పశ్చిమ బంగాల్ లోని ముర్శిదాబాద్ లో, కల్యాణి లో 250 పడకల తో ఉండే రెండు తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రుల ను డిఆర్డిఒ ద్వారా ఏర్పాటు చేయడం కోసం 41.62 కోట్ల రూపాయల ను కేటాయించాలని ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ ఎండ్ రిలీఫ్ ఇన్ ఇమర్జెన్సి సిట్యువేశన్స్ (పిఎమ్ కేర్స్) ఫండ్ ట్రస్టు నిర్ణయించింది. దీనికోసం భారత ప్రభుత్వ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా మౌలిక సదుపాయాల సంబంధిత మద్ధతు ను కొంత వరకు సమకూర్చడం జరుగుతుంది.
కోవిడ్ స్థితి ని ప్రభావవంతమైన విధం గా నిర్వహించడానికి పశ్చిమ బంగాల్ లో ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల ను ఈ ప్రతిపాదన పెంచనుంది.
ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ ఎండ్ రిలీఫ్ ఇన్ ఇమర్జెన్సి సిట్యువేశన్స్ (పిఎమ్ కేర్స్) ఫండ్ ట్రస్టు ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల కల్పన ను అభివృద్ధి పరచడం లో తన వంతు తోడ్పాటు ప్రయాసల లో భాగం గా బిహార్, దిల్లీ, జమ్ము, శ్రీనగర్ లలో సైతం కోవిడ్ ఆసుపత్రుల ఏర్పాటు లో సాయాన్ని అందించింది.
ఉత్సుకత, సకారాత్మక శక్తి... ఇవి మనుషులకు ఎప్పటికీ చురుకుగా ఉండే స్ఫూర్తిని ఇస్తాయని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
పొంగిపొరలే ఈ ఉత్సుకతే ఏ పనిని అయినా సరే, పూర్తి చేయడంలో మనిషికి విజయాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘కర్మశీలురు, శక్తిమంతులైన దేశ ప్రజలే అన్నింటి కన్న పెద్ద శక్తి ఏ దేశానికైనా. వారి కృషితోనే అభివృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. వారి ప్రయత్నాలతో దేశం సమృద్ధిని, స్వయంసమృద్ధిని, ప్రగతి శిఖరాన్ని అందుకొంటుంది.
అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః
కరోతి సఫలం జన్తోః కర్మ యచ్చ కరోతి సః’’ అని పేర్కొన్నారు.
ఉత్సాహం, సకారాత్మక శక్తి మనుషులను వారి పనులలో నిరంతరం చురుకుగా ఉండేటట్లు ప్రేరణను అందిస్తాయి. పొంగి పొర్లుతూ ఉండే ఈ ఉత్సాహమే... మనిషి పూర్తి చేయాలనుకునే ఏ పనిలోనైనా సాఫల్యాన్ని అందిస్తుందని ఈ సుభాషితం బోధిస్తోంది.


