ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇండోనేశియా, మ‌లేశియా మ‌రియు సింగ‌పూర్ ల‌కు బ‌య‌లుదేరి వెళ్ళే ముందు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న పాఠం ఈ కింది విధంగా ఉంది.

‘‘నేను 2018 మే నెల 29 నుండి జూన్ నెల 2వ తేదీ మ‌ధ్య కాలంలో ఇండోనేశియా, మ‌లేశియా, ఇంకా సింగ‌పూర్ ల‌లో ప‌ర్య‌టించ‌నున్నాను. ఈ మూడు దేశాల‌తో భార‌త‌దేశం ఒక బ‌ల‌మైన వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని క‌లిగివుంది.

ఇండోనేశియా అధ్య‌క్షులు శ్రీ జోకో విడోడో ఆహ్వానించిన మీద‌ట నేను మే నెల 29వ తేదీ నాడు జ‌కార్తా ను సంద‌ర్శించ‌నున్నాను. ప్ర‌ధాన మంత్రి గా ఇది ఇండోనేశియా లో నా ఒక‌టో ప‌ర్య‌ట‌న‌. మే 30వ తేదీ నాడు అధ్య‌క్షులు శ్రీ విడోడో తో నేను జ‌ర‌ప‌బోయే చ‌ర్చ‌ల‌తో పాటు ఇండియా-ఇండోనేశియా సిఇఓస్ ఫోర‌మ్ తో సంయుక్త స‌మావేశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇండోనేశియా లో భార‌తీయ స‌ముదాయాన్ని ఉద్దేశించి నేను ప్ర‌సంగించ‌నున్నాను.

భార‌త‌దేశం మ‌రియు ఇండోనేశియా లు ప‌టిష్ట‌మైన మరియు మైత్రీ పూర్వ‌క‌మైన సంబంధాల‌ను క‌లిగివున్నాయి. గాఢ‌తరమైనటువంటి చారిత్ర‌క మ‌రియు నాగ‌రక‌ సంబంధిత బంధాల‌ను కూడా పెన‌వేసుకొన్నాయి. ఇరు దేశాలు బ‌హుళ జాతులతో, బ‌హుళ మ‌తాలతో కూడిన బ‌హుత్వవాద సంబంధి, స్వేచ్ఛాయుతమైనటువంటి స‌మాజాలు కూడాను. ఇండోనేశియా లో నా ప‌ర్య‌ట‌న ఆసియా లోకెల్లా అతి పెద్దవైన రెండు ప్ర‌జాస్వామ్య వ్యవస్థల మ‌ధ్య మ‌రింత స‌మ‌న్వ‌యానికి బాటను ప‌ర‌చ‌డ‌మే కాకుండా ద్వైపాక్షిక సంబంధాల‌ను ఉన్న‌తీక‌రించ‌గ‌ల‌ద‌ని కూడా నేను విశ్వ‌సిస్తున్నాను.

మే నెల 31వ తేదీ నాడు సింగ‌పూర్ కు వెళుతూ, మార్గ‌మ‌ధ్యంలో కొద్దిసేపు మ‌లేశియా లో ఆగి, మ‌లేశియా లోని నూత‌న నాయ‌క‌త్వానికి నా అభినంద‌న‌లను తెలియ‌జేస్తాను; ప్ర‌ధాని డాక్టర్ మహాతిర్ మొహమద్ తో భేటీ కావ‌డం కోసం నేను నిరీక్షిస్తున్నాను.

సింగ‌పూర్ లో నైపుణ్యాల అభివృద్ధి, ప‌ట్ట‌ణ ప్రాంతాలకు సంబంధించిన ప్ర‌ణాళిక ర‌చ‌న‌, ఫిన్‌టెక్ మ‌రియు ఆర్టిఫీశియ‌ల్ ఇంటెలిజెన్స్ రంగాల‌లో భార‌త‌దేశం- సింగ‌పూర్ భాగ‌స్వామ్యాన్ని ఇనుమ‌డింప‌జేసుకోవ‌డం పట్ల నేను శ్ర‌ద్ధ ను వ‌హిస్తాను. ప‌ట్ట‌ణాభివృద్ధి, ప్ర‌ణాళిక ర‌చ‌న‌, స్మార్ట్ సిటీస్ ఇంకా అవ‌స్థాప‌న అభివృద్ధి వంటి రంగాల‌లో సింగ‌పూర్ కు చెందిన సంస్థ‌లు భార‌త‌దేశానికి పెద్ద భాగ‌స్వాములుగా మారాయి. సింగ‌పూర్ లో నేను జ‌రిపే ప‌ర్య‌ట‌న ఉభయ దేశాలు మ‌రింత ముందుకు సాగిపోవ‌డానికి ఒక అవ‌కాశాన్ని అందించగలదు.

మే నెల 31వ తేదీ నాడు నేను ఇండియా-సింగ‌పూర్ ఎంట‌ర్‌ప్రైజ్ అండ్ ఇనవేశ‌న్ ఎగ్జిబిశన్ ను సంద‌ర్శిస్తాను. వ్యాపార అవకాశాలు మ‌రియు పెట్టుబ‌డి అవ‌కాశాల పై సింగ‌పూర్ కు చెందిన ఎంపిక చేసిన అగ్ర‌గామి సిఇఒ ల‌తో ఒక రౌండ్ టేబుల్ స‌మావేశంలో పాలుపంచుకొన్న అనంత‌రం నేను వ్యాపార ప్ర‌ముఖుల కార్య‌క్ర‌మం లో మ‌రియు సాముదాయిక కార్య‌క్ర‌మం లో ప్ర‌సంగిస్తాను.

జూన్ నెల 1వ తేదీ నాడు నేను మాన్యురాలైన సింగ‌పూర్ అధ్య‌క్షురాలు హ‌లీమా యాక‌బ్ గారితో భేటీ అవుతాను. నేను సింగ‌పూర్ ప్ర‌ధాని శ్రీ లీ తో ప్ర‌తినిధివ‌ర్గ స్థాయి చ‌ర్చ‌ల‌లో కూడా పాలుపంచుకొంటాను. అలాగే, నాన్‌యాంగ్ టెక్న‌లాజిక‌ల్ యూనివ‌ర్సిటీ సంద‌ర్శ‌న‌కై వేచి వుంటాను. అక్క‌డి యువ విద్యార్థుల‌తో నేను మ‌మేకం అవుతాను.

ఆ రోజు సాయంత్రం పూట, నేను శాంగ్రి-లా డైలాగ్ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధానోప‌న్యాసం చేస్తాను. ఒక భార‌తీయ ప్ర‌ధాన మంత్రి ఈ ప్ర‌సంగాన్ని ఇవ్వ‌డం ఇదే తొలి సారి కానుంది. ప్రాంతీయ భ‌ద్ర‌త అంశాలు మ‌రియు ఈ ప్రాంతంలో శాంతి, స్థిర‌త్వాల ప‌రిర‌క్ష‌ణ తాలూకు భార‌త‌దేశం యొక్క దృష్టి కోణాన్ని వివ‌రించేందుకు ఇది ఒక అవ‌కాశం.

జూన్ నెల 2వ తేదీ నాడు నేను క్లిఫ‌ర్డ్‌ పియ‌ర్‌ లో ఒక ఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రిస్తాను. గాంధీ మ‌హాత్ముని అస్థిక‌ల‌ను 1948 మార్చి నెల 27వ తేదీ నాడు స‌ముద్రం లో నిమ‌జ్జ‌నం చేసిన ప్ర‌దేశం ఇదే. నేను భార‌త‌దేశంతో నాగ‌రక‌తప‌ర‌మైన అనుబంధం ఉన్న‌టువంటి కొన్ని ప్రార్థ‌న స్థలాల‌ను కూడా సంద‌ర్శిస్తాను.

నా ప‌ర్య‌ట‌న కార్య‌క్ర‌మంలో క‌డ‌ప‌టి అంశం సింగ‌పూర్ లోని చాంగీ నౌకాద‌ళ స్థావ‌రాన్ని సంద‌ర్శించ‌డం. అక్క‌డ నేను భార‌త నౌకాద‌ళానికి చెందిన ఐఎన్ఎస్ సాత్‌పురా ను సంద‌ర్శిస్తాను. భార‌తీయ నౌకాద‌ళం మ‌రియు రాయ‌ల్ సింగ‌పూర్ నేవీ కి చెందిన అధికారుల‌తోను, నావికుల‌తోను నేను సంభాషించ‌నున్నాను.

ఇండోనేశియా, మ‌లేశియా మ‌రియు సింగ‌పూర్ ల‌లో నేను జ‌రిపే ప‌ర్య‌ట‌న మ‌న యొక్క ‘యాక్ట్ ఈస్ట్ పోలిసి’ కి మ‌రింత ఉత్తేజాన్ని అంద‌జేయ‌డంతో పాటు ఈ మూడు దేశాల‌తో మ‌న సంబంధాల‌ను మ‌రింత పెంపొందించ‌గ‌ల‌ద‌ని కూడా నేను న‌మ్ముతున్నాను.’’

 
Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s Defence Exports Explode: ₹40,000 Crore Milestone Signals a New Manufacturing Era

Media Coverage

India’s Defence Exports Explode: ₹40,000 Crore Milestone Signals a New Manufacturing Era
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of PM’s remarks during inauguration of Swaminarayan Hindu Temple in Paris
September 06, 2026

पूज्य महंत स्वामी, फ्रांस सरकार के सम्मानित प्रतिनिधिगण, उपस्थित अतिथिगण, इंडियन कम्युनिटी के मेरे साथी, देश दुनिया से जुड़े सभी हरि भक्त, देवियों और सज्जनों, जय स्वामीनारायण!

आज फ्रांस की राजधानी पेरिस में भव्य स्वामीनारायण मंदिर का लोकार्पण हो रहा है। यह लोकार्पण भारत और फ्रांस के सांस्कृतिक संबंधों का नया युग स्तंभ है। पूज्य संत जनों और सनातन परंपरा के श्रेष्ठ जनों के आशीर्वाद के साथ आज इस लोकार्पण का मंच ‘वसुधैव कुटुम्बकम’ के भाव का मंच बन गया है। भगवान स्वामीनारायण की कृपा और हमारे संतों का स्नेह, संतों का आशीर्वाद, मेरा सौभाग्य है कि मुझे ऐसे पुण्य अवसरों से जुड़ने का अवसर हमेशा मिलता रहता है। आज भी मैं भले ही पेरिस में आप सबके बीच उपस्थित नहीं हूं, लेकिन मन से और हृदय से, मैं स्वयं को आपके बीच ही अनुभव कर रहा हूं।

साथियों,

आज इस अवसर पर मैं परम पूज्य प्रमुख स्वामी जी महाराज का भी श्रद्धापूर्वक स्मरण करता हूं। प्राचीन काल में भारत का जो सांस्कृतिक आध्यात्मिक वैभव था, उन्होंने उसके पुनर्जागरण का एक अभियान शुरू किया था। आज उसका प्रकाश यूरोप समेत पूरी दुनिया में फैल रहा है। 2024 में अबू धाबी में भव्य मंदिर का लोकार्पण हुआ था। आज वहां हजारों लोग दर्शन करने जाते हैं और अब यहां पेरिस में स्वामीनारायण मंदिर का निर्माण सृजन की यह निरंतरता, यह संतों की संकल्प शक्ति का ही प्रमाण है। मैं पुनीत कार्य के लिए पूज्य महंत स्वामी का आभार प्रकट करता हूं, मैं उनके चरणों में प्रणाम करता हूं। मैं BAPS स्वामीनारायण संस्था को और करोड़ों हरि भक्तों को इस अवसर पर हृदय की गहराई से बधाई देता हूं।

साथियों,

BAPS के माध्यम से जब अलग-अलग देश में मंदिरों की प्राण प्रतिष्ठा होती है, तो वहां भारत के प्राचीन विचार और मानवीय मूल्य भी साथ-साथ ही जाते हैं और भारत का विचार कहता है ‘समानं मनः सह चित्तमेषाम्’ अर्थात हमारे मन समान हो, हमारे हृदय साथ जुड़े। इसलिए आज जब फ्रांस में इतना भव्य मंदिर बनकर तैयार हुआ है, यह फ्रांस की विविधता को तो समृद्ध करेगा ही, इससे भारत और फ्रांस के सांस्कृतिक संबंधों को भी ऊर्जा मिलेगी।

साथियों,

बीते वर्षों में भारत और फ्रांस के संबंध नई ऊंचाइयों तक पहुंचे हैं। मेरे मित्र, प्रेसिडेंट मैक्रों के साथ मिलकर दोनों देश एक Special Global Strategic Partnership बना रहे हैं। Technology, AI और Defence से लेकर Space और Climate Action तक हम एक नई गति और नई ऊर्जा के साथ मिलकर के आगे बढ़ रहे हैं। हम 2026 को India-France Year of Innovation के रूप में भी सेलिब्रेट कर रहे हैं। भारत-फ्रांस की ये Strategic Partnership इसलिए भी खास है, क्योंकि ये हमारे पुराने सांस्कृतिक-राजनैतिक सम्बन्धों की मजबूत बुनियाद पर टिकी है। इतिहास गवाह है, फ्रांस में भारतीय सैनिकों के बलिदान का इतिहास आज भी मन-मंदिर में जीवित है। भाषा से जुड़े विषयों में रुचि रखने वाले लोग यह भी जानते हैं कि फ्रेंच स्कॉलर्स ने संस्कृत को लोकप्रिय बनाने में कितनी अहम भूमिका निभाई है। रामकृष्ण परमहंस और स्वामी विवेकानंद पर रोमाँ रोलाँ की की लेखनी हमारी सोसाइटीज़ को और करीब लाई है। पेरिस से पुडुचेरी के अरबिंदो आश्रम तक 'The mother' की spiritual journey, उसने कितने ही भारतीय और फ्रेंच साधकों को inspire किया है।

साथियों,

दशकों पहले श्रील प्रभुपाद स्वामी भी फ्रांस आए थे। इस्कॉन के जरिए भारत फ्रांस के बीच आध्यात्मिक सम्बन्धों का नया अध्याय उन्होंने शुरू किया था। आज योग भी भारत-फ्रांस के people to people कनेक्ट का एक माध्यम बन चुका है। 'इंटरनेशनल योगा डे' पर एफिल टॉवर के सामने से आने वाली तस्वीरें फ्रांस में योग की लोकप्रियता का उदाहरण बनती हैं और अब BAPS के इस भव्य मंदिर के जरिए, हमारे उन सांस्कृतिक सम्बन्धों में एक नया अध्याय जुड़ रहा है।

साथियों,

इन दिनों, भारत फ्रांस Joint Ventures की संभावनाओं पर बातें होती हैं। स्वामीनारायण मंदिर ने इस संभावना में भी एक नया आयाम जोड़ा है। यह मंदिर 'मेड इन इंडिया' है और 'बिल्ट इन फ्रांस' है। इसके काफी पत्थरों को भारत में तराशा गया है। भारत की प्राचीन प्रतिभा यहाँ फ्रांस में आधुनिक इंजीनियरिंग से आकर जुड़ चुकी है। पेरिस में इस भव्य मंदिर ने आकार लिया है। इसलिए, मैं आशा करता हूँ, यह मंदिर सदियों तक भारत और फ्रांस के बीच सहयोग और संभावनाओं का भी प्रतीक बनकर उभरेगा।

साथियों,

स्वामीनारायण मंदिर हमेशा से भक्ति के साथ-साथ सेवा का माध्यम भी रहे हैं। मुझे बताया गया है, यह मंदिर भी सेवा प्रकल्पों का वैसा ही केंद्र बनेगा। मुझे विश्वास है कि यहाँ से भारतीय संस्कृति के जो स्वर निकलेंगे, उनका लाभ पूरे यूरोप में लोगों को मिलेगा। भविष्य में मुझे जब भी समय मिलेगा, मैं इस मंदिर में दर्शन करने का प्रयास अवश्य करूंगा। इन्हीं शब्दों के साथ, एक बार फिर आज के इस लोकार्पण समारोह में सम्मिलित सभी अतिथिगणों को, सभी परिवारों को, सभी हरि भक्तों को और पूरी Indian Diaspora को मेरी ओर से इस शुभारंभ पर्व की ढेरों शुभकामनाएं!

बहुत-बहुत धन्यवाद!

मर्सी बोकू!

जय स्वामीनारायण!