భారత్-ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయటం గురించి చర్చించిన ఇద్దరు నాయకులు
ఉగ్రవాదం పట్ల కఠిన వైఖరిని వ్యక్త్యం చేసిన ఇరువురు నేతలు
న్యాయమైన శాశ్వత శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నాలకు భారత్‌ మద్దతు: ప్రధాని మోదీ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి శ్రీ బెంజమిన్ నెతన్యాహు ఈ రోజు ఫోన్ చేసి మాట్లాడారు. 

భారత్‌-ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో నిరంతర పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఇరువురు నేతలు పరస్పర ప్రయోజనం కోసం సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు నిబద్ధతతో ఉన్నట్లు పేర్కొన్నారు. 

ఉగ్రవాదాన్ని గట్టిగా ఖండిస్తున్నట్లు ఇద్దరు ప్రధానులు తెలిపారు. అన్ని రూపాలు, వ్యక్తీకరణలలోని ఉగ్రవాదం పట్ల ఏమాత్రం ఉపేక్షించని విధానాన్ని పునరుద్ఘాటించారు. 

పశ్చిమాసియాలోని పరిస్థితి‌పై కూడా ఇద్దరు నాయకులు చర్చించారు. గాజా శాంతి ప్రణాళికను తొందరగా అమలు చేయడంతో సహా ఈ ప్రాంతంలో న్యాయమైన శాశ్వత శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నాలకు భారత్‌ మద్దతిస్తున్నట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ మరోసారి తెలియజేశారు. 

భవిష్యత్తులో మరింత విస్తృత ప్రాతిపదికన పనిచేయాలని ఇరువురు నిర్ణయించారు. 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Sacred relics of Buddha from National Museum reach Ladakh as Leh marks Buddha Purnima

Media Coverage

Sacred relics of Buddha from National Museum reach Ladakh as Leh marks Buddha Purnima
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ఉత్సుకత, సకారాత్మక శక్తి... ఇవి విజయాన్ని అందిస్తాయని చెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
April 30, 2026

ఉత్సుకత, సకారాత్మక శక్తి... ఇవి మనుషులకు ఎప్పటికీ చురుకుగా ఉండే స్ఫూర్తిని ఇస్తాయని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
పొంగిపొరలే ఈ ఉత్సుకతే ఏ పనిని అయినా సరే, పూర్తి చేయడంలో మనిషికి విజయాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘కర్మశీలురు, శక్తిమంతులైన దేశ ప్రజలే  అన్నింటి కన్న పెద్ద శక్తి  ఏ దేశానికైనా. వారి కృషితోనే అభివృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. వారి ప్రయత్నాలతో దేశం సమృద్ధిని, స్వయంసమృద్ధిని, ప్రగతి శిఖరాన్ని అందుకొంటుంది.
అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః
కరోతి సఫలం జన్తోః కర్మ యచ్చ కరోతి సః’’ అని పేర్కొన్నారు.
ఉత్సాహం, సకారాత్మక శక్తి మనుషులను వారి పనులలో నిరంతరం చురుకుగా ఉండేటట్లు ప్రేరణను అందిస్తాయి. పొంగి పొర్లుతూ ఉండే ఈ ఉత్సాహమే... మనిషి పూర్తి చేయాలనుకునే  ఏ పనిలోనైనా సాఫల్యాన్ని అందిస్తుందని  ఈ సుభాషితం బోధిస్తోంది.