* పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని

మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఓ ప్రమాద ఘటనలో ప్రాణనష్టం జరిగినందుకు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంబంధికులకు ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున, గాయపడ్డవారికి రూ.50,000 వంతున ఎక్స్‌గ్రేషియాను ఆయన ప్రకటించారు.


సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా తెలిపింది:


‘‘మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఓ ప్రమాద ఘటనలో ప్రాణనష్టం జరగడం విచారకరం. తమ ప్రియతములను కోల్పోయినవారికి నేను సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ఘటనలో ప్రభావితులైన వ్యక్తులకు స్థానిక పాలనయంత్రాంగం అవసరమైన సహాయాన్ని అందిస్తోంది.


పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను మృతుల సంబంధికులకు ఇస్తారు. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఇస్తారు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ @narendramodi”

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
‘Modi Govt’s 12 years are transformational for industry’

Media Coverage

‘Modi Govt’s 12 years are transformational for industry’
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 జూన్ 2026
June 12, 2026

Breaking Barriers, Building Bharat: PM Modi’s Historic Push for Gender Equality and Inclusive Growth