖ్య‌మైంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్తూ, 2019 ఎన్నిక‌ల‌ తో మ‌నం ప‌ద‌హారో లోక్ స‌భ ప‌ద‌వీకాలాన్ని పూర్తి చేసుకొన్నామ‌ని, మ‌రి ఈ ప‌ద‌వీ కాలం దేశ అభివృద్ధి, పురోగ‌తి ల విష‌యంలో చ‌రిత్రాత్మ‌క ప్రాముఖ్యాన్ని సంపాదించుకొంద‌న్నారు.  17 వ లోక్ స‌భ ప‌ద‌వీకాలం 2019 లో మొద‌లైంది, ఈ కాలం లో లోక్ స‌భ లో ఇప్ప‌టికే తీసుకున్న నిర్ణ‌యాలలో కొన్ని చ‌రిత్రాత్మ‌క‌మైన‌వి అని ఆయ‌న పేర్కొన్నారు.  రాబోయే 18 వ లోక్ స‌భ కూడా దేశాన్ని కొత్త ద‌శాబ్దంలోకి తీసుకుపోవ‌డంలో అతి ముఖ్య‌ పాత్ర‌ ను పోషించగలద‌న్న విశ్వాసాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.  

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s data centre boom: Mumbai cracks global top 15, Hyderabad pipeline set to surge 15x

Media Coverage

India’s data centre boom: Mumbai cracks global top 15, Hyderabad pipeline set to surge 15x
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి 27న ప్రధానమంత్రి ప్రసంగం
August 26, 2026
దేశంలో క్రీడలు.. యువ నాయకత్వం.. పౌర బాధ్యత.. స్వచ్ఛంద సేవ.. దారుఢ్యం.. దేశ ప్రగతి వంటి అంశాలను ఈ చర్చలు ఒకే వేదికపైకి తెస్తాయి
ఈ చర్చలు ప్రధానంగా క్రీడలు.. ఒలింపిక్స్‌ ఆకాంక్షలు.. యువ నేతృత్వం.. వికిసిత భారత్.. మాదకద్రవ్య రహిత యువతరంపై దృష్టి సారిస్తాయి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 27న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమం ద్వారా ‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. దేశ క్రీడారంగ పురోగమనంలో యువత భాగస్వామ్యం సహా వారి ఆకాంక్షల వెల్లడి, యువతరం నాయకత్వాన బలమైన వికసిత భారత్ కోసం మేధా మధనం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

జాతీయ క్రీడా దినోత్సవం-2026లో భాగంగా ‘మేరా యువ భారత్’ ఆధ్వర్యాన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలోగల రెండు కళాశాలల్లో యువతరం భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. జాతీయ ప్రగతి కార్యకలాపాల్లో యువత ఆకాంక్షలకు కీలక స్థానమిస్తూ ఆరోగ్యకర, క్రమశిక్షణాయుత. క్రీడాస్ఫూర్తి గల దేశానికి రూపుదిద్దాలన్న ప్రధానమంత్రి దృక్కోణానికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

దేశంలో క్రీడలు, యువ నాయకత్వం, పౌర కర్తవ్యం, స్వచ్ఛంద సేవ, దారుఢ్యం, దేశ పురోగమనం తదితర అంశాలన్నిటిపైనా చర్చను ఈ కార్యక్రమం ఒకే వేదికపైకి తెస్తుంది. దేశ క్రీడారంగ పురోగమన ఆకాంక్షలతో యువత మమేకమయ్యే ప్రత్యక్ష మార్గాన్ని నిర్దేశిస్తుంది. దేశ యువతరం, క్రీడా వ్యవస్థపై చర్చల సందర్భంగా వారి ఆలోచనలు, దృక్కోణాలను పంచుకునే వేదికగా ఇది ఉపయోగపడుతుంది.

ఈ జాతీయ స్థాయి కార్యక్రమం అనంతరం యువ భాగస్వాములు, మై భారత్ వలంటీర్లు, స్థానిక క్రీడాకారులు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో స్థానిక స్థాయిలో చర్చలు సాగుతాయి. క్రీడాసక్తి గల యువత, ప్రముఖ క్రీడాకారులు, పతక విజేతల మధ్య ప్రత్యక్ష ఇష్టాగోష్ఠి ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఇందులో ‘యువతరం చర్చలు’ ప్రధానాంశంగా ఉంటాయి. యువ భాగస్వాములు తమ ఆలోచనలు, దృక్కోణాలు, ఆకాంక్షలను ఈ వేదిక ద్వారా పంచుకుంటారు. ఈ చర్చలు ప్రధానంగా దిగువ పేర్కొన్న 5 అంశాలపై కేంద్రీకృతమవుతాయి:

· మెరుగైన సౌకర్యాలు, శిక్షణ, క్రీడా విజ్ఞానం, సార్వజనీన భాగస్వామ్యంతో జాతీయ క్రీడా వ్యవస్థ మెరుగుదల.

· శాస్త్రీయ ప్రతిభకు గుర్తింపు, పారదర్శక ఎంపిక, దీర్ఘకాలిక క్రీడా వికాసం ద్వారా 2036లో ఒలింపిక్స్ దిశగా ప్రతిభకు పదును పెట్టడం.

· పరిపాలన వేదికలు, మై భారత్ నేతృత్వంలోని స్వచ్ఛంద సేవ ద్వారా యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దడం.

· పౌర చైతన్యం, భవిష్యత్‌ సంసిద్ధ నైపుణ్యం, వ్యవస్థీకృత స్వచ్ఛంద సేవకు ప్రోత్సాహం, ద్వారా వికసిత భారత్ ప్రస్థానం వైపు యువతరానికి సాధికారత కల్పన.

· ఈ నెల 2న ప్రారంభమైన ‘ప్రధానమంత్రి 100 వారాల ప్రచారం’లో భాగంగా వారానికోసారి జన భాగస్వామ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మాదకద్రవ్య వినియోగంపై పోరులో క్రీడలు సహా, సహ రంగాల్లోని వివిధ బృందాల సేవల ద్వారా ‘మాదకద్రవ్య రహిత యువత’ ఉద్యమాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన ధ్యేయం.