ఆకాంక్ష బ్లాక్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి; బ్లాక్ స్థాయిలో ఆకాంక్షాత్మక జిల్లా కార్యక్రమాన్ని అనుసరించాలని రాష్ట్రాలను కోరారు
అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి, దేశం మౌలిక సదుపాయాలు, పెట్టుబడి, ఆవిష్కరణ, చేరికలు అనే నాలుగు అంశాలపై దృష్టి సారిస్తోంది: ప్రధానమంత్రి
ప్రపంచ సరఫరా వ్యవస్థ స్థిరత్వాన్ని తీసుకురావడానికి ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోంది : ప్రధానమంత్రి
ఎం.ఎస్.ఎం.ఈ. లను గ్లోబల్ ఛాంపియన్‌ లుగా చేయడానికి, గ్లోబల్ వాల్యూ వ్యవస్థ లో భాగంగా చేయడానికి చర్యలు తీసుకోండి : ప్రధానమంత్రి
మనం స్వీయ-ధృవీకరణ, డీమ్డ్ ఆమోదాలు, ఫారాల ప్రామాణీకరణ వైపు వెళ్లాలి : ప్రధానమంత్రి
సైబర్ భద్రతను పెంపొందించడంపై దృష్టి సారించడంతో పాటు భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చించిన - ప్రధానమంత్రి
అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ప్రాముఖ్యత గురించి, చిరుధాన్యాల ఉత్పత్తులకు ప్రజాదరణను పెంపొందించే చర్యల గురించి చర్చించిన - ప్రధానమంత్రి

ఈరోజు ఢిల్లీలో జ‌రిగిన ప్రధాన కార్యదర్శుల రెండవ జాతీయ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.

2022 జూన్‌ లో జరిగిన గత సదస్సు నుండి ఇప్పటివరకు దేశం సాధించిన అభివృద్ధి మైలురాళ్లను ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. భారతదేశం G20 అధ్యక్ష పదవిని పొందడం; ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం; కొత్త అంకుర సంస్థల వేగవంతమైన నమోదు; అంతరిక్ష రంగంలో ప్రయివేటు రంగం ప్రయత్నాలు; నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, వివిధ అంశాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్రాలు, కేంద్రం కలిసికట్టుగా పనిచేసి, ప్రగతి వేగాన్ని పెంచాలని ఆయన నొక్కి చెప్పారు.

అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి, దేశం మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఆవిష్కరణ, చేరిక అనే నాలుగు అంశాలపై దృష్టి సారిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. నేడు, ప్రపంచం మొత్తం భారత్‌పై విశ్వాసం ఉంచుతోందని, ప్రపంచ సరఫరా వ్యవస్థలో స్థిరత్వాన్ని తీసుకురాగల దేశంగా మనం చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాలు ముందుండి, నాణ్యతపై దృష్టి సారిస్తూ, భారతదేశానికే ప్రాధాన్యతనిస్తూ నిర్ణయాలు తీసుకుంటే దేశం పూర్తి ప్రయోజనాన్ని పొందగలుగుతుందని ఆయన అన్నారు. అభివృద్ధి అనుకూల పాలన, వ్యాపార సౌలభ్యం, జీవన సౌలభ్యం, పటిష్టమైన మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్రాలు దృష్టి సారించాలని ఆయన సూచించారు.

ఆకాంక్షాత్మక బ్లాక్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తూ, ఆకాంక్షాత్మక జిల్లా కార్యక్రమం కింద దేశంలోని వివిధ ఆకాంక్షాత్మక జిల్లాల్లో సాధించిన విజయాలను ఆయన నొక్కిచెప్పారు. ఆకాంక్షాత్మక బ్లాక్ కార్యకమం రూపంలో ఆకాంక్షాత్మక జిల్లా నమూనాను ఇప్పుడు బ్లాక్ స్థాయికి తీసుకెళ్లాలని కూడా ఆయన సూచించారు. ఆకాంక్షాత్మక బ్లాక్‌ కార్యక్రమాన్ని ఆయా రాష్ట్రాల్లో అమలు చేయాలని సమావేశానికి హాజరైన అధికారులను ఆయన కోరారు.

ఎమ్.ఎస్.ఎం.ఈ. ల గురించి చర్చిస్తూ, ఎమ్.ఎస్.ఎం.ఈ. ల లాంఛనీకరణకు రాష్ట్రాలు చురుగ్గా వ్యవహరించాలని ప్రధానమంత్రి సూచించారు. ఎమ్.ఎస్.ఎం.ఈ. లను ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేలా చేయడానికి, ఆర్థిక, టెక్నాలజీ, మార్కెట్, నైపుణ్యం కోసం అందుబాటులో ఉండేలా చూడాలని కూడా ఆయన సూచించారు. మరిన్ని ఎమ్.ఎస్.ఎం.ఈ. లను జి.ఈ.ఎం. పోర్టల్‌ పరిధి లోకి తీసుకురావడంపై కూడా ఆయన చర్చించారు. ఎమ్.ఎస్.ఎం.ఈ. లను విశ్వ విజేతగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని, గ్లోబల్‌ వాల్యూ వ్యవస్థలో భాగం కావాలని ఆయన అన్నారు. ఎమ్.ఎస్.ఎం.ఈ. ల అభివృద్ధి లో క్లస్టర్ విధానం విజయాన్ని చర్చిస్తూ, ఎమ్.ఎస్.ఎం.ఈ. క్లస్టర్లు, స్వయం సహాయక బృందాల అనుసంధానం విశిష్ట స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి, వాటికి జి.ఐ. ట్యాగ్‌ ల నమోదును పొందడానికి అన్వేషించవచ్చునని, ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీనిని 'ఒక జిల్లా ఒక ఉత్పత్తి' ప్రయత్నంతో అనుసంధానించడం తో పాటు, స్థానికుల కోసం స్వరం అనే స్పష్టమైన పిలుపుకు ఊపిస్తుంది. రాష్ట్రాలు తమ అత్యుత్తమ స్థానిక ఉత్పత్తులను గుర్తించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిని సాధించడంలో సహాయపడాలని ఆయన కోరారు. ఇక్కడ, అతను స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద ఉన్న ఏక్తా మాల్ ఉదాహరణను కూడా చెప్పారు.

ఒకప్పుడు దేశం ఎదుర్కొన్న మితిమీరిన నియంత్రణ, ఆంక్షల భారాన్ని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో వేలకొద్దీ అనుసరణలకు ముగింపు పలికేందుకు సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కొన్ని చట్టాలు కొనసాగుతున్నాయని, పాత చట్టాలను అంతం చేయాల్సిన అవసరం గురించి కూడా ఆయన చెప్పారు.

వివిధ ప్రభుత్వ శాఖలు ఒకే పత్రాలను ఎలా అడుగుతున్నాయో చర్చిస్తూ, ఈ రోజు స్వీయ-ధృవీకరణ, డీమ్డ్ అనుమతులు, సంబంధిత పత్రాల ప్రామాణీకరణ దిశగా పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి అన్నారు. భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి దేశం ఎలా పని చేస్తుందో కూడా ఆయన వివరించారు. ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్‌ ప్లాన్ గురించి కూడా ఆయన చర్చించారు. డేటా భద్రత గురించి, అవసరమైన సేవలను సజావుగా అందించడానికి సురక్షితమైన సాంకేతిక మౌలిక సదుపాయాలను కలిగి ఉండటం క్లిష్టత గురించి కూడా ఆయన మాట్లాడారు. రాష్ట్రాలు పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ వ్యూహాన్ని అవలంబించేందుకు ప్రయత్నించాలని, ఈ పెట్టుబడి భవిష్యత్తుకు బీమా వంటిదని ఆయన ఉద్ఘాటించారు. సైబర్ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహణ, సంక్షోభ నిర్వహణ ప్రణాళికల అభివృద్ధికి సంబంధించిన అంశాలను కూడా ఆయన చర్చించారు.

దేశంలోని తీర ప్రాంతాల అభివృద్ధిపై కూడా ప్రధానమంత్రి చర్చించారు. దేశంలోని విశాలమైన ప్రత్యేక ఆర్ధిక మండలి అపారమైన వనరులను కలిగి ఉందని, ఇది దేశానికి అద్భుతమైన అవకాశాలను అందిస్తుందని ఆయన తెలియజేశారు. వృత్తాకార ఆర్థిక వ్యవస్థపై అవగాహన పెంపొందించవలసిన అవసరాన్ని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. మిషన్ లైఫ్ (పర్యావరణ జీవనశైలి) తో పాటు, దానిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో రాష్ట్రాలు పోషించగల ముఖ్యమైన పాత్ర గురించి ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు.

భారతదేశ చొరవతో, ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. చిరు ధాన్యాలు కేవలం స్మార్ట్ ఫుడ్ గా మాత్రమే కాకుండా పర్యావరణ అనుకూలమైనవని, అవి స్థిరమైన భవిష్యత్తు ఆహారంగా మారగలవని ఆయన పేర్కొన్నారు. చిరు ధాన్యాల ఉత్పత్తులకు సంబంధించిన ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్ తదితర పరిశోధనలపై రాష్ట్రాలు కృషి చేయాలని, చిరు ధాన్యాల ఉత్పత్తుల మొత్తం విలువ జోడింపును ప్రోత్సహించాలని ఆయన అన్నారు. దేశంలోని ప్రముఖ బహిరంగ ప్రదేశాలు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద 'మిల్లెట్ కేఫ్'ల ఏర్పాటుపై కూడా ప్రధానమంత్రి చర్చించారు. రాష్ట్రాల్లో జరుగుతున్న జి-20 సమావేశాలలో చిరు ధాన్యాలను ప్రదర్శించవచ్చని ఆయన అన్నారు.

రాష్ట్రాలలో జరిగే జి-20 సమావేశాలకు సంబంధించిన సన్నాహాల కోసం, సామాన్య పౌరులను భాగస్వామ్యం చేయడం యొక్క ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. అటువంటి 'సిటిజన్ కనెక్ట్' సాధించడానికి సృజనాత్మక పరిష్కారాలను ఊహించాలని ఆయన అన్నారు. జీ-20 కి సంబంధించిన సన్నాహాల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆయన సూచించారు. మాదకద్రవ్యాలు, అంతర్జాతీయ నేరాలు, ఉగ్రవాదం, విదేశీ గడ్డపై పుట్టుకొచ్చే తప్పుడు సమాచారం వంటి సవాళ్లపై కూడా ప్రధానమంత్రి రాష్ట్రాలను హెచ్చరించారు.

బ్యూరోక్రసీ సామర్థ్యాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకతతో పాటు, మిషన్ కర్మయోగిని ప్రారంభించడంపై ప్రధానమంత్రి చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి శిక్షణా మౌలిక సదుపాయాలను సమీక్షించాలని, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభించాలని ఆయన అన్నారు.

ఈ ముఖ్య కార్యదర్శుల సదస్సును నిర్వహించేందుకు వివిధ స్థాయిలలో సుమారు 4000 మంది అధికారులు పనిచేశారని, దీని కోసం ఒక లక్షా 15 వేలకు పైగా పని గంటలు పెట్టుబడి పెట్టారని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ప్రయత్నాలు భూమిపై కూడా ప్రతిబింబించడం ప్రారంభించాలని, సదస్సు నుండి వెలువడే సూచనల ఆధారంగా రాష్ట్రాలు కార్యాచరణ ప్రణాళికలను అభివృద్ధి చేసి అమలు చేయాలని ఆయన కోరారు. ఈ విషయంలో రాష్ట్రాల మధ్య ఆరోగ్య పోటీని కూడా నీతి ఆయోగ్ అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Chai Pe Charcha' With Xi, Putin: Unseen Footage From BRICS Summit Show PM Modi's Moments With Leaders

Media Coverage

'Chai Pe Charcha' With Xi, Putin: Unseen Footage From BRICS Summit Show PM Modi's Moments With Leaders
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister extends greetings on Samvatsari
September 15, 2026

The Prime Minister, Shri Narendra Modi, has extended his greetings to the people on the sacred occasion of Samvatsari. Shri Modi said that Samvatsari reminds us that forgiveness and compassion strengthen every bond. He called upon everyone to embrace humility and let kindness and goodwill guide their actions.

The Prime Minister posted on X:

Samvatsari reminds us that forgiveness and compassion strengthen every bond.

On this sacred occasion, may humility guide us and may kindness and goodwill shape our every action.

Michhami Dukkadam!