Inculcate team spirit, and work towards breaking silos: PM to IAS Officers
The decisions taken should never be counter to national interest: PM to IAS Officers
The decisions should not harm the poorest of the poor: PM to IAS Officers

సహాయక కార్యదర్శుల ముగింపు సమావేశంలో భాగంగా 2014 బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారులు ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమక్షంలో తమ నివేదికలను సమర్పించారు.

పాలనకు చెందిన వేరు వేరు ఇతివృత్తాలలో నుండి అధికారులు సమర్పించిన నివేదికలలో ఎంపిక అయిన 8 నివేదికలలోను ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ (డిబిటి), స్వచ్ఛ భారత్, ఇ-కోర్టులు, పర్యటన, ఆరోగ్యం మరియు శాటిలైట్ అప్లికేషన్స్ ఇన్ గవర్నెన్స్ ల వంటి ఇతివృత్తాల తాలూకు నివేదికలు ఉన్నాయి.

ఈ సందర్భంగా యువ అధికారులు కూలంకష నివేదికలను సమర్పించినందుకు వారిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఐఎఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వానికి సహాయక కార్యదర్శులుగా తీసుకోవాలన్న ఏర్పాటు వెనుక యువత తో పాటు అనుభవజ్ఞులైన అధికారుల మేలుకలయికగా ఉండి ఉత్తమమైన ఫలితాలను ఆవిష్కరించగలదన్న భావన ఉందన్నారు. ఈ రోజు ముందుకు వచ్చిన ఫలితాలు ఈ స్వప్నం సరి అయిన రీతిలోనే సాకారం కాగలదన్న తృప్తిని తనకు మిగిల్చాయని ఆయన చెప్పారు.

జట్టు స్ఫూర్తిని ఒంటబట్టించుకోవలసిందిగా అధికారులకు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. వారు ఏ హోదాలో పనిచేసినప్పటికీ అంతవరకు అమలవుతున్న పాత పద్ధతులను ఛేదించి వాటి చోటులో నవీన మెలకువలకు స్థానం కల్పించడం కోసం కృషిచేయాలని సూచించారు.

విధానాలపై రాజకీయాలు స్వారీ చేయకూడదని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు. అధికారులు వారి నిర్ణయ రూపకల్పన లో రెండు గీటురాళ్లను ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలని వాటిలో.. ఆ నిర్ణయాలు ఎన్నడూ దేశ హితానికి విరుద్ధమైనవి కాకూడదనేది ఒకటోది, ఆ నిర్ణయాలు నిరుపేదలకు హాని కలిగించేవిగా ఉండకూడదనేది రెండోది.. అని ఆయన నొక్కిచెప్పారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
‘Give mothers, sisters their due rights’: PM Modi pushes for women's reservation from the ramparts of Red Fort

Media Coverage

‘Give mothers, sisters their due rights’: PM Modi pushes for women's reservation from the ramparts of Red Fort
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays homage to former Prime Minister, Shri Atal Bihari Vajpayee at Sadaiv Atal
August 16, 2026

Prime Minister Shri Narendra Modi earlier this morning paid homage to former Prime Minister, Shri Atal Bihari Vajpayee at his memorial, Sadaiv Atal. He emphasized that the former Prime Minister's role in India’s progress remains unparalleled.

In a post on X, the Prime Minister wrote:

"Earlier this morning, paid homage to Atal Ji at Sadaiv Atal. His role in India’s progress is unparalleled!"