ఫిన్లాండ్ అధ్యక్షుడు శ్రీ అలెగ్జాండర్ స్టబ్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈ రోజున టెలిఫోన్లో మాట్లాడారు.
ఉక్రెయిన్ సంఘర్షణకు పరిష్కారం అంశంపై యూరోప్, అమెరికా, ఉక్రెయిన్ నేతలు ఇటీవల నిర్వహించిన సమావేశాలపై అధ్యక్షుడు శ్రీ స్టబ్ తన ఆలోచనలను శ్రీ మోదీకి తెలిపారు.
ఈ సంఘర్షణకు శాంతియుత పరిష్కారాన్ని కనుగొనే యత్నాలతో పాటు శాంతి, సుస్థిరత్వాలను సాధ్యమైనంత త్వరలో పునరుద్ధరించే విషయంలో భారత్ ఎప్పుడూ మద్దతునిస్తోందని ప్రధానమంత్రి శ్రీ మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
భారత్-ఫిన్లాండ్ ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని కూడా నేతలు సమీక్షించారు. క్వాంటమ్ టెక్నాలజీ, 6జీ, కృత్రిమ మేధ, సైబర్ భద్రతలతో పాటు స్థిరత్వం సహా సరికొత్తగా తెర మీదకు వస్తున్న రంగాల్లో ఉభయ దేశాల భాగస్వామ్యాన్ని విస్తృతం చేయాలన్న అంశంపై నిబద్ధతను ఇద్దరు నేతలూ పునరుద్ఘాటించారు.
ఇరు పక్షాలకు ప్రయోజనకరంగా వీలయినంత త్వరలో భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తుదిరూపును ఇవ్వాలనీ, ఈ అంశంలో ఫిన్లాండ్ మద్దతును అందిస్తుందని అధ్యక్షుడు శ్రీ స్టబ్ పునరుద్ఘాటించారు. భారత్ వచ్చే సంవత్సరంలో నిర్వహించనున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ విజయవంతం కావడానికి తాము మద్దతిస్తామని కూడా శ్రీ స్టబ్ ఉద్ఘాటించారు.
వీలు చూసుకొని సాధ్యమైనంత త్వరలో భారత్లో పర్యటించేందుకు రావాల్సిందిగా అధ్యక్షుడు శ్రీ స్టబ్ను ప్రధానమంత్రి ఆహ్వానించారు. తరచూ సంప్రదింపులను కొనసాగించేందుకు ఇరువురు నేతలూ అంగీకరించారు.
Had a good conversation with President Alexander Stubb. Finland is a valued partner in the EU. Discussed ways to strengthen cooperation in key sectors such as trade, technology and sustainability. Exchanged perspectives on the ongoing efforts for peaceful resolution of the…
— Narendra Modi (@narendramodi) August 27, 2025


