Metro in Delhi has positively impacted the lives of citizens: PM Modi
There is a direct link between connectivity and development; Metro will mean more employment opportunities for the people: PM
Union Government has brought out a policy relating to Metros, to bring uniformity and standardization in metro rail networks across the country: PM
Our aim is also to boost “Make in India” by making metro rail coaches in India itself: PM Modi
Metro systems are an example of cooperative federalism, the Centre and the respective State Govts are working together: PM Modi
New India requires new and smart infrastructure, Union Government is working on roads, railways, highways, airways, waterways and i-ways: PM Modi

బ‌హ‌దూర్‌ఘ‌ర్‌- ముండ్‌కా మెట్రోలైన్‌ను ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌న‌రేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రారంభించారు.
ఢిల్లీ మెట్రోకుసంబంధించిన ఈ కొత్త సెక్ష‌న్ ప్రారంభం సంద‌ర్భంగా ప్ర‌ధాని హ‌ర్యానా, ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. బ‌హ‌దూర్‌ఘ‌ర్ ఢిల్లీ మెట్రోతో అనుసంధానం కావ‌డం త‌న‌కు ఆనందంగా ఉంద‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.
గుర్‌గావ్‌, ఫ‌రీదాబాద్ త‌ర్వాత హ‌ర్యానాలో ఈ ర‌కంగా అనుసంధాన‌మౌతున్న మూడ‌వ ప్రాంతం ఇది అని ఆయ‌న అన్నారు.
ఢిల్లీలో మెట్రో ప్ర‌జ‌ల జీవితాల‌పై ఎలాంటి సానుకూల మార్పులు తీసుకువ‌చ్చిందో ప్ర‌ధాని ప్ర‌స్తావించారు. బ‌హ‌దూర్‌ఘ‌ర్‌లో పెద్ద ఎత్తున ఆర్థిక వృద్ధి సాగుతున్న‌ద‌ని అంటూ ప్ర‌ధాని, ఇక్క‌డ ప‌లు విద్యాసంస్థ‌లు ఉన్నాయ‌ని, ఇక్క‌డి నుంచి విద్యార్థులు ఢిల్లీ వెళుతుంటార‌ని అన్నారు. మెట్రో కార‌ణంగా ఢిల్లీ ప్ర‌యాణం మ‌రింత సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని ప్ర‌ధాని అన్నారు.
అనుసంధాన‌త‌, అబివృద్ధికి మ‌ద్య ప్ర‌త్య‌క్ష సంబంధం ఉంద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. మెట్రో స‌దుపాయం క‌ల‌గ‌డ‌మంటే, ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌కు మ‌రిన్ని ఉపాధి అవ‌కాశాలు ల‌భించ‌డ‌మే న‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.
దేశ‌వ్యాప్తంగా మెట్రో మెట్రో రైలు నెట్‌వ‌ర్క్‌ల విష‌యంలో ఏక‌రూప‌త‌, ప్రామాణిక‌త సాధించేందుకు  మెట్రోల‌కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం ఒక విధానాన్ని తీసుకువ‌చ్చింద‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. మ‌న న‌గ‌రాల‌లో ర‌వాణా స‌దుపాయాలు  సానుకూల‌, సౌక‌ర్య‌వంత‌మైన రీతిలో చౌక‌ధ‌ర‌కు అందుబాటులో ఉండేలా చూడ‌డ‌మే దీని ల‌క్ష్య‌మ‌ని అన్నారు. మెట్రో రైలు కోచ్‌లు ఇండియాలోనే త‌యారు చేయ‌డం ద్వారా మేక్ ఇన్ ఇండియాను ముందుకు తీసుకుపోవ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని ప్ర‌ధాని తెలిపారు.
మెట్రో వ్య‌వ‌స్థ‌లకు సంబంధించిన ప్ర‌క్రియ కూడా స‌హ‌కార స‌మాఖ్య వ్య‌వ‌స్థ‌తో ముడిప‌డిన‌ద‌ని ప్ర‌ధాని చెప్పారు. భార‌త‌దేశంలో ఎక్క‌డ మెట్రో సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చినా అక్క‌డ కేంద్ర , రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు క‌ల‌సి ప‌నిచేస్తున్నాయ‌ని ఆయ‌న చెప్పారు.
న‌వ‌భార‌త దేశానిఇక కొత్త స్మార్ట్ మౌలిక స‌దుపాయాలు అవ‌ర‌స‌ర‌మని ప్ర‌ధాని గుర్తు చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం రోడ్లు, రైల్వేలు, జాతీయ‌ర‌హ‌దారులు, విమాన‌యానం, జ‌ల‌మార్గాలు, ఐ- వేస్ ల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం కృషి చేస్తున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. అనుసంధాన‌త సాధించ‌డంతోపాటు అభివృద్ధి ప్రాజెక్టులు స‌కాలంలో పూర్తి అయ్యేందుకు  దృష్టిపెడుతున్న‌ట్టు  ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
The Bill to replace MGNREGS simultaneously furthers the cause of asset creation and providing a strong safety net

Media Coverage

The Bill to replace MGNREGS simultaneously furthers the cause of asset creation and providing a strong safety net
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 22 డిసెంబర్ 2025
December 22, 2025

Aatmanirbhar Triumphs: PM Modi's Initiatives Driving India's Global Ascent