తమిళ నాడు లోని విరుధునగర్ జిల్లా లో ఉన్న ఓ బాణసంచా తయారీ కర్మాగారం లో దుర్ఘటన కారణం గా అనేక మంది చనిపోయినట్లు తెలిసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరగా కోలుకోవాలి అని కూడా శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన ప్రతి ఒక్క వ్యక్కి తాలూకు దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతున మరియు ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి ప్రకటించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘విరుధునగర్ జిల్లా లో గల ఓ బాణసంచా తయారీ కర్మాగారం లో జరిగిన దుర్ఘటన ను గురించి తెలిసింది. అది చాలా దు:ఖదాయకమైనటువంటి సమాచారం. ఈ కఠిన సమయం లో విషాదభరితం గా ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల యొక్క ప్రియతముల కు కలిగినటువంటి శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరగాను మరియు పూర్తిగాను కోలుకోవాలి అని నేను కోరుకొంటున్నాను.
మృతి చెందిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇదే దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి @narendramodi’’ అని తెలిపింది.
It is with a heavy heart that I learnt about a mishap at a firecracker factory in Virudhunagar district. During this difficult time, my thoughts are with the loved ones of those who have tragically passed away. I wish a swift and full recovery for all who have been injured.
— PMO India (@PMOIndia) February 17, 2024
An…


