పాల‌స్తీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంకా ఓమాన్ ల‌కు బ‌య‌లుదేరే ముందు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న పాఠం ఈ కింది విధంగా ఉంది.

“ఫిబ్ర‌వ‌రి 9వ తేదీ నుండి 12 వ తేదీ వ‌ర‌కు పాల‌స్తీనా, యునైటెడ్ అర‌బ్‌ ఎమిరేట్స్, ఇంకా ఓమాన్ లలో నేను ద్వైపాక్షిక ప‌ర్య‌ట‌న‌ల‌ను చేప‌ట్ట‌బోతున్నాను.

2015వ సంవ‌త్స‌రం త‌రువాతి కాలంలో గ‌ల్ఫ్ మ‌రియు ప‌శ్చిమ ఆసియా ప్రాంతాల‌లో అయిదో సారి ప‌ర్య‌టించ‌నుండ‌డం నాకు సంతోషాన్నిస్తోంది. మ‌న విదేశీ సంబంధాల‌లో ఈ ప్రాంతానికి ఒక కీల‌క‌మైన ప్రాధాన్యం ఉంది. ఇక్క‌డి దేశాల‌తో మ‌నం చైత‌న్య‌శీల‌మైన బ‌హుళ పార్శ్వికమైన అనుబంధాన్ని క‌లిగివున్నాం.

నా ప‌ర్య‌ట‌న ఫిబ్ర‌వ‌రి 10 తేదీ నాడు జోర్డాన్ మీదుగా ప్ర‌యాణించి, పాల‌స్తీనా కు చేరుకోవ‌డంతో మొద‌ల‌వుతుంది. మార్గ‌మ‌ధ్యంలో బ‌స క‌ల్పిస్తున్నందుకుజోర్డాన్ రాజు శ్రీ రెండో అబ్దుల్లా కు నేను కృత‌జ్ఞుడినై ఉంటాను. ఆయ‌న‌ను ఫిబ్ర‌వ‌రి 9వ తేదీన అమ్మాన్ లో కలుసుకోవడం కోసం నేను ఎదురుచూస్తున్నాను.

ఇది భార‌త‌దేశం నుండి పాల‌స్తీనా ను సంద‌ర్శిస్తున్న మొట్ట‌మొద‌టి ప్ర‌ధాన మంత్రి ప‌ర్య‌ట‌న కాబోతోంది. అధ్య‌క్షులు శ్రీ మొహ‌మూద్ అబ్బాస్ తో జ‌రుప‌బోయే చ‌ర్చ‌ల కోసం, అలాగే పాల‌స్తీనా అభివృద్ధి మ‌రియు పాల‌స్తీనా ప్ర‌జ‌ల‌కు మ‌న మ‌ద్ద‌తును పున‌రుద్ఘాటించ‌డం కోసం నేను నిరీక్షిస్తున్నాను.

ఫిబ్ర‌వ‌రి 10వ, 11వ తేదీల‌లో నేను యుఎఇ లో ప‌ర్య‌టిస్తాను. 2015 ఆగ‌స్టు లో ప‌ర్య‌టించిన అనంత‌రం మ‌రోసారి నేను అక్క‌డకు వెళ్తున్నాను. యుఎఇ ఒక విలువైన వ్యూహాత్మ‌క భాగ‌స్వామి. యుఎఇ తో ఆర్థిక వ్య‌వ‌స్థ, శ‌క్తి, ఉన్న‌త సాంకేతిక విజ్ఞానం, ఇంకా భ‌ద్ర‌త ల‌తో స‌హా ప్ర‌ధాన రంగాల‌న్నింటిలో మ‌నం శ‌ర వేగంగా దూసుకుపోతున్నటువంటి స‌హ‌కారాన్ని పొందుతున్నాం. ఈ రంగాల‌లో మ‌న పురోగ‌తిని గురించి, ఇంకా ఉపాధ్య‌క్షులు, యుఎఇ ప్ర‌ధాని మరియు దుబయ్ పాలకుడు శ్రీ షేక్ మొహమ్మద్ బిన్ ర‌శీద్ అల్ మక్తూమ్ తోను, అబూ ధాబి యువ రాజు శ్రీ షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ అల్ న‌హ్ యాన్ తోను నేను జ‌ర‌ప‌బోయే స‌మావేశాల కోసం వేచి వున్నాను.

యుఎఇ నాయ‌క‌త్వం ఆహ్వానించిన మీద‌ట‌, దుబయ్ లో వ‌ర‌ల్డ్ గ‌వ‌ర్న‌మెంట్ స‌మిట్ 6వ సంచిక‌ను ఉద్దేశించి నేను ప్ర‌సంగించ‌నున్నాను. భారతదేశం ఈ శిఖ‌ర స‌మ్మేళ‌నంలో గౌర‌వ అతిథి దేశంగా పాలుపంచుకోనుంది.

అదే రోజున నేను దుబాయి లో యుఎఇ, అరబ్ ప్రాంతాల సిఇఒ ల‌తో భార‌త‌దేశంలోని విస్తృత‌ ఆర్థిక అవ‌కాశాల‌ గురించి, వ్యాపార స‌మ‌న్వ‌యాన్ని పెంపొందించుకొనేందుకు గాను కలిసికట్టుగా మరేయే చర్యలు చేపట్టాలో అనే దానిని గురించి చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నాను.

ఓమాన్ మ‌నం శ్రేష్ఠ‌మైన సంబంధాల‌ను క‌లిగి ఉన్న మ‌రొక స‌న్నిహిత స‌ముద్ర ప్రాంత పొరుగు దేశంగా ఉంది. నేను ఓమాన్ సుల్తాన్ తో, ఇత‌ర కీల‌క‌ నాయ‌కుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతాను. ఓమాన్ కు చెందిన ప్ర‌ముఖ వ్యాపార రంగ ప్ర‌ముఖుల‌తో నేను భేటీ అవుతాను. భార‌త‌దేశంతో బ‌ల‌మైన ఆర్థిక‌, వ్యాపార సంబంధాల‌ను అభివృద్ధి ప‌ర‌చుకోవ‌డం అనే అంశం పై వారితో చ‌ర్చ‌లు జ‌రుపుతాను.

ఫిబ్ర‌వ‌రి 11వ, 12వ తేదీల‌లో నేను ప్ర‌ధాన మంత్రిగా అక్కడ నా తొలి ప‌ర్య‌ట‌నను చేప‌ట్టనుండడం పట్ల ఆనందిస్తున్నాను. భార‌త‌దేశం మ‌రియు ఓమాన్ వ‌ర్ధిల్లుతున్న‌టు వంటి సంబంధాలను కలిగివున్నాయి. ఈ సంబంధాలు శ‌తాబ్దాల త‌ర‌బ‌డి ఇరు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ మధ్య చోటుచేసుకొంటున్న రాక పోక లతో వేళ్లూనుకొన్నాయి.

ఫిబ్ర‌వరి 11వ తేదీ నాటి సాయంత్రం, నేను ఓమాన్ సుల్తాన్ తో భేటీ అవుతాను. అలాగే, డిప్యూటీ ప్రైం మినిస్టర్ ఫర్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ శ్రీ స‌య్యిద్ ఫహ‌ద్ బిన్ మ‌హ‌మూద్ అల్ స‌యద్ తో, డిప్యూటీ ప్రైం మినిస్టర్ ఫర్ ఇంటర్ నేశనల్ రిలేశన్స్ అండ్ కోఆపరేశన్ అఫైర్స్ శ్రీ స‌య్యిద్ అసాద్ బిన్ తారీఖ్ అల్ స‌య‌ద్ తో స‌మావేశ‌మ‌వుతాను. ద్వైపాక్షిక స‌హ‌కారంతో పాటు సాంప్ర‌దాయ‌కంగా ప‌టిష్టంగా ఉన్న మ‌న సంబంధాలను మ‌రింత‌గా పెంపొందించుకొనేందుకు చేప‌ట్ట‌వ‌ల‌సిన చ‌ర్య‌ల‌ను కూడా మేం స‌మీక్షిస్తాం.

ఫిబ్ర‌వ‌రి 12వ తేదీన, నేను అమాన్ కు చెందిన ప్ర‌ముఖ వ్యాపారవేత్త‌ల‌తో సమావేశమై, భార‌త‌దేశంతో బ‌ల‌వ‌త్త‌ర‌మైన ఆర్థిక మ‌రియు వ్యాపార సంబంధాల‌ను అభివృద్ధి ప‌ర‌చుకోవ‌డం అనే అంశంపై వారితో చ‌ర్చిస్తాను.

అమాన్ లో, యుఎఇ లో పెద్ద సంఖ్య‌లో నివ‌సిస్తున్న ప్ర‌వాసీ భార‌తీయుల స‌ముదాయంతో భేటీ అయ్యే అవ‌కాశం నాకు ద‌క్కనుంది. వారు ఆయా దేశాల‌ను తమ నివాసంగా మ‌ల‌చుకొన్నారు. గ‌ల్ఫ్ ప్రాంతంలో 9 మిలియ‌న్ మందికి పైగా భార‌తీయులు మ‌నుగ‌డ సాగిస్తూ, విధుల‌ను నిర్వ‌హిస్తున్నారు. వారిలో ముడింట ఒక‌టో వంతు మంది ఒక్క యుఎఇ లోనే మ‌నుగ‌డ సాగిస్తున్నారు. ఓమాన్ లో అయితే, వారు అతి పెద్ద నిర్వాసితుల స‌ముదాయంగా ఏర్పడ్డారు.

ప్ర‌వాసీ భార‌తీయుల స‌ముదాయం భార‌త‌దేశానికి, గ‌ల్ఫ్ ప్రాంత దేశాల‌కు మ‌ధ్య నిర్మాణమైనటువంటి ఒక స్నేహ సేతువు. వారు తమ ఆతిథేయి దేశాల పురోగ‌తిలో, సమృద్ధి ల‌లో క్రియాశీల భాగ‌స్తులుగా కూడా ఉంటున్నారు.

ప‌శ్చిమ ఆసియా మ‌రియు గ‌ల్ఫ్ ప్రాంతంలో ప‌ర్య‌టించ‌డం ద్వారా భార‌త‌దేశం యొక్క అంతకంతకు వ‌ర్ధిల్లుతున్న మరియు ముఖ్య‌మైన స‌ంబంధాల‌ను దృఢతరం చేయడం కోసం నేను ఎదురుచూస్తూ ఉన్నాను”.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
How Naxals were compelled to bid farewell to arms

Media Coverage

How Naxals were compelled to bid farewell to arms
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Let us together make the India-Austria partnership innovation-centric and future-ready: PM Modi at the India-Austria Joint Press Meet
April 16, 2026

Your Excellency, चांसलर स्टॉकर

दोनों देशों के delegates,

मीडिया के साथियों,

नमस्कार!

ग्रूस गॉट

चांसलर स्टॉकर, आपकी पहली भारत यात्रा पर मैं आपका हार्दिक स्वागत करता हूँ। हमे बहुत खुशी है कि आपने यूरोप के बाहर अपनी पहली यात्रा के लिए भारत को चुना। यह आपके विज़न और भारत-ऑस्ट्रीया संबंधों के प्रति आपकी प्रतिबद्धता को दर्शाता है।

चार दशकों के बाद ऑस्ट्रिया के चांसलर की भारत यात्रा अत्यंत महत्वपूर्ण है। वर्ष 2026 के ऐतिहासिक भारत -यूरोपियन यूनियन फ्री ट्रेड अग्रीमन्ट के बाद, भारत और यूरोपियन यूनियन के बीच संबंधों में एक नए सुनहरे अध्याय की शुरुआत हुई है। चांसलर स्टॉकर की विज़िट से, हम भारत-ऑस्ट्रिया संबंधों को भी एक नए कालखंड में ले जा रहे हैं।

Friends,

इंफ्रास्ट्रक्चर, इनोवेशन और सस्टेनिबिलिटी में भारत और ऑस्ट्रिया भरोसेमंद साझेदार रहे हैं। दिल्ली मेट्रो हो या हिमालय पर दस हजार फीट की ऊँचाई पर बना अटल टनल, ऑस्ट्रिया की टनलिंग एक्स्पर्टीज़ ने अपनी मजबूत छाप छोड़ी है।

इतना ही नहीं, रेल्वे प्रोजेक्ट्स से लेकर गुजरात के गिरनार रोपवे तक, क्लीन एनर्जी से लेकर urban डेवलपमेंट तक, भारत के कई इंजीनियरिंग प्रोजेक्ट्स में ऑस्ट्रियन कंपनियाँ सक्रिय भागीदार रही हैं।

Friends,

चांसलर स्टॉकर की यह यात्रा ट्रेड और इनवेस्टमेंट में नई ऊर्जा लाएगी। हमे बहुत खुशी है, कि वे एक बड़े vision और बड़े बिजनस delegation के साथ भारत आए हैं।

हम ऑस्ट्रिया की एक्स्पर्टीज़, और भारत की स्पीड और स्केल को जोड़कर, पूरे विश्व के लिए reliable टेक्नॉलजी और supply chain सुनिश्चित करेंगे। हम डिफेन्स, सेमीकन्डक्टर, quantum, और bio-टेक्नॉलजी में भी अपनी पार्ट्नर्शिप को सुदृढ़ करेंगे।

साथ ही, हम इंजीनियरिंग और टेक्निकल एजुकेशन सहयोग को भी और मजबूत करेंगे। IIT दिल्ली और ऑस्ट्रिया की मोंटान यूनिवर्सिटी के बीच आज साइन किया जा रहा MOU, इस knowledge एक्सचेंज का एक उज्ज्वल उदाहरण है।

Friends,

भारत का टैलेंट, ऑस्ट्रिया की innovation और productivity को बढ़ाने की क्षमता रखता है।

2023 में हमने ऑस्ट्रिया के साथ एक व्यापक माइग्रेशन एण्ड मोबिलिटी अग्रीमन्ट किया। अब इस अग्रीमन्ट के अंतर्गत, हम nursing सेक्टर में भी मोबिलिटी को आगे बढ़ाएंगे।

हम जॉइन्ट रिसर्च और start-up सहयोग को भी और मजबूत करेंगे। यूथ एक्सचेंज को प्रमोट करने के लिए, हम आज भारत-ऑस्ट्रिया वर्किंग हॉलिडे प्रोग्राम भी लॉन्च कर रहें हैं।

Friends,

आज पूरा विश्व एक बहुत ही गंभीर और तनावपूर्ण स्थिति से गुजर रहा है। और इसका प्रभाव हम सभी पर पड़ रहा है। ऐसे तनावपूर्ण वैश्विक माहौल में, भारत और ऑस्ट्रिया, हम एकमत हैं कि, मिलिटरी कॉन्फ्लिक्ट से समस्याओं का समाधान नहीं निकल सकता। यूक्रेन हो या वेस्ट एशिया, हम एक stable, सस्टेनबल और lasting peace का समर्थन करते हैं।

हम इस बात पर भी एकमत हैं, कि बढ़ते ग्लोबल challenges के समाधान के लिए Global institutions का रिफॉर्म अनिवार्य है। और आतंकवाद को जड़ से मिटाना, हमारी साझी प्रतिबद्धता है।

Your Excellency,

2024 में मेरी ऑस्ट्रिया की यात्रा भी, चार दशकों बाद हुई थी। उस विज़िट के बाद आज भारत में आपका स्वागत करना, हमारे लिए बहुत गर्व और खुशी की बात है। आइए, हम भारत-ऑस्ट्रिया साझेदारी को इनोवेशन centric और फ्यूचर रेडी बनाएं।

बहुत-बहुत धन्यवाद।