ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2021 జూన్‌ 5న నిర్వహించే కార్యక్రమంలో ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా పాల్గొంటారు. ఈ ఏడాది “మెరుగైన పర్యావరణ కోసం జీవ ఇంధనాలకు ప్రోత్సాహం” ఇతివృత్తంగా కేంద్ర పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పు మంత్రిత్వశాఖ, పెట్రోలియం-సహజ వాయువుల మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

   ఈ కార్యక్రమంలో భాగంగా “భారతదేశంలో ఇథనాల్‌ సమ్మిశ్రమం కోసం మార్గ ప్రణాళిక 2020-2025పై నిపుణుల కమిటీ నివేదిక”ను ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ నిర్వహణ దిశగా ఇథనాల్‌ కలిపిన పెట్రోలు విక్రయించాల్సిందిగా చమురు కంపెనీలను ఆదేశిస్తూ ‘ఈ-20 నోటిఫికేషన్‌’ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ మేరకు 2023 ఏప్రిల్‌ 1 నుంచి పెట్రోలులో 20 శాతం ఇథనాల్‌ కలిపి విక్రయించాలని సూచించనుంది. అదేవిధంగా అధిక మోతాదులో ‘ఇ12, ఇ15’ ఇథనాల్‌ మిశ్రమానికి సంబంధించి ‘బీఐఎస్‌’ ప్రమాణాలను ప్రకటించనుంది. ఈ చర్యలతో ఇథనాల్ అదనపు డిస్టిల్లరీ సామర్థ్యంగల ప్లాంట్ల ఏర్పాటుకు వీలు కలగడమేగాక దేశవ్యాప్తంగా మిశ్రమ ఇంధన లభ్యతకు నిర్ణీత వ్యవధి లభిస్తుంది. ఇథనాల్ ఉత్పాదక రాష్ట్రాలు, సమీప ప్రాంతాల్లో 2025కు ముందే ఇథనాల్ వినియోగం పెరగడానికి కూడా ఈ చర్యలు తోడ్పడతాయి.

   పుణే నగరంలోని మూడు ప్రాంతాల్లో ప్రయోగాత్మక పథకం కింద ‘ఇ100’ ఇంధన విక్రయ స్టేషన్లను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రారంభిస్తారు. దీంతోపాటు ఇథనాల్ మిశ్రమ పెట్రోలు, పీడనసహిత బయోగ్యాస్ కార్యక్రమాల కింద మద్దతు పొందిన రైతుల తొలి అనుభవాలను వారినుంచి తెలుసుకునే దిశగా ప్రధాని వారితో ముచ్చటిస్తారు.

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Indian economy 'resilient' despite 'fragile' global growth outlook: RBI Bulletin

Media Coverage

Indian economy 'resilient' despite 'fragile' global growth outlook: RBI Bulletin
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM attends the Defence Investiture Ceremony-2025 (Phase-1)
May 22, 2025

The Prime Minister Shri Narendra Modi attended the Defence Investiture Ceremony-2025 (Phase-1) in Rashtrapati Bhavan, New Delhi today, where Gallantry Awards were presented.

He wrote in a post on X:

“Attended the Defence Investiture Ceremony-2025 (Phase-1), where Gallantry Awards were presented. India will always be grateful to our armed forces for their valour and commitment to safeguarding our nation.”