ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఒమన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ యూసుఫ్ బిన్ అలావి బిన్ అబ్దుల్లా ఈ రోజు సమావేశమయ్యారు.

భారతదేశం, ఒమన్ లు వేరు వేరు రంగాలలో సాధిస్తున్న పురోగతితో పాటు ఇరు దేశాల మధ్య నెలకొన్న సన్నిహిత సంబంధాలపై ప్రధాన మంత్రి, శ్రీ యూసుఫ్ బిన్ అలావి బిన్ అబ్దుల్లా లు తమ అభిప్రాయాలను ఈ సందర్భంగా వ్యక్తం చేసుకొన్నారు.

గౌరవనీయులైన రాజు సుల్తాన్ ఖబూస్ బిన్ అల్ సైద్ తరపున ప్రధాన మంత్రికి శ్రీ యూసుఫ్ బిన్ అలావి బిన్ అబ్దుల్లా అభినందనలు తెలియజేశారు. ప్రధాన మంత్రి కూడా తన వంతుగా రాజు గారికి అభినందనలు తెలియజేశారు.


