రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఈ రోజు ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు భారత రాజ్యాంగ ప్రవేశిక పఠన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ పవిత్ర గ్రంథ పఠన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె. మిశ్రా, ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి-2 శ్రీ శక్తికాంత దాస్, ప్రధానమంత్రి సలహాదారు శ్రీ తరుణ్ కపూర్, ప్రధానమంత్రి ప్రత్యేక కార్యదర్శి శ్రీ అతీష్ చంద్ర, ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.
‘ఎక్స్’ వేదికగా భారత ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
"ఈ రోజు రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రవేశిక పఠన కార్యక్రమం నిర్వహించాం. ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె. మిశ్రా, ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి-2 శ్రీ శక్తికాంత దాస్, ప్రధానమంత్రి సలహాదారు శ్రీ తరుణ్ కపూర్, ప్రధానమంత్రి ప్రత్యేక కార్యదర్శి శ్రీ అతీష్ చంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు."
Earlier today, on Constitution Day, the Preamble was read out in the Prime Minister's Office. Principal Secretary to the Prime Minister, Dr. PK Mishra, Principal Secretary-2 to PM, Shri Shaktikanta Das, Advisor to PM, Shri Tarun Kapoor, Special Secretary to PM, Shri Atish… pic.twitter.com/TN5VuBOSeu
— PMO India (@PMOIndia) November 26, 2025


