దమన్ లో నమో పథ్ ను, దేవ్ కా సీఫ్రంటు ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అంకితం చేశారు. ప్రధాన మంత్రి కార్య స్థలాని కి చేరుకొన్న తరువాత నిర్మాణ శ్రమికుల తో మాట్లాడారు. వారితో కలసి ఒక ఛాయాచిత్రాన్ని తీయించుకొన్నారు. ఆయన ‘నయా భారత్ సెల్ఫీ పాయింటు’ ను సైతం చూడడానికి వెళ్లారు.

దాదాపు  గా 165 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మాణం జరిగిన 5.45 కి.మీ. ల దేవ్ కా సీఫ్రంటు దేశం లో తనదైనటువంటి ఒకే ఒక సముద్ర తీర ప్రాంత విహార స్థలం అని చెప్పాలి. ఈ సీఫ్రంటు తో స్థానిక ఆర్థిక వ్యవస్థ కు ప్రోత్సాహం లభిస్తుందన్న ఆశ ఉంది. ఈ సీఫ్రంటు ఆ ప్రాంతం మనోరంజక కార్యకలాపాల కు ఖాళీ సమయాన్ని ఆహ్లాదం గా గడపడానికి అనుకూలమైంది గా మారి, మరింత మంది యాత్రికులు ఆ ప్రాంతాని కి తరలి వచ్చేందుకు ఒక ఆకర్షణ కేంద్రం గా నిలవనుంది. స్మార్ట్ లైటింగ్, పార్కింగ్ సదుపాయాలు, తోట లు, ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలు, వినోద కార్యకలాపాల కు తగినటువంటి ప్రదేశాల తో పాటు గా రాబోయే కాలం లో విలాసవంతమైన గుడారాల నగరాన్ని నిర్మించేందుకు కూడా తగిన ఏర్పాటు సహా ఈ సీఫ్రంట్ ను ఒక ప్రపంచ శ్రేణి యాత్రా స్థలం గా తీర్చిదిద్దడం జరుగుతుంది.

ప్రధాన మంత్రి వెంట దాద్ రా మరియు నగర్ హవేలీ, ఇంకా దమన్ మరియు దీవ్ లతో పాటు లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలకుడు శ్రీ ప్రఫుల్ల్ పటేల్ ఉన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Vikas Bhi, Virasat Bhi: How JATAN, AI and Digital Archives are revolutionising India’s cultural heritage preservation

Media Coverage

Vikas Bhi, Virasat Bhi: How JATAN, AI and Digital Archives are revolutionising India’s cultural heritage preservation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న యోధులకు ప్రధాని నివాళి
August 09, 2026

చరిత్రాత్మక క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న యోధులందరినీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో వారు చూపిన ధైర్యసాహసాలకూ, దృఢ సంకల్పానికీ నివాళి అర్పించారు. మహాత్మాగాంధీ నాయకత్వం అందించిన స్ఫూర్తితో క్విట్ ఇండియా ఉద్యమం ఇచ్చిన పిలుపు స్వాతంత్ర్య పోరాటంలో నూతనోత్తేజాన్ని నింపిందనీ, వలస పాలన నుంచి విముక్తి పొందాలన్న భారత ప్రజల అచంచలమైన సంకల్పాన్ని ప్రతిబింబించిందని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

చరిత్రాత్మక క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారిని స్మరించుకుంటున్నా. వారి ధైర్యం ప్రతి భారతీయునికీ ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం. మహాత్మాగాంధీ నాయకత్వం అందించిన స్ఫూర్తితో క్విట్ ఇండియా పిలుపు స్వాతంత్ర్య ఉద్యమంలో నూతన శక్తిని నింపింది. వలస పాలన నుంచి విముక్తి పొందాలన్న మన ప్రజల అచంచల సంకల్పాన్ని ప్రతిబింబించింది.