న్యూ ఢిల్లీ లో నూత‌నంగా నిర్మించిన‌ వెస్టర్న్ కోర్ట్ ఎనెక్స్ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ భ‌వ‌నం పార్ల‌మెంటు స‌భ్యులకు తాత్కాలిక వ‌స‌తి గా ఉంటుంది.

ఈ సందర్భంగా ప్ర‌ధాన మంత్రి ఉపన్యాసమిస్తూ, లోక్ స‌భ స్పీక‌ర్ శ్రీ‌మ‌తి సుమిత్ర మ‌హాజ‌న్ ఈ ప్రోజెక్టు ను పూర్తి చేయ‌డంలో చేసిన కృషిని ప్ర‌శంసించారు. శ్రీ‌మ‌తి సుమిత్ర మ‌హాజ‌న్ ఎల్ల‌ప్పుడూ పార్ల‌మెంట్ స‌భ్యుల శ్రేయాన్నే దృష్టిలో పెట్టుకొంటారు అని ఆయ‌న అన్నారు. ఈ ప్రోజెక్టు లో ప్ర‌తి అంశంలోనూ ఆమె క‌న‌బ‌ర‌చిన ద‌యాళుత్వం ప్రతిబింబిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు.

ఈ ప్రోజెక్టు అనుకొన్న స‌మ‌యానికి లోప‌లే, అంచ‌నా వేసుకొన్న వ్యయంలోగానే చ‌క్క‌గా పూర్తి అయింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఈ ప‌థ‌కం నిర్మాణంలో పాలుపంచుకొన్న అంద‌రినీ ఆయ‌న అభినందించారు.

పార్ల‌మెంటు స‌భ్యులు కొత్త‌గా ఎన్నికైన‌ప్పుడు హోటళ్ళ‌లో ఉండవలసి వ‌స్తోంద‌ని, ఇటువంటి సంద‌ర్భాలు ప‌తాక శీర్షిక‌ల‌కు ఎక్కుతున్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఏమైనప్పటికీ, మునపటి అధివాసులు నిర్దేశించిన అవ‌ధి క‌న్నా అధిక కాలం పాటు మ‌కాం పెడుతున్న సంగ‌తిని ప‌ట్టించుకోవడం జరగడంలేదని ఆయ‌న చెప్పారు.

కేంద్ర ప్ర‌భుత్వం డాక్ట‌ర్ బాబాసాహెబ్ ఆమ్బేడ్ కర్ చూపిన మార్గం లో ముందుకు పోతోంద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. సామ‌ర‌స్యం మ‌రియు ఐక‌మ‌త్యం.. ఇవి డాక్ట‌ర్ ఆమ్బేడ్ కర్ ప్ర‌వ‌చించిన ఆద‌ర్శాల‌లో కీల‌క‌మైన‌వ‌ని ప్రధాన మంత్రి వివ‌రించారు. నిరుపేద‌ల సంక్షేమానికి పాటుప‌డ‌డ‌మే ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని కూడా ఆయన తెలిపారు.

బాబాసాహెబ్ ఆమ్బేడ్ కర్ ను స్మ‌రించుకొనేందుకు న్యూ ఢిల్లీ లోని 26 అలీపుర్ రోడ్డు లో ఒక కట్టడాన్ని ఆయ‌న జ‌యంతి దినమైన ఏప్రిల్ 13 వ తేదీ నాడు ప్రారంభించ‌డం జ‌రుగుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌క‌టించారు. డాక్ట‌ర్ ఆమ్బేడ్ కర్ పేరిట కొంత మంది వ్య‌క్తులు చేస్తున్నటువంటి రాజ‌కీయాల‌ను ఆయ‌న ఖండించారు.

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Republic Day sales see fastest growth in five years on GST cuts, wedding demand

Media Coverage

Republic Day sales see fastest growth in five years on GST cuts, wedding demand
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam emphasising on peace and contentment
January 27, 2026

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam emphasising on peace and contentment :

"शान्तितुल्यं तपो नास्ति न सन्तोषात् परं सुखम्।

न तृष्णायाः परो व्याधिर्न च धर्मो दयापरः।।”

The Subhashitam conveys that, there is no endeavour nobler than peace, no pleasure bigger than contentment, no disease worse than greed and no duty higher than compassion.

The Prime Minister wrote on X;

“शान्तितुल्यं तपो नास्ति न सन्तोषात् परं सुखम्।

न तृष्णायाः परो व्याधिर्न च धर्मो दयापरः।।”