PM Modi campaigns in Rudrapur, Uttarakhand & urges people to vote for BJP
Shri Modi speaks about Mudra Yojana, says BJP Govt wants today's youth to be entrepreneurs of tomorrow
Dev Bhoomi Uttarakhand must get rid of corruption. harda tax must end: PM Modi
Uttarakhand has the potential to attract tourists from the entire world: PM

ఉత్తరాఖండ్లోని రుద్రాపూర్ నేడు భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ర్యాలిలో భారి సంఖ్యలో పాల్గొన్న ఉత్తరాఖండ్ ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.

నేడు ప్రకటించబడిన ఫలితాలలో యుపిలో మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాలను బిజెపి గెలుచుకుందని ప్రధాని పేర్కొన్నారు. "ఉత్తరప్రదేశ్ లో బిజెపి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి తుడిచిపెట్టిందనే గొప్ప వార్తతో వచ్చాను", అని ఆయన చెప్పారు.

క్షిపణులను విజయవంతంగా పరీక్షించిన శాస్త్రవేత్తలను ప్రధాని అభినందించారు. “గాలి లోనే ఇతర క్షిపణులను నాశనం చేసే క్షిపణిలను విజయవంతంగా పరీక్షించినందుకు మన శాస్త్రవేత్తలు అభినందింస్తున్నాను.” అన్నారు. ప్రతిపక్షంపై దాడి చేస్తూ, “గతంలో వ్యూహాత్మక దాడులు చేసినప్పుడు మా ప్రత్యర్థులు ఋజూవులు అడిగారు. ఇప్పుడు ఈ క్షిపణిల పనితీరు గురించి ప్రశ్నించరని అనుకుంటున్నాను.

ఉత్తరాఖండ్ ఏర్పడటానికి మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్పేయి చేసిన కృషిని శ్రీ మోదీ గుర్తుచేసుకున్నారు. “అటల్ బీహారి వాజ్పేయి జీ నే ఉత్తరాఖండ్ ను ఏర్పరిచారు ఈ రాష్ట్రం కొత్త ఎత్తులు అధిరోహించడానికి అయన విధానాలు మరియు ప్రయత్నాలే కారణం.” అని ఆయన అన్నారు.  

ఉత్తరాఖండ్ అభివృద్ధికి ఎన్డిఎ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని  శ్రీ మోదీ తెలిపారు. ఉత్తరాఖండ్ యువత కోసం కొత్త అవకాశాలను సృష్టించేందుకు బిజెపి అంకితమయ్యిందని, “ముద్రా యోజన కింద రుణాలు అందించి మన యువతకు సాధికారత అందించాము. వారు రేపటి వ్యవస్థాపకులుగా ఉండాలని కోరుకుంటున్నాము.” అని అన్నారు.

 కళంకిత మరియు అవినీతి ప్రభుత్వాన్ని ఉత్తరాఖండ్ ప్రజలు వదిలించుకోవాలని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. “దేవతల భూమి ఉత్తరాఖండ్ అవినీతి రహితంగా ఉండాలి.  చిన్న & మధ్యతరహా వ్యాపారులు ఎందుకు హర్దా పన్ను కట్టాలి? దీన్ని ఆపాలి,” అని అన్నారు.

బిజెపికి ఉత్తరాఖండ్ అభివృద్ధే అత్యంత ప్రాముఖ్యమైనదని శ్రీ మోదీ అభిప్రాయపడ్డారు. ఉత్తరాఖండ్ కి వికాస్ విద్యుత్, కానూన్ (చట్టం), సడక్ (రహదారి) అవసరమని ప్రధాని మోదీ అన్నారు.

మంచి రోడ్లు తో చార్ ధామ్ అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.12,000 కోట్లు కేటాయించిందని  శ్రీ మోదీ చెప్పారు. “ఉత్తరాఖండ్ అన్ని వాతావరణాల రోడ్లకు తో మొత్తం దేశం తో అనుసంధానమవ్వాలని మేము కోరుకున్నాము. చార్ ధామ్ కోసం రూ.12,000 కోట్లు కేటాయించాము.” అని అన్నారు.   

మన సైనికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని శ్రీ మోదీ పేర్కొన్నారు. మన మాజీ సైనికులు ఎరుదుర్కునే ఇబ్బందులను కాంగ్రెస్ పట్టించుకోలేదని ప్రధాని అన్నారు. దేశం కోసం పోరాడిన వారు దానిని ఎలా ఒప్పుకోగలరు? వన్ ర్యాంక్, వన్ పెన్షన్ పథకంను కాంగ్రెస్ పరిహాసం చేసింది. మేము అధికారంలోకి వచ్చిన తరువాతే, ఆ పథకం అమలుజరిగింది."

అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు బిజేపికి ఓటు వెయ్యాలని ఉత్తరాఖండ్ ప్రజలను ప్రధాని మోదీ కోరారు. “సంపన్నమైన ఉత్తరఖండ్ గా ఉండాలనే అటల్ జి యొక్క కల నెరవేర్చేందుకు బిజేపి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఉత్తరఖండ్ లోని ప్రజలను కోరుతున్నాను.” అని ముగించారు.

అనేకమంది బిజెపి కార్యకర్తలు మరియు నాయకులు హాజరయ్యారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian Railways to roll out the first rake of 20 LHB coaches for Bangladesh Railway on August 12

Media Coverage

Indian Railways to roll out the first rake of 20 LHB coaches for Bangladesh Railway on August 12
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister highlights India’s strong conservation efforts on World Elephant Day
August 12, 2026

Prime Minister Shri Narendra Modi today stated that on World Elephant Day, we celebrate the majestic elephant, which has remained an integral part of India’s ecological heritage. He expressed gladness that India is home to over 60% of the world’s wild Asian elephants.

The Prime Minister noted that our nation has 33 Elephant Reserves, which provide habitats for elephants and strengthen our efforts towards their long-term conservation. Shri Modi also expressed pride in all forest personnel, scientists, veterinarians, mahouts, and the local communities who are integral to all such efforts.

In a post on X, the Prime Minister shared:

"On World Elephant Day, we celebrate the majestic elephant which has remained an integral part of India’s ecological heritage. It is gladdening that India is home to over 60% of the world’s wild Asian elephants. Our nation has 33 Elephant Reserves, which provide habitats for elephants and strengthen our efforts towards their long-term conservation. We are also proud of all forest personnel, scientists, veterinarians, mahouts and the local communities who are integral to all such efforts."