“టెక్స్ టైల్ పరిశ్రమలో భారతదేశం అసాధారణ సామర్థ్యాలను ప్రదర్శించేందుకు భారత్ టెక్స్ 2024 ఒక అద్భుతమైన వేదిక”
“భారత్ టెక్స్ దారం భారతీయ సంప్రదాయ అద్భుతమైన చరిత్రను నేటి ప్రతిభతో అనుసంధానిస్తుంది; ఇది సంప్రదాయాలతో కూడిన సాంకేతికత; ఇంకా శైలి, సుస్థిరత, స్థాయి , నైపుణ్యాలను కలిపివుంచే దారం
“సంప్రదాయం, సాంకేతికత, ప్రతిభ, శిక్షణపై మేము దృష్టి సారించాము “
అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో టెక్స్ టైల్ రంగం భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు విస్తృతంగా కృషి చేస్తున్నాము “
"టెక్స్ టైల్స్ , ఖాదీ భారతదేశంలోని మహిళలకు సాధికారత కల్పించాయి"
"నేడు సాంకేతికత , ఆధునికీకరణ ప్రత్యేకత, ప్రామాణికతతో సహజీవనం చేయగలవు"
“కస్తూరి కాటన్ భారతదేశానికి సొంత గుర్తింపును సృష్టించే దిశగా ఒక పెద్ద అడుగు కాబోతోంది”
“పీఎం-మిత్ర పార్కులలో ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలతో కూడిన ఆధునిక మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచే మొత్తం వాల్యూ చైన్ ఎకోసిస్టమ్ ను ఒకే చోట ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది”
'వోకల్ ఫర్ లోకల్ అండ్ లోకల్ టు గ్లోబల్' పేరుతో నేడు దేశంలో ప్రజా ఉద్యమం

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూ ఢిల్లీ లోని భారత్ మండపంలో దేశంలో నిర్వహించే అతి పెద్ద గ్లోబల్ టెక్స్ టైల్ ఈవెంట్ లలో ఒకటైన భారత్ టెక్స్ - 2024 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రధాని తిలకించారు.

 

ప్రధాన మంత్రి మాట్లాడుతూ, భారత్ టెక్స్ 2024 కు అందరికీ స్వాగతం పలికారు. భారత్ మండపం, యశోభూమి అనే భారత్ మండపం అనే రెండు అతిపెద్ద ఎగ్జిబిషన్ కేంద్రాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమం ప్రత్యేకత కలిగి ఉందని అన్నారు. సుమారు 100 దేశాలకు చెందిన 3000 మందికి పైగా ఎగ్జిబిటర్లు, వ్యాపారులు, సుమారు 40,000 మంది సందర్శకులు ఉన్నారని, వారందరికీ భారత్ టెక్స్ ఒక వేదికను కల్పిస్తుందని ఆయన చెప్పారు.

భారత్ టెక్స్ భారత సంప్రదాయం మహిమాన్వితమైన చరిత్రను నేటి ప్రతిభతో అనుసంధానం చేసే దారం వంటిదని,  కాబట్టి నేటి కార్య క్రమం అనేక కోణాలను కలిగి ఉందని ప్రధాన మంత్రి అన్నారు. సంప్రదాయాలతో కూడిన సాంకేతిక పరిజ్ఞానం  శైలి / సుస్థిరత / స్కేల్ / నైపుణ్యాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చే దారం కూడా అని అన్నారు. భారతదేశం నలుమూలల నుండి అనేక వస్త్ర సంప్రదాయాలను కలిగి ఉన్న ఈ కార్యక్రమాన్ని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కు ఒక గొప్ప ఉదాహరణగా చూస్తున్నట్టు ఆయన తెలిపారు. వేదిక వద్ద భారత వస్త్ర సంప్రదాయం లోతు, దీర్ఘాయువు , సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఏర్పాటైన ఎగ్జిబిషన్ ను కూడా ఆయన ప్రశంసించారు.

టెక్స్ టైల్ వాల్యూ చైన్ లోని వివిధ భాగస్వాములు ప్రదర్శనలో పాల్గొనడాన్ని ప్రస్తావిస్తూ, భారతదేశ  టెక్స్ టైల్ రంగాన్ని అర్థం చేసుకోవడంతో పాటు సవాళ్లు, ఆకాంక్షల గురించి తెలుసుకోగల వారి పరిజ్ఞానం గురించి ప్రముఖంగా వివరించారు. విలువ గొలుసుకు కీలకమైన నేత కార్మికుల ఉనికిని, క్షేత్రస్థాయి నుంచి వారి తరతరాల అనుభవాన్ని ఆయన ప్రస్తావించారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని, దాని నాలుగు ప్రధాన స్తంభాల సంకల్పాన్ని నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి, భారతదేశ టెక్స్ టైల్ రంగం పేదలు, యువత, రైతులు, మహిళలు ఇలా ప్రతి ఒక్కరితో ముడిపడి ఉందని చెప్పారు. అందువల్ల భారత్ టెక్స్ 2024 వంటి కార్యక్రమం ప్రాముఖ్యత మరింత పెరుగుతుందని ప్రధాన మంత్రి అన్నారు.

 

వికసిత్ భారత్ ప్రయాణంలో టెక్స్ టైల్స్ రంగం పాత్రను విస్తరించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్న పరిధిని ప్రధాని వివరించారు. సంప్రదాయం, సాంకేతిక పరిజ్ఞానం, ప్రతిభ, శిక్షణపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. సమకాలీన ప్రపంచ అవసరాలకు అనుగుణంగా సంప్రదాయ డిజైన్లను అప్ డేట్ చేయడంపై దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. ఫామ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్ అనే ఐదు ఎఫ్ ల కాన్సెప్ట్ ను ఆయన పునరుద్ఘాటించారు, ఇది విలువ గొలుసులోని అన్ని అంశాలను ఒకే మొత్తానికి కలుపుతుంది. ఎమ్ఎస్ఎమ్ఇ రంగానికి చేయూతనిచ్చేందుకు, పరిమాణంలో వృద్ధి సాధించిన తర్వాత కూడా నిరంతర ప్రయోజనాలు ఉండేలా ఎంఎస్ఎంఇ నిర్వచనంలో మార్పును ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ప్రత్యక్ష విక్రయాలు, ఎగ్జిబిషన్లు, ఆన్ లైన్ పోర్టల్స్ వల్ల చేతివృత్తులకు, మార్కెట్ కు మధ్య దూరం తగ్గిందన్నారు.

వివిధ రాష్ట్రాల్లో ఏడు పిఎం మిత్ర పార్కులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చేపట్టిన బృహత్తర ప్రణాళికలను ప్రధాని వివరించారు మొత్తం టెక్స్ టైల్ రంగానికి అవకాశాల కల్పన ఆవశ్యకతను ఉద్ఘాటించారు. "ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలతో కూడిన ఆధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న మొత్తం విలువ గొలుసు పర్యావరణ వ్యవస్థను ఒకే చోట స్థాపించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఇది స్థాయి, నిర్వహణను  మెరుగుపరచడమే కాకుండా లాజిస్టిక్స్ ఖర్చులను కూడా తగ్గిస్తుందని ఆయన చెప్పారు.

 

టెక్స్ టైల్స్ రంగాల్లో గ్రామీణ ప్రజలు, మహిళల ఉద్యోగావకాశాలు, భాగస్వామ్యాన్ని ప్రస్తావిస్తూ, ప్రతి 10 మంది దుస్తుల తయారీదారుల్లో 7 మంది మహిళలేనని, చేనేతలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. గత పదేళ్లలో తీసుకున్న చర్యలు ఖాదీని అభివృద్ధి, ఉద్యోగాలకు బలమైన మాధ్యమంగా మార్చాయని ఆయన ఉద్ఘాటించారు. అదేవిధంగా గత దశాబ్ద కాలంగా చేపట్టిన సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు కూడా టెక్స్ టైల్ రంగానికి మేలు చేశాయన్నారు.

పత్తి, జనపనార, పట్టు ఉత్పత్తిదారుగా భారతదేశం ఎదుగుతున్న తీరు  గురించి ప్రస్తావిస్తూ, ప్రభుత్వం పత్తి రైతులకు మద్దతు ఇస్తోందని, వారి నుండి పత్తిని కొనుగోలు చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన కస్తూరి కాటన్ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ బ్రాండ్ విలువను సృష్టించడంలో ఒక పెద్ద అడుగు అని ఆయన అన్నారు. జనపనార, పట్టు రంగానికి తీసుకోవాల్సిన చర్యలను కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. టెక్నికల్ టెక్స్ టైల్స్ వంటి కొత్త రంగాల గురించి, నేషనల్ టెక్నికల్ టెక్స్ టైల్స్ మిషన్ గురించి, ఈ ప్రాంతంలో స్టార్టప్ లకు ఉన్న అవకాశాల గురించి వివరించారు.

ఒకవైపు సాంకేతిక పరిజ్ఞానం, యాంత్రీకరణ ఆవశ్యకతను, మరోవైపు ప్రత్యేకతను, ప్రామాణికతను నొక్కిచెప్పిన ప్రధాని, ఈ రెండు డిమాండ్లు సహజీవనం చేయగల ప్రదేశం భారత్ లో ఉందని అన్నారు. భారతీయ చేతివృత్తుల వారు తయారు చేసే ఉత్పత్తులకు ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక లక్షణం ఉంటుందని పేర్కొన్న ప్రధాన మంత్రి, ప్రత్యేకమైన ఫ్యాషన్ కు డిమాండ్ పెరగడంతో అటువంటి ప్రతిభావంతులకు డిమాండ్ పెరుగుతుందని అన్నారు. దేశంలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్ ) సంస్థల సంఖ్య 19కి పెరగడంతో నైపుణ్యంతో పాటు స్కేల్ పై ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రధాని తెలిపారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా స్థానిక నేత కార్మికులు, చేతివృత్తుల వారిని కూడా ఎన్ ఐఎఫ్ టీలకు అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. సమర్థ్ పథకం ద్వారా ఇప్పటి వరకు 2.5 లక్షల మందికి పైగా సామర్థ్యం పెంపు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందారని ప్రధాని పేర్కొన్నారు. ఈ పథకంలో ఎక్కువ మంది మహిళలు భాగస్వాములయ్యారని, ఇప్పటికే 1.75 లక్షల మందికి పరిశ్రమలో ఉపాధి లభించిందని తెలిపారు.

 

వోకల్ ఫర్ లోకల్ అంశంపై కూడా ప్రధాని ప్రసంగించారు. 'వోకల్ ఫర్ లోకల్ అండ్ లోకల్ టు గ్లోబల్' పేరుతో నేడు దేశంలో ప్రజా ఉద్యమం జరుగుతోందన్నారు. చిన్న చేతి వృత్తి కళాకారుల కోసం ఎగ్జిబిషన్లు, మాల్స్ వంటి వ్యవస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు.

సానుకూల, సుస్థిర, దూరదృష్టితో కూడిన ప్రభుత్వ విధానాల ప్రభావంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారత టెక్స్ టైల్ మార్కెట్ విలువ 2014 లో 7 లక్షల కోట్ల కంటే తక్కువ నుండి 12 లక్షల కోట్ల రూపాయలు దాటిందని అన్నారు. నూలు, ఫ్యాబ్రిక్, దుస్తుల ఉత్పత్తిలో 25 శాతం పెరుగుదల ఉంది. 380 కొత్త బీఐఎస్ ప్రమాణాలు ఈ రంగంలో నాణ్యత నియంత్రణను నిర్ధారిస్తున్నాయి. దీంతో గత పదేళ్లలో ఈ రంగంలో ఎఫ్ డి  ఐ లు రెట్టింపు అయ్యాయని తెలిపారు.

 

భారతదేశ టెక్స్ టైల్ రంగం నుండి అధిక అంచనాలను వివరిస్తూ, పిపిఇ కిట్లు , ఫేస్ మాస్క్ ల తయారీ కోసం కోవిడ్ మహమ్మారి సమయంలో పరిశ్రమ చేసిన ప్రయత్నాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేశారు.టెక్స్ టైల్ రంగంతో పాటు ప్రభుత్వం సరఫరా గొలుసును క్రమబద్ధీకరించిందని, ప్రపంచం మొత్తానికి తగినన్ని పీపీఈ కిట్లు, ఫేస్ మాస్క్ లను అందించిందన్నారు. ఈ విజయాలను వెనక్కి తిరిగి చూసిన ప్రధాన మంత్రి, సమీప భవిష్యత్తులో భారతదేశం ప్రపంచ ఎగుమతి కేంద్రంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

"మీ ప్రతి అవసరానికి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది" అని ప్రధాన మంత్రి భాగస్వాములకు హామీ ఇచ్చారు. టెక్స్ టైల్ రంగంలోని వివిధ భాగస్వాముల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవాలని, తద్వారా పరిశ్రమ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సమగ్ర పరిష్కారాన్ని సాధించవచ్చని ఆయన సూచించారు. ఆహారం, ఆరోగ్య సంరక్షణ, సంపూర్ణ జీవనశైలితో సహా జీవితంలోని ప్రతి అంశంలోనూ ' మూలాల (బేసిక్స్) కు తిరిగి వెళ్లడం' పట్ల ప్రపంచవ్యాప్తంగా పౌరుల సానుకూలతను ప్రస్తావించిన ప్రధాన మంత్రి, వస్త్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని, వస్త్ర ఉత్పత్తికి రసాయన రహిత రంగు దారాలకు ఉన్న డిమాండ్ గురించి పేర్కొన్నారు. టెక్స్ టైల్ పరిశ్రమ కేవలం భారత మార్కెట్ అవసరాలను ను మాత్రమే తీర్చే మనస్తత్వం నుంచి బయటపడి ఎగుమతుల వైపు చూడాలని ప్రధాని కోరారు. అపారమైన అవకాశాలను అందించే ఆఫ్రికన్ మార్కెట్ నిర్దిష్ట అవసరాలు లేదా జిప్సీ కమ్యూనిటీల అవసరాలను ఆయన ఉదాహరణగా తెలిపారు. విలువ గొలుసులో రసాయన విభాగాలను చేర్చాలని, సహజ రసాయన ప్రదాతలను అన్వేషించాలని ఆయన కోరారు.

 

ఖాదీని దాని సాంప్రదాయ ఇమేజ్ నుండి విడదీసి, యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఫ్యాషన్ స్టేట్మెంట్ గా మార్చడానికి తాను చేసిన ప్రయత్నం గురించి కూడా ఆయన మాట్లాడారు. ఆధునిక టెక్స్ టైల్స్ పై మరిన్ని పరిశోధనలు చేసి స్పెషాలిటీ టెక్స్ టైల్స్ ఖ్యాతిని తిరిగి పొందాలని కోరారు. ప్రస్తుతం పరిశ్రమకు సంబంధించిన అన్ని పరికరాలను దేశీయంగానే తయారు చేస్తున్న భారత వజ్రాల పరిశ్రమను ఉదాహరణగా చూపుతూ, టెక్స్ టైల్ పరికరాల తయారీ రంగంలో పరిశోధనలు చేపట్టాలని, కొత్త ఆలోచనలు, ఫలితాలు ఉన్నవారిని ప్రోత్సహించాలని టెక్స్ టైల్ రంగాన్ని ప్రధాన మంత్రి కోరారు. వైద్య రంగంలో ఉపయోగించే టెక్స్ టైల్స్ వంటి కొత్త రంగాలను అన్వేషించాలని ఆయన వాటాదారులను కోరారు. ప్రపంచ ఫ్యాషన్ ట్రెండ్ ను అనుసరించకుండా నాయకత్వం వహించాలని కోరారు.

ఉత్ప్రేరకంగా పనిచేయడానికి ,ప్రజల కలలను సాకారం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా  అందుబాటులో ఉందని చెప్పారు, ప్రపంచ అవసరాలను తీర్చే ,  వారి మార్కెట్లను వైవిధ్యపరిచే కొత్త దార్శనికతతో పరిశ్రమలు ముందుకు రావాలని కోరుతూ ప్రధాని తన ప్రసంగం ముగించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి శ్రీమతి దర్శన జర్దోష్ తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

భారత్ టెక్స్ 2024 ఫిబ్రవరి 26 నుంచి 29 వరకు జరగనుందిప్రధానమంత్రి 5 ఎఫ్ విజన్ నుండి స్ఫూర్తిని పొందుతూ ఈవెంట్ మొత్తం వస్త్ర విలువ గొలుసును కవర్ చేస్తూ ఫైబర్ఫాబ్రిక్ ,  ఫ్యాషన్ ఫోకస్ ద్వారా విదేశీయులకు ఏకీకృత వ్యవసాయ క్షేత్రాన్ని కలిగి ఉందిఇది టెక్స్ టైల్ రంగంలో భారతదేశ సామర్ధ్యాలను ప్రదర్శిస్తుంది గ్లోబల్ టెక్స్ టైల్ పవర్ హౌస్ గా భారతదేశ స్థానాన్ని పునరుద్ఘాటిస్తుంది.

11 టెక్స్ టైల్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ల కన్సార్టియం, ప్రభుత్వ మద్దతుతో నిర్వహించే భారత్ టెక్స్ 2024 వాణిజ్యం, పెట్టుబడుల రెండు స్తంభాలపై నిర్మించబడింది, సుస్థిరతపై విస్తృత దృష్టి సారించింది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 65 నాలెడ్జ్ సెషన్లు, 100 మందికి పైగా గ్లోబల్ ప్యానలిస్టులు ఈ రంగం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చిస్తారు. ఇందులో సుస్థిరత, సర్క్యులారిటీపై ప్రత్యేక పెవిలియన్లు, 'ఇండీ హాత్', ఇండియన్ టెక్స్టైల్స్ హెరిటేజ్, సస్టెయినబిలిటీ, గ్లోబల్ డిజైన్స్ వంటి విభిన్న థీమ్ లపై ఫ్యాషన్ ప్రజెంటేషన్లు, ఇంటరాక్టివ్ ఫ్యాబ్రిక్ టెస్టింగ్ జోన్లు, ప్రొడక్ట్ డెమానిస్ట్రేషన్స్ ఉన్నాయి.

భారత్ టెక్స్ 2024లో 3,500 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 100 దేశాలకు చెందిన 3,000 మందికి పైగా కొనుగోలుదారులు, 40,000 మందికి పైగా వ్యాపార సందర్శకులతో పాటు టెక్స్టైల్స్ విద్యార్థులు, నేత కార్మికులు, హస్తకళాకారులు, టెక్స్టైల్ కార్మికులు పాల్గొంటారని అంచనా.

ఈ సదస్సులో 50కి పైగా ప్రకటనలు, ఎంవోయూలపై సంతకాలు జరిగే అవకాశం ఉందని, టెక్స్ టైల్ రంగంలో పెట్టుబడులు, వాణిజ్యానికి మరింత ఊతమివ్వడంతో పాటు ఎగుమతులు పెరగడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ అనే ప్రధాని దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో ఇది మరో కీలక అడుగు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
It’s time to fix climate finance. India has shown the way

Media Coverage

It’s time to fix climate finance. India has shown the way
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Aide to the Russian President calls on PM Modi
November 18, 2025
They exchange views on strengthening cooperation in connectivity, shipbuilding and blue economy.
PM conveys that he looks forward to hosting President Putin in India next month.

Aide to the President and Chairman of the Maritime Board of the Russian Federation, H.E. Mr. Nikolai Patrushev, called on Prime Minister Shri Narendra Modi today.

They exchanged views on strengthening cooperation in the maritime domain, including new opportunities for collaboration in connectivity, skill development, shipbuilding and blue economy.

Prime Minister conveyed his warm greetings to President Putin and said that he looked forward to hosting him in India next month.